7-5-2018
గుఱ్ఱాన్ని గాడిదని ఒకే రాటకి కట్టడం నేడు భారతదేశంలో ఎందరో ఒప్పుకున్న దుష్పరిణామం. ఏర్పాటు చేసికొన్న దుర్నీతి. దురవస్థ.
****
Destiny, God, fate, etc,. are names we give to fix cause and responsibility for various happenings on globe and in our lives. All this and the associated statements are to satisfy our inquisitiveness and desire to know and explain everything and every happening; which we need not do, or capable of doing. In reality none knows the Truth exactly.
****
ఓంకారం-ప్రణవశక్తి
ఊపిరులూదే
ప్రాణశక్తి యే ప్రణవ శక్తి.
ఓంకారం శబ్ద శక్తి. infra-sonic frequency లో ఉంటుంది. Around 10 Hz. అన్ని శబ్దములూ ఓంకారము యొక్క వివర్తనములే ( తిరోధాన పురోధాన యుత వర్తనము - reversible becoming) modulation-demodulation.
జగత్తు ప్రణవమయం అంటే చిత్ శక్తి విభూతి ఐన స్వరశక్తి యుతము. తలపులు చిత్ శక్తి మరియొక విభూతి యైన దివ్యశక్తి మయములు. శబ్దముల, తలపుల మూలశక్తి యే ఆత్మశక్తి, చిద్రూపంగా ఉంటుంది.
ఈ ప్రణవశక్తియే సర్వమునకు మూలము. అదియే ఆకాశ, వాయువు భూతములుగ మారి దివ్య, స్వర శక్తులై వివిధ మానసిక, శారీరక కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
అందుకే జగత్తు అంతా ప్రణవమయం అంటారు. ప్రణవశక్తినే ఉపనిషత్ దార్శనికులు వేదాంతులు చిదాభాసా అంటారు. అద్వైత వేదాంతులు మాయ అంటారు. విశిష్టాద్వైతులు శ్రీ అంటారు. మధ్వులు విష్ణు శక్తి అంటారు. శబ్ద బ్రహ్మ సిద్ధాంతులైన వైయాకరణికులు స్ఫోట అంటారు. యోగ, సాంఖ్యములు ప్రకృతి అంటాయి. న్యాయ వైశేషికములు అణువులు అంటాయి.
దర్శనాన్ని బట్టి పేరు వేరు గాని, శక్తి ఒకటే.
సర్వం బ్రహ్మ మయమ్.
****
గొప్పవాళ్ళు-గొప్పతనాలు
నాకు ఎప్పుడూ ఈ గొప్పవాళ్ళందరూ ఎలా గొప్పవాళ్ళయ్యారా, అని తెలుసుకోవాలి అనిపిస్తోంటుంది. కాని నాకు ఏ విధమైన
క్లూ లభించలేదు. ఏ ఫీల్డ్ అయినా గొప్పవారి గొప్పతనాలు ఎలా ఏర్పడతాయా అని తెలుసుకోవాలనే ఉత్సుకత నన్ను అస్తమానూ
గోకుతోంటుంది.
సాహిత్యం, చిత్రకళ, లలితకళలు, సాంఘిక, విజ్ఞాన శాస్త్రాలు, తత్త్వం ఈ ఈ రంగాల్లో గొప్పవారిని ఎవరు గుర్తిస్తారు, ఎవరు నిర్ణయిస్తారు అనేది మీమాంస నాకు. తప్పక విమర్శకులే నిర్ణయించాలి అనిపిస్తుంది. ఎవరికి వారు నేను గొప్ప వాణ్ణి అని ప్రకటించుకోరు కదా?! అలా ఒకవేళ ప్రకటించుకున్నా అందరూ ఒప్పుకోరు కదా.
ఒక విషయం కూడా గమనించాను నేను అందరికీ గొప్పవాడైన గొప్పవాడు భూప్రపంచంలో ఎక్కడా లేడు. ఎవరైనా కొందరికి మాత్రమే గొప్పవారు. ఇది అన్ని రంగాలకు వర్తిస్తుంది. విజ్ఞాన శాస్త్రాల విషయంలో ప్రస్తుతానికి విజ్ఞాన శాస్త్రవేత్తలు కాని వారి ప్రమేయం ఉండదు గొప్పవారి గొప్పతనం నిర్ణయంలో.
మిగతా అన్ని శాస్త్రాలు, తత్త్వాలు, లలిత కళలు, సాహిత్యం అందరికీ లోకువే. ఎవరి మట్టుకు వారు గొప్పవారిని నిర్ణయించేసికుంటారు. మరుక్షణం నుంచే కార్పణ్యాలు, కలహాలు, కొట్లాటలు, హత్యలు, నానా ఛండాలాలూను పుంఖానుపుంఖాలుగా జరుగుతాయి.
ముఖ్యంగా భారతదేశంలో తార్కికులము, హేతు వాదులము, నాస్తికులము, వాద ప్రియులము అని ప్రకటించుకునేవారు కూపస్థ మండూకాలలాగ తమ దృష్టియే సరియైనది అని ఊదరగొట్టేస్తారు. ఎవరికీ ఊపిరి ఆడనియ్యరు.
ఇలా గొప్పతనము రంగాల వారీగా, ప్రేమికుల వారీగా
నిర్ణయించబడుతుంది కాబోలు. ఒకే రంగంలో పరస్పర విరుద్ధమైన మాటలు చెప్పినా వారు వారి వారి అనుయాయులకు "గొప్పవారే". ఏ "ప్రేమికుల" లోనూ కలవక స్వతంత్రంగా ఉండే జనులు బయటినుంచి చూస్తూంటే ఇవన్నీ ప్రేమలు తప్ప అవగాహన మీద ఆధారపడిన జ్ఞాన సిద్ధులు కావు అని విదితమౌతుంది.
ఐన్స్టీన్ ను విమర్శించే హేతువాదులుండరు. కాని ఉపనిషత్తుల తత్త్వాన్ని విమర్శించే హేతువాదులు
ఉంటారు. నిజానికి ఈ హేతువాదులకు సాపేక్ష సిద్ధాంతమూ అవగాహన కాలేదు, ఆత్మ జ్ఞానమూ అవగాహన కాలేదు. మరి హేతువాదులు ఎందుకలా రెండు నాలికల ధోరణి పాటిస్తారు? సాగుతోంది కనుక.
ఏదైనా శాస్త్రాన్ని నేర్చి, అవగాహన చేసుకొని మాట్లాడడం వేరు, అస్సలు చదవకుండానే తమ ఇష్టానుసారం అభిప్రాయాలు ప్రకటించడం వేరు.
అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.
ఒక శాస్త్రంలో నిష్ణాతులైన వారు అన్ని శాస్త్రాలను గౌరవిస్తారు. వారికి వినయం ఉంటుంది. Open mind ఉంటుంది. ఏదీ తెలియని వారికే, అర్థం కాని
వారికే ఎగురుడు ఎక్కువ ఉంటుంది. ఐన్స్టీన్ మొదలైన వారు భారతీయ తత్త్వశాస్త్రాలను గౌరవిస్తారు. భారతదేశంలో పుట్టిన, ఏ శాస్త్రము లోనూ దిట్ట కాని హేతువాదులు మిడి మిడి జ్ఞానంతో
భారతీయ తత్త్వశాస్త్రాలను తీసిపారేస్తారు.
గొప్పతనాలు, గొప్పవారు, వారి రంగానికి చెందని వారిచే విమర్శింప బడడం భారతదేశంలో ఎక్కువ.
ఇదంతా ప్రజాస్వామ్యమిచ్చిన భావప్రకటనా స్వేచ్ఛయో, వికటించిన మనస్తత్త్వపు వంకరలొ.
భారతదేశంలో చాలామంది హేతువాదులు ఏ విజ్ఞాన శాస్త్రం చదవని, అవగాహన కాని పండితులు. ఆచార్యులు. భాషా, సాంఘిక శాస్త్రములు చదువుకున్న వారు. విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటో తెలియని వారు. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతంలో ఏముంది వారికి ఇంత కూడా తెలియదు. వారి ఆ జ్ఞాన రాహిత్యం వారికి ఎఱుకయే. అలాగే భారతీయ తత్త్వశాస్త్రానికి వారి దూరం అంతే. ఐన్స్టీన్ యందు
భక్తి, భగవద్గీత స్రష్ట అంటే లోకువ.
భారతదేశంలో ఎంతోమంది హేతువాదులు నిజమైన దార్శనికులు కారు. అకారణంగా ద్వేషం మనసులో నింపుకొని రత్నాల రాసులను ఎందుకూ పనికిరాని రాళ్ళు అని తీసిపారేసే విచక్షణా రహితులు. దేనినీ విశాలమైన మనస్తత్వంతో చూడలేని నిరక్షరాస్యులు. కుల, ప్రాంత, సిద్ధాంత, వాద, ఉపజాతీయతా పరిధి దాటలేని కూపస్థ మండూకాలు. సంకుచిత మనస్కులు.
ఇలాంటి కుహనా మేధావులు నేడు అన్ని రంగాల్లోనూ గొప్పతనాలను, గొప్పవారిని నిర్ణయించే వారవడం వారి విదూషకత్వాన్ని తెలియజేస్తుంది.
గొప్పవారు సూర్యుని వంటి వారేమో! కళ్ళున్న వారికే ఆ తేజం కనిపిస్తుంది ఏమో! కుళ్ళున్న గ్రుడ్డివారికి
ఆనదేమో!?
****
Class room teaching is a must and should not be dispensed with digital and virtual classrooms.
Education is to train the mind and not stuff the brain with information.
An individual as a teacher imparting subjects being present in physical proximity makes a lot of difference in making us learn at higher levels of instruction.
Even at primary, secondary, tertiary levels it is unwise to remove the physical presence of teacher from class room.
Learning many subjects well gets enhanced by the physical proximity of the teacher and the resulting warmth associated.
When education in India got reduced to certificate hunt, learning subjects took back seat. Rather; parents, students, corporate owners of educational institutions have restructured education and getting ranks has become breath of education.
This sort of education is neither getting jobs nor is moulding students to be values-minded.
We put ourselves in a dangerous situation.
***
అందము, లావణ్యము మెచ్చుకున్న,
కన్నియలకు; కవితల కొనియాడిన,
కవులకు ఉల్లము ఉప్పొంగును
ఏదైనా కలిగి ఉండుట ఒక ఎత్తు
గుర్తింప బడుట మరియొక ఎత్తు
6-5-2018
ఆనందంగా గమనిస్తూ ఉండడమే బ్రహ్మానుభవం.
****
తమ్ముళ్ళు
ప్రభుత్వాలను దుంగీడులకు అప్పగించి తమలో తాము కలహించి కొట్లాడుకొను ధీరులు భారతీయులు!
తాము తమ పొల్లు పోసుకున్న చాలు రాజకీయ నాయకులు అండతో, దేశమేమైన గాని తమకేమి!
విభజనల హోరులో పోరులో తమ తమ అస్తిత్వములకు తామే ఎసరు పెట్టుకొను
అతి దురభిమానులు స్వార్థ నాయకుల
తోకలు; దేశభక్తి లేని దారిద్ర్యధనులు ఘనులు
ఇట్టి ప్రజలకు అభివృద్ధి ఎటుల కలుగును?
తమకు తామే అపకారము చేసికొను తమ్ముళ్లు
కులములు ప్రాంతములు మతములు ఉపజాతీయతలు ముప్పిరిగొని ఊపిరుల
ఆడకుండా చేయు ఈ కుమ్ములాటలలో
పౌరులే కష్టనష్టాల పాలగుచున్నారు; కష్టజీవులు
గొఱ్ఱె కసాయిని నమ్మినట్లు నాయకుల తీపి మాటలకు లొంగిపోయి, తమ జీవితముల
వసంతము విరియునని మూర్ఖముగ నమ్మి
తాము ములిగి తోటి పౌరుల ముంచు అమాయక
ప్రాణులు; ఓటేసినను ఓటుగ నడుచు తమ బ్రతుకులు ఎటుల బాగుపడునో తెలియని కింకర్తవ్యతా విమూఢులు; రాళ్ళను రత్నములను
కొని నమ్మి మోసపోవుచున్న నిరాశ నిండిన పౌరులు
5-5-2018
మన మూర్ఖత్వమే కారణం!
మతమేనా మన కష్టాలకు కారణం?
మన మూర్ఖత్వం కూడా కాదా?
కులమేనా మన సంఘర్షణలకు, సామరస్యం లేక పోవడానికి కారణం? మన గజ్జిలు కూడా కాదా?
ప్రాంతమేనా మనలను విడదీసేది?
మన దురభిమానాలు, అవివేకాలు కాదా?
ఉపజాతీయతలేనా కారణం మన వైషమ్యాలకు?మన మన మూఢత్వాలు, సంకుచితతలు కాదా?
మనం సహకరించక ఏ విభజనలు
మనలను ఏమీ చేయలేవు; మన
చేయి కూడా పడడం వల్లే రాజకీయ
నాయకులు మనల వెఱ్ఱాల్లను చేసి
ఆడుకుంటున్నారు? మళ్ళీ మనందరం
ఒకటేననుకొని దగ్గరవకుండా జాగ్రత్తపడుతున్నారు
****
ఆరోగ్యం
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని మనకి చిన్నప్పటి నుంచి చెబుతారు.
ఆరోగ్యమే మహాభాగ్యము అనే సూక్తి మనకు పరిచయమైనదే. దురదృష్టవశాత్తు మనం ఎవరం ఈ సూక్తిని పట్టించుకోవటం లేదు. మనం తినే తిళ్ళు, వినే ధ్వనులు, చూశే దృశ్యాలు, పీల్చే వాసనలు, అనుభవించే స్పర్శలు, మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి.
తద్వారా మనసు మీద ప్రభావం చూపుతాయి.
మనసు శరీరంలో భాగం. శక్తి స్వరూపిణి. విద్యుత్ రసాయన శక్తి స్వరూపిణి.
అందువల్ల మనసులో మార్పులు మరల తాము శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
మనసు భౌతికమైనది. మానసిక, శరీర ఆరోగ్యాలు పరస్పరం ఒకదానినొకటి మారుస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది.
మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
మనసు ఆరోగ్యంగా ఉండాలంటే తలపులు ఆరోగ్యంగా ఉండాలి. మనసు అరిషడ్వర్గాలచే బాధింప బడుతుంది. తన నైర్మల్యాన్ని, సమ తౌల్యాన్ని కోల్పోతుంది.
అందువల్ల మనసును నియమించుకోవడం నేర్చుకోవడం అవసరం. ఇది బాల్యం నుంచి హడావిడిగా నేర్పవలసింది కాదు. బాల్యంలో భగవన్నామస్మరణ, అవీ చిన్నగా అంచెలంచెలుగా
నేర్పాలి.
అన్నప్రాశన నాడే ఆవకాయ ముద్ద లాగ భగవద్గీత, ఉపనిషత్తులు అంటూ అతి పనికిరాదు. జీవితం కొంత అనుభవించిన తరువాతే తత్త్వాన్ని నెమ్మదిగా చెప్పాలి. వారికి సుఖదుఃఖానుభవాలు, లాభనష్టాలు, కష్టనష్టాలు అనుభవానికి రాకుండా తత్త్వాన్ని చెప్పడం బాలునికి, బాలికకు కామ సూత్రాలు చెప్పడం వంటిది. మానసిక పరిపక్వత, పరిణితి రాక, లేక తత్త్వం, కామం బుర్రకెక్కవు.
తల్లిదండ్రులు, గురువులు ఈ బాధ్యతలు తీసికోవాలి. కాని ఎవరూ పట్టించుకోవటం లేదు. తీరికలూ ఉండటం లేదు. విద్యావిధానమూ అలాగే తప్పుత్రోవ పట్టింది.
ఎందుకనో మనందరం ఆరోగ్యంపై చూపవలసిన శ్రద్ధ చూపటం లేదు, రాజకీయ నాయకులు మన వృద్ధి, సుఖశాంతులు, క్షేమం పట్టించుకోనట్టు.
మనమే మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. అలవాట్లను ఆ దిశలో మార్చుకోవాలి. లేకపోతే ప్రకృతి వైద్యం, హొమియోపతీ, ఆయుర్వేదం, ఇంకా కొత్త కొత్త ఆరోగ్య పరిరక్షక ప్రక్రియలను అనుసరించాల్సి వస్తుంది.
మనశ్శాంతి కోసం వివిధ సన్యాసులను, బాబాలను, అమ్మలను, బాపూలను నమ్ముకుంటూ బతుకులు ఈడ్వాల్సి వస్తుంది.
A stitch in time saves many.
4-5-2018
Imaginig gender bias is equally prevelant now as it was (in which women were/are also equally criminally involved) when it is disappearing, is only inviting unnecessary conflicts.
Asking everyone to be a saint or seer or gentle man is easy but thousands of years of imparting value systems in India or on globe have not proven successful.
Let the men not be blamed for all evils on earth. Because it is not true; so our problems cannot be solved by accusing and finding fault with men alone.
Let a overhaul of social thinking on social living be attempted objectively. Then some solutions can be found for our evils. Evil mind can be had by both men and women. Compassion may be equally missing in the hearts of men and women.
Let evil be tackled. Not just men assuming all men are evil-minded and giving full concession to women assuming they are above committing evil actions.
Let us be fair; and not necessarily unfair to men and fair to fair sex.
3-5-2018
అస్మదీయం
రిటైర్ అయ్యాక కడుపులో చల్ల కదలకుండా కాళ్ళు తన్నిపెట్టుకు పడకకుర్చీలో కూర్చుని జీవితాన్ని
నిరాకులంగా గడపనేర్వని కొందరిని;
భర్త ఉద్యోగానికి, పిల్లలు స్కూళ్లకు వెళ్ళాక టి.వి.
చూసి గడిపే వనితామణులు రూటు మార్చి అంతర్జాలంలో అత్యధిక సమయము గడుపుచు
అన్ని విషయాలు పంచుకొని చర్చించుకొని బి.పి.లు
పెంచుకొనుచు, సాహితీ సృష్టియు చేయుచు నిరంతరం నిర్మాణాత్మక వ్యాసంగముల కుర్చీలో
కూర్చునియే పాల్గొనుచు సంఘసేవ చేయువారిని;
తమ గృహవిశేషములను పంచు, రచించువారిని;
తనలో ఇముడ్చుకుని
"ప్రచురించుటకు", అభిప్రాయ స్వీకరణకు వేగవంతముగ పనిచేయుచు సాహితీ స్రష్టల
పిపాస తీర్చు సారస్వత రంగం;
స్వీయ అభిమాన నాయకుల గొప్పలు, వైరి వారి తిప్పలు, లోట్లు, లోపములు; దండిగ పంచుకొను రణరంగం;
అటులనే "మనువాదులు", వారి ద్వేషులు, ద్వేషాలు
సిద్ధాంతాల రాద్ధాంతాలు, కొట్లాటలు,
విచ్చలవిడిగా పంచు సామాజిక రంగం లుగా
వెలుగుచు జీవితాలకు వెలుగునిచ్చుచున్న
అంతర్జాలం రమణీయం కమనీయం అస్మదీయం
****
క్రూర స్వభావం కలిగి నియంత్రిణులై, దుష్టంగా, దుర్మార్గురాళ్ళ వలె స్త్రీ ప్రతినాయకురాళ్ళ పాత్రలు
ఎవరు సృష్టించడం మొదలుపెట్టారో గాని, అన్ని
టీ.వి. సీరియల్స్ లోనూ వారి హల్ చల్ యే;
ఇటువంటి జుగుప్సాకరమైన పాత్రలు ఏమి సాధిస్తున్నాయి? వినోదమంటే దుర్మార్గమా?
స్త్రీ వాదులు, మేధావులు, సెన్సార్ వారు
ఇటువంటి పాత్రల చిత్రణపై ఏమీ మాటాడరేమి?
****
కఠోర పాకం
విషయాన్ని అస్పష్టంగా చెప్పడం కొందరు కవులకు రచయితలకు ఇష్టం. అది వారి రచనా శిల్పం.
అస్పష్టత వల్ల పాఠకులు రచనలో ఉన్న విషయం గ్రహించలేరు. చాలా శ్రమ పడాల్సి వస్తుంది. పాఠకులను శ్రామికులుగా చేసే ఈ రచనా ప్రక్రియ అందె వేసిన చేతుల్లో పడి (స్రష్టలు, విమర్శకులు) ఒక వాదముగా తెలుగు సాహితీ లోకంలో వెలుగుతోంది.
రచయితకు, కవికీ కూడా విషయంపై స్పష్టత లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందా అని కొందరు కళవళ పడుతూంటారు.
నిజానికి తమ అంతరంగం తెలిసీ తెలియనట్లు ఇతరులకు తెలవాలని ఈ రచనా ప్రక్రియను ఉపయోగించే వారి ఉద్దేశ్యం ఏమో. చదవడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అర్థం చేసుకోవడం
గగనమే అవుతుంది. ఇలా అస్పష్టంగా రాసి తాము ఘనులము అనుకునే సాహితీ కారులూ ఉన్నారు.
ద్రాక్ష, కదళీ, నారికేళ పాకాల్ని మించిన కఠోర పాకం ఇది. పాఠకుల స్థాయిని బట్టి అవగాహన చేసి కోవడం ఉంటుంది. ఏ స్థాయి వారికి శ్రమ పడక పోతే, శ్రమ పడినా అర్థం కాని రచనా ప్రక్రియ విమర్శకుల ఆమోదం, అభిమానం పొందడం తెలుగు సాహితీ లోకం ప్రత్యేకత.
***
Corruption is a non-issue in Karnataka elections.
Santosh Hegde
Not only in Karnataka in every election in India corruption is and will be a non-issue.
****
యథా ప్రజా తథా రాజా!
భారతదేశపు ప్రజాస్వామ్యం చాలా కుటుబాలకిచ్చిన వరం, కుటుంబ రాజకీయ వారసత్వం. పూర్వపు చక్రవర్తులు, రాజులు, సామంతులు, దండనాథులు, జమీందారులు వారి కుటుంబాలు వారసత్వంగా పరిపాలన లోకి వచ్చినట్లు, భారతదేశమంతటా కొన్ని కుటుంబాలు పార్టీ పరంగా, ప్రజా ప్రతినిధుల పరంగా పాలనా పరంగా, పార్టీ అధినాయకత్వాన్ని, ప్రజా ప్రాతినిధ్యాన్ని, తద్వారా ప్రభుత్వ నిర్వహణను సొంతం చేసుకోవడానికి ఓటర్లైన పౌరులు ఎంతో సహకరించారు.
భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదుగానీ, ప్రజలచే ఎన్నుకోబడిన కొన్ని కుటుంబాల వంశ పారంపర్య
పాలన జరుగుతోంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం విలసిల్లుతోంది
అనడం మము బోంట్లకు హాస్యాస్పదంగా అనిపిస్తుంది, కనిపిస్తుంది. పార్టీలు, సిద్ధాంతాలు, సిద్ధాంత అనుసరణ, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత కల నాయకులు, బాధ్యత ఎఱిగి ఓట్లేసే పౌరులు లేని దేశంలో ఇలా ముఠా నాయకత్వాలే (oligarchy) ప్రభుత్వాలను
నడుపుతాయి.
ప్రజలు అమాయకులో, స్వార్థపరులో అయ్యి, కుల, ప్రాంత, మత, ఉపజాతీయతా గజ్జి లతో బాధపడుతూ, స్వార్థ రాజకీయ నాయకులు కులాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా, ఉప జాతీయతలు వారీగా, ఉచితంగా ఇస్తామన్న దానికి, కల్పిస్తామన్నారు దానికి ఆశపడి ఓట్లు వేస్తూ, అందరి పౌరుల అభివృద్ధికి, సుఖశాంతులకి అడ్డుపడుతున్నారు.
యథా ప్రజా తథా రాజా!
******
******
27-4-2018
Biased reporting has become the norm of the day. Reporters reporting objectively have become almost extinct. Journalist and journalism ceased to be interested in the upkeep of their profession.
Just as corporate owners became dictators of education and healthcare systems, so also owners of the media have become dictators of news dissemination.
None is either ashamed or guilty of biased reporting. The readers, viewers and followers of news media are tired and are impatient with the biased reporting of the "renowned" journalists and media houses.
But none of these are caring for views and negative reactions of the public. They instead are hoping to hypnotize citizens about the events, situations and leaders.
Like any other field reporting also lost its charm and responsible behaviour.
****
భాషలెన్నో? భావాలెన్నో?
భామినుల పోకడలెన్నో?
యువకుల యాతనలెన్నో?
జగత్తంతా రసజన హృదయాలు!
26-4-2018
స్వయం ప్రకటిత భగవత్ స్వరూపులెందరో!
వారికి భక్తులును కోకొల్లలు; భక్తుల-భగవంతుని
అనుబంధమును ఇచ్చుట-పుచ్చుకొనుట గా
మార్చిన విధం ఎక్కువ ప్రమాదకరముగా మారింది
అందరూ అర్ధార్థులై ఆర్తిని ప్రకటింపుచు
జ్ఞానము శూన్యమై ముముక్షత్వము
కనుమరుగై, అందరు బాబాలను, అమ్మలను
భగవంతుల చేయుచున్న విధము సనాతనధర్మ
విరుద్ధము.
25-4-2018
భారతదేశంలో హేతువాది అంటే హిందూ మతాన్ని, సంస్కృతిని తిట్టేవాడు అని అర్థం. ఆ హేతువాది ఏ ఇతర మతములను, సంస్కృతులను తిట్టడు. ఎందుకో వీరికి హిందూ మతం పైననే అంత ద్వేషం; ఇతర మతాలను, సంస్కృతులను తిట్టడానికి ఎందుకు అంత భయం? ఇటువంటి వాళ్ళు హేతువాదులు ఎలా అవుతారు? "లోటు, చెడు" ఎక్కడ ఉన్నా ఖండించాలి కదా?
ఇంక ఏ ఇతర మతాలలోను, సంస్కృతులలోను లోటు, చెడులే లేవా? లేక ఇటువంటి హేతువాదులు గ్రుడ్డివారా? ఆయా దేశాల్లో హేతువాదులు ఆయా మతాలను, సంస్కృతులను తిడతారు కదా? భారతదేశపు హేతువాదులు అలా ఎందుకు చెయ్యరు?
అంతర్జాలం లో అన్ని విషయాల గురించి సమాచారం ఉంటుంది. భారతదేశపు హేతువాదులు అవేవీ చదవని, తెలియని కూపస్థ మండూకాలా?
****
దృక్ - దృశ్య వివేకము
దృక్-దృశ్య వివేకము గురించి భారతీయ తత్త్వశాస్త్ర గ్రంథములలో విరివిగా, విశదంగా చర్చించారు. వాటిలో శంకరుల వివేక చూడామణి ఒకటి.
దృక్-దృశ్య వివేకము బ్రహ్మ/ఆత్మ జ్ఞాన సారాంశం.
దృక్ అంటే చూపు. దృశ్యము అంటే కనపడేది. గ్రహింపబడేది. జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహించబడే అన్ని విషయములను దృశ్యములు అంటారు.
కన్ను - దృశ్యము; చెవి-శబ్దము, ధ్వని; నాలుక-రుచి;
ముక్కు-వాసనలు; చర్మము-స్పర్శలు.
వేదాంత పరంగా ఈ విషయములన్నీ దృశ్యములే.
బయటి భౌతిక ప్రపంచం లోని ఈ విషయములు విషయ శక్తులు. కన్ను-కాంతి; చెవి-ధ్వని, యాంత్రిక శక్తి; నాలుక, ముక్కు- రసాయన శక్తి; చర్మము-యాంత్రిక, ఉష్ణ శక్తులు. వీటిని తన్మాత్రలు అంటారు.
ఆత్మశక్తి చిద్రూపంగా వెడలి, మేధలో మాయగా మారుతుంది.
ఈ మాయా - చిదాభాసా పరిణామములే మానసిక కార్యకలాపములు. ఈ మానసిక కార్యకలాపాలు
వక్తలో ఒక దిశలో, శ్రోతలో వ్యతిరేక దిశలో జరుగుతాయి. ఈ విధమైన పరిణామాన్ని వివర్తనం
అంటారు.
వివర్తనమైన ఈ మాయా పరిణామములు మన మెళకువ, కల మానసిక దశలలో జరుగుతాయి. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము రూపములలో ఈ మాయా పరిణామములు జరుగుతాయి.
ఇవన్నీ కూడా దృక్ కి దృశ్యములే. దృక్, దృశ్యము ఒకటే అవడం అద్వైతము. విడిగా తెలుస్తూ మానసిక కార్యకలాపాలు జరుగుతూండడం ద్వైతం.
అద్వైత స్థితి రెండు రకాలు. మెళకువతో కూడిన
నిద్ర (జాగ్రత్ సుషుప్తి), గాఢనిద్ర (సుషుప్తి).
నిద్ర అంటే మానసిక కార్యకలాపాల విరామ సమయం. మనకి పరిసరాలు తెలుస్తూ మానసిక కార్యకలాపాలు విరమింపబడిన స్థితి జాగ్రత్ సుషుప్తి. మనకి ఏమీ తెలియకుండా, మానసిక కార్యకలాపాలు విరమింపబడిన స్థితి గాఢనిద్ర-సుషుప్తి.
దృక్, దృశ్యములు ఒకటే అయిన స్థితే శాంతము. మౌనము. ఆనందము. మోక్షం. ముక్తి.
24-4-2018
మనసు యొక్క స్థితి
unchanging awareness.
అనుభవము.
మనసు యొక్క గతి
Changing awareness.
తలుపు/భావము/ఆలోచన
****
మనస్సు సరిపెట్టుకుంటే తీరని లోపం ఏదీ ఉండదు.
- శ్రీ దువ్వూరి వెంకట రమణశాస్త్రి
****
బ్రహ్మజ్ఞానము -వేదాంతము - భాషాశాస్త్రము
ఉపనిషత్తులు మానవాళికి ఇచ్చిన మనస్తత్వ శాస్త్ర, భాషాశాస్త్ర, తత్త్వ శాస్తరముల మేలు కలయిక బ్రహ్మ జ్ఞానము.
బ్రహ్మజ్ఞానం వేదాంతానికి మూలము అని మనకు తెలుసు. కాని అదే బ్రహ్మజ్ఞానము భాషాశాస్త్రానికి
కూడా మూలము అని చాలామందికి తెలియదు. బ్రహ్మ జ్ఞానము అద్వైతము, విశిష్టాద్వైతం, ద్వైతం,, శాక్తాద్వైతములుగా వ్యాఖ్యానింపబడడం మనకు
ఎఱుకయే.
ఈ బ్రహ్మజ్ఞానము నుంచే పతంజలి ప్రభృతులు శబ్ద బ్రహ్మ సిద్ధాంతాన్ని రూపొందించారు. శబ్ద బ్రహ్మ సిద్ధాంతము భాషా శాస్త్రము. వివర్తనము అనే మార్పు తో మానసిక శక్తి భాష యొక్క వివిధ అవస్థలను మనలో ఎలా కలుగజేస్తుందో ఈ సిద్ధాంతం చెబుతుంది. వాక్యపదీయము అనే పుస్తకంలో భర్తృహరి ఈ సిద్ధాంతాన్ని పెంచి విశదీకరించాడు.
అద్వైతము మానసిక శక్తిని మాయ అంటుంది; ఉపనిషత్తులు చిదాభాసా అంటాయి. శబ్ద బ్రహ్మ సిద్ధాంతము దీనినే స్ఫోట అంటుంది. ఈ మానసిక శక్తినే యోగ సాంఖ్యములు ప్రకృతి అంటాయి. న్యాయ వైశేషికములు అణువులు అంటాయి. పేర్లు మాత్రమే వేరు. అన్నీ ఒకటే శక్తి.
మంత్రపుష్పం, లలితా సహస్రనామ స్తోత్రము పఠించే
వారికి బ్రహ్మజ్ఞానము, భాషాశాస్త్రము ఎలా వీటిలో
పొందుపరుప బడ్డాయో తెలుసు.
పరా,. పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అవస్థల్లో వక్త, శ్రోతల్లో భాష ఎలా పరిణమిస్తుందో వాక్యపదీయము తెలుపుతుంది. భారతీయ తత్త్వశాస్త్రానికి వేదాంతం గానే ప్రాచుర్యం ఎక్కువ. భాషా సిద్ధాంతంగా, భాషాశాస్త్రంగా ఇప్పటి తరానికి ఎంతో మందికి తెలియదు అని నిరాఘాటంగా చెప్పవచ్చు. జ్ఞాన సిరి సంపదల మయమైన ఉపనిషత్తులను, ఆత్మ, బ్రహ్మ జ్ఞానము లను, బౌద్ధ, జైన, షడ్దర్శనములను మతగ్రంథాలుగా మాత్రమే చూడడం అజ్ఞానం.
బ్రహ్మ జ్ఞాన, భాషాశాస్త్ర-సిద్ధాంతాల సంబంధాన్ని శబ్ద బోధ మీమాంస రూపంలో పాండిచ్చేరిలో ఉన్న ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ వారు 5 భాగములుగా తెచ్చారు. ఇన్స్టిట్యూట్ లో ఉన్న భారతదేశ సాంప్రదాయ విద్వాంసులు ఈ పుస్తకాలను ఈ మధ్య రచించారు.
వేదాంతము-వ్యాకరణము
సంస్కృత భాషలో మరొక సరదా ఉంది. సంస్కృత భాషలో ప్రతిపదము పుంలింగ లేదా స్త్రీ లింగ లేదా నపుంసక లింగ శబ్దం అవుతుంది. దాన్ని బట్టి లింగ, వచన, విభక్తులలో పదం రూపు మారుతుంది. అలాగే విశేషణం ఎప్పుడూ కూడా, నామవాచకము ఏ లింగ, వచన, విభక్తులలో ఉంటుందో అవే లింగ, వచన, విభక్తులలో ఉంటుంది. ఇది must.
ఇక్కడ సరదా ఏమిటంటే విశిష్టాద్వైత సిద్ధాంతంలో విశేషణ-విశేష్య భావము ఉంది. అంటే జీవాత్మ-పరమాత్మల సంబంధాన్ని, అనుబంధాన్ని ఈ భావము వివరిస్తుంది.
ఎలా అయితే సంస్కృత భాషలో విశేషణము, విశేష్యము ఉన్న లింగ, వచన, విభక్తులలో ఉంటుందో, అలాగే జీవాత్మ కూడా పరమాత్మ స్థితియే, కాని జీవాత్మ విశేషణము, పరమాత్మ విశేష్యము. ఈ తేడా ఉంటూనే ఉంటుంది, పోదు అంటుంది. ఇలా విశిష్టాద్వైత వేదాంతము భాషా వ్యాకరణం నుంచి సారూప్యత తెచ్చుకొని తమ తత్త్వాన్ని వెలయించారు.
భాష, సంస్కృతి, వ్యాకరణము, వేదాంత ప్రతిపాదనము పడుగూ, పేకల్లా కలిసిపోయాయి.
విద్వత్తు, అవగాహన ఉంటే ఇలాంటి సరదాలు ఆచరించవచ్చు. ప్రతిపాదనలు చేయవచ్చు. ఇది
జ్ఞానుల, పండితుల ఖేల.
No comments:
Post a Comment