కీరములు
క్రూరములాయె! మారుడు క్రూరుడాయె!
మనసు
పడి ముదమున ప్రియమార నేర్పిన
నిజ
ప్రణయేశ్వరుని నామమును పెంపుడు చిలకలు
“మాధవా!”
“మాధవా” యని మధురాలాపములు చేయ
మనసు
రంజనమొంది రాధ మన్మథ వశయైన తరి
మొలనూలు
జారి పయిట తొలగ
బయల్పడిన
సువర్ణ కుచకుంభముల పండ్లని
భ్రమించి
రాచిలుకలు గావించిన ముక్కుల పోటులు
మాధవకృత
నఖదంత క్షతముల అనుభూతినీయ
రసములూరి
తనువు మనసు విరహమున
తీపులు
పెట్టుచుండ మదనుని కదనమునకు
ఆయత్తయైన
రాధకు
ప్రణయకలహమున
అలిగి
మాధవుడు ఇంకను రాని వేళ
కీరములు
క్రూరములాయె!
మారుడు
క్రూరుడాయె!
మీ కవితాస్రవంతికి జోహార్లు. చాలా బాగున్నది.
ReplyDeleteమీ కవితాస్రవంతికి జోహార్లు. చాలా బాగున్నది.
ReplyDelete