మా సోమనాథ్ యాత్ర - మొదటి భాగము
నేను, మా ఆవిడ సోమనాథ్ సందర్శించడానికి ఫిబ్రవరి 25న బొంబాయిలో సౌరాష్ట్ర మెయిల్ లో బయలుదేరాము. నాకు బొంబాయి అనే వస్తుంది. ముంబయి అనే పదం మా మస్తిష్కంలో సరిగా చోటు చేసికోలేదు.
అలాగే మద్రాసు మాకు చెన్నై కాదు. కలకత్తా కోల్ కత్తా కాదు. కొచ్చిన్ కోచి కాదు. క్విలన్ కొల్లం కాదు. ట్రివేండ్రమ్ తిరువనంతపురం కాదు. బెల్గాం బెలగవి కాదు. గుల్బర్గా కులుబెరిగి కాదు. బెంగుళూరు బంగలూరు కాదు. రాజమండ్రి రాజమహేంద్రి కాదు. ప్రాంతీయ అభిమానాలో ఏమిటో ఈ నగరాల పేర్లు మార్చబడ్డాయి. అంత చలాకీగా, నిజాయితీగా ఈ రాష్ట్రాల ప్రజల స్థితిగతులు ఏమీ మారలేదు. నగరాల పేర్లు మార్చనపుడు ఎలా ఉన్నాయో ఇపుడూ అలానే ఉన్నాయి; ముక్కుతూ, మూలుగుతూ.
ప్రాంతీయ సంస్కృతులు, నాగరికతలు పేరుతో భారతీయులను వెఱ్ఱి వెంగళప్పల కింద జమ కట్టి మోసం చేయడం మన రాజకీయ నాయకులకే చెల్లింది. మన దురభిమానాలు, బలహీనతలు కూడా వేణ్ణీలకు చన్నీళ్ళలా దోహదం చేశాయి. ఫలితం మనం భారతీయులమని ఎప్పుడూ అనుకోకుండా ఈ విభేదాలు మనలని విడదీసి రాజకీయ నాయకులకు బలి పశువులను చేస్తున్నాయి. మన స్థితి గతులను ఏమాత్రమూ మార్చనవసరము లేకుండా మన ఆర్ధిక, సాంఘిక, సామాజిక జీవితములను అల్లాగే అధ్వాన్నంగా ఉంచుతూ మన ఓట్లను మాత్రం పట్టేసి పదవులు పట్టేసే సులువు రాజకీయ నాయకులకు మనం అప్పనంగా ఇచ్చేశాము. అది రాజకీయ నాయకుల అదృష్టము.
ఇంతకీ మేము సౌరాష్ట్ర మెయిల్ లో సోమనాథ్ కి బయలుదేరాము. చాలా మందికి మల్లే నా జీవితంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు చూసితీరాలని సోమనాథ్ కి బయలుదేరలేదు. నాకు ప్రయాణాలు చేయడం, ప్రదేశాలు చూడడం ఇష్టం. ఇప్పటికి భారతదేశంలో కొన్ని ప్రదేశాలు చూశాము. ఇది మరొక యాత్ర అంతే.
పుణ్యము, పురుషార్ధము కలిసివచ్చేలా యాత్రలుంటే అభ్యంతరం లేదు. నాకు భగవంతుడు ఉన్నాడో లేదో ఖచ్చితంగా తెలియదు. భగంతుడని ఒకాయన ఉండి మన బాగోగులు చూస్తున్నాడు, చూస్తాడు అంటే అదో ఉపశమనం. ప్రశాంతత. మేము స్మార్తులము. మాకు శివ కేశవ అభేదము. అందరు దేవుళ్ళూ దేవతలూ సమానమే; ఇష్టమే. పూజలు, పునస్కారాలు, అభిషేకాలు చేయడం ఇష్టమే. కాని క్షేత్రదర్శనాలకు వెళ్ళినప్పుడు మాత్రము ఈ బాదరబందీ ఏదీ పెట్టుకోకుండా భగవద్దర్శనము మీదే దృష్టి పెట్టకోవడం ఇష్టం. దర్శించే దైవ నామ స్మరణ చేసికుంటూ, క్షేత్ర, ఆలయ దర్శనములు చేస్తాను. నా భార్య అన్ని విషయాలో లాగానే నాకు సహకరిస్తూ అనుసరిస్తుంది.
ఇద్దరం కలిసి ఆ మరునాడు సాయంకాలానికి వేరావెల్ చేరాము. ఇది చిన్ని పట్టణము. ఇక్కడినుంచి సోమనాథ్ 8 కి.మీ. వేరావల్ లో మా అబ్బాయి హేటల్ గ్రాండ్ దక్ష్లో రెండురోజులకి రూమ్ బుక్ చేసి ఉంచాడు.
టూరిస్టులమైన మనకు కష్టాలు రైలు దిగిన వెంటనే కూలీలు, ఆటోవాళ్ళు, టేక్సీ వాళ్ళ రూపంలో మొదలౌతాయి కదా. లాగుడు పెట్టెల వల్ల కూలీల బాధ తప్పించుకున్నాము. కాని ఆటో, టేక్సీ ల వల్ల తప్పదు కదా. మెట్రో నగరాలలో ఊబర్, ఓలా ల వల్ల కొంత వెసులుబాటు కలిగించుకున్నాము. చిన్న పట్టణాలలో ఈ సదుపాయం ఉండదు కదా. మనలని చూడగానే ఈ ఆటోవాళ్ళకి, టేక్సీ వాళ్ళకి పులికి లేడి చిక్కినట్టుంటుంది అనుకుంటాను.
మొత్తానికి వాడు అడిగిన దానికి సగం ఇస్తానని గట్టిగా నిలబడేసరికి వచ్చాడు హోటల్ కి చేర్చాడు. వాడి కార్డు ఇచ్చి వాడి ఆటో సౌకర్యము ఉపయోగించుకోవచ్చని చెప్పాడు. ఆ చెప్పడంలో ఒక ఉపకారం చేశాడు. హోటల్ నుంచి సోమనాథ్ గుడికి రాను పోను 300 అవుతుందన్నాడు. అలాగేనని బుర్ర ఊపి హోటల్ గదిలో ప్రవేశించాము. హోటల్ గది, వాతావరణము, బాగున్నాయి. వేరావల్ జునాగఢ్ హైవే మీద ఉంది ఆ హోటల్. సాయంకాలం ఐదు అయింది. ఒకసారి దర్శనము చేసుకుని వద్దామనుకున్నాము.
నేను మధ్య తరగతి వాడిని రూపాయితో అయిపోయే చోట వందలు, ఏభైలు ఖర్చుపెట్టలేను. దూరం పది కిమీ. మూడు వందలు ఖర్చుపెట్టడం ఇష్టంలేక పోయింది. మాకు హోటల్ వాచ్ మన్ రూపంలో రక్షకుడు దొరికాడు. అతని సలహా ప్రకారం చెరో పది రూపాయలతో షేర్ ఆటోలో వేరావల్ సెంటరు చేరి, మరో షేర్ ఆటోలో అదే ఖర్చుతో సోమనాథ్ దేవాలయానికి చేరాము. అక్కడి సంగతులు రెండవ భాగంలో
మా సోమనాథ్ యాత్ర - రెండవ భాగము
అలా షేర్ ఆటోలో చీకటి పడుతూండగా సోమనాథ్ చేరాము. దారిలో రోడ్డు ఎంతో గతుకులతో ఉంది. షేర్ ఆటోలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. బస్సుల జాడే లేదు. ఆంధ్రప్రదేశ్ లాగానే తక్కువ దూరాలకు ట్రాన్స్ పోర్ట్ షేర్ ఆటో కుర్రాళ్ళకి, దూరాలు పైవేట్ ఆపరేటర్లకి వదిలేసి ప్రభుత్వ రవాణా సంస్థలు మూతపడేసే కార్యక్రమం ఇక్కడ కూడా అమలవుతోంది.
దారి పొడుగునా చేపల కంపు ఉపద్రవంగా అనిపించింది. అక్కడ ఎన్నో చేపలు పట్టే నావలు, చేపల హడావుడి కనిపించింది. ఆ వాసనలు దాటుకొని ఒక మంచి రోడ్డులోకి ప్రవేశించాము. ఒక కిలోమీటరు తరువాత గుడి వద్దకు చేరాము. గుడి, పరిసరాలు ముగ్ధ మోహనముగా ఉన్నాయి. మేము వెళ్ళేసరికి హారతి టైమ్.
నేను, మా ఆవిడ సోమనాథ్ సందర్శించడానికి ఫిబ్రవరి 25న బొంబాయిలో సౌరాష్ట్ర మెయిల్ లో బయలుదేరాము. నాకు బొంబాయి అనే వస్తుంది. ముంబయి అనే పదం మా మస్తిష్కంలో సరిగా చోటు చేసికోలేదు.
అలాగే మద్రాసు మాకు చెన్నై కాదు. కలకత్తా కోల్ కత్తా కాదు. కొచ్చిన్ కోచి కాదు. క్విలన్ కొల్లం కాదు. ట్రివేండ్రమ్ తిరువనంతపురం కాదు. బెల్గాం బెలగవి కాదు. గుల్బర్గా కులుబెరిగి కాదు. బెంగుళూరు బంగలూరు కాదు. రాజమండ్రి రాజమహేంద్రి కాదు. ప్రాంతీయ అభిమానాలో ఏమిటో ఈ నగరాల పేర్లు మార్చబడ్డాయి. అంత చలాకీగా, నిజాయితీగా ఈ రాష్ట్రాల ప్రజల స్థితిగతులు ఏమీ మారలేదు. నగరాల పేర్లు మార్చనపుడు ఎలా ఉన్నాయో ఇపుడూ అలానే ఉన్నాయి; ముక్కుతూ, మూలుగుతూ.
ప్రాంతీయ సంస్కృతులు, నాగరికతలు పేరుతో భారతీయులను వెఱ్ఱి వెంగళప్పల కింద జమ కట్టి మోసం చేయడం మన రాజకీయ నాయకులకే చెల్లింది. మన దురభిమానాలు, బలహీనతలు కూడా వేణ్ణీలకు చన్నీళ్ళలా దోహదం చేశాయి. ఫలితం మనం భారతీయులమని ఎప్పుడూ అనుకోకుండా ఈ విభేదాలు మనలని విడదీసి రాజకీయ నాయకులకు బలి పశువులను చేస్తున్నాయి. మన స్థితి గతులను ఏమాత్రమూ మార్చనవసరము లేకుండా మన ఆర్ధిక, సాంఘిక, సామాజిక జీవితములను అల్లాగే అధ్వాన్నంగా ఉంచుతూ మన ఓట్లను మాత్రం పట్టేసి పదవులు పట్టేసే సులువు రాజకీయ నాయకులకు మనం అప్పనంగా ఇచ్చేశాము. అది రాజకీయ నాయకుల అదృష్టము.
ఇంతకీ మేము సౌరాష్ట్ర మెయిల్ లో సోమనాథ్ కి బయలుదేరాము. చాలా మందికి మల్లే నా జీవితంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు చూసితీరాలని సోమనాథ్ కి బయలుదేరలేదు. నాకు ప్రయాణాలు చేయడం, ప్రదేశాలు చూడడం ఇష్టం. ఇప్పటికి భారతదేశంలో కొన్ని ప్రదేశాలు చూశాము. ఇది మరొక యాత్ర అంతే.
పుణ్యము, పురుషార్ధము కలిసివచ్చేలా యాత్రలుంటే అభ్యంతరం లేదు. నాకు భగవంతుడు ఉన్నాడో లేదో ఖచ్చితంగా తెలియదు. భగంతుడని ఒకాయన ఉండి మన బాగోగులు చూస్తున్నాడు, చూస్తాడు అంటే అదో ఉపశమనం. ప్రశాంతత. మేము స్మార్తులము. మాకు శివ కేశవ అభేదము. అందరు దేవుళ్ళూ దేవతలూ సమానమే; ఇష్టమే. పూజలు, పునస్కారాలు, అభిషేకాలు చేయడం ఇష్టమే. కాని క్షేత్రదర్శనాలకు వెళ్ళినప్పుడు మాత్రము ఈ బాదరబందీ ఏదీ పెట్టుకోకుండా భగవద్దర్శనము మీదే దృష్టి పెట్టకోవడం ఇష్టం. దర్శించే దైవ నామ స్మరణ చేసికుంటూ, క్షేత్ర, ఆలయ దర్శనములు చేస్తాను. నా భార్య అన్ని విషయాలో లాగానే నాకు సహకరిస్తూ అనుసరిస్తుంది.
ఇద్దరం కలిసి ఆ మరునాడు సాయంకాలానికి వేరావెల్ చేరాము. ఇది చిన్ని పట్టణము. ఇక్కడినుంచి సోమనాథ్ 8 కి.మీ. వేరావల్ లో మా అబ్బాయి హేటల్ గ్రాండ్ దక్ష్లో రెండురోజులకి రూమ్ బుక్ చేసి ఉంచాడు.
టూరిస్టులమైన మనకు కష్టాలు రైలు దిగిన వెంటనే కూలీలు, ఆటోవాళ్ళు, టేక్సీ వాళ్ళ రూపంలో మొదలౌతాయి కదా. లాగుడు పెట్టెల వల్ల కూలీల బాధ తప్పించుకున్నాము. కాని ఆటో, టేక్సీ ల వల్ల తప్పదు కదా. మెట్రో నగరాలలో ఊబర్, ఓలా ల వల్ల కొంత వెసులుబాటు కలిగించుకున్నాము. చిన్న పట్టణాలలో ఈ సదుపాయం ఉండదు కదా. మనలని చూడగానే ఈ ఆటోవాళ్ళకి, టేక్సీ వాళ్ళకి పులికి లేడి చిక్కినట్టుంటుంది అనుకుంటాను.
మొత్తానికి వాడు అడిగిన దానికి సగం ఇస్తానని గట్టిగా నిలబడేసరికి వచ్చాడు హోటల్ కి చేర్చాడు. వాడి కార్డు ఇచ్చి వాడి ఆటో సౌకర్యము ఉపయోగించుకోవచ్చని చెప్పాడు. ఆ చెప్పడంలో ఒక ఉపకారం చేశాడు. హోటల్ నుంచి సోమనాథ్ గుడికి రాను పోను 300 అవుతుందన్నాడు. అలాగేనని బుర్ర ఊపి హోటల్ గదిలో ప్రవేశించాము. హోటల్ గది, వాతావరణము, బాగున్నాయి. వేరావల్ జునాగఢ్ హైవే మీద ఉంది ఆ హోటల్. సాయంకాలం ఐదు అయింది. ఒకసారి దర్శనము చేసుకుని వద్దామనుకున్నాము.
నేను మధ్య తరగతి వాడిని రూపాయితో అయిపోయే చోట వందలు, ఏభైలు ఖర్చుపెట్టలేను. దూరం పది కిమీ. మూడు వందలు ఖర్చుపెట్టడం ఇష్టంలేక పోయింది. మాకు హోటల్ వాచ్ మన్ రూపంలో రక్షకుడు దొరికాడు. అతని సలహా ప్రకారం చెరో పది రూపాయలతో షేర్ ఆటోలో వేరావల్ సెంటరు చేరి, మరో షేర్ ఆటోలో అదే ఖర్చుతో సోమనాథ్ దేవాలయానికి చేరాము. అక్కడి సంగతులు రెండవ భాగంలో
మా సోమనాథ్ యాత్ర - రెండవ భాగము
అలా షేర్ ఆటోలో చీకటి పడుతూండగా సోమనాథ్ చేరాము. దారిలో రోడ్డు ఎంతో గతుకులతో ఉంది. షేర్ ఆటోలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. బస్సుల జాడే లేదు. ఆంధ్రప్రదేశ్ లాగానే తక్కువ దూరాలకు ట్రాన్స్ పోర్ట్ షేర్ ఆటో కుర్రాళ్ళకి, దూరాలు పైవేట్ ఆపరేటర్లకి వదిలేసి ప్రభుత్వ రవాణా సంస్థలు మూతపడేసే కార్యక్రమం ఇక్కడ కూడా అమలవుతోంది.
దారి పొడుగునా చేపల కంపు ఉపద్రవంగా అనిపించింది. అక్కడ ఎన్నో చేపలు పట్టే నావలు, చేపల హడావుడి కనిపించింది. ఆ వాసనలు దాటుకొని ఒక మంచి రోడ్డులోకి ప్రవేశించాము. ఒక కిలోమీటరు తరువాత గుడి వద్దకు చేరాము. గుడి, పరిసరాలు ముగ్ధ మోహనముగా ఉన్నాయి. మేము వెళ్ళేసరికి హారతి టైమ్.
అరేబియా. సముద్రం ఒడ్డున 1950లో కె. ఎమ్. మున్షీ గారి చొరవతో శిథిలాలలో
నున్న సోమనాథ్ దేవాలయాన్ని పునరుద్ధరించారు. దానిని అప్పటి రాష్ట్రపతి
రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. అలా రాష్ట్రపతి ఒక హిందూ దేవాలయ
కార్యక్రమంలో పాల్గొనడం అప్పటి సెక్యులర్ ప్రధాని నెహ్రూకి అభ్యంతరకరమైంది.
రాష్ట్రపతి పట్టించుకోలేదు. ఈ విషయమే కాదు ఎన్నో విషయాలలో విభేదించి
రాష్ట్రపతి, ప్రధాని ఎంతో కరస్పాండెన్స్ చేసుకున్నారు.
ఏమిటో భారతదేశపు జాతకం. సెక్యులరిస్టులందరికీ అప్పటినుంచీ హిందూమతమే లోకువ. సెక్యులరిష్టులు ఇతర మతముల జోలికి పోరు. వాటిలో లోపములే కనుపించవు వీరికి. కనిపించినా పిత్తిన ముత్తైదువ లా మౌనంగా, కిక్కురుమనకుండా ఉంటారు. వారి అంతరంగం సరసులకి ఎప్పటికీ బోధపడదు. భయమో, భక్తో, ద్వేషమో, విద్వేషమో, ఏది వారి హృదయాలను ఏలుతోందో తెలియదు.
మా హేండ్ బేగ్ లను మొబైళ్ళు, బెల్ట్ లతో సహా దేవస్థానం వారి కష్టడీకి అప్పగించి దేవాలయంలోకి ప్రవేశించాము. క్యూ వరసగా కదులుతూనే ఉంటుంది. ఎదురుగా భోలానాథ్, హర్ హర్ మహాదేవ ధ్వనులతో అట్టహాసంగా, అందంగా, ఆనందంగా పరమేశ్వర దర్శనం చేసికున్నాము. స్త్రీ, పురుషులు విడిగా దర్శనము చేసికోవాాలి. అప్పుడే హారతి ఇవ్వడం జరిగింది. హారతి విశేషాలు తరువాయి భాగంలో.
ఏమిటో భారతదేశపు జాతకం. సెక్యులరిస్టులందరికీ అప్పటినుంచీ హిందూమతమే లోకువ. సెక్యులరిష్టులు ఇతర మతముల జోలికి పోరు. వాటిలో లోపములే కనుపించవు వీరికి. కనిపించినా పిత్తిన ముత్తైదువ లా మౌనంగా, కిక్కురుమనకుండా ఉంటారు. వారి అంతరంగం సరసులకి ఎప్పటికీ బోధపడదు. భయమో, భక్తో, ద్వేషమో, విద్వేషమో, ఏది వారి హృదయాలను ఏలుతోందో తెలియదు.
మా హేండ్ బేగ్ లను మొబైళ్ళు, బెల్ట్ లతో సహా దేవస్థానం వారి కష్టడీకి అప్పగించి దేవాలయంలోకి ప్రవేశించాము. క్యూ వరసగా కదులుతూనే ఉంటుంది. ఎదురుగా భోలానాథ్, హర్ హర్ మహాదేవ ధ్వనులతో అట్టహాసంగా, అందంగా, ఆనందంగా పరమేశ్వర దర్శనం చేసికున్నాము. స్త్రీ, పురుషులు విడిగా దర్శనము చేసికోవాాలి. అప్పుడే హారతి ఇవ్వడం జరిగింది. హారతి విశేషాలు తరువాయి భాగంలో.
No comments:
Post a Comment