మా ద్వారకా యాత్ర - మూడవ భాగము
ద్వారకాధీశ దర్శన సుధాంబుధిలో మునకలు వేసి రసప్లావిత మనస్కులమై ఆలయ ప్రాంగణంలోనే చాలా సేపు కూర్చున్నాము. బయటకి వచ్చి భోజనం చేసి ద్వారక చుట్టుపక్కల దర్శనీయ స్థలములను చూడ్డానికి 5 గంటలు సమయం పట్టే ప్రైవేట్ టూరిష్ట్ మినీ బస్ లో సీట్లు రిజర్వు చేసికొని ఆ మధ్యాహ్నం 2-7 p.m. కి మినీ టూర్ కి బయలుదేరి వెళ్ళాము. ఆ టూర్ చూపించే చోట్లు: రుక్మిణీ దేవి ఆలయం, ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటైన నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, గోపీ తలాబ్, బెట్ ద్వారక.
ఇవన్నీ ద్వారకకు 30 కి.మీ పరిధిలో ఉన్నాయి.
ముందుగా రుక్మిణీదేవి మందిర దర్శనము. దూర్వాస మౌని శాపము వలన రుక్మణీ కృష్ణులకు 12 ఏళ్ళ ఎడబాటు ప్రాప్తించింది కదా. అందుకని రుక్మిణీ ఆలయం 12 కి. మీ. దూరంలో వసించింది. అక్కడ ఒక ఆలయం కట్టారు. చిన్నది. ఇక్కడ దూర్వాస ముని శాప కథ చెప్పి జలదానానికి చందా అడిగారు. ఎక్కువ మంది స్పందించ లేదు. ఆ కార్యక్రమము జన సమ్మర్దం వల్ల 20 నిమిషాలు పట్టింది. సంసార పక్షముగా ఉంది.
పిట్ట పాటలో ఏటి నీటిలో
వీచు గాలిలో పూచిన పూవులో
నాతి ప్రేమలో నీతి నడతలో
కల గోవిందుడు కలడంతట
శ్రీరమణీ కుచదుర్గ విహారివి నీవు
శ్రీ రాధా తనులతానందనా రసికుడ వీవు
శృంగారరస సామ్రాట్టువు; రసికా వతంసుడవు
రసపట్టులో తర్కం, మెట్ట వేదాంతం ఆపమని
ఈ స్వయంభూ కుహనా సన్యాసులకు బుర్రకెక్కు
నట్టు చెప్పి; మా రత్యానందములకు పానకంలో
పుడకలు కావద్దని దంండించుము ఈ ఆధ్యాత్మిక
గురువుల రసావతారా! నందనందనా! గోవిందా!
వర్షము పడనున్నప్పటి చల్లని గాలి కలిగించును హర్షము
శరత్తున పున్నమి వెన్నెలలిచ్చును సుఖము; వేసంగిని
గుబాళించి హాయి నిచ్చును మల్లియలు; గోవిందుని స్మరించిన
కలుగును అట్టి హర్షము సుఖము హాయి ఎల్లవేళల యందు
Buy one, get one free - నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం
ఈ ప్రకటన మనం అన్ని ఆధునిక అంగళ్ళలోనూ చూస్తాము. దానికి లోనై కొంటూంటాము కూడా. సోమనాథ్ యాత్ర మొదటి వ్యాసములో జ్యోతిర్లింగ దర్శనం; ముందు తెలిసి అనుకొని చేసిన యాత్ర. తర్వాత ద్వారక సందర్శించుకొని, చుట్టు పక్కల చిన్నా చితక దర్శనీయ క్షేత్రాలను, స్థలాలను చూసుకుని మార్చ్ 3 న బొంబాయికి సౌరాష్ట్ర మెయిల్ లోనే తిరుగు ప్రయాణానికి బుక్ చేసికున్నాము.
(సౌరాష్ట్ర మెయిల్ బొంబాయిలో ఒక రైలుగా బయలుదేరి, రాజ్ కోట జంక్షన్ వద్ద రెండు భాగములుగ విడుతుంది. ఒక భాగము వేరావల్ (సోమనాథ్), రెండవ భాగము ఓఖా (ద్వారక) వెళతాయి. తిరుగు ప్రయాణంలో ఓఖా, వేరావల్ ల నుంచి విడి విడిగా బయలుదేరి, రాజ్కోటలో కలసి ఒక రైలుగా బొంబాయి చేరతాయి).
మనం షాపులలో buy one get one free అనుభవాన్ని మనకు మనం కలిగించుకుంటాము. అంతటి అనుభవాన్ని సాక్షాత్తూ లయ కారకుడు పరమేశ్వరుడే మనకు కలిగిస్తే కలిగే ఆనందానికి అవధులుండవు కదా.
ప్రణమామి శంకరమ్
భక్తజన కింకరమ్
భవతిమిర భాస్కరమ్
పార్వతీ సహచరమ్
అని శివుని తలచుకుంటూ ఉంటాను. అట్టి భక్త జన కింకరుడు, భక్త సులభుడు, భోళా శంకరుడు తనంత తాను మాకు మరొక జ్యోతిర్లింగ దర్శనం ప్రసాదించాడు. ద్వారకలో ఈ మినీబస్ ఎక్కేవరకు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన దారుకావన స్థిత నాగేశ్వరుడు మేము దర్శించబోయే నాగేశ్వరుడు ఒకరేనని నాకు తెలియదు. బీహర్ లోనో ఎక్కడో ఉందనుకున్నాను. ఇదే అది అని తలిసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. పరమేశ్వరుడిచ్చిన వరంగా ఈ దర్శనాన్ని మేము గణించుకున్నాము. ద్వారకకు ఇంత సమీపమని తెలియదు. ఈ పర్యటనలో భోలానాథ్, మహదేవ్ అని ఈ ప్రాంతంలో కొలవబడే సదాశివుడు మాకిచ్చిన బోనస్ ఈ దర్శనము.
నాగేశ్వరుని ఆలయం, జ్యోతిర్లింగము కనుల విందుగా ఉన్నాయి. అమ్మవారు పార్వతి. సోమనాథ్ దేవాలయం వలె ఇక్కడ కూడా అమ్మవారు అయ్యవారి లింగం వెనుక ప్రతిష్ఠితయై ఉన్నారు. పరమశివుని కరుణకు పొంగిపోతూ
దారుకావన స్థిత నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని, అమ్మవారిని తనివి తీరా దర్శించాము. ప్రార్ధించాము. మవసారా కొలిచాము. మవసు శాంతానందమయమైంది. హృదయమున ప్రశాంతత వెల్లి విరిసింది.
ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులను నాగుడు-నాగిని లుగా తలచి నాగ దంపతీ పూజ చేస్తారు. టిక్కెట్టు ఖరీదు
ఎక్కువే. చాలామంది చేసుకుంటున్నారు. గర్భగుడిలో జంటలు కూర్చుని పూజలు చేసుకుంటున్నాయి. పూజా ద్రవ్యములు అక్కడే దండిగా లభిస్తున్నాయి. చాలా హడావుడిగా ఉంది. మేము వెళ్ళినపుడు సాయంకాలం నాలుగు అయింది. ఆ వేళ బుధవారం. 1-3-2017 తేదీన.
మేము మామూలుగానే శివపంచాక్షరి జపిస్తూ మా దర్శనం కానిచ్చుకున్నాము. పరమేశ్వరునికి వెండి తొడుగు తొడిగారు. పార్వతీ దేవి అలంకార భూషితయై అలరారుతోంది.
రమణ మహర్షుల శిష్యులు ఒకరు ఒక కావ్యం రాస్తూ, ఆ కావ్యంలో సందర్భ వశంగా దారుకావన తాపసులకు ఆత్మజ్ఞానము బోధించే ఘట్టాన్ని రమణులను రాయమని, తాను రాయలేనని చేతులెత్తేశాడు. ముందు కాదు కాదన్నా భక్తజన వత్సలురైన రమణులు ఆ ఆత్మజ్ఞాన బోధనా ఘట్టాన్ని తమిళంలో రాసారు.
దానిని, సంస్కృతంలోకి, ద్విపదల రూపంలో తెలుగులోకి, పాట రూపంలో మళయాళం లోకి కూడా రమణులే అనువదించారు. తెలుగులోను, సంస్కృతంలోను ఆ చిన్ని రచన పేరు ఉపదేశసారము. అలతి అలతి పదములతో రెండు భాషలలోను రమణుల ఉపదేశసారము సులభ గ్రాహ్యము. ముముక్షువులు పఠించి ఆనందిస్తారు.
దారుకావనం లోని నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనము చేసికుంటూంటే ఇదంతా మవసులో మెదిలింది. మహాదేవుని కరుణకు, తన దర్శన భాగ్యాన్ని కలిగించిన తీరుకి అబ్బురపడుతూ, విభ్రమము లేని సంభ్రమము మనసును ముప్పిరిగొన వినయ, భక్తి ప్రపత్తులతో శరణాగతినొంది నిటలాక్షుని, ఆయన దేవేరిని స్మరిస్తూ, వారి భక్తపాలన కళా సంరంభమునకు వినతులిడుతూ, నుతిస్తూ తదుపరి దర్శన స్థలానికి బయలు దేరాము.
వర్షము పడనున్నప్పటి చల్లని గాలి కలిగించును హర్షము
శరత్తున పున్నమి వెన్నెలలిచ్చును సుఖము; వేసంగిని
గుబాళించి హాయి నిచ్చును మల్లియలు; గోవిందుని స్మరించిన
కలుగును అట్టి హర్షము సుఖము హాయి ఎల్లవేళల యందు
వెనుకకు ప్రవాహింపవు సముద్రుని కలిసిన నదుల నీళ్ళు
మరలి రావు గడచిపోయిన ఏళ్ళు వయసు పరవళ్ళు
కొండల గుట్టల తిరిగి ఎక్కవు పొంగుచు దూకిన సెలయేళ్ళు
ఎన్నడు క్రుంగవు వీడి రావు ఇంపార గోవిందుని కలసిన మనసులు
కైలాసమన్ననేమి? వైకుంఠమన్ననేమి?
కాశి అన్ననేమి పూర్ణ ప్రకాశమన్ననేమి?
"కాశ్యాన్తు మరణం నామ" అన్ననూ; ఇన్నియూ
నీయందు నా వ్యక్తిత్వము లీనమగుట కాదె శంకరా?
వశిష్ఠ వామదేవ గౌతమాది విశిష్ఠ మహర్షి సంఘములు
భక్త వేదాంతులు శంకర ప్రభృతులు; భక్త శిరోమణులు
నాయనమారులు బసవవేశ్వరాది జంగమదేవులు;
కాళిదాస నన్నెచోడ సోమనాథ శ్రీనాథ ధూర్జటీ
కవి సార్వభౌములు ఈశ్వరార్చనాకళాశీలురై
ధన్యత నొందిరి మనమున మిమ్ము నిలిపి;
నిర్మల హృదయులైరి శివ పంచాక్షరి జపించి;
నాకును శివ మంత్రమును ఉపదేశింపుడు;
తపించి నేనును మిమ్ము కాంతును శంకరా!
శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః!
శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః!
శ్రీ పార్వతీపరమేశ్వరాభ్యాం నమః!
ద్వారకాధీశ దర్శన సుధాంబుధిలో మునకలు వేసి రసప్లావిత మనస్కులమై ఆలయ ప్రాంగణంలోనే చాలా సేపు కూర్చున్నాము. బయటకి వచ్చి భోజనం చేసి ద్వారక చుట్టుపక్కల దర్శనీయ స్థలములను చూడ్డానికి 5 గంటలు సమయం పట్టే ప్రైవేట్ టూరిష్ట్ మినీ బస్ లో సీట్లు రిజర్వు చేసికొని ఆ మధ్యాహ్నం 2-7 p.m. కి మినీ టూర్ కి బయలుదేరి వెళ్ళాము. ఆ టూర్ చూపించే చోట్లు: రుక్మిణీ దేవి ఆలయం, ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటైన నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, గోపీ తలాబ్, బెట్ ద్వారక.
ఇవన్నీ ద్వారకకు 30 కి.మీ పరిధిలో ఉన్నాయి.
ముందుగా రుక్మిణీదేవి మందిర దర్శనము. దూర్వాస మౌని శాపము వలన రుక్మణీ కృష్ణులకు 12 ఏళ్ళ ఎడబాటు ప్రాప్తించింది కదా. అందుకని రుక్మిణీ ఆలయం 12 కి. మీ. దూరంలో వసించింది. అక్కడ ఒక ఆలయం కట్టారు. చిన్నది. ఇక్కడ దూర్వాస ముని శాప కథ చెప్పి జలదానానికి చందా అడిగారు. ఎక్కువ మంది స్పందించ లేదు. ఆ కార్యక్రమము జన సమ్మర్దం వల్ల 20 నిమిషాలు పట్టింది. సంసార పక్షముగా ఉంది.
పిట్ట పాటలో ఏటి నీటిలో
వీచు గాలిలో పూచిన పూవులో
నాతి ప్రేమలో నీతి నడతలో
కల గోవిందుడు కలడంతట
శ్రీరమణీ కుచదుర్గ విహారివి నీవు
శ్రీ రాధా తనులతానందనా రసికుడ వీవు
శృంగారరస సామ్రాట్టువు; రసికా వతంసుడవు
రసపట్టులో తర్కం, మెట్ట వేదాంతం ఆపమని
ఈ స్వయంభూ కుహనా సన్యాసులకు బుర్రకెక్కు
నట్టు చెప్పి; మా రత్యానందములకు పానకంలో
పుడకలు కావద్దని దంండించుము ఈ ఆధ్యాత్మిక
గురువుల రసావతారా! నందనందనా! గోవిందా!
వర్షము పడనున్నప్పటి చల్లని గాలి కలిగించును హర్షము
శరత్తున పున్నమి వెన్నెలలిచ్చును సుఖము; వేసంగిని
గుబాళించి హాయి నిచ్చును మల్లియలు; గోవిందుని స్మరించిన
కలుగును అట్టి హర్షము సుఖము హాయి ఎల్లవేళల యందు
Buy one, get one free - నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం
ఈ ప్రకటన మనం అన్ని ఆధునిక అంగళ్ళలోనూ చూస్తాము. దానికి లోనై కొంటూంటాము కూడా. సోమనాథ్ యాత్ర మొదటి వ్యాసములో జ్యోతిర్లింగ దర్శనం; ముందు తెలిసి అనుకొని చేసిన యాత్ర. తర్వాత ద్వారక సందర్శించుకొని, చుట్టు పక్కల చిన్నా చితక దర్శనీయ క్షేత్రాలను, స్థలాలను చూసుకుని మార్చ్ 3 న బొంబాయికి సౌరాష్ట్ర మెయిల్ లోనే తిరుగు ప్రయాణానికి బుక్ చేసికున్నాము.
(సౌరాష్ట్ర మెయిల్ బొంబాయిలో ఒక రైలుగా బయలుదేరి, రాజ్ కోట జంక్షన్ వద్ద రెండు భాగములుగ విడుతుంది. ఒక భాగము వేరావల్ (సోమనాథ్), రెండవ భాగము ఓఖా (ద్వారక) వెళతాయి. తిరుగు ప్రయాణంలో ఓఖా, వేరావల్ ల నుంచి విడి విడిగా బయలుదేరి, రాజ్కోటలో కలసి ఒక రైలుగా బొంబాయి చేరతాయి).
మనం షాపులలో buy one get one free అనుభవాన్ని మనకు మనం కలిగించుకుంటాము. అంతటి అనుభవాన్ని సాక్షాత్తూ లయ కారకుడు పరమేశ్వరుడే మనకు కలిగిస్తే కలిగే ఆనందానికి అవధులుండవు కదా.
ప్రణమామి శంకరమ్
భక్తజన కింకరమ్
భవతిమిర భాస్కరమ్
పార్వతీ సహచరమ్
అని శివుని తలచుకుంటూ ఉంటాను. అట్టి భక్త జన కింకరుడు, భక్త సులభుడు, భోళా శంకరుడు తనంత తాను మాకు మరొక జ్యోతిర్లింగ దర్శనం ప్రసాదించాడు. ద్వారకలో ఈ మినీబస్ ఎక్కేవరకు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన దారుకావన స్థిత నాగేశ్వరుడు మేము దర్శించబోయే నాగేశ్వరుడు ఒకరేనని నాకు తెలియదు. బీహర్ లోనో ఎక్కడో ఉందనుకున్నాను. ఇదే అది అని తలిసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. పరమేశ్వరుడిచ్చిన వరంగా ఈ దర్శనాన్ని మేము గణించుకున్నాము. ద్వారకకు ఇంత సమీపమని తెలియదు. ఈ పర్యటనలో భోలానాథ్, మహదేవ్ అని ఈ ప్రాంతంలో కొలవబడే సదాశివుడు మాకిచ్చిన బోనస్ ఈ దర్శనము.
నాగేశ్వరుని ఆలయం, జ్యోతిర్లింగము కనుల విందుగా ఉన్నాయి. అమ్మవారు పార్వతి. సోమనాథ్ దేవాలయం వలె ఇక్కడ కూడా అమ్మవారు అయ్యవారి లింగం వెనుక ప్రతిష్ఠితయై ఉన్నారు. పరమశివుని కరుణకు పొంగిపోతూ
దారుకావన స్థిత నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని, అమ్మవారిని తనివి తీరా దర్శించాము. ప్రార్ధించాము. మవసారా కొలిచాము. మవసు శాంతానందమయమైంది. హృదయమున ప్రశాంతత వెల్లి విరిసింది.
ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులను నాగుడు-నాగిని లుగా తలచి నాగ దంపతీ పూజ చేస్తారు. టిక్కెట్టు ఖరీదు
ఎక్కువే. చాలామంది చేసుకుంటున్నారు. గర్భగుడిలో జంటలు కూర్చుని పూజలు చేసుకుంటున్నాయి. పూజా ద్రవ్యములు అక్కడే దండిగా లభిస్తున్నాయి. చాలా హడావుడిగా ఉంది. మేము వెళ్ళినపుడు సాయంకాలం నాలుగు అయింది. ఆ వేళ బుధవారం. 1-3-2017 తేదీన.
మేము మామూలుగానే శివపంచాక్షరి జపిస్తూ మా దర్శనం కానిచ్చుకున్నాము. పరమేశ్వరునికి వెండి తొడుగు తొడిగారు. పార్వతీ దేవి అలంకార భూషితయై అలరారుతోంది.
రమణ మహర్షుల శిష్యులు ఒకరు ఒక కావ్యం రాస్తూ, ఆ కావ్యంలో సందర్భ వశంగా దారుకావన తాపసులకు ఆత్మజ్ఞానము బోధించే ఘట్టాన్ని రమణులను రాయమని, తాను రాయలేనని చేతులెత్తేశాడు. ముందు కాదు కాదన్నా భక్తజన వత్సలురైన రమణులు ఆ ఆత్మజ్ఞాన బోధనా ఘట్టాన్ని తమిళంలో రాసారు.
దానిని, సంస్కృతంలోకి, ద్విపదల రూపంలో తెలుగులోకి, పాట రూపంలో మళయాళం లోకి కూడా రమణులే అనువదించారు. తెలుగులోను, సంస్కృతంలోను ఆ చిన్ని రచన పేరు ఉపదేశసారము. అలతి అలతి పదములతో రెండు భాషలలోను రమణుల ఉపదేశసారము సులభ గ్రాహ్యము. ముముక్షువులు పఠించి ఆనందిస్తారు.
దారుకావనం లోని నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనము చేసికుంటూంటే ఇదంతా మవసులో మెదిలింది. మహాదేవుని కరుణకు, తన దర్శన భాగ్యాన్ని కలిగించిన తీరుకి అబ్బురపడుతూ, విభ్రమము లేని సంభ్రమము మనసును ముప్పిరిగొన వినయ, భక్తి ప్రపత్తులతో శరణాగతినొంది నిటలాక్షుని, ఆయన దేవేరిని స్మరిస్తూ, వారి భక్తపాలన కళా సంరంభమునకు వినతులిడుతూ, నుతిస్తూ తదుపరి దర్శన స్థలానికి బయలు దేరాము.
వర్షము పడనున్నప్పటి చల్లని గాలి కలిగించును హర్షము
శరత్తున పున్నమి వెన్నెలలిచ్చును సుఖము; వేసంగిని
గుబాళించి హాయి నిచ్చును మల్లియలు; గోవిందుని స్మరించిన
కలుగును అట్టి హర్షము సుఖము హాయి ఎల్లవేళల యందు
వెనుకకు ప్రవాహింపవు సముద్రుని కలిసిన నదుల నీళ్ళు
మరలి రావు గడచిపోయిన ఏళ్ళు వయసు పరవళ్ళు
కొండల గుట్టల తిరిగి ఎక్కవు పొంగుచు దూకిన సెలయేళ్ళు
ఎన్నడు క్రుంగవు వీడి రావు ఇంపార గోవిందుని కలసిన మనసులు
కైలాసమన్ననేమి? వైకుంఠమన్ననేమి?
కాశి అన్ననేమి పూర్ణ ప్రకాశమన్ననేమి?
"కాశ్యాన్తు మరణం నామ" అన్ననూ; ఇన్నియూ
నీయందు నా వ్యక్తిత్వము లీనమగుట కాదె శంకరా?
వశిష్ఠ వామదేవ గౌతమాది విశిష్ఠ మహర్షి సంఘములు
భక్త వేదాంతులు శంకర ప్రభృతులు; భక్త శిరోమణులు
నాయనమారులు బసవవేశ్వరాది జంగమదేవులు;
కాళిదాస నన్నెచోడ సోమనాథ శ్రీనాథ ధూర్జటీ
కవి సార్వభౌములు ఈశ్వరార్చనాకళాశీలురై
ధన్యత నొందిరి మనమున మిమ్ము నిలిపి;
నిర్మల హృదయులైరి శివ పంచాక్షరి జపించి;
నాకును శివ మంత్రమును ఉపదేశింపుడు;
తపించి నేనును మిమ్ము కాంతును శంకరా!
శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః!
శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః!
శ్రీ పార్వతీపరమేశ్వరాభ్యాం నమః!
No comments:
Post a Comment