Thursday, May 31, 2018

పూర్ణశాంతి; రెండవ గృహిణి; కైజోతలు; సినిమా- మన తరం

పూర్ణశాంతి

దేవుడు లేడని ఇంక పూజలు పునస్కారములు దేవాలయ 
సందర్శనలు దేనికని భారతీయ నాస్తికులు చెవిని ఇల్లు కట్టుకుని పోరెదరు;

వారి దృష్టిలో హిందూ దేవుళ్ళే లేరు; మిగతా మతాల దేవుళ్ళున్నారో లేరో 
వీరు నిశ్చయింపరు; నోరు విప్పరు; వారి గోలంతా హిందూ దేవుళ్ళ గురించే

భగవంతుని మనిషే సృష్టించాడు, కనుక దేవుడు లేడు అని వీరి వాదన 
తర్కం; మనం భక్తి ప్రపత్తులు చూపించనవసరం లేదని తీర్మానం;

మరి మన అన్ని సౌకర్యాలు, సిద్ధాంతాలూ కూడా
మనిషి సృష్టించినవే; ఎందుకని మనం వాటిని
గౌరవిస్తాం? దీనికి సమాధానం ఏమిటి? ఏమో?

ఆస్తికత్వము, నాస్తికత్వము రెండూ నమ్మకములే!
మన నమ్మకమే సరియైనది అనుకునే పసితనం పోవాలి! 
అన్ని తర్కములు, మీమాంసలు ఆగినదే
దివ్యస్థితి; దానికి ఎన్నో పేర్లు! అది తెలిస్తే పూర్ణశాంతి
*********
రెండవ గృహిణి
నా చిన్నప్పుడు వార పత్రికలో ఒక హాస్యపు సంభాషణ అచ్చయింది.
ఇద్దరు గృహిణులు మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటి మహిళ ఎంతో గొప్పగా అంటారు:
"మా ఆయన రామాయణం రాస్తున్నారు, తెలుసా" అని.
అది విన్న రెండవ ఆవిడ:
"మళ్ళీ రాయడం ఎందుకొచ్చిన శ్రమ? బజార్లో దొరికే ఏదో రామాయణం కొనుక్కోవచ్చు కదా" అంటారు.
మొదటావిడకి ఒళ్ళంతా నీరసం ఆవహించి, ఏం మాట్లాడాలో పాలుపోక, అక్కడ నుంచి నిష్క్రమిస్తారు.
సాహిత్యం గురించి ఏమీ తెలియని వాళ్ళు రెండవ గృహిణిలా మాట్లాడతారు.
సారస్వత సృష్టి, లలితకళాభినివేశము అందరి హృదయాలను తాకవు. వారు వారి సంకుచిత, పరిమిత జ్ఞానంతో ఏదో మాట్లాడతారు.
సంస్కృతి, సంస్కారం, అభిరుచి, ఆస్వాదనా సామర్థ్యం లేని సామాన్యులు తమ దృక్పథానికి లోబడి మాట్లాడతారు, ప్రవర్తిస్తారు.
సంఘంలో రసికులు తక్కువ. ఎక్కువ మందికి జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను తృప్తి పరిచే
వినోదం చాలు. అటువంటి వారు సాహితీ, లలిత కళా విమర్శకులు అయితే చెప్పేదేముంది!
రసికులు అంటే శృంగార పురుషులు అనే తప్పుడు అభిప్రాయం లోకంలో ఉంది. రసికులంటే సాహిత్యంలో, లలిత కళల్లో ప్రతిబింబించే ఆహ్లాదాన్ని ఆనందించగల రసాస్వాదనా చతురులు.
అటువంటి వారి ఆనందంతోనే, వారి హృదయ ఆహ్లాదనా ప్రకటనలు వల్ల కళాకారులు ఉత్సాహం పొంది మరింతగా అలరింపజేస్తారు.
ఏ సమాజంలో నైనా సామాన్యులు వేరు, రసికులు వేరు. రసికులు లేక సారస్వతం, లలిత కళలు, సంస్కృతి, నాగరికతా పరిఢవిల్లవు. ప్రస్తుతం తెలుగు సాహితీ రంగంలో అటువంటి రసికులు లేరు. అందుకే ఒక్క, వాద, వివాద ప్రోత్థితమైన సంకుచిత సారస్వతం సాహిత్యంగా చెలామణి అవుతోంది.
రాసిక్యాన్ని, వాద వివాద సిద్ధాంత రహిత సాహితీ సృష్టిని తెలుగు సాహితీ రంగం సృష్టించలేకపోతోంది.
కొండ వాగులా నిర్మలోదకం కలిగి చెంచీతలా
స్వాతంత్ర్యం అనుభవిస్తూ స్వేచ్ఛగా సంచరించే సాహిత్యం రావటంలేదు.
రెండవ గృహిణులు తెలుగు సాహితీ రంగంలో ఎక్కువగా ఉన్నారు. అందుకే సాహితీ, లలిత కళా రంగాల్లో తెలుగు వారు పుర్ర చేతి భావములను మించి, వాద ప్రసక్తి మరచి సాహితీ సృష్టి, లలిత కళా రామణీయకతా సృజించలేక పోతున్నారు.
*******
BJP not able to win in by-elections across India,  is not necessarily alarming. After not winning parliament seats in UP, BJP has swept northeast and emerged as largest party in Karnataka.
*******
కైజోతలు
ఎవరి కులానికి చెందిన వారిని వారు
ఎవరి ప్రాంతానికి చెందిన వారిని వారు
ఎవరి మతానికి చెందిన వారిని వారు
ఎవరి సిద్ధాంతానికి చెందిన వారిని వారు
ఆకాశానికి ఎత్తేస్తున్న ఈ రోజుల్లో ఫేస్బుక్
అందరికీ సర్వ మానసిక రోగ ప్రదర్శనా వాటిక
ప్రజాస్వామ్యమున తమ పాత్రను యథేచ్ఛగా
తప్పుగా నిర్వహిస్తున్న పత్రికా యాజమాన్యములకు
పత్రికా రచయితలకు లెంప దెబ్బ కొట్టే సావకాశం
కల్పిస్తున్న ఫేస్బుక్ కు సామాన్య పౌరుల నీరాజనం
పౌరులు నిర్భయంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా
వార్తా నాయక రాజకీయ సామాజిక కథనాలను
తమ తమ దృక్పథాలతో పంచుకునే వీలు కల్పిస్తున్న
సామాజిక సాలెగూడు మాధ్యమములకు కైజోతలు
******
Always contemporary colleagues tend to undermine new talent with their limited knowledge and closed minds. They hide behind their seniority. This has been happening in all societies and fields in all places. Many times the genius is not recognized when the individual is alive. And later colleagues who are not biased will recognize the talent and popularize.
********
సినిమా- మన తరం
మనందరిదీ సినిమాల తరం. సినిమాలు ఆకర్షించినట్టుగా మనల్ని ఏ మీడియమ్ ఆకర్షించలేదు. అందుకనే ఇప్పుడు కూడా ఆ సినిమా వాళ్ళని గురించి కొట్టుకుంటున్నాము. మన తరంతో
ఈ కొట్టుకోవడాలు ఆగిపోతాయి.
మన తరం మీద సినిమా మీడియమ్ ప్రభావం లెక్క కట్టలేనిది. మన ఊపిరి, మంచినీళ్లు, ఆహారము సినిమాలుగానే బ్రతికాము. తరువాతి తరాల వారికి సినిమాల మీద ఇంత మోహం లేదు.
సాహిత్యం, ఇతర లలిత కళలు మన దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఇప్పటి తరాలకి ఇంటర్నెట్ లా మనకు సినిమా. మనందరమూ ఆ సినిమాల విషయంలో పండితులమే. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది, ఏ ప్రొడక్షన్స్ ది, నాయికా నాయకులు ఎవరు, సంగీతం ఎవరు, కెమెరా మెన్ ఎవరు, కళా దర్శకుడు ఎవరు, ఏ రిలీజ్, ఏ నాయకునిది ఏ ప్రొడక్షన్స్, ఏ నాయకునిది ఏ రిలీజ్, ఎన్ని చోట్ల శతదినోత్సవాలు జరుపుకొంది, ఎన్ని రజతోత్సవాలు, ఇలా సినిమా గురించి అనంతమైన విషయాల్లో మనకు పరిజ్ఞానం ఉండేది. ఉంది.
ఈ పిచ్చి వల్లే సినిమా వాళ్ళని ఎన్నుకొని, ఏదో పాలన అనుభవించి, వారి చుట్టాలచే పాలింపబడుతూ, ఏ విధమైన గుర్తింపు లేక వాళ్శిచ్చే వేయి రూపాయల నిరుద్యోగ భృతికై భిక్షుకుల వలె ఎదురు చూస్తున్నాం.
మన మనసుల మీద ఇంత పట్టున్న మీడియమ్ ఇంకోటి లేదు. అందుకే ఈ వయస్సులో కూడా అభిమాన తారల గురించి ఇంత సమయం వృథా చేసికుంటున్నాము. ఈ విషయమై అమ్మలక్కల కబుర్ల వంటి కబుర్లు ఎక్కువై పోయాయి. ఆడ, మగ భేదం లేకుండా ఈ చర్చల్లో, వాద, ప్రతి వాదాల్లో విసుగు లేకుండా పాల్గొంటున్నాము.
మనందరి వినోదం సినిమాతో మొదలై సినిమాతో
ఆగిపోయింది. సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రకళ, శిల్పకళ, మొదలైనవి ఉన్నట్లు కూడా మనలో చాలా మందికి తెలియదు. సాహిత్యం పుర్రచేతి భావాలలో ఇరుక్కుపోయింది, సంగీతం, నాట్యం, ఇటువంటి విషయాలలో తెలుగు వారికి ఇష్టము, శ్రద్ధ, ప్రీతి, గౌరవం చాలా తక్కువ.
మన సంస్కృతి అంతా సినిమా, కుల రాజకీయాలు మాత్రమే. మరే విధమైన దృష్టి మనకు లేదు. సినిమా, రాజకీయం, డాక్టర్ దగ్గరకు వెళ్ళడం, స్కూల్లో చేర్పించడం అంతా మనోళ్లు, మనోళ్లు అనుకుంటూ అభిమానించడమే, చెయ్యడమే;
ఈ కులగజ్జి తప్ప మరో సాంప్రదాయమే మనకు లేకుండా పోయింది. సినిమాతో సమానంగా మనకు అంటుకుంది

No comments:

Post a Comment