Tuesday, May 22, 2018

Tide; నొప్పింపక తా నొవ్వక ; సావిత్రి- సినిమా; ఆధునిక కాళిదాసులం; అచ్చు - ఇ-ప్రచురణలు; ఆధునిక రచ్చబండ; Karnataka elections May 2018

Tide
We are all tempted to comment on political, social and other issues as they happen, especially political, which are so volatile and change every minute.
If the political happening is of our liking we comment so immediately and keep quiet if it happens contrary to our liking. Once the tide changed, which is so quickly changing, and favourite to us we again plunge into commenting.
The political leaders and happenings are giving us a tough time for commenting. Still we are coping.
The same coping with near and dear is necessary for a peaceful living.
Tides change with time. Or time changes tide.
Let us be patient.
*******
Many are aware of reality and truth; only few will use it and follow.
********* 
ధనవంతులు ధనం లేనివారిని హీనంగా చూస్తారు.
అలాగే రాజకీయ నాయకులు ఓట్ బేంక్ కాని వారిని హీనంగా చూస్తారు.
********
ప్రస్తుతం తిరుమల అనే బంగారు బాతుని కోసుకొని తినడం జరుగుతోంది.
*********
నొప్పింపక తా నొవ్వక
తప్పించుకు తిరుగు వాడు
ధన్యుడు సుమతీ!
ఈ సత్యాన్ని ఈ రోజుల్లో మనం ఎవ్వరం పట్టించుకోవటం లేదు.
చాలా సంస్కార హీనంగా ఒకరినొకరు నొప్పించుకుంటున్నాము.
అంతర్జాల సాలెగూళ్ళతో అయితే మరీను. విషయం ఏదైనా అటు, ఇటు నిలబడి పోస్ట్ల, కామెంట్ ల, తిరిగి కామెంట్ ల వాగ్బాణాలతో ఒకరినొకరు నొప్పించుకోవడం గొప్ప నాగరికత అయింది. సంస్కృతిలా భాసిల్లుతోంది.
మనసుని నొప్పించడం శరీరానికి చేసే గాయం కన్నా
ఎన్నో రెట్లు ఎక్కువ అని మనందరికీ తెలుసు. అయినా సరే మన అభిప్రాయమే కరెక్ట్, ఇతరుల అభిప్రాయాలు తప్పు అని ఎంచుతూ పోస్ట్ ల లహరిలో కొట్టుకు పోతున్న జాతి మనది. ఒక విషయానికి రెండు వైపులుంటాయని తెలియని జీవులం.
మనకి తెలిసిన సమాచారం మాత్రమే కరెక్ట్ అని మూర్ఖంగా వ్యవహరించడం, మాట్లాడడం ఒక ఫేషన్ అయిపోయింది. చిన్న చిన్న పనికిరాని విషయాల నుంచి, కొట్లాడుకోవడం, కాట్లాడుకోవడం రివాజు అయింది.
మన జ్ఞానం, మన అనుభవం, మన విజ్ఞానం, మన పరిజ్ఞానం పరిమితమైనవి అనే స్పృహ చాలా మందికి లేదు. పసిపిల్లల కన్న కనాకష్టంగా పంతాలు, పట్టింపులకు పోయి అసలే తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉండే ఈ అంతర్జాల స్నేహాల్లో కూడా అహం ప్రదర్శించడం, చంటి పిల్లల లాగ మనదే ఆఖరు మాట అవ్వాలనుకోవడం adults లోని అపరిపక్వతను తెలియజేస్తుంది.
వయసు పెరిగింది కాని అవగాహన పెరగలేదు అని మనకి రూఢిగా తెలుస్తుంది. ఇదే ధోరణి నిజ జీవితాల్లో కూడా ఉంచుకుని అనవసరమైన పంతాలకు పోయి అనుబంధాలను బలహీన పరచుకుంటారు. ఏది ఏమైతేనేమి, ఇందులో ఏముంది, అని విషయాలను తేలికగా తీసి కోవడం నేర్చుకోక పోతే మన జీవితాల నిండా అశాంతి నెలకొని సుఖాన్ని, సంతోషాన్ని హరిస్తాయి.
ఇది గ్రహించి ప్రవర్తిస్తే ఎంతో మానసిక శక్తిని ఆదా చేసుకోవచ్చు.
*******
It is really wonderful, surprising and sycophantic that many intellectuals, media, and party workers still take seriously the abilities of RA GA to lead party and nation to take to excellent heights.
********
Once elections are over the role of citizens is over in Indian democracy. After that it is the show of people's representatives.
The citizens are contacted during next elections only. Between the elections their role is confined to helplessly watch the drama exhibited by their elected representatives.
********
మన వివేకం మన ప్రవర్తనలో తెలుస్తుంది.
మన "జ్ఞానం" మన మాటల్లో తెలుస్తుంది.
********
సావిత్రి- సినిమా
సావిత్రిని, ఆవిడ వ్యక్తి గత జీవితాన్ని ఇంత స్థాయిలో సెలిబ్రేట్ చేసుకోవలసినంత అవసరం తెలుగు జాతికి ఉందా? స్వంత తప్పిదాల వల్ల జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంది మనందరి లాగే.
జెమినీ గణేషన్ సావిత్రి సినిమాలో చూపించినట్టుగా సినిమాల్లో విలన్ లాంటి వాడు కాదని ఆయన కన్న కూతురు ప్రకటన విడుదల చేసింది.
మనందరం ఇలా సావిత్రిని ఎత్తేస్తూంటే మన పిల్లలకు తప్పుడు సందేశం అందుతుంది. పెళ్లైనవాడని తెలిసీ ఎందుకు సావిత్రి తప్పటడుగులు వేసింది? జీవితాన్ని అలా పాడుచేసికొంది? జరిగిన దానికి అంతకీ జెమినీ గణేశన్ మాత్రమే బాధ్యుడనడం వల్ల మన పక్షపాత ధోరణి విదితమౌతుంది తప్ప వాస్తవం తెలియదు.
సంఘంలో వివిధ వృత్తుల్లో ఉన్నవారు వృత్తి స్వరూపాన్ని బట్టి రకరకాలుగా జీవిస్తారు. అవన్నీ సరియైనవి, ఆదర్శమైనవి కాకపోతే మనం వాటి పదే పదే తలుచుకొంటే మన పిల్లలకు మనసుల్లో తప్పుడు భావాలు కలిగిస్తాం. ముఖ్యంగా సినిమా వారిని సినిమా వారిలాగా మాత్రమే చూడాలి. వారి నటనతో మనల్ని ముగ్ధుల్ని చేశారు కదా అని నెత్తిన ఎక్కించుకో కూడదు.
నట, విట, విదూషకులను దూరంగా ఉంచాలి. చోరులు, జారులు, కుటుంబ వ్యవస్థను గౌరవించని వారు, అవినీతి పరులు మనకు ఆదర్శప్రాయులు కారాదు.
ఇది మన సంస్కృతికి, నాగరికతకు సంబంధించిన విషయం. మన పిల్లల మనసులను ప్రభావితం చేసే విషయం. సినిమాని సినిమాలా ఉంచాలి.
అసలే సంస్కృతి విషయంలో ఒక దారి, తెన్నులు లేని మన సంఘంలో మన అతితో తప్పుడు సందేశాలు, సంకేతాలు ఈయరాదు.
తన ప్రవర్తనతో నిర్లక్ష్యంగా తన జీవితాన్ని గడిపిన ఒక స్త్రీ, మనలను ఎంతో అలరించిన నటి కదా అని అవన్నీ మర్చిపోయి మనం ప్రవర్తించరాదు.
గమనిక: ఫేస్బుక్ పోస్ట్లో ఒకావిడ చెప్పారు. జనం అంతా సావిత్రి, సావిత్రి అంటూంటే ఒక ఆధునిక యువతి జెమినీ గణేశన్ వేసిన వాడు చాలా బాగున్నాడే, అబ్బ ఎంత అందంగా ఉన్నాడే, వాణ్ణి చూసి నా మతిపోయింది, వాడే నా crush అందిట.
చూసే చూపులు ఒకే విషయం మీద అందరికీ ఒకే లాగే ఉండదు. "కన్యా వరయతే రూపం"!
మన సినిమా హడావుడులు తగ్గించుకోవడం ఉత్తమం. సావిత్రైనా, ఆమె జీవితమైనా, ఆవిడ జీవితం మీద తీసిన సినిమా అయినా మన స్పందనలు; మన అభిరుచులను, దృష్టులను, ధోరణులను, పరిమితిని, పరిణితిని, పరిపక్వతను తెలియజేస్తాయి. Let us be aware of it.
*******
ఆధునిక కాళిదాసులం
కాళిదాసు పూర్వాశ్రమంలో విద్యాగంధం లేని మూర్ఖుడైన సామాన్యుడు అనీ, కాళికాదేవి అనుగ్రహంతో సకల విద్యా పారంగతుడు, విద్వాంసుడు,, గొప్ప నాటక కర్త అయ్యాడనీ ఐతిహ్యం. ఇందులో నిజానిజాలు కాసేపు పక్కన పెట్టి, ఆయన్ని మూర్ఖుడని ఎందుకన్నారో ఒకసారి చూద్దాం.
రాజకుమారి అహం అణచడానికి, గర్వభంగం చేయడానికి మంత్రి వేసిన పన్నాగంలో భాగంగా కాళిదాసు పూర్వాశ్రమంలో పావుగా ఉపయోగించుకో
బడ్డాడు. మూర్ఖునికై వెతుకుతూ తిరుగుతున్న మంత్రికి తను కూచున్న కొమ్మని తాను నరుక్కుంటూ కనబడ్డాడు. కొమ్మ విరిగితే తాను కిందికి పడిపోతానని తెలియనంత మూర్ఖుడు. మంత్రి అది
గ్రహించి రాచనగరుకు తోడ్కొని పోయి రాజకుమారితో వివాహం చేయించాడు.
తను కూచున్న కొమ్మని తాను నరుక్కుంటే వాడిని కింద పడిపోతానని తెలియని వాడిని మూర్ఖుడంటారు.
మనందరికీ కొమ్మ లాంటి, అమ్మలాంటి కొమ్మలున్న కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకొని, మనకు ఆధారం, నిలువనీడ లేకుండా చేసికునే మనం ఆధునిక కాళిదాసులం కాదా?
********
అచ్చు - ఇ-ప్రచురణలు
ఈ రోజుల్లో కూడా మనం మన రచన ఏదో పత్రికలో పడితే పొందే ఆనందం, అంతర్జాలంలో పెట్టి రసజ్ఞులు దానిని మెచ్చుకున్నా అంత ఆనందం పొందం.
సాంకేతికంగా ఎంతో వృద్ధి చెంది, క్షణాల్లో మన రచన అందరినీ చేరినా, సత్వరం వారు ప్రతిస్పందన తెలియజేసినా మనకు అంత తృప్తి కలగటం లేదు.
ప్రచురించడం నాలుగు వందల ఏళ్ల క్రితం సాంకేతికత. ఇప్పటికే అదే మనల్ని కట్టిపడెయ్యడం వింతల లోకి వింత.
అలాగే పుస్తక ప్రచురణ. అంతర్జాలంలో, ఇ-పుస్తకాలు, ఎన్ని "ప్రచురించినా", అచ్చులో ప్రచురించబడితేనే అది పురస్కారాలకి అర్హం. రచనలో పస కన్న రచన అందించిన విధానానికి పురస్కారం లభిస్తోంది. ఇంతకన్నా వెఱ్ఱి తనం ఉందా?
పుస్తకాన్ని అచ్చు వేయించడం ఆషామాషీ వ్యవహారం కాదు. రచన చేసినవాడే దాన్ని ప్రచురించుకోవాలి.
అది ఓ పెద్ద చేతి చమురు భాగోతం. రచనలు చేసే వారందరికీ పెను ఆర్ధిక భారం. ముఖ్యంగా కవులు, కవయిత్రులు తమ తమ కవనాలని అచ్చేయించు కోవడానికి తెగ ఉత్సాహపడుతూంటారు. కిలమూ వదుల్చుకుంటారు.
అచ్చుకు సంఘం ఇంత ప్రాధాన్యత ఈయడం సాహితీ సృష్టికి, పఠనానికి, ప్రసారానికి ఎంతో అడ్డు. అచ్చు వేయించకపోవడం వల్ల ఎంతో పస కల రచన కూడా సాహితీ రంగానికి అందకుండా పోతుంది.
సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిన నేడు పురస్కార ప్రదాతలు, విమర్శకులు, గుర్తింపు నిచ్చే వారు రచనను అచ్చువేయిస్తే తప్ప పట్టించుకోం అనడం హాస్యాస్పదం. అభివృద్ధి నిరోధకం.
రచనను అచ్చు వేయించుకోవడం సాహితీ స్రష్టకు
మోయలేని భారం. సాహితీ సృష్టే చేస్తాడా, అచ్చు కార్యక్రమంలో మునిగి తేలుతూ సమయాన్ని, డబ్బును, శక్తిని వృథా చేసికుంటాడా?
ఇది మనందరి సమస్య. అందరం ఆలోచించి ఒక పరిష్కారం ఆవిష్కరించడం సాహితీ వేత్తలుగా మన తక్షణ కర్తవ్యం. పుంఖానుపుంఖాలుగా ఇ-రచనలు రావడం ఈ దిశలో ఒక వేగనిరోధకమే
కనీసం పురస్కార ప్రదానాల విషయంలో నైనా ఇ-పుస్తకాలను పరిగణించి తీరాలి. ఇలా చేస్తే సాహితీ స్రష్టలకు ఎంతో శారీరక, మానసిక, ఆర్ధిక భారం తగ్గుతుంది. ఆ సమయాన్ని వారు మెరుగైన రచనలు చేయడానికి ఉపయోగించు కోవచ్చు.
పఠనం, ప్రచారం, ప్రసారం, గుర్తింపు ప్రతి సాహితీ స్రష్టా కోరుకునే కనీస ప్రతి స్పందన. దానిని అచ్చుకు, ఆర్ధిక భారానికి ముడిపెట్టడం సాహితీ స్రష్టలకు గొప్ప అపకారం. సృజనాత్మకతను మొగ్గలోనే తుంచేయడం.
**********
మనం ఎంత, మన అభిప్రాయాలెంత; అనంత
కాల ప్రవాహంలో పుల్ల ముక్కలం కదా మనం
మన మేధ సమాజాన్ని విడదీయడానికి పనికొస్తోంది తప్ప కలదోయడానికి కాదు; సమాజ సుఖశాంతులు
కాదు మనకు కావలసినది; మన పేరు ప్రఖ్యాతులు;
ద్వేష విద్వేషపూరిత మనస్సులతో మత్సరాలు పెంచి
పబ్బం గడుపుకోవడమే మనకు కావలసినది
జ్ఞాన విజ్ఞాన పరిజ్ఞానాలలో మనకు అవగాహన శూన్యం; శాస్త్ర సాహిత్య వేదాంత పరిచయాలు
సున్న; సంస్కృతీ సంప్రదాయాలు ధ్వంసం చేయగలం కాని సౌమనస్య ఆహ్లాదం అందించలేము
ఎందుకో నిలకడయైన, నెమ్మదినిచ్చే బుద్ధి లేనే లేదు
ప్రపంచోద్ధారకులం అనే పనికిరాని అహంతో
ముందు వెనుకలు చూడక మదం తలకెక్కిన వాళ్ళం
సమాజాన్ని బాగు చేయడం చేతకాదు
ఉన్న మంచిని తగలేయడం తెలుసు
దిక్కుమాలిన తర్కంతో, నాస్తి భావాలతో
ఇంగితం లేక ఇరుకు మనసుతో బావిలో కప్పలం
*******
ఆధునిక రచ్చబండ
మనందరి ఫేస్బుక్ విలాపాలు, సల్లాపాలు, కోప, తాపాలు, హర్షోల్లాసాలు, మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి తప్ప రాజకీయ నాయకులకు, వారి వ్యవహార శైలికి ఏమీ మొప్పం ఉండదు.
ఇన్నాళ్లూ రచ్చబండల దగ్గర జరిగే చర్చలు ఇప్పుడు ఫేస్బుక్ లో జరుగుతున్నాయి. అలా ఫేస్బుక్ అంతర్జాల రచ్చబండ. ఎవరి వాగుడు వారిది. ఎవరి ఎగురుడు వారిది.
మన ఇష్ట ప్రకారం జరగనిదానిని జీర్ణించుకోలేక పోతే బ్లడ్ ప్రెషర్ రావడం ఖాయం. అందరూ స్వతంత్ర్య భారతదేశ పౌరులే. సమాన వాక్స్వాతంత్ర్యం ఉన్నవారే. తమ అయిష్టులను, వారి అభిప్రాయాలను అసభ్యంగా దునుమాడేవారే.
ఫేస్బుక్ మానసిక గ్లానులకు ఔషధం. కారణం కూడా.
******
Ageing is the harshest devouring change imposing itself on human body; its appearance and function. I have seen many in their prime and in old age. Old age and then death are: inevitable for any who is born, however eminent or lowly one is.
******
The alliance between Congress and JD (S), that itself is a horse-trading in a bulky way.
Why blame BJP for the same?
Hypocrisy at its height.
తను చేస్తే శృంగారం. ఇతరులు చేస్తే వ్యభిచారం.
*******
మన ప్రజాస్వామ్యం లోని రాజకీయ నాయకులు, పాలకులు
"కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిన్ పొందరే"
అనే పోతన్న గారి భాగవత పద్యం అర్థం పట్టించుకోని వారు.
వారికి శాస్త్ర, సాహిత్య, వేదాంత పరిచయాలు లేవు. జీవితాన్ని గురించిన పూర్ణమైన అవగాహన లేదు. దానికి తోడు పొగరుమోత్తనం, కుల గజ్జి, అంతా తమ ప్రతిభావ్యుత్పన్నతల వల్లనే సాధ్యమౌతోందన్న
అమాయకత్వంతో కూడిన అహంభావం నిండుగా కలిగి ఉండడం; ఇంగితం మరచి తమ స్వార్థం కోసం గుడ్డెద్దు చేలో పడిన వ్యవహారంగా ప్రవర్తించడం.
దాని వల్ల వాళ్ళకీ, మనకూ అపకారం జరుగుతోంది. వారు అది పట్టించుకునే సమయం, దృష్టి లేకుండా దేశాన్ని, సంఘాన్ని అశాంతితో, కష్టాలతో నింపుతున్నారు.
There is a law of nature: in the universe order and disorder follow each other.
ప్రస్తుతం disorder నడుస్తోంది.
ఇది చక్ర భ్రమణం.
******
మరణించిన వారి మంచిని‌ వేనోళ్ళ పొగిడే వాళ్ళు ఎక్కువై పోయారు
బ్రతికున్న మంచి వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే వారు కరువయ్యారు;
మరణమంటే ఎందుకంత గౌరవం?
జీవించి ఉన్నవారంటే ఎందుకింత లోకువ?
మంచితనం గుర్తించబడాలంటే
మనిషి మరణించి తీరాలా?
*******
Two Telugu news papers set news items and write articles equating Andhra Pradesh people with Telugu Desam party.
These two news papers forget that Telugu Desam is a political party and does not represent all citizens of Andhra Pradesh.
And center or rest of the citizens of Andhra Pradesh need not and will not identify themselves with Telugu Desam party.
Governments have to rule beyond their party and party and government are different. The duty of executive is different and not Xerox copy of political party in power. Roughly in 70 years political parties forgot these simple constitutional norms and are arrogating themselves and made this thin speration non-existent between party and government and behave unconstitutionally.
Telugu Desam party's interests are not the interests of Andhra Pradesh citizens.
*******
Mr. Siddaramiah was in JD (S) for decades and migrated to Congress having differences with Deve Gowda in elevating Kumara Swamy as important person in JD (S) and future chief minister. Thus Siddaramiah is not a Congressman at the roots level.
Because JD(S) is a family owned party, like any other counterpart none except for Party Chief's family members can be proposed to the highest positions.
And as my friend has pointed out, JD(S) ditched BJP after understanding to hand over chief ministership to BJP in second half. But JD (S) did not do so saying BJP is not a secular party after enjoying power for 2 and 1/2 years with BJP support!!!!!!!!
None of Indian media or intellectuals questioned it, as usual. Now the coalition of JD (S) and Congress is planned under Kumara Swamy's chief ministership.
The Indian media has always batted for first inviting largest single party to form government. But now BJP will be the beneficiary, so they will say there is already a post-poll understanding and JD(S) coalition with Congress, and they have numbers, it must be invited to form government. Though pre-poll understanding has relevance and not post-poll understanding. Siddaramiah ruled out any understanding with JD (S) as late as yesterday.
This is all to say about the quality of Indian politicians, political parties, and their running of parties and governments. Yes we all know this. This is another reminder.
The moment election is over and governments are formed the voters are completely conveniently neglected and only power sharing and looting will be on the agenda of politicians to which they give various guises and wear masks.
And most importantly the coalition partners have to meet separately, bring out a resolution and together, a combined legislature party leader is to be elected and then they can hand over the letter in relation to election of leader and governor using his discretion, can accede to the request or can deny.
Let us continue observing this shameless
behavior of our leaders.
******
I read in Deccan Herald, Bangalore edition, in December 2017 that Congress cannot win in the 2018 assembly election getting a majority of its own, but will form a government with JD (S). He also predicted that such a government will fall and elections have to be held again ln very near future. I was fascinated to see first part of that prediction coming true.
Now that Congress is having an infamous history of its own that making government fall at its time of choice, as it happened to Charan Singh, Chandrasekhar, IK. Gujral and Deve Gowda, the second part of that prediction may also turn out to be true.
But Kumara Swamy will still form government with Congress. It is again the fate of Congress that though it got more seats, it cannot have its chief minister, thus thwarting the ambitions of Kharge or Shiva Kumar.
Let us follow the drama as is getting unveiled.
Now that Congress may be part of new government under Kumara Swamy, EVM tampering charge is not labelled, it seems.
*****
It would be useful if after so many wins and defeats, the politicians realize that the real power in a democracy is with citizens as voters, and not in them as leaders or rulers.
What all the power felt to be with rulers is not theirs but of people's. It is not the greatness of leaders and their capabilities but of voters'.
This realization dawns on politicians after each election defeat, but gets masked by ego and self-praise after each win. They feel invincible and become arrogant once they get elected.
*****
మీకెరికే
దాహంగా ఉంది మంచినీళ్లు కావాలంటే ఉచితంగా వై ఫై అందించాం మీకు అంటారు; పీల్చడానికి శుభ్రమైన గాలి కావాలంటే చంద్ర మండలం నుంచి ఆక్సిజన్
సిలిండర్లు దిగుమతికి ఆర్డరిచ్చామంటారు; తిండి
సంపాదించు కోవడానికి కొలువిమ్మంటే వారికో వీరికో
రిజర్వేషన్ సదుపాయం కల్పించామంటారు; మాకు
హుందాగా బతకాలని ఉంది అంటే ఋణ మాఫీ చేస్తామని మానిఫెస్టో లో పొందుపరిచాం కదా
అంటారు; దేశంలో శాంతి భద్రతలు కాపాడండి అంటే
వారికి మైనారిటీ స్టేటస్ ఇచ్చాం కదా అంటారు; అవి నీతి, బంధుప్రీతి, చీకటి సొమ్ము, ఆశ్రిత పక్షపాతం పెరిగి పోయాయంటే, బాబుని, పాపని రాజకీయాల్లోకి
తెచ్చాం కదా; కొత్త రాజధాని కడతాం కదా అంటారు
శత్రు దేశాలు మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయంటే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కదా అంటారు; ప్రతి రాష్ట్రం ఒక దేశం
అవ్వాలంటారు ఏమిటి అంటే ఆర్యులు ద్రావిడులు
మనుషులు మనసులు కలవని రెండు విభిన్న సంస్కృతులంటారు; ద్రావిడులన్నవారే రెండు రాష్ట్రాలుగా విడిపోయారేమిటంటే ఇక్కడా సంస్కృతి
వేరంటారు; ఆత్మగౌరవం కాపాడడానికి అంటారు
ప్రతి ఛిద్రానికీ తామే కారణమై, ప్రతి అవినీతిలో
భాగాలు పంచుకొని, "మనోణ్ణి" తప్ప మరోడి పొడ
గిట్టకుండా తంత్రం నడిపి అందరినీ విడదీసి, తమకే
మళ్ళీ ఓటు వేయమనే చాణక్యులు; ఎవరు, మీకెరికే
*******
జనాలకి విషాదం నచ్చినట్టు సంతోషం నచ్చదు. సావిత్రి బదులు అంజలీదేవి సినిమా తీస్తే ఎందరు చూసేవారు?
*******
సావిత్రి నామ స్మరణ కొన్నాళ్ళుంటుంది. అసలు నటీనటులకు మన జీవితాల్లో ఇంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత అవసరమా?
*******
భాషలు-చదువు-శ్రద్ధ
భాషలు సరిగా నేర్చుకోవడం ఆధునికుల వల్ల కాదు. తెలుగు భాషే కాదు, ఏ భాషా ఎవరు సరిగా నేర్చుకోవడం లేదు. ఎవరికీ శ్రద్ధ లేదు. ఇంటర్నెట్లో ఉండే వార్తల్లో, రోజూ వచ్చే వార్తాపత్రికలలోనూ గత ఇరవై, ముప్ఫై ఏళ్లుగా భాషని అశ్రద్ధగా రాస్తున్నారు. ఎంతో గొప్పగా చెప్పుకునే ది హిందూ నుంచి అన్ని పత్రికల్లోనూ స్పెల్లింగ్, గ్రామర్ తప్పులే. తెలుగులో అయితే ఇంటర్నెట్ లో అన్నీ వర్ణక్రమ దోషాలే.
ప్రతి భాషకు ఒక నిర్దుష్టమైన భాష ఉండాలి. మన తెలుగు భాషకు అది లేదు. పైగా అక్షరాలకు అక్షరాలే తీసి పారేశారు. భాష ఎవరి సొత్తు? ఉమ్మడి ఆస్తి. కాని ఆ ఉమ్మడి తెగ తెగకీ తెగ మారిపోయింది.
పిల్లలు, యువతీయువకులు, పెద్దలు అందరూ, వారూ, వీరని లేక ఎంతో, వీలయినంత అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా భాషని రాస్తున్నారు. మాట్లాడడంలో ఎలాగా పొంతన ఉండదు. మాండలికమైనా దానికి అణుగుణంగా వర్ణక్రమము ఉండాలి కదా. అది కూడా తెలియదు చాలా మందికి. అసలు ఎందుకని శ్రద్ధ వహించాలి అనే వాళ్ళు ఎక్కువై పోయారు.
చదువులూ అలాగే ఉన్నాయి. భాషాధ్యయనం అంతకు ఇంకా దిగదుడుపుగా ఉంది. చదువు మీద గాని, భాషాధ్యయనం మీదగాని దృష్టి పెట్టకుండా మేధావులు, పండితులు, ఆచార్యులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు అయిపోతున్నారు.
ఈ వాతావరణంలో భాష మీద శ్రద్ధ పెట్టక పోవడం సహజమై పోయింది. అన్ని దిగజారుడులలో ఇదొకటి. అంతే. ఎవరికి పుట్టేవురా ఎంకన్నా, ఎక్కెక్కి ఏడుస్తున్నావు అన్నట్లుంది సంఘం పరిస్థితి, సంఘంలో విషయాలు, ఘటనలు.

No comments:

Post a Comment