తెలుగు సాహితీ సృష్టి - ఒక ఆలోకన
1970 లలో అని జ్ఞాపకం. నేను "అసూర్యం పశ్య", "సంధ్యావందన మాహాత్మ్యం" అని శీర్షికలు కల రెండు రచనలను అవధరించాను.
మొదటిది అప్పటి పాప్యులర్ తెలుగు మాసపత్రిక "జ్యోతి" లో ప్రచురించబడింది. ఒక మాదిరి పెద్ద కథ. కథకుడి ఒడుపంతా కథను మనకు చెప్పిన తీరులో ఉంది. ఆ కథ చివరదాకా ఉత్కంఠగా చదివిన మనకు రచయిత శీర్షిక ఎందుకు అలా పెట్టేరో తెలుస్తుంది.
1970 లలో అని జ్ఞాపకం. నేను "అసూర్యం పశ్య", "సంధ్యావందన మాహాత్మ్యం" అని శీర్షికలు కల రెండు రచనలను అవధరించాను.
మొదటిది అప్పటి పాప్యులర్ తెలుగు మాసపత్రిక "జ్యోతి" లో ప్రచురించబడింది. ఒక మాదిరి పెద్ద కథ. కథకుడి ఒడుపంతా కథను మనకు చెప్పిన తీరులో ఉంది. ఆ కథ చివరదాకా ఉత్కంఠగా చదివిన మనకు రచయిత శీర్షిక ఎందుకు అలా పెట్టేరో తెలుస్తుంది.
ఆ శీర్షిక అర్థం
ఏమిటంటే, "ఆమె సూర్యం చేత చూడబడ లేదు" అని. సంస్కృత భాషలో వాక్యాన్ని
passive voice లో చెప్పడం సంప్రదాయం. కథంతా చదివాక, శీర్షిక కథని, కథనాన్ని
ఎలా సమర్ధిస్తుందో తెలుస్తుంది.
ప్రతి రచన, సాహితీ సృష్టి సమాజానికి సందేశం ఇవ్వాలి, సమాజం జీవితాన్ని ప్రతిబింబించాలి, ఏదో ఒక ఇజానికి దాసియై మెలగాలి అనుకునేవారికి తప్ప మిగిలిన రసికులందరికీ నచ్చుతుంది. ఈ కథ అందం, రమ్యత, శీర్షిక పెట్టడం లోను, చివరిదాకా ఆ సస్పెన్సుతో కథ నడపడం లోనూ ఉంది.
సాహిత్యం సరదాకి, ఆనందం అందించడానికీ కూడా ఉపయోగించాలి, ఉపయోగిస్తుందని నమ్మేవారిలో ప్రథముడిని నేను. సిద్ధాంత రాద్ధాంతాల గొడవకే సాహితీ సృష్టిని పరిమితం చేయడం నాకు నచ్చని విషయం.
"సంధ్యావందన మాహాత్మ్యం" కూడా, శీర్షికతో మన్ని ఆడించే రచన. ఆకాశవాణిలో ఒక నాటకంగా ప్రసారమైంది
అని జ్ఞాపకం. "సంధ్య" అని పేరు కల ఒక అందమైన యువతి ఒక పెళ్ళైనాయనకి సినిమా హాల్లో నమస్కరిస్తుంది. ఆయన భార్య కూడా పక్కనే ఉంటుంది. ఆమె అనుమానం, ఆ అనుమానంతో చేసే రభస, అందువల్ల ఆ గృహస్థునికి కలిగిన ఇబ్బందులు ఎంతో హాస్యస్ఫోరకంగా రచించారు ఆ రేడియో నాటక కర్త.
ఈ రచన మలచిన తీరు, నటీనటుల భావస్ఫోరక సంభాషణా వైవిధ్యము రచనకి మెరుగులు దిద్ది నాటకాన్ని పండించాయి. అవధరించి ఎన్నో సంవత్సరాలైనా అవి నన్ను అలరించిన,ముగ్ధుణ్ణి చేసిన తీరు నా స్మృతి పథంలో నిలిచిపోయాయి.
మనసుని రంజింపజేయడమూ రచన పరమార్థమని సాహితీ సృష్టి చేసే వారు, సాహితీ వేత్తలు, సాహితీ విమర్శకులు, ఎక్కువ మంది అనుకుంటే తెలుగు సాహితీ సరస్వతి అందగిస్తుంది. ఆనందపడుతుంది.
మనమూ రమ్య, రమణీయ, సాహిత్యాన్ని అవధరిస్తూ ఆనందించ వచ్చు. తెలుగు సాహిత్యానికీ వైవిధ్యం ఏర్పడుతుంది. ఇజాల, వాదాల మూస ధోరణికి తెరపడుతుంది.
"వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్", "రమణీయార్థ ప్రతిపాదక శబ్దః కావ్యః" వంటి రసప్లావిత వచనములు, నిర్వచనములు పండుతాయి. మన మనసులు రసాంబుధి లో మునిగి తేలుతాయి..
శుభం భూయాత్!
ప్రతి రచన, సాహితీ సృష్టి సమాజానికి సందేశం ఇవ్వాలి, సమాజం జీవితాన్ని ప్రతిబింబించాలి, ఏదో ఒక ఇజానికి దాసియై మెలగాలి అనుకునేవారికి తప్ప మిగిలిన రసికులందరికీ నచ్చుతుంది. ఈ కథ అందం, రమ్యత, శీర్షిక పెట్టడం లోను, చివరిదాకా ఆ సస్పెన్సుతో కథ నడపడం లోనూ ఉంది.
సాహిత్యం సరదాకి, ఆనందం అందించడానికీ కూడా ఉపయోగించాలి, ఉపయోగిస్తుందని నమ్మేవారిలో ప్రథముడిని నేను. సిద్ధాంత రాద్ధాంతాల గొడవకే సాహితీ సృష్టిని పరిమితం చేయడం నాకు నచ్చని విషయం.
"సంధ్యావందన మాహాత్మ్యం" కూడా, శీర్షికతో మన్ని ఆడించే రచన. ఆకాశవాణిలో ఒక నాటకంగా ప్రసారమైంది
అని జ్ఞాపకం. "సంధ్య" అని పేరు కల ఒక అందమైన యువతి ఒక పెళ్ళైనాయనకి సినిమా హాల్లో నమస్కరిస్తుంది. ఆయన భార్య కూడా పక్కనే ఉంటుంది. ఆమె అనుమానం, ఆ అనుమానంతో చేసే రభస, అందువల్ల ఆ గృహస్థునికి కలిగిన ఇబ్బందులు ఎంతో హాస్యస్ఫోరకంగా రచించారు ఆ రేడియో నాటక కర్త.
ఈ రచన మలచిన తీరు, నటీనటుల భావస్ఫోరక సంభాషణా వైవిధ్యము రచనకి మెరుగులు దిద్ది నాటకాన్ని పండించాయి. అవధరించి ఎన్నో సంవత్సరాలైనా అవి నన్ను అలరించిన,ముగ్ధుణ్ణి చేసిన తీరు నా స్మృతి పథంలో నిలిచిపోయాయి.
మనసుని రంజింపజేయడమూ రచన పరమార్థమని సాహితీ సృష్టి చేసే వారు, సాహితీ వేత్తలు, సాహితీ విమర్శకులు, ఎక్కువ మంది అనుకుంటే తెలుగు సాహితీ సరస్వతి అందగిస్తుంది. ఆనందపడుతుంది.
మనమూ రమ్య, రమణీయ, సాహిత్యాన్ని అవధరిస్తూ ఆనందించ వచ్చు. తెలుగు సాహిత్యానికీ వైవిధ్యం ఏర్పడుతుంది. ఇజాల, వాదాల మూస ధోరణికి తెరపడుతుంది.
"వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్", "రమణీయార్థ ప్రతిపాదక శబ్దః కావ్యః" వంటి రసప్లావిత వచనములు, నిర్వచనములు పండుతాయి. మన మనసులు రసాంబుధి లో మునిగి తేలుతాయి..
శుభం భూయాత్!
No comments:
Post a Comment