Thursday, May 31, 2018

పూర్ణశాంతి; రెండవ గృహిణి; కైజోతలు; సినిమా- మన తరం

పూర్ణశాంతి

దేవుడు లేడని ఇంక పూజలు పునస్కారములు దేవాలయ 
సందర్శనలు దేనికని భారతీయ నాస్తికులు చెవిని ఇల్లు కట్టుకుని పోరెదరు;

వారి దృష్టిలో హిందూ దేవుళ్ళే లేరు; మిగతా మతాల దేవుళ్ళున్నారో లేరో 
వీరు నిశ్చయింపరు; నోరు విప్పరు; వారి గోలంతా హిందూ దేవుళ్ళ గురించే

భగవంతుని మనిషే సృష్టించాడు, కనుక దేవుడు లేడు అని వీరి వాదన 
తర్కం; మనం భక్తి ప్రపత్తులు చూపించనవసరం లేదని తీర్మానం;

మరి మన అన్ని సౌకర్యాలు, సిద్ధాంతాలూ కూడా
మనిషి సృష్టించినవే; ఎందుకని మనం వాటిని
గౌరవిస్తాం? దీనికి సమాధానం ఏమిటి? ఏమో?

ఆస్తికత్వము, నాస్తికత్వము రెండూ నమ్మకములే!
మన నమ్మకమే సరియైనది అనుకునే పసితనం పోవాలి! 
అన్ని తర్కములు, మీమాంసలు ఆగినదే
దివ్యస్థితి; దానికి ఎన్నో పేర్లు! అది తెలిస్తే పూర్ణశాంతి
*********
రెండవ గృహిణి
నా చిన్నప్పుడు వార పత్రికలో ఒక హాస్యపు సంభాషణ అచ్చయింది.
ఇద్దరు గృహిణులు మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటి మహిళ ఎంతో గొప్పగా అంటారు:
"మా ఆయన రామాయణం రాస్తున్నారు, తెలుసా" అని.
అది విన్న రెండవ ఆవిడ:
"మళ్ళీ రాయడం ఎందుకొచ్చిన శ్రమ? బజార్లో దొరికే ఏదో రామాయణం కొనుక్కోవచ్చు కదా" అంటారు.
మొదటావిడకి ఒళ్ళంతా నీరసం ఆవహించి, ఏం మాట్లాడాలో పాలుపోక, అక్కడ నుంచి నిష్క్రమిస్తారు.
సాహిత్యం గురించి ఏమీ తెలియని వాళ్ళు రెండవ గృహిణిలా మాట్లాడతారు.
సారస్వత సృష్టి, లలితకళాభినివేశము అందరి హృదయాలను తాకవు. వారు వారి సంకుచిత, పరిమిత జ్ఞానంతో ఏదో మాట్లాడతారు.
సంస్కృతి, సంస్కారం, అభిరుచి, ఆస్వాదనా సామర్థ్యం లేని సామాన్యులు తమ దృక్పథానికి లోబడి మాట్లాడతారు, ప్రవర్తిస్తారు.
సంఘంలో రసికులు తక్కువ. ఎక్కువ మందికి జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను తృప్తి పరిచే
వినోదం చాలు. అటువంటి వారు సాహితీ, లలిత కళా విమర్శకులు అయితే చెప్పేదేముంది!
రసికులు అంటే శృంగార పురుషులు అనే తప్పుడు అభిప్రాయం లోకంలో ఉంది. రసికులంటే సాహిత్యంలో, లలిత కళల్లో ప్రతిబింబించే ఆహ్లాదాన్ని ఆనందించగల రసాస్వాదనా చతురులు.
అటువంటి వారి ఆనందంతోనే, వారి హృదయ ఆహ్లాదనా ప్రకటనలు వల్ల కళాకారులు ఉత్సాహం పొంది మరింతగా అలరింపజేస్తారు.
ఏ సమాజంలో నైనా సామాన్యులు వేరు, రసికులు వేరు. రసికులు లేక సారస్వతం, లలిత కళలు, సంస్కృతి, నాగరికతా పరిఢవిల్లవు. ప్రస్తుతం తెలుగు సాహితీ రంగంలో అటువంటి రసికులు లేరు. అందుకే ఒక్క, వాద, వివాద ప్రోత్థితమైన సంకుచిత సారస్వతం సాహిత్యంగా చెలామణి అవుతోంది.
రాసిక్యాన్ని, వాద వివాద సిద్ధాంత రహిత సాహితీ సృష్టిని తెలుగు సాహితీ రంగం సృష్టించలేకపోతోంది.
కొండ వాగులా నిర్మలోదకం కలిగి చెంచీతలా
స్వాతంత్ర్యం అనుభవిస్తూ స్వేచ్ఛగా సంచరించే సాహిత్యం రావటంలేదు.
రెండవ గృహిణులు తెలుగు సాహితీ రంగంలో ఎక్కువగా ఉన్నారు. అందుకే సాహితీ, లలిత కళా రంగాల్లో తెలుగు వారు పుర్ర చేతి భావములను మించి, వాద ప్రసక్తి మరచి సాహితీ సృష్టి, లలిత కళా రామణీయకతా సృజించలేక పోతున్నారు.
*******
BJP not able to win in by-elections across India,  is not necessarily alarming. After not winning parliament seats in UP, BJP has swept northeast and emerged as largest party in Karnataka.
*******
కైజోతలు
ఎవరి కులానికి చెందిన వారిని వారు
ఎవరి ప్రాంతానికి చెందిన వారిని వారు
ఎవరి మతానికి చెందిన వారిని వారు
ఎవరి సిద్ధాంతానికి చెందిన వారిని వారు
ఆకాశానికి ఎత్తేస్తున్న ఈ రోజుల్లో ఫేస్బుక్
అందరికీ సర్వ మానసిక రోగ ప్రదర్శనా వాటిక
ప్రజాస్వామ్యమున తమ పాత్రను యథేచ్ఛగా
తప్పుగా నిర్వహిస్తున్న పత్రికా యాజమాన్యములకు
పత్రికా రచయితలకు లెంప దెబ్బ కొట్టే సావకాశం
కల్పిస్తున్న ఫేస్బుక్ కు సామాన్య పౌరుల నీరాజనం
పౌరులు నిర్భయంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా
వార్తా నాయక రాజకీయ సామాజిక కథనాలను
తమ తమ దృక్పథాలతో పంచుకునే వీలు కల్పిస్తున్న
సామాజిక సాలెగూడు మాధ్యమములకు కైజోతలు
******
Always contemporary colleagues tend to undermine new talent with their limited knowledge and closed minds. They hide behind their seniority. This has been happening in all societies and fields in all places. Many times the genius is not recognized when the individual is alive. And later colleagues who are not biased will recognize the talent and popularize.
********
సినిమా- మన తరం
మనందరిదీ సినిమాల తరం. సినిమాలు ఆకర్షించినట్టుగా మనల్ని ఏ మీడియమ్ ఆకర్షించలేదు. అందుకనే ఇప్పుడు కూడా ఆ సినిమా వాళ్ళని గురించి కొట్టుకుంటున్నాము. మన తరంతో
ఈ కొట్టుకోవడాలు ఆగిపోతాయి.
మన తరం మీద సినిమా మీడియమ్ ప్రభావం లెక్క కట్టలేనిది. మన ఊపిరి, మంచినీళ్లు, ఆహారము సినిమాలుగానే బ్రతికాము. తరువాతి తరాల వారికి సినిమాల మీద ఇంత మోహం లేదు.
సాహిత్యం, ఇతర లలిత కళలు మన దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఇప్పటి తరాలకి ఇంటర్నెట్ లా మనకు సినిమా. మనందరమూ ఆ సినిమాల విషయంలో పండితులమే. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది, ఏ ప్రొడక్షన్స్ ది, నాయికా నాయకులు ఎవరు, సంగీతం ఎవరు, కెమెరా మెన్ ఎవరు, కళా దర్శకుడు ఎవరు, ఏ రిలీజ్, ఏ నాయకునిది ఏ ప్రొడక్షన్స్, ఏ నాయకునిది ఏ రిలీజ్, ఎన్ని చోట్ల శతదినోత్సవాలు జరుపుకొంది, ఎన్ని రజతోత్సవాలు, ఇలా సినిమా గురించి అనంతమైన విషయాల్లో మనకు పరిజ్ఞానం ఉండేది. ఉంది.
ఈ పిచ్చి వల్లే సినిమా వాళ్ళని ఎన్నుకొని, ఏదో పాలన అనుభవించి, వారి చుట్టాలచే పాలింపబడుతూ, ఏ విధమైన గుర్తింపు లేక వాళ్శిచ్చే వేయి రూపాయల నిరుద్యోగ భృతికై భిక్షుకుల వలె ఎదురు చూస్తున్నాం.
మన మనసుల మీద ఇంత పట్టున్న మీడియమ్ ఇంకోటి లేదు. అందుకే ఈ వయస్సులో కూడా అభిమాన తారల గురించి ఇంత సమయం వృథా చేసికుంటున్నాము. ఈ విషయమై అమ్మలక్కల కబుర్ల వంటి కబుర్లు ఎక్కువై పోయాయి. ఆడ, మగ భేదం లేకుండా ఈ చర్చల్లో, వాద, ప్రతి వాదాల్లో విసుగు లేకుండా పాల్గొంటున్నాము.
మనందరి వినోదం సినిమాతో మొదలై సినిమాతో
ఆగిపోయింది. సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రకళ, శిల్పకళ, మొదలైనవి ఉన్నట్లు కూడా మనలో చాలా మందికి తెలియదు. సాహిత్యం పుర్రచేతి భావాలలో ఇరుక్కుపోయింది, సంగీతం, నాట్యం, ఇటువంటి విషయాలలో తెలుగు వారికి ఇష్టము, శ్రద్ధ, ప్రీతి, గౌరవం చాలా తక్కువ.
మన సంస్కృతి అంతా సినిమా, కుల రాజకీయాలు మాత్రమే. మరే విధమైన దృష్టి మనకు లేదు. సినిమా, రాజకీయం, డాక్టర్ దగ్గరకు వెళ్ళడం, స్కూల్లో చేర్పించడం అంతా మనోళ్లు, మనోళ్లు అనుకుంటూ అభిమానించడమే, చెయ్యడమే;
ఈ కులగజ్జి తప్ప మరో సాంప్రదాయమే మనకు లేకుండా పోయింది. సినిమాతో సమానంగా మనకు అంటుకుంది

Wednesday, May 30, 2018

కవులు - ఊహాధురీణులు ; అదృష్టవంతులు; Brazen Disrespect; Arrogance;

కవులు - ఊహాధురీణులు 

మనం రాసేది కొందరే చదువుతారు
మనం పోయాక అందరూ మనలను మరుస్తారు
అందరికీ తెలియరు వ్యాస వాల్మీకులైనా
భాస కాళిదాసులైనా నన్నయ్య పోతనలైనా
రామాయణ మహాభారతాలే చదవడం లేదు
ఇప్పుడెవరూ; మన రచనలెంత? కాని ఎంత
చెట్టుకు అంత గాలి; రాయడము ఒక ప్రవృత్తి
కాదది ఒక వృత్తి; ధన సంపాదన లేని వ్యాసంగం
జన్యువులో పూర్వ జన్మ సుకృతం తపః ఫలములో
కారణం కవితల ఉదయానికి; నేర్చుకొని రాయలేని
కళ; సహజ సిద్ధమైన పాండితీ భావనా ప్రకర్షల వరం
ఏ దేశమేగినా ఎందు కాలిడినా వెలుగుచూ ఉందురు
కవులు; రవి కాంచనిచో కూడా కాంచగల సిద్ధులు
ఊహాధురీణులు, రసికులు, సారస్వత స్రష్టలు వారు
********
అదృష్టవంతులు

ఎవరు ఎంత గొప్ప వారైనా మరణించక తప్పదు.
సామాన్యుడైనా, అసామాన్యుడైనా కాల వశమున శరీరం వీడక తప్పదు.
చిన్న వింతైన విషయం‌.
ఎవరు చనిపోయినా మనకి ఎంతో నష్టం జరిగింది అంటారు. నిజానికి చనిపోయే సమయానికి ఎంతటి అసామాన్యులైనా శరీర దార్ఢ్యం కోల్పోయి ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు. మానసికంగా, శారీరకంగా జీర్ణ స్థితిలో ఉండి ఏ పనీ చేయలేని నిస్సహాయతలో ఉంటారు. ఆ స్థితిలో వారికి తమ అసామాన్యత గురించి స్పృహలో ఉండదు.
ఆ స్థితిలో వారు ఇదివరకిటిలా సృష్టులు, కార్యకలాపాలలో దక్షత చూపించలేరు. మర్యాదకి, గౌరవానికి మనం సంతాప సందేశాలలో, తీర్మానాలలో వారి మరణం లోటు అంటాము.
మరణించేటప్పటికి కొద్ది సంవత్సరాల ముందు నుంచే ఏమీ చేయలేక ముసలితనాన్ని ఈడుస్తూ
ఉంటారు. ఆ స్థితిలో వారు ఉన్నా, మరణించినా తేడా ఉండదు.
అదో మర్యాద కింద యాంత్రికంగా మాట్లాడేస్తాము.
వినా దైన్యేన జీవితమ్
అనాయాసేన మరణమ్
జరిగిన వారు అదృష్టవంతులు.
********
Brazen Disrespect and wayward behavior
No media says anything about the ridiculous impasse in Karnataka where the coalition partners are unable to finalize cabinet composition. Why they couldn't finalize? What is the reason?
The press reports say there is no understanding on the distribution of portfolios. Is it not brazenly exhibiting the selfishness and ridiculing citizens about their fate?
Some years back in Maharashtra the same impasse continued for two months. These attidudes show the least regard the politicians have for propriety of conduct of representatives - the would be ministers and rulers and citizens.
Once they are elected, they say by their actions that they are not answerable to anyone, even to citizens and that the citizens must bear their selfish and corrupt ways of implementation of democracy and democratic rule.
This brazen behavior of politicians is bane of Indian democracy and its rulers.
********
సంఘంలో బాధ్యత గల మేధావులు, సినిమా, ఇతర లలితకళలలో ప్రావీణ్యులు తక్కువ. ప్రజలకు ఉపయోగపడే దానికన్నా ప్రజల జంతు తత్త్వాన్ని ఉపయోగించుకొని నాలుగు రాళ్లు సంపాదించుకోవాలి అనుకునేవారే కోకొల్లలు. ఈ విపరీతాల నుంచి తల్లిదండ్రులే తమ సంతానాన్ని రక్షించుకోవాలి. ఇతరులకు వదిలిపెట్టడం తెలివితక్కువ తనం.
*******
Arrogance
A chief minister of a regional party said Governor system is unnecessary and should be dumped with.
Now another chief minister says why to pay central taxes when central government is not releasing funds to states.
How many chief ministers have given funds to zilla parishats, mandal parishats and panchayats?
What is the reply from the chief minister if a Panchayat president or sarpanch says why should the village pay taxes to state when state is not releasing any funds to it?
Similarly presidents of mandal and zilla parishats can give statements.
In India getting elected to be a chief minister is amounting to the chief minister owning the state. Such arrogance is exhibited in the name of democracy and federal structure.
It is high time Indian politicians are given lessons on Indian Constitution and democratic principles and unless one is successful in the examination conducted on the lessons must be barred from contesting any election.
Executive is not all powerful. Judiciary, legislature/parliament and citizens are checks and balances in the democracy.
Every one must behave accordingly. Being a chief minister or any representative does not give absolute license to loot the nation at the respective levels of the politicians.
Because all these realities are unknown to leaders and citizens, a peculiar and ridiculous functioning of democracy is taking place in India.
Manipulating voters is considered as the intelligence of the politicians. But the citizens are deprived of quality representatives and rulers.
Innocence and arrogance are intoxicating Indian politicians and leaders to the extent of questioning everything which is not to their advantage and embracing everything that benefits them in all illegal and corrupt ways.
*******

Tuesday, May 29, 2018

గుణము; Indian religions; సత్య దర్శనంలో తేడాలు , భేదాలు; ఫేస్బుక్ వాడు;RESONATING HEARTS

గుణము
గుణం అంటే ఏమిటో మనందరికీ తెలుసు. గుణం పదం మనిషి స్వభావాన్ని, ప్రవర్తన గురించి మాట్లాడే సందర్భంలో ఉపయోగిస్తాము.
మంచి గుణములు కలిగి ఉండడం, చెడ్డ గుణములు కలిగి ఉండడం అని మాట్లాడుతాము. ఆ విధంగా గుణమును విశేషణంగా వాడతాము.
"మందు మంచి గుణాన్నిచ్చింది" అనేది ఆయుర్వేద చికిత్సలో పరిభాష. మందు పనిచేసిందని దీని భావము.
శ్రేష్ఠతని గుణ శబ్దంతో సూచించే సంప్రదాయమూ ఉంది. ప్రతి భాషలోనూ ఒక పదానికి నానార్థాలు ఉంటాయి. వివిధ సందర్భాల్లో వివిధ అవగాహనలు
కలుగుతాయి. భాషల సొగసు నానార్థాలలో, అలంకారాల ఉపయోగంలో, శ్లేషలో అందగిస్తుంది.
ఇలాంటి సొగసులను మన ఇప్పటి జీవనశైలిలో నిర్లక్ష్యం చేస్తున్నాం. లేదా అంతటి "పాండిత్యం" మనకి ఉండటం లేదు.
భాష, మాట్లాడగలగడం, ప్రకృతి మనిషికి మాత్రమే ఇచ్చిన ప్రసాదం. వరం. దురదృష్టవశాత్తు ఇంతటి సిద్ధిని మనం సద్వినియోగం చేసుకోలేక పోతున్నాము. ఎంతో నిరాదరణ, నిర్లక్ష్యం చూపిస్తున్నాం. భాష పట్ల, దాని ఉపయోగం పట్ల శ్రద్ధాసక్తులు లేవు. గౌరవాభిమానాలు చూపించడం లేదు.
ప్రస్తుతానికి వస్తే, గుణ శబ్దాన్ని భారతీయ తత్త్వశాస్త్రాలు ప్రత్యేక అర్థంలో వాడాయి. సత్వరజస్తమో గుణాలు అని మనం విన్నాము. వాటి అర్థాలు సరిగా తెలియని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ఏదో చెబ్తారు వాటి గురించి.
వైశేషికము, సాంఖ్య యోగాలు, వేదాంతము ఈ పదాన్ని వాడాయి.
గుణము అంటే ముడి అని సంస్కృతభాషార్థము.
తత్త్వశాస్త్రాలలో ముడి అనే అర్థంలో ఉపయోగిస్తారు.
మనకు విషయములను, అవి కలిగించే అనుభవములను (విషయానుభవములు లేక వాసనలు) గ్రహింపజేసే మానసిక కార్యకలాప వ్యవస్థ ఉంది.
ఇక్కడ సత్త్వ గుణము అంటే విషయ, విషయానుభవములతో "ముడి" పడి లేచిన శుద్ధ మానసిక అవస్థ (Phase of mind).
రజో గుణము అంటే విషయానుభవముతో "ముడి" పడిన మానసిక అవస్థ. అంతఃకరణ కలాప స్థితి.
తమో గుణము అంటే విషయముతో "ముడి" పడిన
మానసిక గతి. అంతర, బాహ్య భౌతిక ప్రపంచంలతో
మనసు "ముడి" పడి మనకు గ్రహణ కలిగిస్తుంది.
అంతర ప్రపంచం నుంచి ఈ గ్రహణ జరిగితే అది భావము అవుతుంది.
విషయానుభవములతో గాని, విషయములతో గాని
"ముడి" పడని ఆంతరంగిక లేక అంతర స్థితి. ఈ స్థితిలో మనోబుద్ధ్యహంకారచిత్త రూపములైన అంతఃకరముల పరిణామం ఉండదు. అంతఃకరణముల కలాపములు విరమింపబడి ఉంటాయి. దీనిని "నిర్గుణ" స్థితి అంటారు. విషయానుభవాలతో గాని, విషయములతో గాని
"ముడి" పడి లేని నిర్మల మానసము పరిఢవిల్లే ఆత్మ సమయము. పరమాత్మ నిర్గుణుడు అంటే పైన చెప్పిన విధానములో అర్థం చేసుకోవాలి. ఆయన విషయ గ్రహణ, విషయానుభవ స్థితులకు అతీతుడై
ఉంటాడు. నిజానికి నిర్గుణ స్థితి శాంతానందమౌన స్థితి.
దీనినే భాషా శాస్త్ర పరంగా భక్తి స్థితి, తత్పర లేక తాత్పర్య స్థితి అంటారు. మానసిక కార్యకలాపాలు జరిగే స్థితి విభక్తి స్థితి.
ఆస్తికులు నిర్వచించిన భక్తి స్థితీ ఇదే.
అస్మిన్ పరమ ప్రేమ రూపా - ఆస్తిక నిర్వచనం.
స్సవస్వరూపానుసంధానం భక్తిః ఇతి అభిదీయతే - ఇది తత్త్వశాస్త్ర నిర్వచనము.
తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి మూలములలోకి వెళ్ళాలి. తక్కువ రకం మనుషుల వ్యాఖ్యానాలు, భాషణములు అపార్థాన్ని మాత్రమే కలిగిస్తాయి.
ఆస్తికులు సత్త్వ గుణానికి విష్ణువుని, రజోగుణానికి చతుర్ముఖ బ్రహ్మను, తమోగుణానికి శివుని ప్రతీకలుగా చేశారు. మరి కొందరు సత్త్వ గుణాన్ని మంచితనానికి, రజోగుణాన్ని కార్యకలాపాలపై దృష్టికి, తమో గుణాన్ని అలసత్వానికి, సోమరితనానికి, నిద్రకు, రాక్షస ప్రవృత్తికి, చెడ్డ తనానికి ప్రాతినిధ్యం వహించేలా చేశారు.
గుణ శబ్దాన్ని మనం ఇన్ని రకాలుగా అవగాహన చేసి కోవచ్చు.
శ్రీర్భూయాత్!
సమస్త సన్మంగలాని భవంతు!
ఏతత్ సర్వమ్ శ్రీ పరమేశ్వరార్పణమస్తు!
*******
Indian Religions
Religions in India are serving least the followers of their faith and are inconveniencing followers of other faiths with their lures, foolish propaganda, intolerance, fundamentalism, non-patriotism and blindness to Divinity and ignorance of Truth and Reality.
All their energies are wasted in vain and foolish pursuits and never used for Divine pursuits.
********
సత్య దర్శనంలో తేడాలు , భేదాలు

చాలా మంది జనాలకి సత్యం దాని నిజ స్థితిలో అక్కర్లేదు.
సత్యాన్ని వాళ్ళ పరిమిత జ్ఞానంలో ఇమిడిస్తే చూస్తాం అంటారు.
వాళ్ళు చూసినా, చూడక పోయినా సత్యానికి ఏమీ నష్టం లేదు.
సత్యాన్ని ఎవరు కావాలనుకున్నా, అక్కర్లేదనుకున్నా సత్యానికి ఏమీ ఇబ్బంది గాని, లోటు గాని లేదు.
తమ తమ పరిమిత జ్ఞానములతో సత్యాన్ని కొలవడం వల్లే సత్యం స్వరూపం, అవగాహనా మారిపోయాయి. ఒక్కోసారి అనిపిస్తుంది: సత్య దర్శనం రకరకాలుగా జరగడం వల్ల, ఎన్నో తప్పుడు
వ్యాఖ్యానాలు, వికృత ఆలోకన, అవలోకనలు ప్రచారం లోకి వచ్చాయి.
అలా సత్యం అర్థమైన వాళ్ళ కన్నా సత్యాన్ని అపార్థం
చేసుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు.
ఏది ఉన్నదో అది సత్యం. మన పరిమిత గ్రహింపు ఉన్నదాన్ని ఉన్నట్లుగా అర్థం చేసికోనివ్వదు. మన రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు మన అవగాహనకు
రంగులు పూస్తాయి. ఆ రంగుల ప్రపంచంలో జీవించి
మరణిస్తాం. అదే సత్యమని ఎందరినో భ్రమింప చేస్తాము. మన చుట్టూ పరిభ్రమింప చేసుకుంటాము.
ఒకే అనుభవాన్ని పొందిన జ్ఞానులలోనే, ఆ అనుభవాన్ని మనకు వివరిస్తున్నప్పుడు, వారి వారి పూర్వాశ్రమ జీవితాన్ని బట్టి, అనుభవం గురించి చెప్పే మాటలు ఒకేలా ఉండవు. కాని మనం వారి మాటలను అర్థం చేసుకుంటే మనకు కలిగే అనుభవం మాత్రం ఒకటే.
నిజమైన సత్య దర్శనం శాంతిని, సంతృప్తిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
సత్య దర్శనం చేయాలనుకుని మనం జీవితంలో ఎందరో "మహానుభావులను" ఆశ్రయిస్తాము. కాని ఆ మహానుభావులలో తర తమ భేదాలు ఉండడం వల్ల
మనకు సాఫల్యం కలిగే స్థాయిలో తేడాలుంటాయి.
అందువల్లనే - ఏకమ్ సత్ విప్రాః బహుధా వదంతి -
అనే నానుడి వచ్చింది.
సత్యం ఒకటే కాని జ్ఞానులు రకరకాలుగా చెబుతారు.
ఆ అవగాహనా భేదం వల్ల కలిగిన కల్పిత భేదాభిప్రాయాలతో వివాదములు పెంచుకుని వాదములలో మునిగి తేలుతూ జీవితాన్ని గడిపేస్తారు. కడతేరకుండానే కడతేరతారు.
ఈ వైరుధ్యాల వల్లే తత్త్వం రకరకాలుగా భాసిస్తోంది,
భావింప చేస్తోంది.
******
ఒక్కోసారి మనకు మనమే మంచి తోడు; మనకు మనమే మంచి సాహిత్యం.
********
ఫేస్బుక్ వాడు
వార్తా ఛానెల్స్ లో అవే విజువల్స్ పదే పదే చూపించి బోర్ కొట్టినట్లు, ఈ మధ్య ఫేస్ బుక్ అవే పోస్టింగ్స్ ని పదే పదే చూపించి బోర్ కొట్టిస్తోంది. పొద్దున్నే చూసిన ఓ ఇరవై ముప్ఫై పోస్టింగ్స్ పొద్దుటి నుంచి రాత్రి దాకా తిప్పుతోంది. అలాగే మనకు "ఫ్రెండ్స్" ఎందరో ఉన్నా కొద్ది మంది పోస్టింగ్స్ నే చూపిస్తోంది.
ఎక్కువ కాంటాక్టు లో ఉన్న ఫ్రెండ్స్ పోస్టులు మాత్రమే మనకు చూపబడుతున్నాయేమో! ఇదివరకు తాజా తాజాగా ఎన్నో న్యూ పోస్ట్లు వచ్చేవి. ఇప్పుడు సంఖ్య బాగా తగ్గిపోయింది. తాజాగా రావటంలేదు.
మన ఫ్రెండ్స్ పెట్టటం లేదో, సాఫ్ట్వేర్ మార్చేశాడో ఫేస్బుక్ వాడు. చూసిన పోస్టులే చూడడానికి విసుగుగా ఉంది. ఎందుకు ఫేస్బుక్ వాడు ఇలా మార్చేశాడో!?
********
RESONATING HEARTS
Resonating hearts fall in love
It can be at first sight or blind;
Intuition of nearness is dearness
For the youth in initial stages of
Courting and proximity due to
Studies or job or neighborhood
Love is though termed falling
It is invigorating for the ripened
And matured hearts and minds
It becomes rising together in the
Company of each other and
Enjoy union of hearts contentedly

Sunday, May 27, 2018

దురాశ; ఫేస్బుక్ పోస్టింగ్స్; సంతసమే; సముద్రుడు

దురాశ
నీటికొరత అన్ని పల్లెల్నీ, పట్టణాలను నగరాలను, బాధిస్తున్న సమస్య. మిగతా వ్యవహారాలలాగే మన పాలకులు స్టేట్మెంట్స్ ఇచ్చేసి చేతులు దులుపు కుంటున్నారు. ఎన్నికైన ఐదేళ్ళలో ఎంత నొల్లుకున్నామా తప్పించి ప్రజలకు సౌకర్యంగా ఏమి చేశాము అని రాజకీయ నాయకులు అనుకోనవసరం లేకుండా వారి మోసపు మాటలకు పడిపోయి వారినే మళ్ళీ ఎన్నుకుంటున్నాము.
కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు, మరికొన్ని వర్గాలకు ఋణ మాఫీలు, ఇంకొన్ని వర్గాలకు తాయిలాలు ఇస్తూ మన్ని మచ్చిక చేసుకునే ఈ ప్రజా ప్రతినిధులనూ; మనందరకూ అవసరమైన మంచి నీరు, పరిశుభ్రమైన గాలి, వాతావరణం కల్పించాలని ఏ నాయకునీ కోరము. వాతావరణ కాలుష్యం లేకుండా చేయండి అని నాయకులను, పాలకులను నిలదీయము.
మాకు మంచి రోడ్లు కావాలి, సుఖ ప్రయాణానికి బస్సులు, రవాణా సౌకర్యాలు కావాలని నాయకుల్ని డిమాండ్ చేయము. ప్రైవేటు ట్రావెల్స్ మన్ని ఎంత దోస్తున్నా ప్రభుత్వాలను, నాయకులను నిలదీయము. దగ్గర ప్రయాణాలకు షేర్ ఆటోల్లో లగేజీలతో ఇరుక్కుని పూర్తి అసౌకర్యంతో ప్రయాణిస్తాము.
ప్రైవేటు విద్యాసంస్థలను అసాంఘిక శక్తులు, రాజకీయ నాయకులు కబ్జా చేసి మన కష్టాన్నంతా ఫీజుల రూపంలో దోస్తున్నా కిమ్మనం. వైద్యం పేరుతో మన ఆరోగ్యాలతో, డబ్బుతో, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైద్యశాలల గురించి ప్రశ్నించము.
కులగజ్జి బాగా పట్టించుకొని అస్తమానూ గోక్కుంటూ, మనోళ్ళనుకుంటూ, సంఘంలోని ఇతర కులస్తులను
మర్యాదగా, సభ్యతగా చూడము. పైపెచ్చు వినడానికి అసహ్యమైన భాషతో నానా తిట్లూ తిడతాము. మన కుసంస్కారాన్ని, అనాగరికతను యథేచ్ఛగా, సిగ్గు లేకుండా ప్రదర్శిస్తాము.
మనకి సుఖశాంతులతో కూడిన జీవితాలు ఎక్కడ లభిస్తాయి? ఇంకా మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేసికొని మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేసు కుంటున్నాము. ఏ మేధావుల పుణ్యమో గాని ఇల్లాలిని చంపేశాము.
ఇన్ని వక్రాలు మనలో, మన మనసుల్లో పెట్టుకొని, అవకతవకగా ప్రవర్తిస్తూ, గతాన్ని నిందిస్తూ, దానికి ఫలానా వారు కారకులని బుద్ధి లేకుండా మాట్లాడుతూ, మన ద్వేష విద్వేషాలతో సంఘంలో దారుణమైన అశాంతిని, కష్టాలనూ కలిగిస్తూ ఎంత సేపూ వెనకబడ్డానని వెనుక పడుతూ జీవితాలను స్వయంగా ఛిన్నాభిన్నం చేసికుంటూ ఎవరిమీదో ఏడుస్తూ మనకి మనమూ ఉపయోగపడటం లేదు,
సంఘానికి, దేశానికీ ఉపయోగపడటం లేదు.
మనలో ఇన్ని లోట్లు, లోపాలు పెట్టుకొని మన దరిద్రానికి ఇతరులను బాధ్యులను చేస్తూ మనం ఏడుస్తూ బతుకుతున్నాం. తోటి పౌరులను ఏడిపిస్తున్నాం. కష్ట పెడుతున్నాము.
దీనికి పరిష్కారం మనందరం కూచుని చర్చించుకొని కనుక్కోవాలి. వారిని, వీరిని నిందిస్తూ, వారినీ, వీరినీ కులాల, మతాల పేరుతో అంటకాగి మన జీవితాల్లో వసంతం విరియాలనుకోవడం దురాశ.
********
ఫేస్బుక్ పోస్టింగ్స్ 

ఫేస్బుక్ వివిధ రాజకీయ పక్షాల రణరంగంగా తయారైంది. అమ్మా, ఆలీ బూతులు తిట్టుకుంటున్నారు. సభ్యత లేదు. ఫేస్బుక్ కి ఏమీ సెన్సార్ లేదు కాబట్టి ఈ కుసంస్కారాలు, సభ్యతా రాహిత్యాలు, అనాగరిక, ఆటవిక ధోరణులు; ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఏ విధమైన అడ్డూ, ఆపూ లేకుండా అటు వారు ఇటు వారు చెడుగుడు ఆడేసుకుంటున్నారు.
ఒక పబ్లిక్ ఫోరం లో ఇంత నిర్లక్ష్యంగా, అమర్యాదగా, అగౌరవంగా, తిట్టుకోవడం ఇళ్ళల్లో మాట్లాడే అనాగరిక, అసభ్య భా‌షని వాడడం, నీచాతి నీచమైన వాళ్ళ హీనతని అంత ప్రస్ఫుటంగా చూపించుకోవడం చాలా అసహ్యకరంగా ఉంది.
మానసిక రోగులందరూ ఇక్కడ కట్ట కట్టుకు తయారయ్యారు. చదువు, సంస్కారం లేని జంతు సముదాయం విచ్చలవిడిగా సంచరిస్తున్న సాంఘిక అరణ్యంగా ఫేస్బుక్ తయారైంది.
******
సంతసమే

శతకోటి లింగాలలో ఓ బోడి లింగంగా వెలయించే
నా కవితలు ఏ సరస హృదయాలను తాకునో
ఏ రసికులకు మనోరంజనం కలిగించునో!
ఛందో బద్ధమైనవి కావు ఏ వాదములకూ చెందవు
మనసున విరిసిన మల్లెలు ఏ మది వేసంగిని పూయించునో; మామిడులతో కలిసి ఏ అంతరంగమును రస ఫల భరితము చేయునో!
సారస్వతమున ఉద్దండులైన కవిసార్వభౌములకు
కవి సామ్రాట్ లకు సహజ కవులకు దీటుగా నిలబడ
లేకపోయిననూ నిలబడిననూ నా కవితలు పాఠకుల
అలరించిన చాలును; వారి తలల కాసేపు ఊపినను
అదే పదివేలు; అక్షరముల వరుస, భావ లహరి,
అనుభవముల అల్లిక, శారదకు అభివాదములు
నా బుల్లి హృదయము గానము చేసిన గీతములు;
కవనములు పాఠక మనోహరములు హృదయ 
వికాస కారణములైన చాలును; నా పదపుష్పములు 
వాసుదేవ పదారవిందముల క్షణమున్నను సంతసమే
*********
సముద్రుడు 
తన గాంభీర్యాన్ని ఏమాత్రం సడలించకుడానే నదుల నీటినంతని సముద్రం ఇముడ్చేసుకుంటుంది.
అలాగే మనుషులూ తమ స్థిమితాన్ని ఏమాత్రం కోల్పోకుండా జీవితంలో కలిగే వడిదుడుకులను ఇముడ్చుకోవాలి. ఇది కష్టతరమే కాని అసాధ్యం కాదు. ఎందుకంటే ఇది మనంతట మనం నేర్చుకుని ఆచరించుకోవలసినది.
ఆ మాత్రం శ్రద్ధ వహించక పోతే ఏ ఆధ్యాత్మిక గురువు పాలనో పడతాము. మన అశాంతి పోకపోవడం అలా ఉంచి మన స్వాతంత్ర్యాన్ని, వ్యక్తిత్వాన్ని కోల్పోతాము. మన వ్యక్తిత్వాన్ని భగవంతుని ఆరాధనలో, అర్చనలో, స్మరణలో కోల్పోవాలి, లేదా భగవల్లక్షణాలైన జ్ఞానం, ఆనందం, శాంతి, మౌనము లలో కాని కోల్పోవాలి; మరెవరిలోనూ, మరెందులోనూ కాదు

Friday, May 25, 2018

ఉద్ధరింపులు; పిల్లల పెంపకం; గురువింద గింజలు; సాహితీ సృష్టి; ఊపిరి;

ఉద్ధరింపులు
చాలా మంది భారతీయ సాంప్రదాయం నుంచి, సంస్కృతి నుంచి తాము లాభ పడే ఊసు పెట్టుకోకుండా, మిగిలిన అందరినీ ఉద్ధరించెయ్యాలని
ఎన్నో పోస్ట్లు పెడతారు. ఎంతో తాపత్రయం చూపుతారు. ఈ తాపత్రయంలో అణుమాత్రం తమని తాము ఉద్ధరించుకోవాలని సంకల్పం ఉన్నా వాళ్ళూ బాగుపడతారు మనకీ ఈ పోస్ట్లు చూసే హడావుడీ తగ్గుతుంది.
తనకు మాలిన ధర్మం లేదు - అంటే తను ఆచరించని ధర్మాన్ని ఇతరులకు బోధించడం అనవసరం అని అర్థం. తను ఆచరించకుండా మీరందరూ ఆచరించండి అనడం height of innocence and ignorance.
ఈ బోధనలు మనం ఆచరించి ఇతరులకు చెబితేనే వాటికి విలువ. లేకపోతే చిరాగ్గా ఉంటుంది.
మిగతా వాళ్ళని బాగుచేసే ముందు మన్ని మనం బాగుచేసుకోవడం అత్యవసరం. ఏదో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కదా, అందరికీ క్షణాల్లో పంపిచెయ్యచ్చు కదా అని మనం పంపించేదాన్ని ఏమీ చదవకుండా, అవగాహన చేసుకోకుండా ఇతరులకు తోసేయడం మన శ్రమ మాత్రమే. ఇతరులపై ప్రేమ కాదు. ఉద్ధరింపు మన నుంచి మొదలవ్వాలి.
**********
పిల్లల పెంపకం

లలిత కళల్లో నిష్ణాతులైన వారికి, మేధావులని కీర్తింపబడే వారికి చంచలమైన మనసు ఉంటుంది.
వారి అలవాట్లు, వ్యవహారాలు, బంధాలు, సంబంధాలు సమాజం నిర్దేశించినట్లుండవు. వారు స్వేచ్ఛగా తిరుగుతారు. వాళ్ళ అలవాట్లని, ప్రవర్తనని బట్టి మాత్రమే వారిని గౌరవిస్తాను, ఇష్ట పడతాను అంటే అందుకోసం మనకు ఎవరూ మిగలరు. బలహీనతలు లేని మనుషులు ఉండరు.
ముఖ్యంగా కళాకారులు, పేరొందిన మేధావులు, "పెద్ద మనుషుల్లో" సంఘ నియమాలు పాటించకుండా జీవించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మన కొలబద్దలు అక్కడ ఉపయోగిస్తే ప్రయోజనం ఉండదు. సంఘం ఎప్పటినుంచో కళాకారులు, మేధావులు, ఇతర "పెద్ద మనుషుల" విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించేది. ఇప్పుడు అంతర్జాలం వచ్చేక సామాజిక సాలెగూళ్ళలో నీతి, అవినీతి బోధించడం, అలా లేని సెలిబ్రటీలని ఎండగట్టడం ఒక ఆనవాయితీగా తయారైంది.
అందుకే ఇదివరకు నట, విట, విదూషకులను దూరంగా ఉంచాలనేవారు. ఎందుకంటే వారికి సాంఘిక నియమాల మీద అలస భావం ఉంటుంది.
అది ఆయా వృత్తులలో సహజం. వారు వినోదాన్ని పంచుతారు. అలా మన మనసులని తేలికగా దోచేస్తారు. మన చిన్నప్పుడు మనం, ఇప్పుడు మన పిల్లలు, మనుమలు, మనమరాండ్రు సినీ నటీనటులను ఎంత ఆరాధిస్తారో, వారిపై, వారికై ఎంతో మనసు పారేసుకుంటారో చెప్పనవసరంలేదు.
అందమైన మన అమ్మాయిలు, అబ్బాయిలు ఈ సినీ తారలపై మనసు పారేసుకోవడం నిజంగా నాకు ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడు మన జీవన విధానం పూర్తిగా మారిపోయి ఎప్పుడో 28, 29 ఏట జరిగే పెళ్ళి వరకు ఏ ఆకర్షణలోనూ పడకుండా ఉండడం అసాధ్యం. గర్ల్ఫ్రెండ్, బాయ్ఫ్రెండ్ లు ఈ లోటు కొంత పూడ్చినా సినీ తారల, ఇతర వినోద కారుల ఆకర్షణనుంచి మన పిల్లల్ని కాపాడలేము.
ఏదో బట్టీ పట్టి పరీక్షల్లో రాసేసి సర్టిఫికెట్ తద్వారా ఉద్యోగం మాత్రం సంపాదించి పెట్టే నేటి చదువులు మానసిక వికాసం కలిగించే అవకాశం లేకుండా పోయింది. తల్లిదండ్రులు, వాళ్ళు స్వతహాగా చదువుకున్న రెండు మూడు పుస్తకాలు తప్ప వారికి జీవితం గురించి చెప్పే వారే లేరు. వారు చదివే విద్యాలయాల్లోని ఉపాధ్యాయులకు ఈ శక్తీ లేదు, ఉన్న ఒకరిద్దరు యాజమాన్యాలను అధికరించి జీవితం గురించి ఏ మంచి మాటా చెప్పలేని స్థితి.
ఎక్కువ విద్యాలయాలు అసాంఘిక శక్తులచే నడుప బడుతున్నాయి.
మన పిల్లలకి విద్యాలయాల్లో గడిపే సమయమంతా రేంకులు, రాబోయే ఉద్యోగాల గురించి (చాలామందికి ఏ ఉద్యోగాలు రావటంలేదు, అది వేరే సంగతి) సతమత మయ్యే హడావుడే తప్ప జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమయ్యే విషయాలే చెప్పబడటంలేదు. ఈ విషయంలో ఏ విధమైన సాయం అందటం లేదు. అసలే వయసు తెచ్చే అలజడులు, ఆకర్షణ, ఇంగితం నేర్పేవారు, సావకాశాలు లేని విద్యావిధానం, వ్యవస్థ, జైళ్ళలాంటి ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజీలు, అసలు మన పిల్లలు మన ఈ "దౌష్ట్యాన్ని" ఎలా తట్టుకుంటున్నారో!
ఆ ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ జైళ్ళ బందిఖానా నుంచి బయట పడగానే కలిగే స్వేచ్ఛ, అణిచి ఉంచిన వయసు, ఆకర్షణలు ఉన్న కాస్త ఇంగితాన్ని మింగేస్తాయి. అప్పుటికే మనసునాకర్షించిన సినీతారలు, ఆటగాళ్ళు, ఇతర సెలిబ్రిటీలు జీవితంపై దృష్టి పెట్టనీయరు. అప్పుడే తల్లిదండ్రుల పెంపకం; వారికి సహజంగా అంటిన సంస్కారాలు, స్ఫురణ, స్ఫూర్తులు వెన్నంటి ఉండి కాపాడతాయి. లేనివాళ్ళు ఇతరుల వంచనకు లోనవుతారు. జీవితం ఇబ్బందుల్లో పడుతుంది.
ఇదంతా మనం ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించం. ఆలోచించి ఏం ప్రయోజనం అని ఎందరో వదిలేస్తారు.
కాని చురుకైన, మెరుగైన, అందమైన మన ఆడపిల్లలు, మగపిల్లలు వారి వారి అందాలకు, సంస్కారానికి, సంస్కృతికి ఏ మాత్రం తూగని, ఒక్క వినోదం మాత్రం పంచే, అదీ జుగుప్స కలిగించే విధంగా; నిజ జీవితాల్లో ఏమాత్రం ఆదర్శంగా జీవించని; రూపంలో తప్ప మరెందులోనూ తగని, నటీనటుల పట్ల ఆకర్షితులై వ్యవహరించడం మనం ఎవరం కావలసినంత దృష్టి పెట్టని విషయం.
పిల్లల పెంపకంలో మన పాత్ర మరెవ్వరూ తీసికో లేనిది. పూరింపలేనిది. ఈ వాస్తవాన్ని గ్రహించి మనం జాగరూకులమై మన బాధ్యత నిర్వహించక పోతే నష్ట పోయేది మన పిల్లలు, మనం.
************
"Miracle" for setting in peace

People swarm to individuals who "can" tell about your past lives and future. Very few pay attention to the present. All meditations direct us to practice and cultivate the art of living in the present.
We live by our thoughts. Most of the times our thoughts are about what passed and what will happen. These thoughts are related to I, me, mine. This situation is because we are highly ego-centric.
We always think of bonds to I and the merits and demerits of those bonds. The thoughts originate from our experiences relating to I, me, mine; pain, hurt, unpleasant happenings are sourced from our memory. Past is nothing but memory in the form of pleasant and unpleasant experiences. Surprisingly and most of the times our thoughts of past are about unpleasant happenings. Pleasant happenings rarely are activated giving us joy.
Sorrow, pain, hurt dominate past. In a similar way future is active in our mind as fear, anxiety, apprehension, worry, doubt mostly. Both past and future are activated in the present as mere thought forms; and are unreal confined to mental uneasiness and have no physical existence.
Mind always tries to dwell in the past or future; thus giving us no time to live in the present. All mental illnesses are due to weak mind which cannot stop rising of unpleasant thoughts in relation to past or future. Mind has to be and can be strengthened through our conscious efforts.
Every one of us must attempt this strengthening of mind.
First and foremost thing in this direction is to have and maintain harmonious human relationships. In the absence of this any amount of spirituality or gurus, meditation techniques will fail to help us in strengthening our mind to tackle all vissicitudes that envelop and engross us during the course of our lives.
So the primary and only phenomenon that helps us in curtailing disturbances in and of our mind is cultivating and maintaining harmonious human relationships and have respect for fellow humans, animals and nature - cum - environment.
Many erroneously feel that even in the absence of having harmonious relationships, spirituality or gurus or meditations can help and rescue them from mental uneasiness and illnesses.
We have to take care of our relationships among family, society and nation to have peaceful coexistence.
Living in the present in harmony to around living and non-living beings is the miracle that sets in peace in us and society.
********
నయనానందకరము ప్రకృతి అందములు;
శ్రవణానందకరము పక్షుల కిల కిలా రావములు
హృదయాహ్లాదకరము ప్రణయిని రాగ భాషణములు
మదిని పొంగించును రమణీ తనురచనలు సొంపులు
ఆహ్లాదము మనిషి మనిషికీ వేరు
స్త్రీ పురుషులకు అంతరంగ మథనాలు వేరు
మనసుల మంతనాలు జరుగు విధములు వేరు
ఒకరి తత్త్వము వేరొకరి తత్త్వము; మనసులు
పనిచేయు తీరులు వేరు; ఒకరి వైపునుంచి చూచి
మరొకరిని తక్కువగా చూడరాదు; ప్రకృతి ఆట ఇది
********
అనుబంధం ఆత్మీయత లేని "ప్రేమ"
ఎండిపోయిన నదీ ఒకటే; ఆర్ద్రతలుండవు
********
గురువింద గింజలు
ప్రపంచంలో తప్పులు చేసేవారి కన్న తప్పులు చేసిన వారి తప్పులను దుయ్యబట్టే సామాన్య జనం ఎక్కువ. నిజానికి ఈ దుయ్యబట్టే వారంతా కూడా తమ తమ జీవితాల్లో తప్పులు చేసిన వారే. వీరికి ఇతరులలో తప్పులు ఎంచడం, పట్టడం, దునుమానడం ఒక వేడుక.
ఈ తిట్టే వాళ్ళ తప్పులు ఇతరులకు తెలియవు. అలా వీరు తప్పించుకొని సంఘంలో తప్పులు చేసిన వారందరి మీదా కారాలు మిరియాలు నూరతారు.
ముఖ్యంగా సెలిబ్రటీలైతే చచ్చారన్న మాటే. ఈ తప్పులెన్నువారు, నీతి వాక్యాలు చెప్పే వారు వారి వారి జీవితాల్లో తప్పులు చేసే సగటు మనుషులే. సెలిబ్రటీల తప్పుల దగ్గరకొచ్చే పూనకం వచ్చిన వారిలా రెచ్చిపోతారు. ఓ మాట అని ఊరుకోవచ్చు.
ఉహు అలా కుదరదు వీళ్ళకి. ఆ సెలిబ్రటీని చీల్చి చెండాడెయ్యాలసిందే. వాళ్ళ చుట్టాలలో, స్నేహ బృందంలో తప్పులు చేసే వారెందరో ఉంటారు. వీళ్ళు గబుక్కున అంధులైపోతారు ఆత్మీయుల ఆగడాలకి.
తప్పులు అందరం చేస్తాం అనే స్పృహ ఉంటే తప్పులు చేసిన ఎవరినీ అతిగా ఆడిపోసుకోం.
గురువింద గింజ సామెతలా వీరు వ్యవహరిస్తారు.
*******
Rising power of regional parties is not good for emotional integration of India.
Our leaders' narrow-mindedness and no love for nation together with their ignorance of democratic processes and its various wings and sole selfishness and dynasty leadership trends are detrimental to progress of India and the idea of India as an integrated nation.
********
Readers have become rare to find. The entertaining ways are so dominating that "ordinary" people who were readers for time pass are now smart phone savvy and spending their time that way.
********

సాహితీ సృష్టి
సమాజంలో మనకి ఆనందం కలిగించే రచనలు చేయడం సామాజిక అంశమే కదా! అవసరమే కదా! ఎటొచ్చీ రచన తరువాత ఈ ఉపయోగం కలుగుతుంది.
సాహిత్యం సమాజంలోని సమస్యలు చిత్రించి మనకు అశాంతి కలిగించడం కన్న మనకు ఆహ్లాదం కలిగించడం మంచిది కదా. వార్తా ప్రసార సాధనాల ద్వారా మనం సమస్యలు తెలుసుకుంటూనే ఉంటాము. అలాగే కాక పాఠకులమైన మనమూ సంఘాన్ని గమనిస్తూ ఉంటాం కదా.
పాఠకులకు ఆహ్లాదం కలిగించడం సామాజిక సేవ కిందే వస్తుంది కదా. అన్ని రచనలూ సమాజంలోని సంఘటనలను, బాధలను, అణచివేతలను మాత్రమే ప్రతిబింబించాలనడం పసితనం. అలాగే ప్రతి రచనా సందేశం ఇవ్వాలనడం ఒక విధమైన మేష్టారి మనస్తత్వం.
రచనలు ఆహ్లాదాన్ని మాత్రమే కలిగించేవి కావచ్చు. అవి రచనలు కావు అలా రాయడం బూర్జువా సంస్కృతి అనడం సంకుచితంగా మాట్లాడడం.
ప్రణయము, ప్రేమ, ఇత్యాది కవితా వస్తువులను పుర్ర చేతి భావ విమర్శకులు తెలుగు సాహితీ రంగంలో అనధికారికంగా నిషేధించారు. సమస్యల వలయాలను చిత్రించడమే సాహిత్య పరమార్థం అని శ్రీ శ్రీ అనుయాయులచే నిర్ణయించబడింది.
తరువాత వాదముల హవా మొదలైంది. ఈ వాద సాహిత్యంలో ఎంతసేపూ ఎవరో ఒకరిని, దేనినినో ఒక దానిని నిరసించడం, దుయ్యబట్టడం ఉంటాయి. సామరస్యం, సౌమనస్యములకు తావుండదు. సాహిత్యం సంఘంలో శాంతి, ఆహ్లాదయుత వాతావరణాన్నీ నిర్మించాలి.
ఊకదంపుడుగా తిట్లు, కువిమర్శలు కల రాతలే సాహిత్యం అనే స్థాయి నుంచి తెలుగు సాహిత్యం సౌమ్యత, సౌమనస్యము, సామరస్యం, ఆహ్లాదం, వివేకము, వివేచన, తత్త్వ జ్ఞానము పొందడంల వైపు పయనించాలి. అప్పుడే మన మధ్య కృత్రిమత, ద్వేష, విద్వేషాలు, కోప తాపాలు, అపోహలు, అజ్ఞానయుత ధోరణులు, వైషమ్యం నిండిన తలపులు తొలగి మనలో, సంఘంలో సుఖశాంతులు ఏర్పడతాయి.
సాహిత్యా సృష్టిని ఇందుకూ వాడుకోవాలి
*********
ఊపిరి
నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం బాగా అలవాటు. ఈ అలవాటు నాకు మా అమ్మ నాన్న గార్లనుంచి వచ్చింది. మా అమ్మగారు పురాణాలు చదివే వారు. మా నాన్నగారు అన్ని రకాల పుస్తకాలు తెలుగు, ఆంగ్ల భాషల్లో చదివేవారు.
నేను బాలల బొమ్మల రామాయణంతో మొదలుపెట్టి
వివిధరకాలను చదివాను. నేను పి హెచ్. డి. చేస్తూంటే నేను ఒక రచయితనైతే బాగుండును అని మొదటి సారి అనిపించింది. అప్పుడు పుర్రచేతి భావాలు తెలుగు సాహిత్యాన్ని ముప్పిరిగొని ఉన్నాయి. వార, పక్ష, మాస పత్రికలు తమ వంతు సాహితీ సేవ చేస్తూ ఉండేవి. కాని రచయితగా మాత్రమే ఉంటే జీవనం గడవదని అర్థమైపోయింది.
మౌనంగా పి. హెచ్. డి. పూర్తి చేసికొని ఉద్యోగంలో చేరాను. కాని రచయితగా మారలేదు.
చిన్న చితకా కవితలు, కథలు రాస్తూ ఉండే వాడిని.
కాని సాహితీ స్రష్టల సందోహం ఎక్కువైపోయి, పత్రికలు తక్కువై పోయి మము బోంట్ల రచనలకు ప్రచురణా భాగ్యం కలిగేది కాదు. ఎప్పుడూ గోడకి కొట్టిన బంతిలా వెనక్కి రావడమే.
ఇంటర్నెట్ వచ్చాక సాంఘిక సాలెగూళ్ళు, వెబ్ సైట్లు పెరిగాక మాకూ ప్రచురణా (ఇంటర్నెట్లో) మాత్రమే కలగడం మొదలు పెట్టింది. రచించడానికి ప్రేరణ, ఉత్సాహం కలిగాయి.
ఆ రోజుల్లో అసలు నేను (ఇప్పుడు కూడా) రచయిత నవ్వాలని ఎందుకనుకున్నానంటే, రచయితలకు పదవీవిరమణ లేదు. ఆరోగ్యం ఉంటే ఆఖరి ఊపిరి తీసేవరకు రాసుకోవచ్చు.
కాని ధన సంపాదనే ఉండదు. ఇప్పుడంటే రిటైర్ అయిపోయాను, ధన సంపాదన అవసరం లేదు, అందుకని తనివితీరా రచనా వ్యాసంగంలో మగ్నమై పోవచ్చు. పేరు, ప్రఖ్యాతులు రాకున్నా మనకు కాలక్షేపం అయిపోతుంది. బుర్రా ఖాళీగా ఉండదు. పదునెక్కుతుంది కూడా. రవంత పేరు రావచ్చు.
రాయడం ఎందరికో ఊపిరి.
********
విశ్వవిద్యాలయములా బొచ్చెడు
చదువులా కులగజ్జిని దాటనివ్వవు
కవులు, మేధావులా వర్గాన్ని మించలేరు
జ్ఞానులు, గురువులా తమ ఆస్తుల పెంపకంలో
ములిగి తేలేరు; అన్ని తమకములు తీర్చుకొనేరు
పాలకులా పదిచేతులతో వెనకేసుకొనేరు
భారత దేశమున అన్ని వృత్తుల్లో నిజాయితీ తగ్గుతోంది; ప్రజల్లో అనైక్యత పెరుగుతోంది
ముఖ్యమైన చదువు, వైద్యం, ఆధ్యాత్మికత
వ్యాపారుల, దళారుల వశమై నిరుపయోగమయ్యేను; అంతనూ సరిచేయడానికి
మేధావులు లేరు, గురువులు లేరు, పాలకులు లేరు
ఉద్యమిద్దాం అంటే మన కులం చూసి దూరమయ్యేరు; ప్రాంతం, మతం పేర్లు
చెప్పి నీరు కార్చేరు; కుహనా మేధావులు
తాము చేయలేరు, ఇతరులను చేయనివ్వరు
ద్వేష విద్వేషాలు మాత్రం మస్తుగా పంచేరు
పెంచేరు; ముసలి ఎద్దుల వంటి వీరు పనికిరారు
దేశంలో ఐక్యత కలిగించే మేధావులు ఏదో
సూత్రం కనిపెట్టి ఆ సూత్రంతో భారతీయులను
ఒక గుదిని గుచ్చి అందమైన మాలగా అల్లడానికి
మనందరం సహకరించాలి; మన బాగు చూసుకోవాలి

Tuesday, May 22, 2018

Tide; నొప్పింపక తా నొవ్వక ; సావిత్రి- సినిమా; ఆధునిక కాళిదాసులం; అచ్చు - ఇ-ప్రచురణలు; ఆధునిక రచ్చబండ; Karnataka elections May 2018

Tide
We are all tempted to comment on political, social and other issues as they happen, especially political, which are so volatile and change every minute.
If the political happening is of our liking we comment so immediately and keep quiet if it happens contrary to our liking. Once the tide changed, which is so quickly changing, and favourite to us we again plunge into commenting.
The political leaders and happenings are giving us a tough time for commenting. Still we are coping.
The same coping with near and dear is necessary for a peaceful living.
Tides change with time. Or time changes tide.
Let us be patient.
*******
Many are aware of reality and truth; only few will use it and follow.
********* 
ధనవంతులు ధనం లేనివారిని హీనంగా చూస్తారు.
అలాగే రాజకీయ నాయకులు ఓట్ బేంక్ కాని వారిని హీనంగా చూస్తారు.
********
ప్రస్తుతం తిరుమల అనే బంగారు బాతుని కోసుకొని తినడం జరుగుతోంది.
*********
నొప్పింపక తా నొవ్వక
తప్పించుకు తిరుగు వాడు
ధన్యుడు సుమతీ!
ఈ సత్యాన్ని ఈ రోజుల్లో మనం ఎవ్వరం పట్టించుకోవటం లేదు.
చాలా సంస్కార హీనంగా ఒకరినొకరు నొప్పించుకుంటున్నాము.
అంతర్జాల సాలెగూళ్ళతో అయితే మరీను. విషయం ఏదైనా అటు, ఇటు నిలబడి పోస్ట్ల, కామెంట్ ల, తిరిగి కామెంట్ ల వాగ్బాణాలతో ఒకరినొకరు నొప్పించుకోవడం గొప్ప నాగరికత అయింది. సంస్కృతిలా భాసిల్లుతోంది.
మనసుని నొప్పించడం శరీరానికి చేసే గాయం కన్నా
ఎన్నో రెట్లు ఎక్కువ అని మనందరికీ తెలుసు. అయినా సరే మన అభిప్రాయమే కరెక్ట్, ఇతరుల అభిప్రాయాలు తప్పు అని ఎంచుతూ పోస్ట్ ల లహరిలో కొట్టుకు పోతున్న జాతి మనది. ఒక విషయానికి రెండు వైపులుంటాయని తెలియని జీవులం.
మనకి తెలిసిన సమాచారం మాత్రమే కరెక్ట్ అని మూర్ఖంగా వ్యవహరించడం, మాట్లాడడం ఒక ఫేషన్ అయిపోయింది. చిన్న చిన్న పనికిరాని విషయాల నుంచి, కొట్లాడుకోవడం, కాట్లాడుకోవడం రివాజు అయింది.
మన జ్ఞానం, మన అనుభవం, మన విజ్ఞానం, మన పరిజ్ఞానం పరిమితమైనవి అనే స్పృహ చాలా మందికి లేదు. పసిపిల్లల కన్న కనాకష్టంగా పంతాలు, పట్టింపులకు పోయి అసలే తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉండే ఈ అంతర్జాల స్నేహాల్లో కూడా అహం ప్రదర్శించడం, చంటి పిల్లల లాగ మనదే ఆఖరు మాట అవ్వాలనుకోవడం adults లోని అపరిపక్వతను తెలియజేస్తుంది.
వయసు పెరిగింది కాని అవగాహన పెరగలేదు అని మనకి రూఢిగా తెలుస్తుంది. ఇదే ధోరణి నిజ జీవితాల్లో కూడా ఉంచుకుని అనవసరమైన పంతాలకు పోయి అనుబంధాలను బలహీన పరచుకుంటారు. ఏది ఏమైతేనేమి, ఇందులో ఏముంది, అని విషయాలను తేలికగా తీసి కోవడం నేర్చుకోక పోతే మన జీవితాల నిండా అశాంతి నెలకొని సుఖాన్ని, సంతోషాన్ని హరిస్తాయి.
ఇది గ్రహించి ప్రవర్తిస్తే ఎంతో మానసిక శక్తిని ఆదా చేసుకోవచ్చు.
*******
It is really wonderful, surprising and sycophantic that many intellectuals, media, and party workers still take seriously the abilities of RA GA to lead party and nation to take to excellent heights.
********
Once elections are over the role of citizens is over in Indian democracy. After that it is the show of people's representatives.
The citizens are contacted during next elections only. Between the elections their role is confined to helplessly watch the drama exhibited by their elected representatives.
********
మన వివేకం మన ప్రవర్తనలో తెలుస్తుంది.
మన "జ్ఞానం" మన మాటల్లో తెలుస్తుంది.
********
సావిత్రి- సినిమా
సావిత్రిని, ఆవిడ వ్యక్తి గత జీవితాన్ని ఇంత స్థాయిలో సెలిబ్రేట్ చేసుకోవలసినంత అవసరం తెలుగు జాతికి ఉందా? స్వంత తప్పిదాల వల్ల జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంది మనందరి లాగే.
జెమినీ గణేషన్ సావిత్రి సినిమాలో చూపించినట్టుగా సినిమాల్లో విలన్ లాంటి వాడు కాదని ఆయన కన్న కూతురు ప్రకటన విడుదల చేసింది.
మనందరం ఇలా సావిత్రిని ఎత్తేస్తూంటే మన పిల్లలకు తప్పుడు సందేశం అందుతుంది. పెళ్లైనవాడని తెలిసీ ఎందుకు సావిత్రి తప్పటడుగులు వేసింది? జీవితాన్ని అలా పాడుచేసికొంది? జరిగిన దానికి అంతకీ జెమినీ గణేశన్ మాత్రమే బాధ్యుడనడం వల్ల మన పక్షపాత ధోరణి విదితమౌతుంది తప్ప వాస్తవం తెలియదు.
సంఘంలో వివిధ వృత్తుల్లో ఉన్నవారు వృత్తి స్వరూపాన్ని బట్టి రకరకాలుగా జీవిస్తారు. అవన్నీ సరియైనవి, ఆదర్శమైనవి కాకపోతే మనం వాటి పదే పదే తలుచుకొంటే మన పిల్లలకు మనసుల్లో తప్పుడు భావాలు కలిగిస్తాం. ముఖ్యంగా సినిమా వారిని సినిమా వారిలాగా మాత్రమే చూడాలి. వారి నటనతో మనల్ని ముగ్ధుల్ని చేశారు కదా అని నెత్తిన ఎక్కించుకో కూడదు.
నట, విట, విదూషకులను దూరంగా ఉంచాలి. చోరులు, జారులు, కుటుంబ వ్యవస్థను గౌరవించని వారు, అవినీతి పరులు మనకు ఆదర్శప్రాయులు కారాదు.
ఇది మన సంస్కృతికి, నాగరికతకు సంబంధించిన విషయం. మన పిల్లల మనసులను ప్రభావితం చేసే విషయం. సినిమాని సినిమాలా ఉంచాలి.
అసలే సంస్కృతి విషయంలో ఒక దారి, తెన్నులు లేని మన సంఘంలో మన అతితో తప్పుడు సందేశాలు, సంకేతాలు ఈయరాదు.
తన ప్రవర్తనతో నిర్లక్ష్యంగా తన జీవితాన్ని గడిపిన ఒక స్త్రీ, మనలను ఎంతో అలరించిన నటి కదా అని అవన్నీ మర్చిపోయి మనం ప్రవర్తించరాదు.
గమనిక: ఫేస్బుక్ పోస్ట్లో ఒకావిడ చెప్పారు. జనం అంతా సావిత్రి, సావిత్రి అంటూంటే ఒక ఆధునిక యువతి జెమినీ గణేశన్ వేసిన వాడు చాలా బాగున్నాడే, అబ్బ ఎంత అందంగా ఉన్నాడే, వాణ్ణి చూసి నా మతిపోయింది, వాడే నా crush అందిట.
చూసే చూపులు ఒకే విషయం మీద అందరికీ ఒకే లాగే ఉండదు. "కన్యా వరయతే రూపం"!
మన సినిమా హడావుడులు తగ్గించుకోవడం ఉత్తమం. సావిత్రైనా, ఆమె జీవితమైనా, ఆవిడ జీవితం మీద తీసిన సినిమా అయినా మన స్పందనలు; మన అభిరుచులను, దృష్టులను, ధోరణులను, పరిమితిని, పరిణితిని, పరిపక్వతను తెలియజేస్తాయి. Let us be aware of it.
*******
ఆధునిక కాళిదాసులం
కాళిదాసు పూర్వాశ్రమంలో విద్యాగంధం లేని మూర్ఖుడైన సామాన్యుడు అనీ, కాళికాదేవి అనుగ్రహంతో సకల విద్యా పారంగతుడు, విద్వాంసుడు,, గొప్ప నాటక కర్త అయ్యాడనీ ఐతిహ్యం. ఇందులో నిజానిజాలు కాసేపు పక్కన పెట్టి, ఆయన్ని మూర్ఖుడని ఎందుకన్నారో ఒకసారి చూద్దాం.
రాజకుమారి అహం అణచడానికి, గర్వభంగం చేయడానికి మంత్రి వేసిన పన్నాగంలో భాగంగా కాళిదాసు పూర్వాశ్రమంలో పావుగా ఉపయోగించుకో
బడ్డాడు. మూర్ఖునికై వెతుకుతూ తిరుగుతున్న మంత్రికి తను కూచున్న కొమ్మని తాను నరుక్కుంటూ కనబడ్డాడు. కొమ్మ విరిగితే తాను కిందికి పడిపోతానని తెలియనంత మూర్ఖుడు. మంత్రి అది
గ్రహించి రాచనగరుకు తోడ్కొని పోయి రాజకుమారితో వివాహం చేయించాడు.
తను కూచున్న కొమ్మని తాను నరుక్కుంటే వాడిని కింద పడిపోతానని తెలియని వాడిని మూర్ఖుడంటారు.
మనందరికీ కొమ్మ లాంటి, అమ్మలాంటి కొమ్మలున్న కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకొని, మనకు ఆధారం, నిలువనీడ లేకుండా చేసికునే మనం ఆధునిక కాళిదాసులం కాదా?
********
అచ్చు - ఇ-ప్రచురణలు
ఈ రోజుల్లో కూడా మనం మన రచన ఏదో పత్రికలో పడితే పొందే ఆనందం, అంతర్జాలంలో పెట్టి రసజ్ఞులు దానిని మెచ్చుకున్నా అంత ఆనందం పొందం.
సాంకేతికంగా ఎంతో వృద్ధి చెంది, క్షణాల్లో మన రచన అందరినీ చేరినా, సత్వరం వారు ప్రతిస్పందన తెలియజేసినా మనకు అంత తృప్తి కలగటం లేదు.
ప్రచురించడం నాలుగు వందల ఏళ్ల క్రితం సాంకేతికత. ఇప్పటికే అదే మనల్ని కట్టిపడెయ్యడం వింతల లోకి వింత.
అలాగే పుస్తక ప్రచురణ. అంతర్జాలంలో, ఇ-పుస్తకాలు, ఎన్ని "ప్రచురించినా", అచ్చులో ప్రచురించబడితేనే అది పురస్కారాలకి అర్హం. రచనలో పస కన్న రచన అందించిన విధానానికి పురస్కారం లభిస్తోంది. ఇంతకన్నా వెఱ్ఱి తనం ఉందా?
పుస్తకాన్ని అచ్చు వేయించడం ఆషామాషీ వ్యవహారం కాదు. రచన చేసినవాడే దాన్ని ప్రచురించుకోవాలి.
అది ఓ పెద్ద చేతి చమురు భాగోతం. రచనలు చేసే వారందరికీ పెను ఆర్ధిక భారం. ముఖ్యంగా కవులు, కవయిత్రులు తమ తమ కవనాలని అచ్చేయించు కోవడానికి తెగ ఉత్సాహపడుతూంటారు. కిలమూ వదుల్చుకుంటారు.
అచ్చుకు సంఘం ఇంత ప్రాధాన్యత ఈయడం సాహితీ సృష్టికి, పఠనానికి, ప్రసారానికి ఎంతో అడ్డు. అచ్చు వేయించకపోవడం వల్ల ఎంతో పస కల రచన కూడా సాహితీ రంగానికి అందకుండా పోతుంది.
సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిన నేడు పురస్కార ప్రదాతలు, విమర్శకులు, గుర్తింపు నిచ్చే వారు రచనను అచ్చువేయిస్తే తప్ప పట్టించుకోం అనడం హాస్యాస్పదం. అభివృద్ధి నిరోధకం.
రచనను అచ్చు వేయించుకోవడం సాహితీ స్రష్టకు
మోయలేని భారం. సాహితీ సృష్టే చేస్తాడా, అచ్చు కార్యక్రమంలో మునిగి తేలుతూ సమయాన్ని, డబ్బును, శక్తిని వృథా చేసికుంటాడా?
ఇది మనందరి సమస్య. అందరం ఆలోచించి ఒక పరిష్కారం ఆవిష్కరించడం సాహితీ వేత్తలుగా మన తక్షణ కర్తవ్యం. పుంఖానుపుంఖాలుగా ఇ-రచనలు రావడం ఈ దిశలో ఒక వేగనిరోధకమే
కనీసం పురస్కార ప్రదానాల విషయంలో నైనా ఇ-పుస్తకాలను పరిగణించి తీరాలి. ఇలా చేస్తే సాహితీ స్రష్టలకు ఎంతో శారీరక, మానసిక, ఆర్ధిక భారం తగ్గుతుంది. ఆ సమయాన్ని వారు మెరుగైన రచనలు చేయడానికి ఉపయోగించు కోవచ్చు.
పఠనం, ప్రచారం, ప్రసారం, గుర్తింపు ప్రతి సాహితీ స్రష్టా కోరుకునే కనీస ప్రతి స్పందన. దానిని అచ్చుకు, ఆర్ధిక భారానికి ముడిపెట్టడం సాహితీ స్రష్టలకు గొప్ప అపకారం. సృజనాత్మకతను మొగ్గలోనే తుంచేయడం.
**********
మనం ఎంత, మన అభిప్రాయాలెంత; అనంత
కాల ప్రవాహంలో పుల్ల ముక్కలం కదా మనం
మన మేధ సమాజాన్ని విడదీయడానికి పనికొస్తోంది తప్ప కలదోయడానికి కాదు; సమాజ సుఖశాంతులు
కాదు మనకు కావలసినది; మన పేరు ప్రఖ్యాతులు;
ద్వేష విద్వేషపూరిత మనస్సులతో మత్సరాలు పెంచి
పబ్బం గడుపుకోవడమే మనకు కావలసినది
జ్ఞాన విజ్ఞాన పరిజ్ఞానాలలో మనకు అవగాహన శూన్యం; శాస్త్ర సాహిత్య వేదాంత పరిచయాలు
సున్న; సంస్కృతీ సంప్రదాయాలు ధ్వంసం చేయగలం కాని సౌమనస్య ఆహ్లాదం అందించలేము
ఎందుకో నిలకడయైన, నెమ్మదినిచ్చే బుద్ధి లేనే లేదు
ప్రపంచోద్ధారకులం అనే పనికిరాని అహంతో
ముందు వెనుకలు చూడక మదం తలకెక్కిన వాళ్ళం
సమాజాన్ని బాగు చేయడం చేతకాదు
ఉన్న మంచిని తగలేయడం తెలుసు
దిక్కుమాలిన తర్కంతో, నాస్తి భావాలతో
ఇంగితం లేక ఇరుకు మనసుతో బావిలో కప్పలం
*******
ఆధునిక రచ్చబండ
మనందరి ఫేస్బుక్ విలాపాలు, సల్లాపాలు, కోప, తాపాలు, హర్షోల్లాసాలు, మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి తప్ప రాజకీయ నాయకులకు, వారి వ్యవహార శైలికి ఏమీ మొప్పం ఉండదు.
ఇన్నాళ్లూ రచ్చబండల దగ్గర జరిగే చర్చలు ఇప్పుడు ఫేస్బుక్ లో జరుగుతున్నాయి. అలా ఫేస్బుక్ అంతర్జాల రచ్చబండ. ఎవరి వాగుడు వారిది. ఎవరి ఎగురుడు వారిది.
మన ఇష్ట ప్రకారం జరగనిదానిని జీర్ణించుకోలేక పోతే బ్లడ్ ప్రెషర్ రావడం ఖాయం. అందరూ స్వతంత్ర్య భారతదేశ పౌరులే. సమాన వాక్స్వాతంత్ర్యం ఉన్నవారే. తమ అయిష్టులను, వారి అభిప్రాయాలను అసభ్యంగా దునుమాడేవారే.
ఫేస్బుక్ మానసిక గ్లానులకు ఔషధం. కారణం కూడా.
******
Ageing is the harshest devouring change imposing itself on human body; its appearance and function. I have seen many in their prime and in old age. Old age and then death are: inevitable for any who is born, however eminent or lowly one is.
******
The alliance between Congress and JD (S), that itself is a horse-trading in a bulky way.
Why blame BJP for the same?
Hypocrisy at its height.
తను చేస్తే శృంగారం. ఇతరులు చేస్తే వ్యభిచారం.
*******
మన ప్రజాస్వామ్యం లోని రాజకీయ నాయకులు, పాలకులు
"కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిన్ పొందరే"
అనే పోతన్న గారి భాగవత పద్యం అర్థం పట్టించుకోని వారు.
వారికి శాస్త్ర, సాహిత్య, వేదాంత పరిచయాలు లేవు. జీవితాన్ని గురించిన పూర్ణమైన అవగాహన లేదు. దానికి తోడు పొగరుమోత్తనం, కుల గజ్జి, అంతా తమ ప్రతిభావ్యుత్పన్నతల వల్లనే సాధ్యమౌతోందన్న
అమాయకత్వంతో కూడిన అహంభావం నిండుగా కలిగి ఉండడం; ఇంగితం మరచి తమ స్వార్థం కోసం గుడ్డెద్దు చేలో పడిన వ్యవహారంగా ప్రవర్తించడం.
దాని వల్ల వాళ్ళకీ, మనకూ అపకారం జరుగుతోంది. వారు అది పట్టించుకునే సమయం, దృష్టి లేకుండా దేశాన్ని, సంఘాన్ని అశాంతితో, కష్టాలతో నింపుతున్నారు.
There is a law of nature: in the universe order and disorder follow each other.
ప్రస్తుతం disorder నడుస్తోంది.
ఇది చక్ర భ్రమణం.
******
మరణించిన వారి మంచిని‌ వేనోళ్ళ పొగిడే వాళ్ళు ఎక్కువై పోయారు
బ్రతికున్న మంచి వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే వారు కరువయ్యారు;
మరణమంటే ఎందుకంత గౌరవం?
జీవించి ఉన్నవారంటే ఎందుకింత లోకువ?
మంచితనం గుర్తించబడాలంటే
మనిషి మరణించి తీరాలా?
*******
Two Telugu news papers set news items and write articles equating Andhra Pradesh people with Telugu Desam party.
These two news papers forget that Telugu Desam is a political party and does not represent all citizens of Andhra Pradesh.
And center or rest of the citizens of Andhra Pradesh need not and will not identify themselves with Telugu Desam party.
Governments have to rule beyond their party and party and government are different. The duty of executive is different and not Xerox copy of political party in power. Roughly in 70 years political parties forgot these simple constitutional norms and are arrogating themselves and made this thin speration non-existent between party and government and behave unconstitutionally.
Telugu Desam party's interests are not the interests of Andhra Pradesh citizens.
*******
Mr. Siddaramiah was in JD (S) for decades and migrated to Congress having differences with Deve Gowda in elevating Kumara Swamy as important person in JD (S) and future chief minister. Thus Siddaramiah is not a Congressman at the roots level.
Because JD(S) is a family owned party, like any other counterpart none except for Party Chief's family members can be proposed to the highest positions.
And as my friend has pointed out, JD(S) ditched BJP after understanding to hand over chief ministership to BJP in second half. But JD (S) did not do so saying BJP is not a secular party after enjoying power for 2 and 1/2 years with BJP support!!!!!!!!
None of Indian media or intellectuals questioned it, as usual. Now the coalition of JD (S) and Congress is planned under Kumara Swamy's chief ministership.
The Indian media has always batted for first inviting largest single party to form government. But now BJP will be the beneficiary, so they will say there is already a post-poll understanding and JD(S) coalition with Congress, and they have numbers, it must be invited to form government. Though pre-poll understanding has relevance and not post-poll understanding. Siddaramiah ruled out any understanding with JD (S) as late as yesterday.
This is all to say about the quality of Indian politicians, political parties, and their running of parties and governments. Yes we all know this. This is another reminder.
The moment election is over and governments are formed the voters are completely conveniently neglected and only power sharing and looting will be on the agenda of politicians to which they give various guises and wear masks.
And most importantly the coalition partners have to meet separately, bring out a resolution and together, a combined legislature party leader is to be elected and then they can hand over the letter in relation to election of leader and governor using his discretion, can accede to the request or can deny.
Let us continue observing this shameless
behavior of our leaders.
******
I read in Deccan Herald, Bangalore edition, in December 2017 that Congress cannot win in the 2018 assembly election getting a majority of its own, but will form a government with JD (S). He also predicted that such a government will fall and elections have to be held again ln very near future. I was fascinated to see first part of that prediction coming true.
Now that Congress is having an infamous history of its own that making government fall at its time of choice, as it happened to Charan Singh, Chandrasekhar, IK. Gujral and Deve Gowda, the second part of that prediction may also turn out to be true.
But Kumara Swamy will still form government with Congress. It is again the fate of Congress that though it got more seats, it cannot have its chief minister, thus thwarting the ambitions of Kharge or Shiva Kumar.
Let us follow the drama as is getting unveiled.
Now that Congress may be part of new government under Kumara Swamy, EVM tampering charge is not labelled, it seems.
*****
It would be useful if after so many wins and defeats, the politicians realize that the real power in a democracy is with citizens as voters, and not in them as leaders or rulers.
What all the power felt to be with rulers is not theirs but of people's. It is not the greatness of leaders and their capabilities but of voters'.
This realization dawns on politicians after each election defeat, but gets masked by ego and self-praise after each win. They feel invincible and become arrogant once they get elected.
*****
మీకెరికే
దాహంగా ఉంది మంచినీళ్లు కావాలంటే ఉచితంగా వై ఫై అందించాం మీకు అంటారు; పీల్చడానికి శుభ్రమైన గాలి కావాలంటే చంద్ర మండలం నుంచి ఆక్సిజన్
సిలిండర్లు దిగుమతికి ఆర్డరిచ్చామంటారు; తిండి
సంపాదించు కోవడానికి కొలువిమ్మంటే వారికో వీరికో
రిజర్వేషన్ సదుపాయం కల్పించామంటారు; మాకు
హుందాగా బతకాలని ఉంది అంటే ఋణ మాఫీ చేస్తామని మానిఫెస్టో లో పొందుపరిచాం కదా
అంటారు; దేశంలో శాంతి భద్రతలు కాపాడండి అంటే
వారికి మైనారిటీ స్టేటస్ ఇచ్చాం కదా అంటారు; అవి నీతి, బంధుప్రీతి, చీకటి సొమ్ము, ఆశ్రిత పక్షపాతం పెరిగి పోయాయంటే, బాబుని, పాపని రాజకీయాల్లోకి
తెచ్చాం కదా; కొత్త రాజధాని కడతాం కదా అంటారు
శత్రు దేశాలు మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయంటే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కదా అంటారు; ప్రతి రాష్ట్రం ఒక దేశం
అవ్వాలంటారు ఏమిటి అంటే ఆర్యులు ద్రావిడులు
మనుషులు మనసులు కలవని రెండు విభిన్న సంస్కృతులంటారు; ద్రావిడులన్నవారే రెండు రాష్ట్రాలుగా విడిపోయారేమిటంటే ఇక్కడా సంస్కృతి
వేరంటారు; ఆత్మగౌరవం కాపాడడానికి అంటారు
ప్రతి ఛిద్రానికీ తామే కారణమై, ప్రతి అవినీతిలో
భాగాలు పంచుకొని, "మనోణ్ణి" తప్ప మరోడి పొడ
గిట్టకుండా తంత్రం నడిపి అందరినీ విడదీసి, తమకే
మళ్ళీ ఓటు వేయమనే చాణక్యులు; ఎవరు, మీకెరికే
*******
జనాలకి విషాదం నచ్చినట్టు సంతోషం నచ్చదు. సావిత్రి బదులు అంజలీదేవి సినిమా తీస్తే ఎందరు చూసేవారు?
*******
సావిత్రి నామ స్మరణ కొన్నాళ్ళుంటుంది. అసలు నటీనటులకు మన జీవితాల్లో ఇంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత అవసరమా?
*******
భాషలు-చదువు-శ్రద్ధ
భాషలు సరిగా నేర్చుకోవడం ఆధునికుల వల్ల కాదు. తెలుగు భాషే కాదు, ఏ భాషా ఎవరు సరిగా నేర్చుకోవడం లేదు. ఎవరికీ శ్రద్ధ లేదు. ఇంటర్నెట్లో ఉండే వార్తల్లో, రోజూ వచ్చే వార్తాపత్రికలలోనూ గత ఇరవై, ముప్ఫై ఏళ్లుగా భాషని అశ్రద్ధగా రాస్తున్నారు. ఎంతో గొప్పగా చెప్పుకునే ది హిందూ నుంచి అన్ని పత్రికల్లోనూ స్పెల్లింగ్, గ్రామర్ తప్పులే. తెలుగులో అయితే ఇంటర్నెట్ లో అన్నీ వర్ణక్రమ దోషాలే.
ప్రతి భాషకు ఒక నిర్దుష్టమైన భాష ఉండాలి. మన తెలుగు భాషకు అది లేదు. పైగా అక్షరాలకు అక్షరాలే తీసి పారేశారు. భాష ఎవరి సొత్తు? ఉమ్మడి ఆస్తి. కాని ఆ ఉమ్మడి తెగ తెగకీ తెగ మారిపోయింది.
పిల్లలు, యువతీయువకులు, పెద్దలు అందరూ, వారూ, వీరని లేక ఎంతో, వీలయినంత అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా భాషని రాస్తున్నారు. మాట్లాడడంలో ఎలాగా పొంతన ఉండదు. మాండలికమైనా దానికి అణుగుణంగా వర్ణక్రమము ఉండాలి కదా. అది కూడా తెలియదు చాలా మందికి. అసలు ఎందుకని శ్రద్ధ వహించాలి అనే వాళ్ళు ఎక్కువై పోయారు.
చదువులూ అలాగే ఉన్నాయి. భాషాధ్యయనం అంతకు ఇంకా దిగదుడుపుగా ఉంది. చదువు మీద గాని, భాషాధ్యయనం మీదగాని దృష్టి పెట్టకుండా మేధావులు, పండితులు, ఆచార్యులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు అయిపోతున్నారు.
ఈ వాతావరణంలో భాష మీద శ్రద్ధ పెట్టక పోవడం సహజమై పోయింది. అన్ని దిగజారుడులలో ఇదొకటి. అంతే. ఎవరికి పుట్టేవురా ఎంకన్నా, ఎక్కెక్కి ఏడుస్తున్నావు అన్నట్లుంది సంఘం పరిస్థితి, సంఘంలో విషయాలు, ఘటనలు.

టి . టి . డి .; రక్షణపై విముఖత ?; గింజ-పొల్లు; JD (S); గొప్ప విచిత్రం; Language and individuals; జన్మ-సంసారము; పులుపులు-సలుపులు-తీపులు

టి . టి . డి . 

టి.టి.డి. వ్యవహారానికి కుల గజ్జి పట్టించి అసలు సమస్యలను వెనక్కి నెట్టేసిన నాయక గణం 
రాజకీయాల్లోని విభజించి పాలించు అన్న లాభసాటి వ్యాపారాన్ని ఇక్కడా మొదలు పెట్టారు. అంతర్జాల మాధ్యమాల్లో రాష్ట్ర, దేశ, అంతర్జాతీయంగా డప్పుకొట్టుకొంటున్నారు.
రాష్ట్రంలో కుల గజ్జి చేయలేనిది లేదు.

********
All religions are great and are for the well-being of humans. The great problem is with the followers of these great religions.
*******
రక్షణపై విముఖత ?;

క్రూర జంతువులకి దూరంగా జరిగి వెళ్ళిపోతాం
అడవిలో; నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా అనం
కాని సమాజమనే క్రూరారణ్యంలో అర్ధరాత్రి అయినా
మా ఇ‌ష్టం వచ్చినట్లు తిరుగుతాము అంటామేమిటి?
అరణ్యంలో భయం ప్రాణంపై
మరి సమాజారణ్యంలో
ఎందుకీ విముఖత రక్షణపై?
*******
గింజ-పొల్లు
నాలాంటి చాలా మంది ఫేస్బుక్ రచయితలు/రచయిత్రులం మా మా రచనల ఆధారంగా మా గ్రేడ్ నిర్ణయించేసుకొని ఆ ఆభిజాత్యంతో పాఠకులైన ఇతర మిత్రులని కలవర పెడుతూంటాము.
నిజానికి ఏ రచన గొప్పది, ఏ రచయిత/రచయిత్రి గొప్పవారు అంటే ఇతమిత్థంగా ఏమీ చెప్పలేమనుకోండి. కాకి పిల్ల కాకికి ముద్దు లెవెల్లో నడుస్తూ ఉంటాము, నడిపిస్తూ ఉంటాము మా రచనలను మా బోంట్లం.
రచన రచయిత కోసమా? పాఠకుని కోసమా? చాలా మంది , రచయిత ఆత్మ తృప్తి కోసం రాసుకుంటాడు అంటారు. అంతవరకు బాగానే ఉంది కాని తను మాత్రమే చదువుకోగల విధంగా రాస్తే అందరికీ ఇబ్బందే. ఈ రోజుల్లో ఏ రచననీ ఎవరూ విమర్శించరాదు.
రచయితలలో ఎన్నో వర్గాల వారు. అలాగే రచయిత్రులు ఒక వర్గంగా పురుషాధిక్య సమాజం పై బాణాలు, తుపాకులు ఎక్కుపెట్టి ఉంచుతున్నారు. ఈ వర్గ విభజన ఆధారంగానే రచన పస నిర్ణయింపబడుతోంది.
అటువంటప్పుడు రచన కన్న రాసిన వర్గానికే పెద్దపీట వేయబడుతోంది. రచన రచయిత వర్గం ముందు వెల వెల బోతోంది. అందువల్ల ఫేస్బుక్ రచయితల్లో ఎక్కువ మందిమి వర్గం పసనే ఎక్కువగా చూపిస్తున్నాం.
మరొకలా, రచనలు పాఠకులకోసం కాకుండా రచయితలు పేరు ప్రఖ్యాతులు పొందడం కోసమే రాయబడుతున్నాయి. అందులో పాఠకులకి ఉపయోగించే అంశాలు దాదాపు ఉండటం లేదు. రచించిన వారి వర్గ సానుభూతి కోసమే రాయబడుతున్నాయా అన్నట్లు ఉంటున్నాయి.
రచించే వారు, విమర్శకులు, పాఠకులు వర్గాలుగా విడిపోయి సాహితీ సృష్టి, "సేవ", పఠనం చేస్తున్న నేడు ఏది పస గల రచన? ఏది పొల్లు చెబితే గొడవలైపోయేలా ఉన్నాయి.
అయినా సర్వ స్వతంత్ర భారతావనిలో భావ ప్రకటనా స్వేచ్ఛ అతిగా ఉన్న ఇప్పుడు గింజ, పొల్లు గురించి మాట్లాడడం అమాయకత్వం.
*********
JD (S)
Instead of calmly enjoying power in Karnataka, the JD (S) is messing up itself with grand illusion of opposition unity for 2019 parliament elections induced by Congress and other bewildered politicians from all over India.
JD(s) is erroneously feeling and trying to defeat Modi rather than providing a good governance to citizens of Karnataka.
Not a wise thing do. This is how Kejriwal disused his election and popularity.
God save JD(S).
********
మేం నెలలో బెంగుళూరులో ప్రతి సాయంత్రం వర్షం తప్పక పడుతుంది. వాతావరణాన్ని చల్లబరుస్తుంది. మనసులని ఆహ్లాదపరుస్తుంది.
వర్షం తెచ్చే హర్షం మనసుకి ఆహ్లాదం
నెచ్చెలి ఇచ్చే వెచ్చటి కౌగిలియూ ప్రమోదం
********
 గొప్ప విచిత్రం 
చాలా మంది చాలామంది కళాకారులని, ఇతర రంగాలలో నిష్ణాతులైన వారిని వారు బ్రతికి ఉండగా పట్టించుకోరు. చనిపోయాక మాత్రం నివాళులు ఘనంగా అర్పిస్తారు. అప్పుడు ఆ కళాకారులని, నిష్ణాతులైన వ్యక్తుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులే కనిపెట్టుకుని ఉంటారు. అన్ని సంఘాలలోను ఇదో గొప్ప విచిత్రం. 
**********
Language and individuals

Literature in India is undergoing stress and strain for want of readers who are proficient in respective languages. Thus the problem also is many youngsters are not learning languages in earnestness and eventually it is readers who are oxygen to the life and or death of a work.
This kind of disinterested - ness among youth about language is another impediment for literature to flourish. Unless readers are also adept in language, creations by writers will be neglected for want of ability to understand by readers.
Apathy for language learning and proper usage is one of the greatest dangerous trends for demise of culture and eventually, civilization.
Internet, sms etc,. communications have made individuals lazy in spelling writing and disrespecting grammar rules is further complicating communication and responses.
This is all reflection of our waywardness in learning and using languages. The society's grace and etiquette are best and adequately reflected in language learning and usage.
We are negligent of language learning and usage means we are negligent of living.
Such an attitude further makes us vulnerable to politicians, criminals, spiritual gurus and the rest of the societies. This negligence in relation to language also reflects our promiscuity in maintaining relationships and many other social involvements.
We are not serious about language means we are not serious to live and shine as cultured and civilized human beings.
*********
Ways of Destiny
Karnataka developments must have been music to Congress, Kumara Swamy, secularists, lovers of democracy, believers in judiciary and political leaders of regional parties.
But in the midst of celebrations by all these only one person who is swept by fate and destined to be in association with JD(S), and Kumara Swamy, Mr. Siddaramiah must be wondering the doings of fate.
He left JD(S) in fight with Deve Gowda on the issue of rise of Kumara Swamy in JD(S) at his cost. But now he is made to be compulsorily with Kumara Swamy by his adopted party.
And also the dreams of Kharge and Sivakumar of Congress are also shattered by destiny. The taking place of an event makes some jubilant and some melonchic.
Funny and harsh are the ways of destiny!
*********
చనిపోతేనే అవుతారు మనుషులు గొప్ప వాళ్ళు
బ్రతికుంటే అంతా ఈసడింపు, దూషణ, తిరస్కారములే
*********
జన్మ-సంసారము

విష్ణు సహస్రనామ శ్లోకం:
యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే !!
ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే !!
ఈ పై శ్లోకంలో
మహావిష్ణువు నామం స్మరిస్తే జన్మ వల్ల కలిగిన సంసార బంధాన్నించి ముక్తిని కలిగించే విష్ణువు, ప్రభ విష్ణువునకు నమస్కారము
అని చెప్పబడినది.
ఇక్కడ జన్మ అనగానే మానవ జన్మ అని వ్యాఖ్యానిస్తారు. సంసారం అంటే భార్య/భర్త, పిల్లలు ఇత్యాది అంటారు.
కాని జన్మ అంటే తలపుల రూపమైన వ్యక్తిత్వం, అహంకార, అహంభావ, మమకారములు మన మానసిక దృష్టి లోకి రావడం. మరణం అంటే ఆ తలపులు నిండుకోవడం.
మనకు జాగ్రత్, స్వప్న, సుషుప్తి, జాగ్రత్ సుషుప్తులనే నాలుగు మానసిక దశలు ఉన్నాయి.
ఇందులో జాగ్రత్, స్వప్న మానసిక దశలలో మాత్రమే తలపులు కలుగుతాయి. ఆ తలపులు, వాటిలో ఉండే విషయ సమూహములు కలిగించే సుఖ దుఃఖానుభవములే సంసారం.
మనం నారాయణ నామ స్మరణం చేస్తోంటే మానసిక రూపములు మాత్రమే అయిన ఈ జన్మ, సంస్కారములు దృ‌ష్టిలోకి రావు. దృష్టిలో ఉండవు.
ఈ మానసిక కార్యకలాపాలు విరమింపబడిన, దృష్టిలో లేని క్షణాలే సుఖశాంతులు.
అందువల్ల శ్రీమన్నారాయణుడైన మహావిష్ణువు తన నామస్మరణం మనం చేస్తున్నంతసేపు మనకు జన్మ, సంసార బంధముల వల్ల ఏర్పడిన, ఏర్పడే క్లేశములు కలుగకుండా చూస్తాడు. భవబంధ జనిత
రాగద్వేషాలు, సుఖదుఃఖాలు తలపులు, అనుభవములుగా లేకుండా చేస్తాడు.
తన ప్రసాద, ప్రహ్లాద దృష్టులతో ప్రహ్లాదులను చేస్తాడు.
మోక్షాన్ని ఇస్తాడు. మానసిక విరామ రామ సమయాన్ని నిరంతర అనుభవంగా చేస్తాడు.
మోక్షమంటే ఆహ్లాదమే. ఆహ్లాదం మన సహజ నిరంతర అనుభవం.
ఓం నమో నారాయణాయ!
********
పులుపులు-సలుపులు-తీపులు

సినిమాల నుంచి బయటపడలేము,
మన తిండి, నీళ్లు, ఊపిరి, సినిమాలే;
ఇరవయ్యవ శతాబ్దపు ఈ ఇంద్రజాలం
మన ధన, మాన, అభిమానాలని కొల్లగొట్టింది;
మన ధ్యాస, ధ్యానం సినిమాలే, అందులోని తారలే;
తమి తీరే కాలక్షేపం లేని మనకు గొప్ప కాలయాపన
సినిమా, దానికి సంబంధించిన విశేషాలు;
ఆ తర్వాత మనల్ని కట్టిపడేసేవి రాజకీయాలు
మనల్ని గొఱ్ఱెలను చేసి మనతో ఆడుకోవడం
నాయకులకు నల్లేరు మీద బండి నడక అయింది
మన జీవితాలకు ఏ వెలుగూ ప్రసాదించని, ప్రసాదించడం తెలియని వీరి పాలనలు గుదిబండలు
సాహిత్యం, విజ్ఞానం, పరిజ్ఞానం, లలిత కళలు, ఆధ్యాత్మికతల జోలికి పోనే పోము మనం; మనకు
ప్రసిద్ధ వ్యక్తులు, సినిమా, రాజకీయం, క్రికెట్, ఆధునిక
ఆర్ధిక సామ్రాజ్య చక్రవర్తులు మాత్రమే; మన క్షేమం,
మన స్థిమితం, జీవితంలో సంతృప్తి మనకు అందవు
అందని మ్రాని పండు పులుపు కదా
కానీ అమాయక, అజ్ఞానపు బ్రతుకు సలుపు కదా
తీపిగా ఉన్నా, మన మనసులకు తీపులు కలిగించు