Monday, June 13, 2016

వేర్ ఉద్యోగులు; దిగువ మధ్యతరగతి కుటుంబాల వృథా వ్యయములు; కుహనా మేధావులు; వాల్మీకి, వ్యాసుల సాహితీ భిక్షలు

వేర్ ఉద్యోగులు


రాముడు, కృష్ణుడు ఆరాధ్యులు కారు నేటి యువతకు;
స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్, వారెన్ బఫే మొదలగు వ్యాపార
దిగ్గజములు; సచిన్ టెండూల్కర్ వంటి క్రికెట్ ఆటగాళ్ళు,
సినీ నటీ నటులు, నేటి యువతకు ఆదర్శప్రాయులు,
వారి హృదయాధివేతలు, జీవితములకు రోల్ మోడల్స్;

రామానుజన్, ఐన్స్టైన్, రాధాకృష్ణన్, ఆదిశంకరులు,
రామానుజులు, పతంజలి, నాట్య విశారదుడు భరతుడు
మొదలైన వారి పేర్లే వినని తరము నేటి వేర్ ఉద్యోగులు


సంగణకయంత్రము ముందు కూచుని, కోకోకోలా త్రాగుచు

గంటల తరబడి స్క్రీన్ పై దృష్టి నిలిపి అంతర్జాల మాధ్యమమున
అన్ని పనులు చేసికొను దిట్టలు; ధన సంపాదనమునకు జ్ఞాన
సముపార్జనము కలపలేని సునిశిత బుద్ధిమంతులు, మేధను
అరుదుగా ఉపయోగించు రొటీన్ పనుల వారు; అందరిటుల కాదు;

ఎక్కురు ఇటుల; తరములు మారిన ధన సంపాదనా
మార్గములు, జీవన శైలి మారును; సహజమైన ఈ
పరిణామమునకు అందరము అలవాటు పడవలె;

 దిగువ మధ్యతరగతి కుటుంబాల వృథా వ్యయములు


ఎంతో మంది దిగువ మధ్యతరగతి కుటుంబాలవాళ్ళు పనికిరాని ఇప్పటి ఈ మమ్మీ, డేడీ, చదువులకు వృథా చేసికుంటున్న మొత్తాలు లక్షల్లో ఉంటున్నాయి. అదే‌
డబ్బు బేంక్ లో వేసి అట్టేపెట్టి, పిల్లలు పెద్దయ్యాక వాళ్ళకి ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అక్షరాస్యత ప్రభుత్వ విద్యాలయాలలో చదివిస్తే అబ్బుతుంది. అసలు గవర్నమెంటు స్కూళ్ళలో చేర్చడానికి ఈ పేదలు ముందుకు రావటం లేదు.
తాము రెక్కలు ముక్కలు చేసికొని సంపాదించినదంతా ఈ పనికి మాలిన, ఉద్యోగాలు తేలేని, నిరర్ధక చదువులకు పోస్తున్నారు. ఇలా వృథా చేసుకోకండయ్యా అంటే మనమీద గయ్ మని లేస్తున్నారు. మృదు మనస్కులైతే మవసు కష్టపెట్టుకుంటున్నారు. మా పిల్లలు వృద్ధిలోకి వచ్చి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయడం మీకు కంటగింపుగా ఉందా అని అడుగుతున్నారు.
ఇందరికి ఉద్యోగాలు లేవు, ఏదో కొందరికి, చాలా తక్కువ శాతం వారికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి అనే వాస్తవాన్ని ఎప్పటికి గ్రహిస్తారో ఈ బడుగులు.
ప్రభుత్వాలే ఈ పనికి మాలిన చదువుల రూపు గ్రహించి, ఉద్యోగాలు తేలేని వాటి అసమర్ధత గమనించి, skills development అనే పాట పాడుతూంటే, ఈ కష్టజీవులు తమ సంపాదనంతా (వేలల్లో, లక్షల్లో) ఈ చదివించడంలో
గంగలో కలుపుకుంటున్నారు.
నాలుగు రాళ్ళు సంపాదించుకోగల విద్యను నేర్చుకొని రాజాలలాగా బ్రతకవలసింది పోయి ఉద్యోగాలు, సంపాదన లేక అలమటిస్తున్నారు.
వీరి ఈ అజ్ఞానము ఎప్పటికి పోతుందో కదా!

 కుహనా మేధావులు

చాలా మంది మేధావులు, జనాలు నిజం తెలుసుకోవాలి అనుకోరు. తాము చెప్పిందే నిజమని నమ్మి ప్రజలు అలాగే నడవాలి అనుకుంటారు; అంటారు.
తమ తమ విచక్షణ నుపయోగించి జనం నిజం తెలుసుకోవడాన్ని ఈ మేధావులు ఆమోదించరు.సామాన్య జనాలకూ విచక్షణ, బుద్ధి సూక్ష్మత, ఇంగిత జ్ఞానం ఉంటాయని వీరు గ్రహించరు. గ్రహించలేరు.
ఓ పక్క తమ తర్కాన్నంతా ఉపయోగించి నిజ దర్శనం చేసామనీ, సామాన్యులు మారు ప్రశ్న వేయకుండా తాము చెప్పిన దానిని అనుసరిస్తే సరిపోతుందని; ప్రజలు, మరొకరు చెప్పినదానిని గణించక్కర లేదని, తాము చెప్పినది "నమ్మి" తు. చ. తప్పకుండా అనుసరిస్తే చాలని ప్రసంగిస్తారు; రచనలూ చేస్తారు, కవితలూ వెలయిస్తారు. తమ సిద్ధాంతం పేరుతో మరొక "మతాన్నీ" సృష్టిస్తారు. ఇప్పటి వరకు ఉన్న మతాలని దునుమాడుతారు.
సామాన్యుని ఇంగిత జ్ఞానాన్నిగౌరవించలేని వీరు మత గురువుల వంటివారు.

 వాల్మీకి, వ్యాసుల సాహితీ భిక్షలు

వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్రామాయణము, వ్యాసమహర్షి‌ రచించిన మహాభారతము, మహాభాగవతములలో మన జీవిత నౌకల సజావుగా నడిపించుకోవడానికి కావలసిన ఉపయోగకర విషయములు, మానవ‌ జీవిత పరమార్దము‌ తెలుసుకోవడానికి, జీవితాన్ని పండించుకోవడానికి సరిపడ ఆచరణల వివరములు విశదముగా ఉన్నాయి.
పంచతంత్రము, నీతిచంద్రిక, హితోపదేశ కథలు, బుద్ధుని జాతక కథలు కూడా మనకు లౌకిక జ్ఞానము, ఇంగితమూ తెలుపుతాయి.
ఉపయోగించుకోవడమే మన ఆలస్యం.


No comments:

Post a Comment