Tuesday, May 22, 2018

టి . టి . డి .; రక్షణపై విముఖత ?; గింజ-పొల్లు; JD (S); గొప్ప విచిత్రం; Language and individuals; జన్మ-సంసారము; పులుపులు-సలుపులు-తీపులు

టి . టి . డి . 

టి.టి.డి. వ్యవహారానికి కుల గజ్జి పట్టించి అసలు సమస్యలను వెనక్కి నెట్టేసిన నాయక గణం 
రాజకీయాల్లోని విభజించి పాలించు అన్న లాభసాటి వ్యాపారాన్ని ఇక్కడా మొదలు పెట్టారు. అంతర్జాల మాధ్యమాల్లో రాష్ట్ర, దేశ, అంతర్జాతీయంగా డప్పుకొట్టుకొంటున్నారు.
రాష్ట్రంలో కుల గజ్జి చేయలేనిది లేదు.

********
All religions are great and are for the well-being of humans. The great problem is with the followers of these great religions.
*******
రక్షణపై విముఖత ?;

క్రూర జంతువులకి దూరంగా జరిగి వెళ్ళిపోతాం
అడవిలో; నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా అనం
కాని సమాజమనే క్రూరారణ్యంలో అర్ధరాత్రి అయినా
మా ఇ‌ష్టం వచ్చినట్లు తిరుగుతాము అంటామేమిటి?
అరణ్యంలో భయం ప్రాణంపై
మరి సమాజారణ్యంలో
ఎందుకీ విముఖత రక్షణపై?
*******
గింజ-పొల్లు
నాలాంటి చాలా మంది ఫేస్బుక్ రచయితలు/రచయిత్రులం మా మా రచనల ఆధారంగా మా గ్రేడ్ నిర్ణయించేసుకొని ఆ ఆభిజాత్యంతో పాఠకులైన ఇతర మిత్రులని కలవర పెడుతూంటాము.
నిజానికి ఏ రచన గొప్పది, ఏ రచయిత/రచయిత్రి గొప్పవారు అంటే ఇతమిత్థంగా ఏమీ చెప్పలేమనుకోండి. కాకి పిల్ల కాకికి ముద్దు లెవెల్లో నడుస్తూ ఉంటాము, నడిపిస్తూ ఉంటాము మా రచనలను మా బోంట్లం.
రచన రచయిత కోసమా? పాఠకుని కోసమా? చాలా మంది , రచయిత ఆత్మ తృప్తి కోసం రాసుకుంటాడు అంటారు. అంతవరకు బాగానే ఉంది కాని తను మాత్రమే చదువుకోగల విధంగా రాస్తే అందరికీ ఇబ్బందే. ఈ రోజుల్లో ఏ రచననీ ఎవరూ విమర్శించరాదు.
రచయితలలో ఎన్నో వర్గాల వారు. అలాగే రచయిత్రులు ఒక వర్గంగా పురుషాధిక్య సమాజం పై బాణాలు, తుపాకులు ఎక్కుపెట్టి ఉంచుతున్నారు. ఈ వర్గ విభజన ఆధారంగానే రచన పస నిర్ణయింపబడుతోంది.
అటువంటప్పుడు రచన కన్న రాసిన వర్గానికే పెద్దపీట వేయబడుతోంది. రచన రచయిత వర్గం ముందు వెల వెల బోతోంది. అందువల్ల ఫేస్బుక్ రచయితల్లో ఎక్కువ మందిమి వర్గం పసనే ఎక్కువగా చూపిస్తున్నాం.
మరొకలా, రచనలు పాఠకులకోసం కాకుండా రచయితలు పేరు ప్రఖ్యాతులు పొందడం కోసమే రాయబడుతున్నాయి. అందులో పాఠకులకి ఉపయోగించే అంశాలు దాదాపు ఉండటం లేదు. రచించిన వారి వర్గ సానుభూతి కోసమే రాయబడుతున్నాయా అన్నట్లు ఉంటున్నాయి.
రచించే వారు, విమర్శకులు, పాఠకులు వర్గాలుగా విడిపోయి సాహితీ సృష్టి, "సేవ", పఠనం చేస్తున్న నేడు ఏది పస గల రచన? ఏది పొల్లు చెబితే గొడవలైపోయేలా ఉన్నాయి.
అయినా సర్వ స్వతంత్ర భారతావనిలో భావ ప్రకటనా స్వేచ్ఛ అతిగా ఉన్న ఇప్పుడు గింజ, పొల్లు గురించి మాట్లాడడం అమాయకత్వం.
*********
JD (S)
Instead of calmly enjoying power in Karnataka, the JD (S) is messing up itself with grand illusion of opposition unity for 2019 parliament elections induced by Congress and other bewildered politicians from all over India.
JD(s) is erroneously feeling and trying to defeat Modi rather than providing a good governance to citizens of Karnataka.
Not a wise thing do. This is how Kejriwal disused his election and popularity.
God save JD(S).
********
మేం నెలలో బెంగుళూరులో ప్రతి సాయంత్రం వర్షం తప్పక పడుతుంది. వాతావరణాన్ని చల్లబరుస్తుంది. మనసులని ఆహ్లాదపరుస్తుంది.
వర్షం తెచ్చే హర్షం మనసుకి ఆహ్లాదం
నెచ్చెలి ఇచ్చే వెచ్చటి కౌగిలియూ ప్రమోదం
********
 గొప్ప విచిత్రం 
చాలా మంది చాలామంది కళాకారులని, ఇతర రంగాలలో నిష్ణాతులైన వారిని వారు బ్రతికి ఉండగా పట్టించుకోరు. చనిపోయాక మాత్రం నివాళులు ఘనంగా అర్పిస్తారు. అప్పుడు ఆ కళాకారులని, నిష్ణాతులైన వ్యక్తుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులే కనిపెట్టుకుని ఉంటారు. అన్ని సంఘాలలోను ఇదో గొప్ప విచిత్రం. 
**********
Language and individuals

Literature in India is undergoing stress and strain for want of readers who are proficient in respective languages. Thus the problem also is many youngsters are not learning languages in earnestness and eventually it is readers who are oxygen to the life and or death of a work.
This kind of disinterested - ness among youth about language is another impediment for literature to flourish. Unless readers are also adept in language, creations by writers will be neglected for want of ability to understand by readers.
Apathy for language learning and proper usage is one of the greatest dangerous trends for demise of culture and eventually, civilization.
Internet, sms etc,. communications have made individuals lazy in spelling writing and disrespecting grammar rules is further complicating communication and responses.
This is all reflection of our waywardness in learning and using languages. The society's grace and etiquette are best and adequately reflected in language learning and usage.
We are negligent of language learning and usage means we are negligent of living.
Such an attitude further makes us vulnerable to politicians, criminals, spiritual gurus and the rest of the societies. This negligence in relation to language also reflects our promiscuity in maintaining relationships and many other social involvements.
We are not serious about language means we are not serious to live and shine as cultured and civilized human beings.
*********
Ways of Destiny
Karnataka developments must have been music to Congress, Kumara Swamy, secularists, lovers of democracy, believers in judiciary and political leaders of regional parties.
But in the midst of celebrations by all these only one person who is swept by fate and destined to be in association with JD(S), and Kumara Swamy, Mr. Siddaramiah must be wondering the doings of fate.
He left JD(S) in fight with Deve Gowda on the issue of rise of Kumara Swamy in JD(S) at his cost. But now he is made to be compulsorily with Kumara Swamy by his adopted party.
And also the dreams of Kharge and Sivakumar of Congress are also shattered by destiny. The taking place of an event makes some jubilant and some melonchic.
Funny and harsh are the ways of destiny!
*********
చనిపోతేనే అవుతారు మనుషులు గొప్ప వాళ్ళు
బ్రతికుంటే అంతా ఈసడింపు, దూషణ, తిరస్కారములే
*********
జన్మ-సంసారము

విష్ణు సహస్రనామ శ్లోకం:
యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే !!
ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే !!
ఈ పై శ్లోకంలో
మహావిష్ణువు నామం స్మరిస్తే జన్మ వల్ల కలిగిన సంసార బంధాన్నించి ముక్తిని కలిగించే విష్ణువు, ప్రభ విష్ణువునకు నమస్కారము
అని చెప్పబడినది.
ఇక్కడ జన్మ అనగానే మానవ జన్మ అని వ్యాఖ్యానిస్తారు. సంసారం అంటే భార్య/భర్త, పిల్లలు ఇత్యాది అంటారు.
కాని జన్మ అంటే తలపుల రూపమైన వ్యక్తిత్వం, అహంకార, అహంభావ, మమకారములు మన మానసిక దృష్టి లోకి రావడం. మరణం అంటే ఆ తలపులు నిండుకోవడం.
మనకు జాగ్రత్, స్వప్న, సుషుప్తి, జాగ్రత్ సుషుప్తులనే నాలుగు మానసిక దశలు ఉన్నాయి.
ఇందులో జాగ్రత్, స్వప్న మానసిక దశలలో మాత్రమే తలపులు కలుగుతాయి. ఆ తలపులు, వాటిలో ఉండే విషయ సమూహములు కలిగించే సుఖ దుఃఖానుభవములే సంసారం.
మనం నారాయణ నామ స్మరణం చేస్తోంటే మానసిక రూపములు మాత్రమే అయిన ఈ జన్మ, సంస్కారములు దృ‌ష్టిలోకి రావు. దృష్టిలో ఉండవు.
ఈ మానసిక కార్యకలాపాలు విరమింపబడిన, దృష్టిలో లేని క్షణాలే సుఖశాంతులు.
అందువల్ల శ్రీమన్నారాయణుడైన మహావిష్ణువు తన నామస్మరణం మనం చేస్తున్నంతసేపు మనకు జన్మ, సంసార బంధముల వల్ల ఏర్పడిన, ఏర్పడే క్లేశములు కలుగకుండా చూస్తాడు. భవబంధ జనిత
రాగద్వేషాలు, సుఖదుఃఖాలు తలపులు, అనుభవములుగా లేకుండా చేస్తాడు.
తన ప్రసాద, ప్రహ్లాద దృష్టులతో ప్రహ్లాదులను చేస్తాడు.
మోక్షాన్ని ఇస్తాడు. మానసిక విరామ రామ సమయాన్ని నిరంతర అనుభవంగా చేస్తాడు.
మోక్షమంటే ఆహ్లాదమే. ఆహ్లాదం మన సహజ నిరంతర అనుభవం.
ఓం నమో నారాయణాయ!
********
పులుపులు-సలుపులు-తీపులు

సినిమాల నుంచి బయటపడలేము,
మన తిండి, నీళ్లు, ఊపిరి, సినిమాలే;
ఇరవయ్యవ శతాబ్దపు ఈ ఇంద్రజాలం
మన ధన, మాన, అభిమానాలని కొల్లగొట్టింది;
మన ధ్యాస, ధ్యానం సినిమాలే, అందులోని తారలే;
తమి తీరే కాలక్షేపం లేని మనకు గొప్ప కాలయాపన
సినిమా, దానికి సంబంధించిన విశేషాలు;
ఆ తర్వాత మనల్ని కట్టిపడేసేవి రాజకీయాలు
మనల్ని గొఱ్ఱెలను చేసి మనతో ఆడుకోవడం
నాయకులకు నల్లేరు మీద బండి నడక అయింది
మన జీవితాలకు ఏ వెలుగూ ప్రసాదించని, ప్రసాదించడం తెలియని వీరి పాలనలు గుదిబండలు
సాహిత్యం, విజ్ఞానం, పరిజ్ఞానం, లలిత కళలు, ఆధ్యాత్మికతల జోలికి పోనే పోము మనం; మనకు
ప్రసిద్ధ వ్యక్తులు, సినిమా, రాజకీయం, క్రికెట్, ఆధునిక
ఆర్ధిక సామ్రాజ్య చక్రవర్తులు మాత్రమే; మన క్షేమం,
మన స్థిమితం, జీవితంలో సంతృప్తి మనకు అందవు
అందని మ్రాని పండు పులుపు కదా
కానీ అమాయక, అజ్ఞానపు బ్రతుకు సలుపు కదా
తీపిగా ఉన్నా, మన మనసులకు తీపులు కలిగించు

No comments:

Post a Comment