Friday, May 25, 2018

ఉద్ధరింపులు; పిల్లల పెంపకం; గురువింద గింజలు; సాహితీ సృష్టి; ఊపిరి;

ఉద్ధరింపులు
చాలా మంది భారతీయ సాంప్రదాయం నుంచి, సంస్కృతి నుంచి తాము లాభ పడే ఊసు పెట్టుకోకుండా, మిగిలిన అందరినీ ఉద్ధరించెయ్యాలని
ఎన్నో పోస్ట్లు పెడతారు. ఎంతో తాపత్రయం చూపుతారు. ఈ తాపత్రయంలో అణుమాత్రం తమని తాము ఉద్ధరించుకోవాలని సంకల్పం ఉన్నా వాళ్ళూ బాగుపడతారు మనకీ ఈ పోస్ట్లు చూసే హడావుడీ తగ్గుతుంది.
తనకు మాలిన ధర్మం లేదు - అంటే తను ఆచరించని ధర్మాన్ని ఇతరులకు బోధించడం అనవసరం అని అర్థం. తను ఆచరించకుండా మీరందరూ ఆచరించండి అనడం height of innocence and ignorance.
ఈ బోధనలు మనం ఆచరించి ఇతరులకు చెబితేనే వాటికి విలువ. లేకపోతే చిరాగ్గా ఉంటుంది.
మిగతా వాళ్ళని బాగుచేసే ముందు మన్ని మనం బాగుచేసుకోవడం అత్యవసరం. ఏదో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కదా, అందరికీ క్షణాల్లో పంపిచెయ్యచ్చు కదా అని మనం పంపించేదాన్ని ఏమీ చదవకుండా, అవగాహన చేసుకోకుండా ఇతరులకు తోసేయడం మన శ్రమ మాత్రమే. ఇతరులపై ప్రేమ కాదు. ఉద్ధరింపు మన నుంచి మొదలవ్వాలి.
**********
పిల్లల పెంపకం

లలిత కళల్లో నిష్ణాతులైన వారికి, మేధావులని కీర్తింపబడే వారికి చంచలమైన మనసు ఉంటుంది.
వారి అలవాట్లు, వ్యవహారాలు, బంధాలు, సంబంధాలు సమాజం నిర్దేశించినట్లుండవు. వారు స్వేచ్ఛగా తిరుగుతారు. వాళ్ళ అలవాట్లని, ప్రవర్తనని బట్టి మాత్రమే వారిని గౌరవిస్తాను, ఇష్ట పడతాను అంటే అందుకోసం మనకు ఎవరూ మిగలరు. బలహీనతలు లేని మనుషులు ఉండరు.
ముఖ్యంగా కళాకారులు, పేరొందిన మేధావులు, "పెద్ద మనుషుల్లో" సంఘ నియమాలు పాటించకుండా జీవించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మన కొలబద్దలు అక్కడ ఉపయోగిస్తే ప్రయోజనం ఉండదు. సంఘం ఎప్పటినుంచో కళాకారులు, మేధావులు, ఇతర "పెద్ద మనుషుల" విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించేది. ఇప్పుడు అంతర్జాలం వచ్చేక సామాజిక సాలెగూళ్ళలో నీతి, అవినీతి బోధించడం, అలా లేని సెలిబ్రటీలని ఎండగట్టడం ఒక ఆనవాయితీగా తయారైంది.
అందుకే ఇదివరకు నట, విట, విదూషకులను దూరంగా ఉంచాలనేవారు. ఎందుకంటే వారికి సాంఘిక నియమాల మీద అలస భావం ఉంటుంది.
అది ఆయా వృత్తులలో సహజం. వారు వినోదాన్ని పంచుతారు. అలా మన మనసులని తేలికగా దోచేస్తారు. మన చిన్నప్పుడు మనం, ఇప్పుడు మన పిల్లలు, మనుమలు, మనమరాండ్రు సినీ నటీనటులను ఎంత ఆరాధిస్తారో, వారిపై, వారికై ఎంతో మనసు పారేసుకుంటారో చెప్పనవసరంలేదు.
అందమైన మన అమ్మాయిలు, అబ్బాయిలు ఈ సినీ తారలపై మనసు పారేసుకోవడం నిజంగా నాకు ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడు మన జీవన విధానం పూర్తిగా మారిపోయి ఎప్పుడో 28, 29 ఏట జరిగే పెళ్ళి వరకు ఏ ఆకర్షణలోనూ పడకుండా ఉండడం అసాధ్యం. గర్ల్ఫ్రెండ్, బాయ్ఫ్రెండ్ లు ఈ లోటు కొంత పూడ్చినా సినీ తారల, ఇతర వినోద కారుల ఆకర్షణనుంచి మన పిల్లల్ని కాపాడలేము.
ఏదో బట్టీ పట్టి పరీక్షల్లో రాసేసి సర్టిఫికెట్ తద్వారా ఉద్యోగం మాత్రం సంపాదించి పెట్టే నేటి చదువులు మానసిక వికాసం కలిగించే అవకాశం లేకుండా పోయింది. తల్లిదండ్రులు, వాళ్ళు స్వతహాగా చదువుకున్న రెండు మూడు పుస్తకాలు తప్ప వారికి జీవితం గురించి చెప్పే వారే లేరు. వారు చదివే విద్యాలయాల్లోని ఉపాధ్యాయులకు ఈ శక్తీ లేదు, ఉన్న ఒకరిద్దరు యాజమాన్యాలను అధికరించి జీవితం గురించి ఏ మంచి మాటా చెప్పలేని స్థితి.
ఎక్కువ విద్యాలయాలు అసాంఘిక శక్తులచే నడుప బడుతున్నాయి.
మన పిల్లలకి విద్యాలయాల్లో గడిపే సమయమంతా రేంకులు, రాబోయే ఉద్యోగాల గురించి (చాలామందికి ఏ ఉద్యోగాలు రావటంలేదు, అది వేరే సంగతి) సతమత మయ్యే హడావుడే తప్ప జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమయ్యే విషయాలే చెప్పబడటంలేదు. ఈ విషయంలో ఏ విధమైన సాయం అందటం లేదు. అసలే వయసు తెచ్చే అలజడులు, ఆకర్షణ, ఇంగితం నేర్పేవారు, సావకాశాలు లేని విద్యావిధానం, వ్యవస్థ, జైళ్ళలాంటి ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజీలు, అసలు మన పిల్లలు మన ఈ "దౌష్ట్యాన్ని" ఎలా తట్టుకుంటున్నారో!
ఆ ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ జైళ్ళ బందిఖానా నుంచి బయట పడగానే కలిగే స్వేచ్ఛ, అణిచి ఉంచిన వయసు, ఆకర్షణలు ఉన్న కాస్త ఇంగితాన్ని మింగేస్తాయి. అప్పుటికే మనసునాకర్షించిన సినీతారలు, ఆటగాళ్ళు, ఇతర సెలిబ్రిటీలు జీవితంపై దృష్టి పెట్టనీయరు. అప్పుడే తల్లిదండ్రుల పెంపకం; వారికి సహజంగా అంటిన సంస్కారాలు, స్ఫురణ, స్ఫూర్తులు వెన్నంటి ఉండి కాపాడతాయి. లేనివాళ్ళు ఇతరుల వంచనకు లోనవుతారు. జీవితం ఇబ్బందుల్లో పడుతుంది.
ఇదంతా మనం ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించం. ఆలోచించి ఏం ప్రయోజనం అని ఎందరో వదిలేస్తారు.
కాని చురుకైన, మెరుగైన, అందమైన మన ఆడపిల్లలు, మగపిల్లలు వారి వారి అందాలకు, సంస్కారానికి, సంస్కృతికి ఏ మాత్రం తూగని, ఒక్క వినోదం మాత్రం పంచే, అదీ జుగుప్స కలిగించే విధంగా; నిజ జీవితాల్లో ఏమాత్రం ఆదర్శంగా జీవించని; రూపంలో తప్ప మరెందులోనూ తగని, నటీనటుల పట్ల ఆకర్షితులై వ్యవహరించడం మనం ఎవరం కావలసినంత దృష్టి పెట్టని విషయం.
పిల్లల పెంపకంలో మన పాత్ర మరెవ్వరూ తీసికో లేనిది. పూరింపలేనిది. ఈ వాస్తవాన్ని గ్రహించి మనం జాగరూకులమై మన బాధ్యత నిర్వహించక పోతే నష్ట పోయేది మన పిల్లలు, మనం.
************
"Miracle" for setting in peace

People swarm to individuals who "can" tell about your past lives and future. Very few pay attention to the present. All meditations direct us to practice and cultivate the art of living in the present.
We live by our thoughts. Most of the times our thoughts are about what passed and what will happen. These thoughts are related to I, me, mine. This situation is because we are highly ego-centric.
We always think of bonds to I and the merits and demerits of those bonds. The thoughts originate from our experiences relating to I, me, mine; pain, hurt, unpleasant happenings are sourced from our memory. Past is nothing but memory in the form of pleasant and unpleasant experiences. Surprisingly and most of the times our thoughts of past are about unpleasant happenings. Pleasant happenings rarely are activated giving us joy.
Sorrow, pain, hurt dominate past. In a similar way future is active in our mind as fear, anxiety, apprehension, worry, doubt mostly. Both past and future are activated in the present as mere thought forms; and are unreal confined to mental uneasiness and have no physical existence.
Mind always tries to dwell in the past or future; thus giving us no time to live in the present. All mental illnesses are due to weak mind which cannot stop rising of unpleasant thoughts in relation to past or future. Mind has to be and can be strengthened through our conscious efforts.
Every one of us must attempt this strengthening of mind.
First and foremost thing in this direction is to have and maintain harmonious human relationships. In the absence of this any amount of spirituality or gurus, meditation techniques will fail to help us in strengthening our mind to tackle all vissicitudes that envelop and engross us during the course of our lives.
So the primary and only phenomenon that helps us in curtailing disturbances in and of our mind is cultivating and maintaining harmonious human relationships and have respect for fellow humans, animals and nature - cum - environment.
Many erroneously feel that even in the absence of having harmonious relationships, spirituality or gurus or meditations can help and rescue them from mental uneasiness and illnesses.
We have to take care of our relationships among family, society and nation to have peaceful coexistence.
Living in the present in harmony to around living and non-living beings is the miracle that sets in peace in us and society.
********
నయనానందకరము ప్రకృతి అందములు;
శ్రవణానందకరము పక్షుల కిల కిలా రావములు
హృదయాహ్లాదకరము ప్రణయిని రాగ భాషణములు
మదిని పొంగించును రమణీ తనురచనలు సొంపులు
ఆహ్లాదము మనిషి మనిషికీ వేరు
స్త్రీ పురుషులకు అంతరంగ మథనాలు వేరు
మనసుల మంతనాలు జరుగు విధములు వేరు
ఒకరి తత్త్వము వేరొకరి తత్త్వము; మనసులు
పనిచేయు తీరులు వేరు; ఒకరి వైపునుంచి చూచి
మరొకరిని తక్కువగా చూడరాదు; ప్రకృతి ఆట ఇది
********
అనుబంధం ఆత్మీయత లేని "ప్రేమ"
ఎండిపోయిన నదీ ఒకటే; ఆర్ద్రతలుండవు
********
గురువింద గింజలు
ప్రపంచంలో తప్పులు చేసేవారి కన్న తప్పులు చేసిన వారి తప్పులను దుయ్యబట్టే సామాన్య జనం ఎక్కువ. నిజానికి ఈ దుయ్యబట్టే వారంతా కూడా తమ తమ జీవితాల్లో తప్పులు చేసిన వారే. వీరికి ఇతరులలో తప్పులు ఎంచడం, పట్టడం, దునుమానడం ఒక వేడుక.
ఈ తిట్టే వాళ్ళ తప్పులు ఇతరులకు తెలియవు. అలా వీరు తప్పించుకొని సంఘంలో తప్పులు చేసిన వారందరి మీదా కారాలు మిరియాలు నూరతారు.
ముఖ్యంగా సెలిబ్రటీలైతే చచ్చారన్న మాటే. ఈ తప్పులెన్నువారు, నీతి వాక్యాలు చెప్పే వారు వారి వారి జీవితాల్లో తప్పులు చేసే సగటు మనుషులే. సెలిబ్రటీల తప్పుల దగ్గరకొచ్చే పూనకం వచ్చిన వారిలా రెచ్చిపోతారు. ఓ మాట అని ఊరుకోవచ్చు.
ఉహు అలా కుదరదు వీళ్ళకి. ఆ సెలిబ్రటీని చీల్చి చెండాడెయ్యాలసిందే. వాళ్ళ చుట్టాలలో, స్నేహ బృందంలో తప్పులు చేసే వారెందరో ఉంటారు. వీళ్ళు గబుక్కున అంధులైపోతారు ఆత్మీయుల ఆగడాలకి.
తప్పులు అందరం చేస్తాం అనే స్పృహ ఉంటే తప్పులు చేసిన ఎవరినీ అతిగా ఆడిపోసుకోం.
గురువింద గింజ సామెతలా వీరు వ్యవహరిస్తారు.
*******
Rising power of regional parties is not good for emotional integration of India.
Our leaders' narrow-mindedness and no love for nation together with their ignorance of democratic processes and its various wings and sole selfishness and dynasty leadership trends are detrimental to progress of India and the idea of India as an integrated nation.
********
Readers have become rare to find. The entertaining ways are so dominating that "ordinary" people who were readers for time pass are now smart phone savvy and spending their time that way.
********

సాహితీ సృష్టి
సమాజంలో మనకి ఆనందం కలిగించే రచనలు చేయడం సామాజిక అంశమే కదా! అవసరమే కదా! ఎటొచ్చీ రచన తరువాత ఈ ఉపయోగం కలుగుతుంది.
సాహిత్యం సమాజంలోని సమస్యలు చిత్రించి మనకు అశాంతి కలిగించడం కన్న మనకు ఆహ్లాదం కలిగించడం మంచిది కదా. వార్తా ప్రసార సాధనాల ద్వారా మనం సమస్యలు తెలుసుకుంటూనే ఉంటాము. అలాగే కాక పాఠకులమైన మనమూ సంఘాన్ని గమనిస్తూ ఉంటాం కదా.
పాఠకులకు ఆహ్లాదం కలిగించడం సామాజిక సేవ కిందే వస్తుంది కదా. అన్ని రచనలూ సమాజంలోని సంఘటనలను, బాధలను, అణచివేతలను మాత్రమే ప్రతిబింబించాలనడం పసితనం. అలాగే ప్రతి రచనా సందేశం ఇవ్వాలనడం ఒక విధమైన మేష్టారి మనస్తత్వం.
రచనలు ఆహ్లాదాన్ని మాత్రమే కలిగించేవి కావచ్చు. అవి రచనలు కావు అలా రాయడం బూర్జువా సంస్కృతి అనడం సంకుచితంగా మాట్లాడడం.
ప్రణయము, ప్రేమ, ఇత్యాది కవితా వస్తువులను పుర్ర చేతి భావ విమర్శకులు తెలుగు సాహితీ రంగంలో అనధికారికంగా నిషేధించారు. సమస్యల వలయాలను చిత్రించడమే సాహిత్య పరమార్థం అని శ్రీ శ్రీ అనుయాయులచే నిర్ణయించబడింది.
తరువాత వాదముల హవా మొదలైంది. ఈ వాద సాహిత్యంలో ఎంతసేపూ ఎవరో ఒకరిని, దేనినినో ఒక దానిని నిరసించడం, దుయ్యబట్టడం ఉంటాయి. సామరస్యం, సౌమనస్యములకు తావుండదు. సాహిత్యం సంఘంలో శాంతి, ఆహ్లాదయుత వాతావరణాన్నీ నిర్మించాలి.
ఊకదంపుడుగా తిట్లు, కువిమర్శలు కల రాతలే సాహిత్యం అనే స్థాయి నుంచి తెలుగు సాహిత్యం సౌమ్యత, సౌమనస్యము, సామరస్యం, ఆహ్లాదం, వివేకము, వివేచన, తత్త్వ జ్ఞానము పొందడంల వైపు పయనించాలి. అప్పుడే మన మధ్య కృత్రిమత, ద్వేష, విద్వేషాలు, కోప తాపాలు, అపోహలు, అజ్ఞానయుత ధోరణులు, వైషమ్యం నిండిన తలపులు తొలగి మనలో, సంఘంలో సుఖశాంతులు ఏర్పడతాయి.
సాహిత్యా సృష్టిని ఇందుకూ వాడుకోవాలి
*********
ఊపిరి
నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం బాగా అలవాటు. ఈ అలవాటు నాకు మా అమ్మ నాన్న గార్లనుంచి వచ్చింది. మా అమ్మగారు పురాణాలు చదివే వారు. మా నాన్నగారు అన్ని రకాల పుస్తకాలు తెలుగు, ఆంగ్ల భాషల్లో చదివేవారు.
నేను బాలల బొమ్మల రామాయణంతో మొదలుపెట్టి
వివిధరకాలను చదివాను. నేను పి హెచ్. డి. చేస్తూంటే నేను ఒక రచయితనైతే బాగుండును అని మొదటి సారి అనిపించింది. అప్పుడు పుర్రచేతి భావాలు తెలుగు సాహిత్యాన్ని ముప్పిరిగొని ఉన్నాయి. వార, పక్ష, మాస పత్రికలు తమ వంతు సాహితీ సేవ చేస్తూ ఉండేవి. కాని రచయితగా మాత్రమే ఉంటే జీవనం గడవదని అర్థమైపోయింది.
మౌనంగా పి. హెచ్. డి. పూర్తి చేసికొని ఉద్యోగంలో చేరాను. కాని రచయితగా మారలేదు.
చిన్న చితకా కవితలు, కథలు రాస్తూ ఉండే వాడిని.
కాని సాహితీ స్రష్టల సందోహం ఎక్కువైపోయి, పత్రికలు తక్కువై పోయి మము బోంట్ల రచనలకు ప్రచురణా భాగ్యం కలిగేది కాదు. ఎప్పుడూ గోడకి కొట్టిన బంతిలా వెనక్కి రావడమే.
ఇంటర్నెట్ వచ్చాక సాంఘిక సాలెగూళ్ళు, వెబ్ సైట్లు పెరిగాక మాకూ ప్రచురణా (ఇంటర్నెట్లో) మాత్రమే కలగడం మొదలు పెట్టింది. రచించడానికి ప్రేరణ, ఉత్సాహం కలిగాయి.
ఆ రోజుల్లో అసలు నేను (ఇప్పుడు కూడా) రచయిత నవ్వాలని ఎందుకనుకున్నానంటే, రచయితలకు పదవీవిరమణ లేదు. ఆరోగ్యం ఉంటే ఆఖరి ఊపిరి తీసేవరకు రాసుకోవచ్చు.
కాని ధన సంపాదనే ఉండదు. ఇప్పుడంటే రిటైర్ అయిపోయాను, ధన సంపాదన అవసరం లేదు, అందుకని తనివితీరా రచనా వ్యాసంగంలో మగ్నమై పోవచ్చు. పేరు, ప్రఖ్యాతులు రాకున్నా మనకు కాలక్షేపం అయిపోతుంది. బుర్రా ఖాళీగా ఉండదు. పదునెక్కుతుంది కూడా. రవంత పేరు రావచ్చు.
రాయడం ఎందరికో ఊపిరి.
********
విశ్వవిద్యాలయములా బొచ్చెడు
చదువులా కులగజ్జిని దాటనివ్వవు
కవులు, మేధావులా వర్గాన్ని మించలేరు
జ్ఞానులు, గురువులా తమ ఆస్తుల పెంపకంలో
ములిగి తేలేరు; అన్ని తమకములు తీర్చుకొనేరు
పాలకులా పదిచేతులతో వెనకేసుకొనేరు
భారత దేశమున అన్ని వృత్తుల్లో నిజాయితీ తగ్గుతోంది; ప్రజల్లో అనైక్యత పెరుగుతోంది
ముఖ్యమైన చదువు, వైద్యం, ఆధ్యాత్మికత
వ్యాపారుల, దళారుల వశమై నిరుపయోగమయ్యేను; అంతనూ సరిచేయడానికి
మేధావులు లేరు, గురువులు లేరు, పాలకులు లేరు
ఉద్యమిద్దాం అంటే మన కులం చూసి దూరమయ్యేరు; ప్రాంతం, మతం పేర్లు
చెప్పి నీరు కార్చేరు; కుహనా మేధావులు
తాము చేయలేరు, ఇతరులను చేయనివ్వరు
ద్వేష విద్వేషాలు మాత్రం మస్తుగా పంచేరు
పెంచేరు; ముసలి ఎద్దుల వంటి వీరు పనికిరారు
దేశంలో ఐక్యత కలిగించే మేధావులు ఏదో
సూత్రం కనిపెట్టి ఆ సూత్రంతో భారతీయులను
ఒక గుదిని గుచ్చి అందమైన మాలగా అల్లడానికి
మనందరం సహకరించాలి; మన బాగు చూసుకోవాలి

No comments:

Post a Comment