
పత్రికల నిష్క్రమణం - మరణం?
24-2-2015
సంచికతో ఇండియా టుడే (తెలుగు) పత్రిక ప్రచురణ ఆగిపోతుంది. ఈ పత్రిక ఇంక
వెలువడదు. ఇలా ఈ పత్రిక మన జీవితములలోంచి నిష్క్రమిస్తోంది. తెలుగు
మాట్లాడే ప్రాంతాలవారిలో ఈ పత్రిక ప్రచురణఆగిపోతున్నట్టు ఎంతమందికి తెలుసో, ఎందరు విచారిస్తున్నారో తెలియదు. నేను మాత్రము బాధపడుతున్నాను.
నేను ఆంద్ర ప్రాంతము వదిలేసి 16 ఏళ్ళు అయింది. ఈ పదహారేళ్ళుగా నేను ఇండియా టుడే (తెలుగు) వార పత్రికను తపాలా ద్వారా తెప్పించుకుంటున్నాను. మొదట అది పక్ష పత్రిక. నెమ్మదిగా వారపత్రికగా మార్చారు. ఇందులో తెలుగు భాష బాగుంటుంది. విషయములను ఎక్కువగా ఆంగ్ల ఇండియా టుడే నుంచి అనువదిస్తారు.
నేను ఆంద్ర ప్రాంతము వదిలేసి 16 ఏళ్ళు అయింది. ఈ పదహారేళ్ళుగా నేను ఇండియా టుడే (తెలుగు) వార పత్రికను తపాలా ద్వారా తెప్పించుకుంటున్నాను. మొదట అది పక్ష పత్రిక. నెమ్మదిగా వారపత్రికగా మార్చారు. ఇందులో తెలుగు భాష బాగుంటుంది. విషయములను ఎక్కువగా ఆంగ్ల ఇండియా టుడే నుంచి అనువదిస్తారు.
నిజానికి
పత్రిక ప్రచురణ ఆగిపోయినప్పుడు నేను విచారించడము ఇది మొదట సారి కాదు.
నన్ను యవ్వనంలో అలరించిన ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ అఫ్ ఇండియా, యూత్ టైమ్స్ -
ఈ రెండు టైమ్స్ అఫ్ ఇండియా పబ్లికేషన్స్ ఆగి పోయినప్పుడూ ఇలానే
అనిపించింది.
ఆంద్ర పత్రిక దినపత్రిక, వార పత్రిక,
భారతిల ప్రచురణలు ఆగిపోయినప్పుడు మనసు మూగబోయింది. కాశీనాథుని
నాగేశ్వరరావు పంతులుగారి ప్రియ పత్రికలు అలా నిష్క్రమించినపుడు తెలుగు
భాష,తెలుగు వారు ఎంతో నష్ట పోయారు. మమబోంట్లు మరింత వ్యథ చెందారు.
నా
చిన్నప్పుడు కృష్ణా పత్రిక, ప్రజామత అని రెండు పత్రికలు వచ్చేవి.
ప్రజామతలో ఎక్కువగా రాజకీయ సంబంధమైన వార్తలు ఉండేవి. కృష్ణా పత్రిక ఆల్
రౌండర్. అందులో ఇల్లిందల సరస్వతీ దేవి గారి "ఇయం గేహే లక్ష్మీ: " శీర్షిక
చదివేవాణ్ణి. అందులోని విషయములు చిన్నతనము వల్ల ఎక్కువగా అర్ధము కాకపోయినా శీర్షిక పేరు ఎంతో ఆహ్లాదకరముగా ఉండేది.
అందరి
బాలల హృదయాల రంజని, జ్ఞాన, సంస్కృతీ ప్రదాత, చల్లదనము ఆహ్లాదము కలగలపిన
కథలతో మనసు కొల్లగొట్టిన నిండు జాబిలీ - అదే పిల్లల ప్రియ మాసపత్రిక,
చందమామ ప్రచురణ ఆగిపోయినప్పుడు ఇదే శూన్య భావము. నాగిరెడ్డి-చక్రపాణిల
సినిమాల వలే ఆహ్లాదపరిచిన చందమామ, విజయచిత్ర, యువ; వారి ప్రచురణయే అయిన Heritage
అనే ఆంగ్ల మాసపత్రికల ప్రచురణలు ఆగిపోయినప్పుడు ఇదే బాధ.
Heritage పత్రికకు Manoj Das సంపాదకులు. వచ్చిన 5 ఏళ్ళు ఎంతో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కలిగించి, వివిధ భాషా సాహితీ పరిచయాన్ని చేసింది. నన్ను మొదటి సారి కథల అనువాదానికి ప్రేరేపించిన ప్రముఖ బెంగాలీ కథకులు "పరశురాం" సృష్టి "బటేశ్వరునుని సృష్టి" ఇందులో ప్రచురణ అయినదే. దానితో మొదలైన నా అనువాద ప్రస్థానము 5 ఏళ్ళు కొనసాగి, విపులలో వివిధ భారతీయ భాషలలోంచి ఆణి ముత్యాలవంటి 16 అనువాద కథలను తెలుగు పాఠకులకు అందించే స్ఫూర్తిని కలిగించింది.
Heritage పత్రికకు Manoj Das సంపాదకులు. వచ్చిన 5 ఏళ్ళు ఎంతో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కలిగించి, వివిధ భాషా సాహితీ పరిచయాన్ని చేసింది. నన్ను మొదటి సారి కథల అనువాదానికి ప్రేరేపించిన ప్రముఖ బెంగాలీ కథకులు "పరశురాం" సృష్టి "బటేశ్వరునుని సృష్టి" ఇందులో ప్రచురణ అయినదే. దానితో మొదలైన నా అనువాద ప్రస్థానము 5 ఏళ్ళు కొనసాగి, విపులలో వివిధ భారతీయ భాషలలోంచి ఆణి ముత్యాలవంటి 16 అనువాద కథలను తెలుగు పాఠకులకు అందించే స్ఫూర్తిని కలిగించింది.
దానిని మూసివేస్తూ మనోజ్ దాస్ గారు రాసిన సంపాదకీయం నాకు ఇప్పటికీ గుర్తు. చందమామ ప్రచురణతో వచ్చిన డబ్బులతో Heritage ప్రచురణ కొనసాగించడము నాకు ఎంతమాత్రము ఇష్టము లేదు. దానికాళ్ళ మీద అది నిలబడే పరిస్థితి లేదు. చందమామ పబ్లికేషన్స్ వారు ఎంత బ్రతిమిలాడినా మనోజ్ దాస్ గారు వినలేక పోయారు. అది అలా మూత బడింది.
అలాగే సంస్కృత చందమామ ప్రచురణ కూడాను ఆగిపోయింది. నేను సంస్కృతం నేర్చుకోవడములో ఎంతో సాయం చేసిన ఆ పత్రిక ప్రచురణ ఆగిపోవడమూ నాకు వ్యక్తిగతముగా కష్టమే కలిగించింది. అలాగే Readers Digest, ఇంకా ఎన్నో - బాలమిత్ర, బాల రంజని, వారం వారం సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు అందించిన ఆంధ్రజ్యోతి వారపత్రిక, ఇలా అన్నీ నిష్క్రమించాయి.
మనుషుల మరణం లాగానే పత్రికల మరణం, మన జీవితములలోంచి వాటి, వారి నిష్క్రమణ కూడా అనివార్యమని వేదాంతాన్ని అలవరచుకుని ఈ బాధని అధిగమిస్తాను.
మనుషుల మరణం లాగానే పత్రికల మరణం, మన జీవితములలోంచి వాటి, వారి నిష్క్రమణ కూడా అనివార్యమని వేదాంతాన్ని అలవరచుకుని ఈ బాధని అధిగమిస్తాను.
తప్పదండి... యెంత సాహిత్యాభిరుచి ఉన్నా, పత్రిక నడిపేందుకు అయ్యే నిర్వహణ ఖర్చులు ఎడిటర్ కు పెనుభారం. టీవీ ఆడ్స్ కోసం 5 సెకండ్ లకు 3 లక్షలు ఇచ్చే వ్యాపారులు పత్రికలో ఆడ్ కోసం కనీసం పదివేలు కూడా ఇవ్వరు. సాహిత్యాభిరుచి ఉంటుంది, కాని సాహితీ పోషకులు ఎవరూ ఉండరు. ప్రభుత్వం ప్రోత్సహించి, దన్నుగా నిలవదు. అందుకే ఉదయించిన ప్రతీ పత్రికా... ఏదో ఒకనాటికి అస్తమించాల్సిందే నేమో !
ReplyDelete