Friday, March 10, 2017

Lawyers and Fraudster; భిన్నత్వమున ఏకత్వము; కవి - కావ్యము; భారతదేశము-రాచరికం

 Lawyers and Fraudsters

Are the lawyers defending Mallaya in Indian courts are doing so to defend a fugitive, an absconder, a fraudster, a cheat or fighting for his "genuine" rights? All these lawyers are Indians and for money are defending an individual who is not guilty till proved. We can safely take shelter under legal system even after committing financial crime against nation. And we have advocates who are objective and fight for the rights of the individual against those of nation and fellow Indians. 

We have lawyers who take their profession from human rights point of view. Great things happen to neo-rich which ordinary Indian can never even dream. And one superior court also made a statement that rich can "get justice" by promptly approaching higher courts by engaging lawyers and there is nothing against law in it. Celebrities are always treated specially which is not available to Aam aadmi. Who said all Indians or humans are equal?

**********

భిన్నత్వమున ఏకత్వము

చిత్తరువులో
బాణం ఉంటే రాముడు
చక్రం ఉంటే విష్ణువు
మురళి ఉంటే కృష్ణుడు
చంద్రుడుంటే శివుడు


అందరు దేవుళ్ళకు ఆయా ప్రతీకలు
మౌనము జ్ఞానికి ప్రతీక
వలపు జవ్వనికి ప్రతీక
లాలింపు అమ్మకు ప్రతీక

మౌనరాగం నాన్నకు ప్రతీక
జ్ఞాన పయస్సు మౌనికి ప్రతీక
ధ్యానము యోగమునకు ప్రతీక
జిజ్ఞాస ముముక్షువునకు ప్రతీక

ఊహలో సొంపులు కవికి ప్రతీక
నిజదర్శనముకై ఆరాటం శాస్త్రవేత్తకు ప్రతీక
సత్ దర్శనమునకై‌ నిర్గుణ సగుణ పంథా వేదాంతికి ప్రతీక
రమ్యవనితా ప్రేమోత్సవమునకై రసార్తి పురషునికి ప్రతీక

అన్నియు ప్రతీకలు; వారి వారి ప్రత్యేకతా చిహ్నములు
జగత్తులో ఒక్కొక్కరికి ఒక్కొక్క ధ్వజము; ధ్వజమెత్తరాదు
ఎవరిపై; అందరు ఒక తీరున ఉండరు; ఒక రీతిని నడువరు;
 బ్రహ్మాండమంతయు భిన్నత్వమున ఏకత్వము

************
కలలు ప్రమాదాన్ని ‌తేవు, ప్రమోదాన్ని ఇస్తాయి.‌ కాని చిత్తరువులో ఉన్న మామిడిపండు‌ ఆకలి తీర్చలేదు అంతే. కల కల్లయే కదా.
 ************

కవి - కావ్యము

మనము కవులము మన స్నేహితుల దయ ప్రచారము వలన
మనము కవులము మనకిష్టులైన మనమిష్టులైన విమర్శకులవలన
మనము కవులము కవితా సంపుటి అచ్చువేసినందువలన
మనము కవులము పురస్కారములు పొందినందువలన 


మనము కవులము వివిధ కవితా గోష్ఠుల పాల్గొన్నందువలన
మనము కవులము "ప్రసిద్ధుల" ప్రాపకము సాన్నిహిత్యము వలన
మనమెప్పుడగుదుము కవులము పాఠకులు మన కవితలు చదువుట వలన?
వారు సంతసించి ముగ్ధులై మనల మనసార అభినందించుట వలన?

"నానృషి: కురుతే కావ్యమ్" అని కవికి ఒక నిర్వచనము
"రమణీయార్థ ప్రతిపాదక శబ్దః కావ్యః" అని కావ్య నిర్వచనము
"వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్" అని మరియొక రస నిర్వచనము
"ధ్వని వాక్యమునకు ఆత్మ" అని మరొక సొగసైన నిర్వచనము

కవి ఎవరు? కావ్యమేది? అవగాహన లేని సృష్టులు
అలరించవు కవితలుగ మిగలవు కావ్యములుగ
కవియని నలుగురూ మెచ్చుకొను కవులు చిరంజీవులు
మిగతా అందరమూ కవితలు అల్లుదుము అంతే!

***********
 కొన్నాళ్ళ క్రితం ‌వరకు రాజులు, రాణుల చేత‌ వంశ పారంపర్యముగా పరిపాలించబడింది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ప్రజాస్వామ్యం ఏర్పడింది, ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రభుత్వం, రాజ్యం అన్నారు. 60 ఏళ్ళు గడిచినట్టున్నాయి. మళ్ళీ రాజులు, రాణులు, యువరాజులు, యువరాణులు, రాజకుటుంబీకులు, వంశ పారంపర్యపు హక్కుగా, పరిపాలిస్తున్నారు. భారతీయులకు రాచరికం పైనే మోజేమో?!!

No comments:

Post a Comment