Monday, May 7, 2018

శ్రీకంఠుడు; ఎందులో లోపం; హిందువులలో అనైక్యత; భారత పౌరుల స్థితి;భావ ప్రపంచం; పాఠశాలలు

23-4-2018

శ్రీకంఠుడు

ఆలయముల మాత్రముననే 
అద్రిసుత ధవునికి భవునికి
సిరిచూలి అంతకునికి శంభునికి
మార్కండేయ వరప్రసాదికి భక్తవరదునికి
గణాధిపతికి, యతికి, ఆదిభిక్షువునకు
జ్ఞానకారకునికి ప్రజ్ఞానస్వరూపునికి
ప వర్గ రచితామూర్తికి పినాక-ఫణి-
బాలేందు-భస్మ-మందాకినీ యుతునికి
అపవర్గ ప్రదాయినికి ఆదిదేవునికి
పూజలు అభిషేకములు అర్చనలు చేయవలెనా?

మనసున శివపంచాక్షరి
సతతము జపించుచు
పరమేశ్వరుని స్మరించుచున్న
తరింపజేయడా శ్రీకంఠుడు!
****
ఎందులో లోపం? ఎక్కడ లోటు?

ఆధునిక భారతదేశంలో

పేదల బ్రతుకులలోని దీనతను రోజూ చూస్తూనే ఉంటాం బయటికి  వెళ్ళినప్పుడు;

పేదల బ్రతుకులలోని నిజాలను అన్ని రకాల మీడియా చెబుతోంటుంది, చూపిస్తోంటుంది

వాద కవులు పేదల దౌర్భాగ్య జీవితాలపై దస్తాల
దస్తాల కాగితాలపై కవితలు రాసి ప్రచురిస్తూంటారు

రచయితలు పేదల నికృష్ట జీవితాలపై కథలు, నవలలు, వ్యాసాలు, విమర్శలు దైనందిన ప్రాతిపదికన అందజేస్తారు

పేదల కష్టాలను ఎన్నుకున్న తక్షణమే తొలగించి
వేస్తామని అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు బల్లలు
గుద్ది, మైకులు పట్టుకుని చెబుతారు

ప్రభుత్వాలు ఎన్నెన్నో ప్రణాళికలు రచిస్తాయి
ప్రభుత్వ యంత్రాంగం అంతా దాని అమలుకై పాటుపడుతుంది

అయినా దేశంలో పేదరికం పోలేదు సరి కదా పెరిగింది
పేదలకు మేలు చేసే హడావుడిలో పైన చెప్పిన వారెవరూ మధ్య తరగతి వారిపై ఏమీ దృష్టి పెట్టరు

ఇందరు ఇంతలా వాళ్ళ వాళ్ళ జీవితాలు దరిద్ర
నారాయణోద్ధరణకై వెచ్చిస్తున్నా ఏ మార్పులు 
రాలేదు పేదల జీవితాల్లో; ఎవరూ పట్టించుకోనందు వల్ల మధ్య తరగతి వారి జీవితాలూ అణగారే ఉన్నాయి; ఎందులో లోపం; ఎక్కడ లోటు?

ఓటు వేయడం లోనా?
నోటు చేతులు మారడం వలనా?
****
పెద్దలు చనిపోతే వారికి నివాళులు
పెద్దలు పుట్టిన గిట్టిన రోజుల్లో
నివాళులు; అంతర్జాలమంతా
నివాళుల మయం; వీరిలో ఎందరు
పెద్దల పుస్తకాలు చదివిరి; పాటలు, సంగీతము వినిరి; నాట్యములు, నటనలు చూచిరి; 
చిత్రలేఖనముల, శిల్పాల అరిసిరి; 
ఏమిటో గొఱ్ఱెల చందమున నివాళులు
****
హిందువులలో అనైక్యత

చాలా మందికి తెలియని విషయం: శంకరాచార్యులంటే హిందూ మతం లోని వైష్ణవ ఆచార్యులకు గౌరవం, ఆయన అద్వైత సిద్ధాంతం పట్ల శ్రద్ధ, లక్ష్యం లేవు. వైష్ణవ ఆచార్యులు శంకరాచార్యులను ప్రచ్ఛన్న బౌద్ధులు అని నిరసించారు. నిందించారు కూడా. ఆయన ఆస్తికత్వానికి చాప కింద నీరులా  చెడు చేశారని వారి ఆరోపణ. 

విశిష్టాద్వైతం, ద్వైతం శంకరుల అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పుకోవు. అలాగే శివుని స్వతంత్రుడైన దేవునిగా ఒప్పుకోరు విశిష్టాద్వైతులు, ద్వైతులు. ఇదంతా వాస్తవం. హిందూమతం లో అనైక్యతకు ఈ సిద్ధాంత భేదాలు, కుల నాయకత్వాలు, ప్రాంతీయ తత్వం బోధించే రాజకీయ నాయకత్వాలు, ఉపజాతీయతలు, ప్రతి ప్రాంతానికి ఉండే ఆచార, వ్యవహారాల తేడాలు, భేదాలు, సంస్కృతీ విభేదాలు హిందువులను మేం అందరం ఒకటి అనుకోనివ్వవు. ఒక్కటిగా ఉండనివ్వవు.

ఆర్. ఎస్. ఎస్., బిజెపి హిందువులను సంఘటిత పరచలేక పోవడానికి ఇవి కారణాలు. వాటి రెండింటికీ
కూడా ఈ తేడాలు, భేదాలు, విభేదాలు, విభజనల గురించి ఇసుమంతైనా అవగాహన లేదు. మహారాష్ట్ర
లో ఎవరో ఒకాయన అనుకున్నదే, చెప్పినదే హిందూ మతం అనడం అంత పసితనం, హాస్యాస్పదమైన
విషయం లేదు. 

అందుకే అంతర్జాలం లో, బయటా హిందువుల ఐక్యతకై ఇచ్చే పిలుపులు ఏమీ సాధించలేవు. కుల, ప్రాంతీయ, సంస్కృతీ పరిరక్షకులు ఈ ఐక్యతను అడ్డుకుంటారు.

ఈ మధ్య మిడి మిడి జ్ఞానం కల హిందూ ఐక్యతా వాదులు, ఇవన్నీ తెలిసి మౌనంగా ఉండే సభ్య హిందువులను తప్పుపట్టడం, నిందించడం ప్రారంభించారు. ఉదాహరణకి; ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం నియామకాలలో అన్యమతస్థుల, అన్యమత సానుభూతి పరుల నియామకాల గురించి నిరసనలలో పాల్గోని హిందువులను శ్రమ పెడుతున్నారు.

హిందూమతానికి సంబంధించిన దేవాలయాలలో, వ్యవస్థలలో, విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ ఖేలనం ఎక్కువ అయింది. హిందూమతానికి సంబంధించిన ఆస్తుల్లోనే ప్రభుత్వాలు చేయిపెట్టవచ్చు. రాజ్యాంగం అనుమతి ఉంది. ఇతర మతాల విషయంలో అలా వేలుపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాల కు అధికారం లేదు. వాళ్ళు ఓట్లు తగ్గుతాయనే భయంతో ఏ వేలూ పెట్టాలనిపించినా అస్సలు పెట్టరు.

రాజ్యాంగాన్ని సవరించి హిందూ మతానికి సంబంధించిన దేవాలయాలలో, ఆస్తుల్లో, వ్యవహారాలలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వేలు పెట్టకుండా చేసుకోవాలి. అది మానేసి తోటి హిందువులను తప్పుపట్టడితే సమస్యలు పరిష్కరించబడతాయా?

కుల, ప్రాతీయ, ఉప జాతీయతా, సంస్కృతీ పరంగా హిందువులు విడిపోయి ఉండగా, దానిని సవరించక హిందువుల ఐక్యత కలుగదు. నిజం నిష్ఠూరంగానే
ఉంటుంది. 

హిందువులలోని అనైక్యత బాపండి. అప్పుడు హిందువులంటూ ఉద్యమించండి.

అంత వరకు హిందువుల ఐక్యత గురించి మాట్లాడడం ప్రయోజనం లేనిది.

లింగాయత్ లు, రామకృష్ణ పరమహంస అనుయాయులు మేము హిందువులు కాము మాది ప్రత్యేక మతము అంటున్నారు. అందుకే లింగాయత్ లకు మైనారిటీ స్టేటస్ ఇచ్చినా మిగతా దేశంలో ఏ ప్రతిఘటనా రాలేదు. ఇంకా ఎన్నో "హిందూ సంస్థలు"
మాది హిందూ మతం కాదు, మేము హిందువులం కాము అన్నా సంస్కృతీ భేదం వల్ల లింగాయత్ లు విషయంలో వలె నోరుమూసుకుని కూర్చోవాలి. 

ముందు ఈ వాస్తవాలు గ్రహించకుండా, వాటిని పట్టించుకోకుండా ఏమి చేసినా నిష్ప్రయోజనం. నిష్ఫలం. ఇటువంటి భేదనీతి సామ్రాట్టులైన, స్వార్థపరులు, సంకుచితులు, దేశభక్తి లేని రాజకీయ నాయకులను ఎన్నుకుంటూ హిందూ ఐక్యతకై మాట్లాడడం వెఱ్ఱితనం.

భారతీయుల్లో ఐక్యత వస్తే దేశానికి, పౌరులకు మంచిది
****
ఆడువారు రాస్తే లైకులెక్కువ
మగవారు రాస్తే లైకులు ఇన్నే
ఎందుకీ వివక్ష? ఎప్పటికైనా
లింగ సమానత్వం సాధించడం
జరగని పని; అది రమ్యమైన ఊహ అంతే!
****
భాష-సంస్కృతి

సంస్కృత భాషలో ఎక్కువగా passive voice వాడతారు. Active voice చాలా రేర్. I did it అని కాకుండా it is done by me मया क्रियते అంటారు. ఒక్కోసారి by me కూడా ఉండదు. It is done అంటారు. I usage లో అహంభావం ప్రస్ఫుటం అవుతుంది. Passive voice  కరణ కారకము. తృతీయా విభక్తి. నేను బదులు నాచేత అనడంలో కర్తృత్వం లేదు. Instrumental cause అది. జాతి లక్షణాలు భాషల ప్రయోగంలో తెలుస్తాయి. భాష, సంస్కృతి పరస్పర పరిపూరకాలు.
****

ప్రణయజీవులైనపుడు నేను ఉండదు, నువ్వు ఉండదు, మనం ఉండదు. ఎవరూ లేక పోవడమే ఆనందము. శాంతము. వ్యక్తి, వ్యక్తిత్వ స్పృహ లేకపోవడమే ప్రేమ. ప్రణయమూను. అన్నిటినీ, అంతనూ, అందరనూ మరపింపచేసేదే వలపు. ఆ మురిపెంలో సంతోషం మాత్రం ఉంటుంది. ప్రణయం తత్త్వం. అకుంఠిత, అచంచల లీన స్థితి.
****
22-4-2018
A human-being though is body is mostly a mental being; who becomes a spiritual being by shedding ego. Body of human-being is like basement to buildings. Though basement is essential, the building is admired for its structure. Similarly body though is base for humans, their mental and spiritual states are admired and adored. Shedding or transcending ego makes one peaceful, blissful, serene and melodious silence.
****

ప్రజాస్వామ్యము-న్యాయవ్యవస్థ-చట్టాలు

లైంగిక నేరాలకు తీవ్ర శిక్ష మంచిదే.
అన్ని నేరాలకు తీవ్ర శిక్ష కావాలి. శిక్ష వెంటనే పడాలి. పడాలి. లైంగిక నేరాలను మాత్రమే తీవ్రంగా పరిగణించడం లోటు, లోపం. అన్ని నేరాలను, ఆర్థిక, దేశద్రోహ, సాంఘిక అశాంతి కలిగించే మాటలు, పనులు, పర్యావరణానికి విఘాతం కలిగించే పనులు అన్నీ మనకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. వాటన్నింటినీ ఉపేక్షించి ఒక్క లైంగిక నేరాలను మాత్రమే తీవ్రంగా పరిగణించడం పాలనలోని అపరిపక్వత. అవినీతి, బంధుప్రీతి, చీకటి ధనం, రాజకీయ నాయకుల పౌర విభజన అన్నీ ఆపబడాలి. 
ఒక్క లైంగిక నేరాలను మాత్రమే తీవ్రంగా పరిగణించడం రాజకీయం మాత్రమే. మన సంక్షేమం దీనితో మాత్రమే ముడిపడి లేదు. 

ఆవేశం వేరు, ఆలోచన వేరు, ఆలోకన వేరు, అవగాహన వేరు, అనుభూతి వేరు, అనుభవం వేరు.
అంతర్జాల ఇంద్రజాల మహర్జాలంలో ఎవరి మట్టుకు
వారు తమ తమ ప్రియ సమస్యను మాత్రమే ప్రస్తావిస్తారు, నిరసిస్తారు, నేరస్థులను గొయ్యి తీసి ఉప్పు పాతర వేయమంటారు. వారికి దార్శనికత లేదు. సర్వ మానవ సంక్షేమం పట్టదు. 

అన్ని నేరాలను సమర్థవంతంగా ఆపుచేయాలి. పాలన కూడా ఓట్ల సాధన వలె, లింగ, కుల, ప్రాంత, మత, సిద్ధాంత, ఉపజాతీయతల ఆధారంగా నిశ్చయింపబడడం, తదనుగుణంగా మాత్రమే చట్టాలు తీసికొని రావడం జరిగితే భారతీయ శిక్షా స్మృతిని, చట్టాలను తిరిగి రాయాల్సి వస్తుంది.
కులాన్ని బట్టి, లింగాన్ని బట్టి, ప్రాంత, మత సిద్ధాంతాలను బట్టి, ఉపజాతీయతలను బట్టి చట్టాలు తీసుకురారాదు. శిక్షా స్మృతి ఆ ఉద్దేశంతోనే మార్చరాదు. న్యాయం వేరు, అంతర్జాలమున, పత్రికా, టి.వి, మాధ్యమాల్లో వెలువరించే అభిప్రాయాలు వేరు. పక్షపాతంతో కూడిన నిరసనలు, చర్చలు, గొడవలు, గోలలు వేరు. 

ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు, న్యాయస్థానాలు, ప్రభుత్వము ఒక దానికి ఒకటి పరిశీలన, పర్యవేక్షణ, నియంత్రణ. ఇలా పద్ధతిగా జరగక, ఒక్క ప్రజాప్రతినిధుల కోసం మాత్రమే ప్రజాస్వామ్యం పనిచేయడం దురదృష్టం. ప్రజలు, ప్రజాప్రతినిధులు న్యాయవ్యవస్థ పనితీరును నిర్దేశించరాదు. పనితీరులో కలుగ చేసికోకూడదు.
****
మంచి ఉపదేశము

నేడు మేధావులమనుకునేవారు కూడా సంకుచిత్వాన్ని మాత్రమే మనసా, వచసా, కర్మణా ఆచరిస్తున్నారు, ఉపదేశిస్తున్నారు. సంకుచితుల మాటలు ప్రవర్తన వారి మనస్తత్వానికి సంబంధించినవి. వారు అనుసరిస్తున్న మతానికి, సిద్ధాంతానికి, కుల, ప్రాంత, ఉపజాతీయతలకు, లింగానికి సంబంధించినవి కావు.

ఆధునిక రచయితలు చెప్పినా, మత గ్రంథాలు, శాస్త్రాలు చెప్పినా మంచిని గ్రహించడం చాలా మందికి తెలియదు. రచనలు, సిద్ధాంతాలు, జ్ఞాన, విజ్ఞానాలు మూర్ఖత్వాన్ని పోగొట్టలేవు. నేడు మత స్పర్శ లేని రచయిత ఉన్నాడేమో కాని సిద్ధాంత స్పర్శ లేని రచయిత లేడు. 

నేడు మత మౌఢ్యాన్ని సిద్ధాంత మౌఢ్యం ఆక్రమించింది. పాఠకుల్లో సామాన్యులెక్కువ. వారికి చదివే, అవగాహన చేసుకొని ఆచరించే సమర్థత తక్కువ. గొఱ్ఱె దాటులా వెళ్ళి పోవడమే వారికి తెలిసినది. తన మతం గురించి చదివి, అర్థం చేసికునే శక్తే ఉండదు, ఇంకా ఇతర మతములతో తారతమ్య పరిశీలన ఎక్కడ. అసహనం పర మతం పట్ల చూపకూడదు, పర సిద్ధాంతం పట్ల చూపకూడదు. మతము, సిద్ధాంతము స్వభావం దృష్ట్యా ఒకటే. 

మూర్ఖులైన, మత అనుయాయులు, సిద్ధాంత అనుయాయులు, కుల, ప్రాంత అనుయాయులు, లింగ అనుయాయులు సమానంగా సంఘానికి ఛిద్రాలు. అందరూ మతానుయాయ మూర్ఖుల గురించి మాత్రమే మాట్లాడతారు. వారి మూర్ఖత్వాన్ని మాత్రమే నిరసిస్తారు. మతం అంటే, ముఖ్యంగా so called "హిందూ" మతమంటే అందరు "మేధావులకు" లోకువ. 

అన్ని మూర్ఖత్వాలను సమానంగా నిరసించే సంఘంలో మాత్రమే సుఖశాంతులు ఉంటాయి. పర మతం సహనం చూపించే సామాన్యులు, "మేధావులు" అరుదు. ఇక్కడ మతం అనే పదం ఇష్టం అనే అర్థంలో ఉపయోగించ బడింది. నిబద్ధత గల రచయితలు, నిబద్ధత గల మత, సిద్ధాంత, కుల, ప్రాంత, ఉపజాతీయత ప్రియులు చాలా తక్కువ.
****
భారత పౌరుల స్థితి

భారత పౌరుల స్థితి ఏమని వర్ణింతును; వారి నాయకులు వారిని ఓట్ బాంక్ లు గా తప్ప చూడలేరు

పార్టీ బలమున అందరు నాయకులు తమను తాము 
అగ్రేసరులుగ భావించుకొని రాని నానా భాషల్లో
నానా మాటలు అందురు; ప్రజలందరూ తమ
వైపే ఉన్నారనుకొని ఉచితానుచితములు మరచి

మతముల మధ్య కులముల మధ్య ప్రాంతముల మధ్య చిచ్చులు పెట్టెదరు; సిగ్గు విడిచి తమను తాము పొగుడుకుందురు; ఏమిటో భారత పౌరుల
దుస్థితి; చెప్పుకొనుటకు నిఖార్సైన నాయకులు లేరు

అందరూ విడదీసి పబ్బము గడుపుకొనువారే తప్ప మేధావులా దుర్భిణి వేసి వెతికినను కానరారు అంతయు దేశ పౌరుల దుర్యోగము; దుర్దశ; వారి వారి చేతిలో అష్టకష్టాలు పడుటకు  బందీయైనవారు
****
భారత పౌరుల స్థితి

భారత పౌరుల స్థితి ఏమని వర్ణింతును; వారి నాయకులు వారిని ఓట్ బాంక్ లు గా తప్ప చూడలేరు

పార్టీ బలమున అందరు నాయకులు తమను తాము 
అగ్రేసరులుగ భావించుకొని రాని నానా భాషల్లో
నానా మాటలు అందురు; ప్రజలందరూ తమ
వైపే ఉన్నారనుకొని ఉచితానుచితములు మరచి

మతముల మధ్య కులముల మధ్య ప్రాంతముల మధ్య చిచ్చులు పెట్టెదరు; సిగ్గు విడిచి తమను తాము పొగుడుకుందురు; ఏమిటో భారత పౌరుల
దుస్థితి; చెప్పుకొనుటకు నిఖార్సైన నాయకులు లేరు

అందరూ విడదీసి పబ్బము గడుపుకొనువారే తప్ప మేధావులా దుర్భిణి వేసి వెతికినను కానరారు అంతయు దేశ పౌరుల దుర్యోగము; దుర్దశ; వారి వారి చేతిలో అష్టకష్టాలు పడుటకు  బందీయైనవారు
****
If you are a realized Self, you will cause least or no disturbance to others.
****
ధర్మం గురించి ధర్మపరులూ, అధర్మపరులూ మాట్లాడుతున్నారు. ఇది చూసి మనబోంట్లకు నవ్వు వస్తుంది. అధర్మపరులు ధర్మం గురించి మాట్లాడడం దెయ్యం వేదాలు వల్లించడం వంటిది. 

ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ తెలివి తక్కువ తనం వల్ల సంక్షోభంలో పడినప్పుడు ధర్మం గురించి మాట్లాడడం, మామూలు రోజుల్లో అధర్మంగా ప్రవర్తించడం వారికే చెల్లింది.
****
20-4-2018
Blaming all men for atrocities against fair sex is unfair. It is no proper education, cultivation of values, culture and right attidudes since childhood are responsible for the present sad and reprehensible state of affairs. Without addressing these merely blaming all men for all atrocities is naive and child-like.

There should be proper diagnosis and remedies for present awkward and unsecured state of affairs. Rituals of support and denouncing online and offline 
serves no useful purpose.
****
ఎవరినీ బాధించని విషయం

ఆధునిక మానవునికి మానసిక విరామ సమయం ఉండటం లేదు. ఎప్పుడూ ఏదో ఒక విషయంతోనో
పరికరముతోనో మనిషి గడుపుతూ ఉంటున్నాడు.

బాగా చదివి లోతుగా విషయాలను అవగాహన చేసుకొని, క్రొత్త సిద్ధాంతాలను, వైజ్ఞానిక శాస్త్రాలను ఆవిష్కరించే సమయము, ప్రతిభావ్యుత్పన్నతలను కలిగిఉండటం లేదు. అందువల్ల మేధను ఉపయోగించుకునే వెసులుబాటు లేకుండా జీవితాన్ని సుఖంగా గడుపుతున్నాడు. అందువల్ల మేధావులు తయారవకుండా పోతున్నారు. అలాగే, పండితులు, విద్వాంసులు, తత్త్వవేత్తలు, వైజ్ఞానికులు, క్రాంత దర్శులైన జ్ఞానులు, కవులు, లలికకళా నిపుణులు సంఘంలో ఏర్పడడం లేదు. 

ఎంతసేపూ పాత ఆవిష్కరణల, వైజ్ఞానిక, సాంఘిక, తత్త్వశాస్త్రాలను గురించి ఏదో అరకొరగా మాట్లాడే వాళ్ళే తప్ప అవగాహన చేసికొని మాట్లాడే వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. విశ్వవిద్యాలయములు, పరిశోధనా శాలలు నాణ్యమైన ఆవిష్కరణలు చేయడంలేదు. 

మనిషి జీవనశైలి వల్ల బౌద్ధికంగా శ్రమపడే శక్తి కోల్పోయాడు. అంతటి ఓపిక, శ్రద్ధ, ప్రతిభ కొరవడి పోతున్నాయి. ఈ హడావుడిలో మిడి మిడి జ్ఞానం, ప్రతిభ కూడా లేనివాళ్ళు కూడా మేధావులుగా, పండితులుగా, విద్వాంసులుగా, విజ్ఞానశాస్త్రవేత్తలు
గా చెలామణి అయిపోతున్నారు. వాసి పూర్తిగా సున్నకి చేరుతోంది.

మనుషులు ఇంక తమ బుద్ధి కౌశలం, విద్వత్తు, ప్రతిభల గుర్తించి ఉపయోగించగలిగే స్థాయిలో
నిమ్న స్థితిలో ఉన్నారు. క్రొత్త ఆవిష్కరణల మాట అలా ఉంచి ఇదివరకటి వివిధ శాస్త్రములలోని ఉన్నత, ఉత్తమ, గహన ఆవిష్కరణలను అర్థం చేసికోగల సత్తాను కోల్పోతున్నారు.

భారతదేశం లాంటి దేశంలో ప్రతిభ కన్న కులమునకు, లింగానికి పెద్ద పీట వెయ్యడం వల్ల మేధావుల స్థాయి, స్థానము తగ్గాయి. విద్యావ్యవస్థ కూడా నేర్చుకోవడానికి, జ్ఞానం సంపాదించడానికి, తీరికగా అవగాహన చేసుకోవడానికి ఆస్కారం ఇవ్వడం లేదు.
అసలు చదువు యొక్క ఉద్దేశ్యమే మారిపోయింది.
ఇప్పటి ఈ వ్యవస్థ మేధావులను, విద్వాంసులను, వైజ్ఞానికులను, లలితకళాధురీణులను, కౌశలం కల కుశలురను తయారు చేసే ఉద్దేశంలో లేదు. తయారు చేయలేదు కూడా.

ఇదంతా ఎవరినీ బాధించని విషయం.
****
శంకర జయంతి నాడు శంకరాచార్యులను తలుచుకొందుము; మరొకరి జయంతి నాడు మరొకరిని‌; ప్రశంసలు కురిపించుటలో ఘనులము
ఆచరణయందు, అనుసరించుటయందు అల్పులం

శ్రీ రమణులు, శ్రీ గణపతి శాస్త్రి, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి
శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ అరవిందులు ఎందరికో
పూజనీయులు; వారిలో ఒకరిని ఉదాహరణగా 
తీసికొన్న చాలు; ఏల వేల అమాయక పోస్టింగ్స్?
****
ప్రజలను నాయకులు పూర్తిగా వెఱ్ఱి వాళ్ళను చేసి ఆడుకుంటున్నారు.
****
కాలము

కాలము విహంగమా, ప్రవాహమా,
గణనయా, అవధియా, సాపేక్షమా?

కాలము భూత భవిష్యత్ వర్తమానములుగా విభజనయా, భౌతికమా, మానసికమా?

మనసు గతులు, తలపులు, కాలమా?
అనుభవ స్థితులు, వీటన్నింటికీ అతీతం
కాలమా? గ్రహముల గతులు కాలమా,
వస్తుగతి, పరిణామము, పెరుగుట, తరుగుట
కాలమా? సమయము కాల సృష్టా? కాలమే
స్పృహా మాత్రమా? శక్తి పరిణామము కాలమా?

కాలగతి, కాలాతీత స్థితి భౌతిక మానసిక
కాలస్పృహ మనసు కల్పితమా? కాలమునకు
ఉనికి ఉందా? కాలము ఘటనల, సంఘటనల
కలిగించే శక్తి కలదా? ఫక్తు శక్తి, పదార్థ పరిణామమా?
****
Because of the availability of technology, internet and smart phones we are living more for following and commenting on outside events, and almost made our life virtual. No time is left for us to live our life for us and our near and dear.
****
19-4-2018
Intellectual Vacuum

There is an intellectual vacuum in India right now.

Most of the individuals who claim they are intellectuals and are termed as intellectuals by some others of same genre are anti-ancient Indian outlook. They ruthlessly criticize Brahmins and Brahminism thinking and erroneously perceiving that these two are essentially and completely responsible for the social state of affairs of India.

None talks about political, commercial, business-related, financial, social justice planks which are completely crowded by individuals who are other than Brahmins; and these individuals are responsible for all our difficulties and woes. 

All activities in all fields and aspects in present India are being led by left, rationalist, aetheistic, corrupt, dynasty related parties, and anti-ancient Indian block of persons. 

These individuals are now being rated and called intellectuals. Their minds are filled with dislike and hatred for what is ancient Indian for no known reason. They are more carried away by feelings and sentiments against ancient India and its culture and vehemently talk, write, spread hatred among Indians in the name of secularism.

Their idea of India is not clear to them even except for blaming everything  ancient Indian. Such "intellectuals" are misleading than leading India. They do not know that merely blaming and finding fault with a community or culture around and language used; do not revive or rejuvenate India and only sustained efforts alone can do it.

But these intellectuals mastered the art of making "intellectual" noise and disrupt measures aimed at reviving India. 

Intellectuals who think and talk objectively and for all citizens transcending all divisions, are shouted down with slogans of gender, caste, community, region, anti-certain religion and culture. The idea of India of this shouting brigade is regressive which is making India and Indian people suffer.

Thus intellectual vacuum is prevailing in India. There is no comprehensive love for Indians unrelated to their divisions.
****
పెద్దల స్మరణము మంచిదే;
వారిని అనుసరించుట ఇంకా మంచిది;
****

భావ ప్రపంచం


మనం చదివినది, విన్నది, చూచినది, రుచి చూసినది, వాసన చూసినది, స్పర్శ అనుభవించినది,
మనలో ప్రపంచంగా వెలుస్తుంది. బయటి భౌతిక జగత్తుకి చెందిన ఈ విషయములు జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించబడుతున్నప్పుడు అదే సమయంలో
అనుభవాలు కలిగిస్తాయి. ఈ అనుభవముల సమూహమే స్మృతి. వాసనలు అన్నా ఇవే.

ఇలా మనలో ఏర్పడే ప్రపంచం మనిషి మనిషికీ వేరుగా ఉంటుంది. దీనికి తోడు జన్యు పరమైన ఇచ్ఛలు, జ్ఞానములు పుట్టుకతో వస్తాయి. ఇది సూక్ష్మంగా మనిషి. భౌతికమైన శరీరం మానసిక కార్యకలాపాలకు నిలయం, ఆలయం. 

మానసిక కార్యకలాపాలతో కూడిన మనిషి భౌతిక ఆకారం స్థూలమైన మనిషి. ఈ మానసిక కార్యకలాపాలను, భౌతికమైన శరీరాన్ని గమనించే
ప్రజ్ఞయే మనిషి యొక్క అసలు స్వరూపము. 

లోపల ఏర్పడిన  వాసనలు ప్రేరణను పొంది తదనుగుణంగా అంతర్ ప్రపంచంలోని విషయ గ్రహణము మనసు ద్వారా చేసి తలపులుగా మారతాయి. ఆ తలపులకు అనుగుణంగా మనం కర్మేంద్రియాల ద్వారా చేష్టిస్తాము.

ఈ భావ రూప ఆంతర ప్రపంచాన్నే జగత్ అంటారు.

బ్రహ్మా సత్ జగత్ మిథ్యా 
జీవో బ్రహ్మా ఏవ న అపరః

తత్త్వ వాక్యంలో మిథ్యా అన్న జగత్ యే ఈ భావ ప్రపంచం. ఇది మాత్రమే మిథ్యా. బయటి భౌతిక ప్రపంచం మిథ్యా కాదు.

ఈ జగత్ మనిషి మనిషికీ వేరు.
****
తలనొప్పులు

జరిగిన సంఘటన కన్న నెటిజన్ల ప్రతిస్పందన హద్దులు దాటెను; వారి పూనకానికి  అంతర్జాలమే అదిరెను; మతము రంగు పూసి అమానుషత్వం
నుంచి రాజకీయ లబ్ధి పొందగోరు వారికి ఊతం

దొరికెను; ఎవరో చెప్పినట్టు స్త్రీని సినిమాల్లో
ప్రకటనల్లో, కేలెండర్లలో, నెట్లో , మన కళ్ళ ఎదుట సర్వాంగ ప్రదర్శనలు చేయించి స్త్రీత్వమును 
బజారున పెట్టిన, ఎవ్వరికీ అభ్యంతరము లేదు

రెండు నాలికల ధోరణి సాంఘిక సమస్యలను 
పరిష్కరించ లేదు; నిజాయితీ లేని నిరసనలు
బూడిదను పోసిన పన్నీరగును; మూర్ఖపు
స్పందనలు మానవ జాతికి తలనొప్పులు
****
18-4-2018
Doing Ph. D. is a psychological task. It is relation and mind management equal to subject enhancement and intellectual effort. One must be ready for this also. Else the stess consumes the individual, that too when job opportunities are meagre.
****
పాఠశాలలు

పాఠశాలలు జాతికి ఊపిరులు. వాటిని వ్యాపారస్థులు నిర్వహిస్తున్నారు. అందులో ఎందరో ఉన్నత శ్రేణి పౌరుల పిల్లలు చదువుతున్నారు. వారి తల్లిదండ్రులు కూడా అటువంటి ధోరణిలోనే, కార్పొరేట్ థింకింగ్ లో ఉన్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పూర్తిగా పడిపోయింది. అన్ని చోట్లా కార్పొరేట్ హవానే.

ఉపాధ్యాయులకు ఏ విషయంలోనూ స్వాతంత్ర్యం లేదు. ముప్ఫై, నలభై ఏళ్ల క్రితం ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉపాధ్యాయునికి నిబద్ధత ఉండేది. గౌరవం, ఆయన పట్ల భయభక్తులు ఉండేవి. ఇప్పుడు అవేమీ లేవు.

 ప్రభుత్వ నిర్వహణలో ఉన్నా, కార్పొరేట్ విద్యా సంస్థలలో అయినా, చదువుకునే విధానం మారిపోయింది. ఇది వరకు ప్రతి ఉపాధ్యాయుడు పండితుడు, తత్త్వవేత్త అయిఉండేవారు. ఇప్పుడా స్థితి లేదు. విద్యకు గౌరవం లేదు. పాఠశాలల్లో పంచతంత్రం, రామాయణ, మహాభారతాలు, జాతక కథలు, హితోపదేశం కథలు, అన్ని మతముల లోని మంచి, మంచి సాహిత్యం పిల్లల చేత చదివించక మంచి పౌరులు తయారు కారు. పాఠశాలలు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. 

స్త్రీల పట్ల అత్యాచారాలు, సమాజంలో హింస, నేర ప్రవృత్తి, మోసం, అవినీతి, ఇవి పాపపుణ్యాల గురించి పిల్లలకు బోధించక ఆగవు. ఉత్త ఉపన్యాసాల వల్ల ఉత్తమ, బాధ్యతాయుత పౌరులు తయారు అవరు. పాపభీతి లేక మనిషి తప్పుడు పనులు చేయడం మానడు. మేం అంటున్నాం కాబట్టి, అనుకుంటున్నాం కాబట్టి అత్యాచారాలు, హింస, అవినీతి, మోసం, దేశద్రోహం మాయమైపోవాలంటే, అది ఉత్త అమాయకత్వం మాత్రమే. 

మనుషులు అనుకరించి, అనుసరించి నేర్చుకుంటారు. పిల్లల ముందు మంచి ఉదాహరణలు ఉంచాలి. ఇవేమీ చేయక మనుషులు ఋషుల్లా ప్రవర్తించాలి అనుకోవడం పసితనం, కొండొకచో మూర్ఖత్వం. మనిషి ప్రకృతి, మనస్తత్వాలను ముందుంచుకొని మంచి చెడ్డలు చెప్పాలి, నేర్పాలి. 

సినిమాల, సినీతారల, ఇంటర్నెట్, ఇతర అసాంఘిక, అసాంప్రదాయ, జుగుప్సాకర వినోద కార్యక్రమాల, సాధనాల నుంచి పిల్లలను తల్లిదండ్రులే కాపాడు
కోవాలి. రాజకీయ నాయకుల దుర్నీతి, దుశ్చర్యలను
ఒక కంట కనిపెట్టి విరుగుడు ఆచరించకపోతే మనం
అందరం పరస్పరం కలహించుకుంటూ ఉంటాము. ఇవన్నీ జరగక సంఘంలో దుర్మార్గం, దుష్టత్వం, దుర్నీతి ఎక్కడికీ పోవు.

Just wishful thinking leads us nowhere. And no atrocity or crime will cease to take place by our mere protest or feeling or wishing.

A human being is a complex being. Tradition observed all that and put forward certain guidelines. But in our arrogance we are neither preparing for anything nor are obvious of any happening. 

We are oblivious of commonsense. We are merely idealistic and not realistic.
****
Nature has many spas. But we prefer only five star ones.
****
17-4-2018
ఊగు, ఊగీసలాడు, ఊపు, తూగు, తూలు, తూగును మనసు; ఊహల ఊసులుగ మార్చు, ఊసుల ఊహలుగ మార్చు; మనసు మోదం, ఖేదం
భయం, బాధ, ఉత్సాహం, ఉసూరుమనడం
అంతా తన ఇష్టం; మనం మనసాడించే
ఆటబొమ్మలం, తైతెక్కలాడే తోలు బొమ్మలం
****
Sculpture is poetry in stone
Mind is reflection of Divine
Poetry is sculpture with words
Beauty is work of art by nature
****
Our country needs a more competent and learning-oriented education. We need to produce human beings and not robots or animals.
****
అంతర్జాల మాధ్యమాల్లో సమస్యలు పరిష్కరింప బడవు.

కుల, లింగ, మత, ప్రాంతీయత, ఉపజాతీయతలకు అతీతులైన అందరి మంచి కోరే ప్రజ్ఞా పాటవాలు కల మేధావులు మాత్రమే సమస్యలను పరిష్కరించ గలరు. ఏదో ఒక గజ్జి ఉన్న మనుషులు సమస్యలను సృష్టించగలరంతే.

భేద భావాలు కలిగించి, విభజించి, విద్వేషంతో మాట్లాడే మేధావులు సమస్య కన్నా ప్రమాదకరమైన వారు.
****
"మగవాళ్ళ కంటే ఆడవాళ్ళమైన మేము ఎంతో గొప్పవాళ్ళము,
అన్నింటిలో వారికన్నా నిపుణులము"

అని చాటే మగువలు ఎక్కువైపోయారు! 

"అమ్మాయిలు అబ్బాయిలను మించిన 
వారు; ఆడపిల్లలా మగపిల్లలు ఉండలేరు
ఉపయోగపడరు"

అనే ముదితలు కోకొల్లలైయ్యారు

మగపిల్లలకీ మనసుంటుందని
ఈ మాటలకు అది గాయపడుతుందని
తెలియని స్త్రీలు ఇబ్బడిముబ్బడయ్యారు

ఏమిటో?
ముందు సమానం అన్నారు
ఇప్పుడు అధికం, ఉన్నతం అంటున్నారు
అనుకుంటున్నారు;
ముదితల్ పలుకగరాని మాట కలదే?
****

ఆమ్మమ్మలు-మామ్మలు

అమ్మా! నీకు వయసైపోతోందే! అలిసిపోయావు! విశ్రాంతి తీసుకోవే అనే కూతురు లేదు
అత్తయ్యగారు మీరు కూర్చోండి నేను చేస్తాననే కోడలు లేదు
ఎందుకంటే కూతురూ, కోడలూ తమ తమ ఉద్యోగాలతో బిజీ!
అరవయ్యొచ్చినా, ఒళ్ళు సహకరించక పోయినా
మా తరం ఆడవాళ్ళకు రిటైర్మెంట్ లేదు

కూతురు పిల్లలకో, కోడలు పిల్లలకో మనుమలు మనమరాళ్ళు అనుకుంటా అంతటి చాకిరిని మళ్ళీ చేయాల్సి రావడంతో ఊపిరి పీల్చు కోవడానికి ఖాళీ
లేని, అనడానికి వీలు లేని, మానవ హక్కులు లేని
అమ్మమ్మలు, మామ్మలు వీరు; అన్ని హక్కుల సంఘాల వారు అందరు పట్టించుకోని సమానత్వం లేని 

మహిళలు వీరు; నా బొందో అనుకుంటూ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు పని చేసే శ్రమజీవులు

ఇంత చేసిపెట్టే మనవారైన వీరికి
ఏమిటి మన బహుమతి?
వృద్ధాశ్రమ వసతి!!!

1 comment:


  1. తత్త్వ వాక్యంలో మిథ్యా అన్న జగత్ యే ఈ భావ ప్రపంచం. ఇది మాత్రమే మిథ్యా. బయటి భౌతిక ప్రపంచం మిథ్యా కాదు.

    ReplyDelete