పాండిచేరి చుట్టుపక్కల దర్శనీయ పురాతన దేవాలయములు
అరవిందాశ్రమము
పాండిచేరి అనగానే అందరకు అరవిందులు, వారి ఆశ్రమము గుర్తుకు వస్తాయి. అది చూసాక కొంత సంతృప్తి రహితముగా వెనుదిరుగుతారు. అరవిందుల ఆశ్రమములో ఏముంటుంది? ఒక సమాధి ఉంటుంది. అక్కడ మనలని సెల్ ఫోన్లు కట్టెయ్యమంటారు. కొద్దిగా ముందుకు వెళితే ఒక సమాధి దాని మీద ఆనుకుని కొందరు మనుషులు ఏదో చేస్తూంటారు. బహుశా ధ్యానము. అంతా నిశ్శబ్దముగా కూర్చుని ఉంటారు; ధ్యానము. అరవిందులు 1910లో ఆంగ్లేయుల బారినుంచి తప్పించు కొనేందుకు ఫ్రెంచ్ వాళ్ళ ఆధీనములో ఉన్న పాండిచేరికి వలస వచ్చారు. అప్పటికి ఆయనకు కొంత ఆధ్యాత్మిక అనుభవములు కలిగి ఉన్నాయి. బరోడాలో ఉన్నప్పుడు దేవీ ఉపాసన చేసేవార; కలకత్తాలో జైలులో ఉన్నప్పుడు నారాయణ దర్శనము జరిగింది. అప్పటినుంచి ఆయనలో విపరీతమైన మార్పు వచ్చింది. విప్లవ మార్గము వదిలేసి ఆధ్యాత్మిక మార్గములోకి వచ్చారు. ఆయన పాండిచేరి వచ్చాక ఆధ్యాత్మిక గ్రంథ రచన మొదలుపెట్టారు. ఆ సమయములో ఫ్రెంచి దేశస్థురాలు, తరువాత మదర్ గా ప్రసిద్ధి గాంచిన ఒక ఆవిడ శిష్యురాలిగా చేరింది. అరవిందుల సామీప్యము పొంది ఆయన ప్రభావమునకు లోనై ఆయన ఉపదేశములను, రచనలను ప్రాచుర్యములోనికి తీసుకుని వచ్చింది.
అరవిందుల పేరు, తత్త్వము ఖండ ఖండాంతరములకు వ్యాపించేలా చేసింది. అరవిందుల తరువాత ఆశ్రమ నిర్వాహకురాలు అయింది. అరవిందులు 1950లో, మదర్ నామధేయురాలైన ఈ శిష్యురాలు 1972లో మరణించారు. ఈ సమాధిలో ఇద్దరినీ సమాంతరముగా పాతి పెట్టారని కథనము. అందుకే ఆ సమాధికి అంత ప్రశస్తి. అరవిందులు పోయాక మదర్ ఆరో విల్లె అని పక్కన తమిళనాడులో ఒక అంతర్జాతీయ నగర నిర్మాణానికి పునాదులు వేసింది.ఎందఱో విదేశీయులు, కొందరు భారతీయులు ఇక్కడ అన్ని విభేదములకు అతీతముగా జీవించే స్థలముగా దీనిని తయారుచేయడానికి ఉద్యుక్తులు అయ్యారు. అక్కడ ఒక గ్లోబ్ ని మెడిటేషన్ సెంటర్ గా తయారుచేసారు. కాని ఇప్పుడు వారిలో వారికి పడక గ్లోబ్ ని ప్రజల సందర్శనార్ధము అనుమతించడము లేదు. ఇది పాండిచేరి పట్టణానికి 10 కిలోమీటర్ల లో ఉంది. ఒక అర కిలో మీటర్ దూరము నుంచి గ్లోబ్ ఆకారములో ఉన్న ఈ ధ్యాన మందిరాన్ని వీక్షించవచ్చు.
సుబ్రహ్మణ్య భారతి
నేను పదునాలుగు ఏళ్ల క్రితము పాండిచేరి ఉద్యోగ రీత్యా వచ్చాను. ఈ నెల (నవంబర్) 30 న రిటైర్ అవుతాను. నాకు ఇక్కడికి రాని క్రితము నుంచి పాండిచేరి అంటే ఇష్టము. అందరికీ అరవిందుల వల్ల పాండిచ్చేరి దర్శన ఉత్సుకత కలిగితే నాకు మహాకవి సుబ్రహ్మణ్య భారతి వల్ల పాండిచేరి దర్శన ఉత్సుకత కలిగింది. నాకు సుబ్రహ్మణ్య భారతి ఇష్టమైన కవి. ఆయన కవిత్వం, వ్యక్తిత్వం సమానముగా ఇష్టము. మదురై తెలుగు విభాగములో అప్పుడు ఆచార్యులుగా ఉన్న డా. చల్లా రాధాకృష్ణ శర్మ గారు యువభారతి ఆధ్వర్యములో తెలుగు లోకి అనువదింఛిన సుబ్రహ్మణ్య భారతి కవితా వైభవము చదివి భారతి కవిత్వంతో పరిచయము కలిగించుకున్నాను. ఆయన వ్యక్తిత్వము సాహిత్య అకాడమీ వారు భారతి పై ప్రచురించిన చిన్ని పొత్తము చదివినపుదు కలిగింది. ఐశ్వర్యములో తులతూగుతూ టాగూరు కవితా వ్యవసాయము చేస్తే, భారతి, కుటుంబం కూడా ఒక పూట తింటే ఒక పూట తినక ఉన్న స్థితిలో ఎంతో గొప్ప కవిత్వము వెలయించాడు భారతి.
సుబ్రహ్మణ్య భారతి కూడా ఆంగ్లేయుల బారి నుంచి తప్పించుకోవడానికి పాండిచేరి వచ్చి నివాసము ఏర్పరుచుకున్నాడు. ఈయన అరవిందులు ఇక్కడ సమకాలికులు. 1910-1919 ల మధ్య నివసించారు. ఒకరినొకరు ఒక సారి కలిసారు అంతే.
ఇక్కడ ఉన్నప్పుడు భారతి ఎన్నో ఉదాత్తమైన కవితలు రచించాడు. తెలుగు భాషని "సుందర తెలుంగు" అని అభిమానముగా ప్రేమగా గానము చేసి, కీర్తించినవాడు భారతి. ఇక్కడికి వచ్చాక ఆయన ఏ ఏ చోట్ల కూర్చుని కవిత్వము రాశారో ఆ ప్రదేశాలన్నీ చూసాను. చిదానందస్వామి కోయిల్, కొబ్బరి తోపులు అందులో ముఖ్యమైనవి.
ఇతర స్థలములు:
ఇక్కడ బీచ్ బాగుంటుంది. అరవిందుల సమాధి చోటుకు బీచ్ కూత వేటు దూరములో ఉంటుంది. ఇక్కడే పాత లైట్ హౌస్, రెండవ ప్రపంచ యుద్ధములో మరణించిన ఫ్రెంచ్ సైనికుల స్మారక చిహ్నము ఉన్నాయి. ఒకటి రెండు దర్శనీయ రూపాంతర దేవాలయములూ ఉన్నాయి (చర్చ్, మసీద్). వీటి పక్కనే పాండిచేరి అసెంబ్లీ భవనము, లెఫ్టినెంట్ గవర్నర్ నివాసస్థలము ఉన్నయి. దీని పక్కనే మనాకుళ వినాయకర్ కోవిల్ అని ఒక మహిమ గల గణపతి దేవాలయము ఉంది. శుక్రవారము రద్దీ గా ఉంటుంది.
పాండిచేరిలో నగరం మధ్యలో వేదపురీశ్వ రుని ఆలయము ఉంది. అమ్మవారు త్రిపుర సుందరి. ఈ దేవి త్రిపురసుందరీ దశ శ్లోకీ అనే సంస్కృత కవిత దయతో నాచే రాయించింది. దీనికి ప్రక్కనే వరదరాజ స్వామి ఆలయము ఉంది. అమ్మవారు పేరిందేవి. కంచి వరద రాజ స్వామి అలయం లో వలె బల్లి స్పర్శనము ఉంది
తిండివనం వైపు
పంచవటి
ఇక్కడ నిలువెత్తు పంచ ముఖ (హనుమ, నరసింహ, వరాహ, హయగ్రీయ (హనుమంతుని నెత్తి మీద), గరుత్మంత (ఆంజనేయుని ముఖము వెనుక - వెనుక వైపునుంచి చూడాలి) ఆంజనేయ స్వామీ దేవాలయము ఉంది. చాలా పొడుగైనది. ప్రొద్దుట 7 నుంచి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. నిరంతరముగా ప్రసాదము పెడతారు - దద్ద్యోజనము, పులిహార, పొంగల్, ఉప్పుపిండి పొంగల్, సాంబారు అన్నము - వీటిలో ఏదో ఒకటి. ఇది పాండిచేరికి 10 కిలోమీటర్లలో ఉంది.
మైలం
ఇక్కడ ఒక పురాతనమైన సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయము ఉంది. శ్రీ వల్లి దేవసేనలతో స్వామి అలరారుతో ఉంటాడు. పాండిచేరికి 25 కిలోమీటర్లు.
తిరువక్కరై
మైలం నుంచి తిరిగి వస్తూంటే ఈ క్షేత్రానికి రోడ్డు మళ్ళుతుంది. అలా వెళితే వక్ర కాళీ అమ్మన్ దేవాలయము వస్తుంది. ఇదీ మహిమగల, పురాతనమైన దేవాలయము. అమ్మవారు విగ్రహములో వక్రము (వంకర) గా కూర్చుని ఉంటుంది . దీని పక్కనే ఒక శివాలయము, విష్ణ్వాలయము ఉన్నాయి. శివుని పేరు చంద్రమౌళీశ్వరుడు. ముఖరూపములో ఉంటాడు. చుట్టూ ఉండే అద్దములలో వివిధముగా కనిపిస్తాడు.
జింజి:
ఇది గొప్ప చారిత్రిక ప్రదేశము. పల్లవులనుంచి, చోళులు, విజయనగర రాజులు, హైదరాలి, టిప్పు సుల్తాన్, ఆంగ్లేయులు, ఫ్రెంచి వారి పాలనలు చవి చూచిన కోట. చాలా పెద్దది. ఇప్పుడు బాగా శిథిలమైపోయింది. చరిత్ర అంటే ఇష్టము అయినవారికి దర్శనీయ స్థలము.ఇక్కడ నుంచి కూడా అరుణా చలం వెళ్ళవచ్చు
కంచి ఈ దిశలో పాండిచేరికి 150 కిలోమీటర్లు.
విల్లుపురం వైపు
విల్లియానూర్
పాండిచేరి ప్రాంతమే అయిన విల్లియానూర్లో పురాతన శివాలయము ఉంది. విజయనగర రాజుల ప్రాపకము సంపాదించిన గుడి. శివుడు తిరుకామేశ్వరుడు, అమ్మవారు కోకిలాంబ. పక్కనే ఈ మధ్య కట్టిన విష్ణుమూర్తి ఆలయము ఉంది. వరదరాజ స్వామి ఆయన పేరు. పక్కనే భూ, శ్రీ దేవులుంటారు. 7 కిలోమీటర్లు
తిరుబువనై
విల్లియానూరుకు విల్లుపురం మార్గములో 16 కిలోమీటర్ల దూరములో తిరుబువనై క్షేత్రము ఉంది. ఇది పాండిచేరి ప్రాంతమే. ఇక్కడ తోతాద్రినాథన్ పేరుతొ విష్ణుమూర్తి వెలసి ఉంటాడు. ప్రక్కన శ్రీదేవి, భూదేవి ఉంటారు. చాలా పురాతన ఆలయము. పరాంతక చోళుడు 907-827 మధ్యలో ఈ ఆలయము కట్టించాడు. ఎంతో బాగుంటుంది. చిన్ని గుడి. కాని ఆహ్లాదముగా ఉంటుంది . అమ్మవారి పేరు వర మంగై తాయారు. తాయారు అంటే తల్లి గారు అని అర్ధము. తాయ్ అంటే తమిళం లో తల్లి. దానికి యార్ చేరిస్తి గారు అవుతుంది. మన అలమేలు మంగ తాయార్ పదం ఇలా ఏర్పడిందే.
అరుణాచలంగా పిలువబడే తిరువణ్ణామలై ఈ దిశలో పాండిచేరికి 100 కిలోమీటర్లు.
కడలూరు వైపు
స్వాతంత్ర్య సమరం రోజుల్లో ఎందఱో మన స్వాతంత్ర్య సమారా యోధులను కడలూరు జైల్లో ఉంచేవారు. కడలూరు జిల్లా కేంద్రము. తమిళనాడులో ఉంటుంది. ఇది ఒకప్పుడు జైన మతానికి కేంద్రము.
మధ్యలో బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. జింజి నది సముద్రములో కలిసే ప్రాంతము.
అభిషేకపాక్కము
ఇది పాండిచేరి ప్రాంతమే. 14 కిలోమీటర్లు పాండిచేరి నుంచి. ఇక్కడ పురాతన నరసింహ స్వామి ఆలయం ఉంది. . మన ప్రియతమ ప్రధాన మంత్రి పి. వి. నరసింహారావుగారు ప్రత్యేకముగా దీనిని దర్శించారు.
తిరువంతిపురం
30 కిలోమీటర్లు
దీనిని ప్రథమ తిరుపతి అంటారు. విష్ణు మూర్తి ఆలయము. దేవుని పేరు దేవాదినాథన్. అమ్మవారు అమృతవల్లితాయార్. విశిష్టాద్వైత వేదాన్తులలో ప్రసిద్దులైన వేదాంతదేశికులకి ఈ దేవాలయముతో గాఢానుబంధము ఉంది. ఈ ఆలయము ఒక నదిని ఆనుకుని ఒడ్డున ఉంది. పక్కన ఒక చిన్ని కొండ ఉంది. దీని మీద లక్ష్మీ హయగ్రీవుల ఆలయము ఉంది. ఆలయము పక్కనే ఒక ప్రదేశము లో వేదాంత దెశికులకి హయగ్రీవ దర్శనము జరిగింది. హయగ్రీవులు వైష్ణవ సాంప్రదాయములో తత్త్వ గురువులు. శ్రీ దక్షిణా మూర్తి శైవ సంప్రదాయములో తత్త్వ గురువులు.
చిదంబరం (70), వైద్యనాథన్, శీర్కాలి, అబిరామి (100) దేవాలయములు వరసగా ఈ వైపు ఉన్నాయి.. ఇంకాస్త ముందుకు వెళితే కుంభకోణం, తంజావూరు, తిరుచిరాపల్లి, శ్రీరంగం వస్తాయి.
నేను డిసెంబర్ నెలలో పాండిచేరి నుంచి వచ్చేస్తాను. మా స్వగ్రామము భిమవరములో స్థిరడతాను. అందుకే ఈ చిన్న స్మరణ.
అరవిందాశ్రమము
పాండిచేరి అనగానే అందరకు అరవిందులు, వారి ఆశ్రమము గుర్తుకు వస్తాయి. అది చూసాక కొంత సంతృప్తి రహితముగా వెనుదిరుగుతారు. అరవిందుల ఆశ్రమములో ఏముంటుంది? ఒక సమాధి ఉంటుంది. అక్కడ మనలని సెల్ ఫోన్లు కట్టెయ్యమంటారు. కొద్దిగా ముందుకు వెళితే ఒక సమాధి దాని మీద ఆనుకుని కొందరు మనుషులు ఏదో చేస్తూంటారు. బహుశా ధ్యానము. అంతా నిశ్శబ్దముగా కూర్చుని ఉంటారు; ధ్యానము. అరవిందులు 1910లో ఆంగ్లేయుల బారినుంచి తప్పించు కొనేందుకు ఫ్రెంచ్ వాళ్ళ ఆధీనములో ఉన్న పాండిచేరికి వలస వచ్చారు. అప్పటికి ఆయనకు కొంత ఆధ్యాత్మిక అనుభవములు కలిగి ఉన్నాయి. బరోడాలో ఉన్నప్పుడు దేవీ ఉపాసన చేసేవార; కలకత్తాలో జైలులో ఉన్నప్పుడు నారాయణ దర్శనము జరిగింది. అప్పటినుంచి ఆయనలో విపరీతమైన మార్పు వచ్చింది. విప్లవ మార్గము వదిలేసి ఆధ్యాత్మిక మార్గములోకి వచ్చారు. ఆయన పాండిచేరి వచ్చాక ఆధ్యాత్మిక గ్రంథ రచన మొదలుపెట్టారు. ఆ సమయములో ఫ్రెంచి దేశస్థురాలు, తరువాత మదర్ గా ప్రసిద్ధి గాంచిన ఒక ఆవిడ శిష్యురాలిగా చేరింది. అరవిందుల సామీప్యము పొంది ఆయన ప్రభావమునకు లోనై ఆయన ఉపదేశములను, రచనలను ప్రాచుర్యములోనికి తీసుకుని వచ్చింది.
అరవిందుల పేరు, తత్త్వము ఖండ ఖండాంతరములకు వ్యాపించేలా చేసింది. అరవిందుల తరువాత ఆశ్రమ నిర్వాహకురాలు అయింది. అరవిందులు 1950లో, మదర్ నామధేయురాలైన ఈ శిష్యురాలు 1972లో మరణించారు. ఈ సమాధిలో ఇద్దరినీ సమాంతరముగా పాతి పెట్టారని కథనము. అందుకే ఆ సమాధికి అంత ప్రశస్తి. అరవిందులు పోయాక మదర్ ఆరో విల్లె అని పక్కన తమిళనాడులో ఒక అంతర్జాతీయ నగర నిర్మాణానికి పునాదులు వేసింది.ఎందఱో విదేశీయులు, కొందరు భారతీయులు ఇక్కడ అన్ని విభేదములకు అతీతముగా జీవించే స్థలముగా దీనిని తయారుచేయడానికి ఉద్యుక్తులు అయ్యారు. అక్కడ ఒక గ్లోబ్ ని మెడిటేషన్ సెంటర్ గా తయారుచేసారు. కాని ఇప్పుడు వారిలో వారికి పడక గ్లోబ్ ని ప్రజల సందర్శనార్ధము అనుమతించడము లేదు. ఇది పాండిచేరి పట్టణానికి 10 కిలోమీటర్ల లో ఉంది. ఒక అర కిలో మీటర్ దూరము నుంచి గ్లోబ్ ఆకారములో ఉన్న ఈ ధ్యాన మందిరాన్ని వీక్షించవచ్చు.
సుబ్రహ్మణ్య భారతి
నేను పదునాలుగు ఏళ్ల క్రితము పాండిచేరి ఉద్యోగ రీత్యా వచ్చాను. ఈ నెల (నవంబర్) 30 న రిటైర్ అవుతాను. నాకు ఇక్కడికి రాని క్రితము నుంచి పాండిచేరి అంటే ఇష్టము. అందరికీ అరవిందుల వల్ల పాండిచ్చేరి దర్శన ఉత్సుకత కలిగితే నాకు మహాకవి సుబ్రహ్మణ్య భారతి వల్ల పాండిచేరి దర్శన ఉత్సుకత కలిగింది. నాకు సుబ్రహ్మణ్య భారతి ఇష్టమైన కవి. ఆయన కవిత్వం, వ్యక్తిత్వం సమానముగా ఇష్టము. మదురై తెలుగు విభాగములో అప్పుడు ఆచార్యులుగా ఉన్న డా. చల్లా రాధాకృష్ణ శర్మ గారు యువభారతి ఆధ్వర్యములో తెలుగు లోకి అనువదింఛిన సుబ్రహ్మణ్య భారతి కవితా వైభవము చదివి భారతి కవిత్వంతో పరిచయము కలిగించుకున్నాను. ఆయన వ్యక్తిత్వము సాహిత్య అకాడమీ వారు భారతి పై ప్రచురించిన చిన్ని పొత్తము చదివినపుదు కలిగింది. ఐశ్వర్యములో తులతూగుతూ టాగూరు కవితా వ్యవసాయము చేస్తే, భారతి, కుటుంబం కూడా ఒక పూట తింటే ఒక పూట తినక ఉన్న స్థితిలో ఎంతో గొప్ప కవిత్వము వెలయించాడు భారతి.
సుబ్రహ్మణ్య భారతి కూడా ఆంగ్లేయుల బారి నుంచి తప్పించుకోవడానికి పాండిచేరి వచ్చి నివాసము ఏర్పరుచుకున్నాడు. ఈయన అరవిందులు ఇక్కడ సమకాలికులు. 1910-1919 ల మధ్య నివసించారు. ఒకరినొకరు ఒక సారి కలిసారు అంతే.
ఇక్కడ ఉన్నప్పుడు భారతి ఎన్నో ఉదాత్తమైన కవితలు రచించాడు. తెలుగు భాషని "సుందర తెలుంగు" అని అభిమానముగా ప్రేమగా గానము చేసి, కీర్తించినవాడు భారతి. ఇక్కడికి వచ్చాక ఆయన ఏ ఏ చోట్ల కూర్చుని కవిత్వము రాశారో ఆ ప్రదేశాలన్నీ చూసాను. చిదానందస్వామి కోయిల్, కొబ్బరి తోపులు అందులో ముఖ్యమైనవి.
ఇతర స్థలములు:
ఇక్కడ బీచ్ బాగుంటుంది. అరవిందుల సమాధి చోటుకు బీచ్ కూత వేటు దూరములో ఉంటుంది. ఇక్కడే పాత లైట్ హౌస్, రెండవ ప్రపంచ యుద్ధములో మరణించిన ఫ్రెంచ్ సైనికుల స్మారక చిహ్నము ఉన్నాయి. ఒకటి రెండు దర్శనీయ రూపాంతర దేవాలయములూ ఉన్నాయి (చర్చ్, మసీద్). వీటి పక్కనే పాండిచేరి అసెంబ్లీ భవనము, లెఫ్టినెంట్ గవర్నర్ నివాసస్థలము ఉన్నయి. దీని పక్కనే మనాకుళ వినాయకర్ కోవిల్ అని ఒక మహిమ గల గణపతి దేవాలయము ఉంది. శుక్రవారము రద్దీ గా ఉంటుంది.
పాండిచేరిలో నగరం మధ్యలో వేదపురీశ్వ రుని ఆలయము ఉంది. అమ్మవారు త్రిపుర సుందరి. ఈ దేవి త్రిపురసుందరీ దశ శ్లోకీ అనే సంస్కృత కవిత దయతో నాచే రాయించింది. దీనికి ప్రక్కనే వరదరాజ స్వామి ఆలయము ఉంది. అమ్మవారు పేరిందేవి. కంచి వరద రాజ స్వామి అలయం లో వలె బల్లి స్పర్శనము ఉంది
తిండివనం వైపు
పంచవటి
ఇక్కడ నిలువెత్తు పంచ ముఖ (హనుమ, నరసింహ, వరాహ, హయగ్రీయ (హనుమంతుని నెత్తి మీద), గరుత్మంత (ఆంజనేయుని ముఖము వెనుక - వెనుక వైపునుంచి చూడాలి) ఆంజనేయ స్వామీ దేవాలయము ఉంది. చాలా పొడుగైనది. ప్రొద్దుట 7 నుంచి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. నిరంతరముగా ప్రసాదము పెడతారు - దద్ద్యోజనము, పులిహార, పొంగల్, ఉప్పుపిండి పొంగల్, సాంబారు అన్నము - వీటిలో ఏదో ఒకటి. ఇది పాండిచేరికి 10 కిలోమీటర్లలో ఉంది.
మైలం
ఇక్కడ ఒక పురాతనమైన సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయము ఉంది. శ్రీ వల్లి దేవసేనలతో స్వామి అలరారుతో ఉంటాడు. పాండిచేరికి 25 కిలోమీటర్లు.
తిరువక్కరై
మైలం నుంచి తిరిగి వస్తూంటే ఈ క్షేత్రానికి రోడ్డు మళ్ళుతుంది. అలా వెళితే వక్ర కాళీ అమ్మన్ దేవాలయము వస్తుంది. ఇదీ మహిమగల, పురాతనమైన దేవాలయము. అమ్మవారు విగ్రహములో వక్రము (వంకర) గా కూర్చుని ఉంటుంది . దీని పక్కనే ఒక శివాలయము, విష్ణ్వాలయము ఉన్నాయి. శివుని పేరు చంద్రమౌళీశ్వరుడు. ముఖరూపములో ఉంటాడు. చుట్టూ ఉండే అద్దములలో వివిధముగా కనిపిస్తాడు.
జింజి:
ఇది గొప్ప చారిత్రిక ప్రదేశము. పల్లవులనుంచి, చోళులు, విజయనగర రాజులు, హైదరాలి, టిప్పు సుల్తాన్, ఆంగ్లేయులు, ఫ్రెంచి వారి పాలనలు చవి చూచిన కోట. చాలా పెద్దది. ఇప్పుడు బాగా శిథిలమైపోయింది. చరిత్ర అంటే ఇష్టము అయినవారికి దర్శనీయ స్థలము.ఇక్కడ నుంచి కూడా అరుణా చలం వెళ్ళవచ్చు
కంచి ఈ దిశలో పాండిచేరికి 150 కిలోమీటర్లు.
విల్లుపురం వైపు
విల్లియానూర్
పాండిచేరి ప్రాంతమే అయిన విల్లియానూర్లో పురాతన శివాలయము ఉంది. విజయనగర రాజుల ప్రాపకము సంపాదించిన గుడి. శివుడు తిరుకామేశ్వరుడు, అమ్మవారు కోకిలాంబ. పక్కనే ఈ మధ్య కట్టిన విష్ణుమూర్తి ఆలయము ఉంది. వరదరాజ స్వామి ఆయన పేరు. పక్కనే భూ, శ్రీ దేవులుంటారు. 7 కిలోమీటర్లు
తిరుబువనై
విల్లియానూరుకు విల్లుపురం మార్గములో 16 కిలోమీటర్ల దూరములో తిరుబువనై క్షేత్రము ఉంది. ఇది పాండిచేరి ప్రాంతమే. ఇక్కడ తోతాద్రినాథన్ పేరుతొ విష్ణుమూర్తి వెలసి ఉంటాడు. ప్రక్కన శ్రీదేవి, భూదేవి ఉంటారు. చాలా పురాతన ఆలయము. పరాంతక చోళుడు 907-827 మధ్యలో ఈ ఆలయము కట్టించాడు. ఎంతో బాగుంటుంది. చిన్ని గుడి. కాని ఆహ్లాదముగా ఉంటుంది . అమ్మవారి పేరు వర మంగై తాయారు. తాయారు అంటే తల్లి గారు అని అర్ధము. తాయ్ అంటే తమిళం లో తల్లి. దానికి యార్ చేరిస్తి గారు అవుతుంది. మన అలమేలు మంగ తాయార్ పదం ఇలా ఏర్పడిందే.
అరుణాచలంగా పిలువబడే తిరువణ్ణామలై ఈ దిశలో పాండిచేరికి 100 కిలోమీటర్లు.
కడలూరు వైపు
స్వాతంత్ర్య సమరం రోజుల్లో ఎందఱో మన స్వాతంత్ర్య సమారా యోధులను కడలూరు జైల్లో ఉంచేవారు. కడలూరు జిల్లా కేంద్రము. తమిళనాడులో ఉంటుంది. ఇది ఒకప్పుడు జైన మతానికి కేంద్రము.
మధ్యలో బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. జింజి నది సముద్రములో కలిసే ప్రాంతము.
అభిషేకపాక్కము
ఇది పాండిచేరి ప్రాంతమే. 14 కిలోమీటర్లు పాండిచేరి నుంచి. ఇక్కడ పురాతన నరసింహ స్వామి ఆలయం ఉంది. . మన ప్రియతమ ప్రధాన మంత్రి పి. వి. నరసింహారావుగారు ప్రత్యేకముగా దీనిని దర్శించారు.
తిరువంతిపురం
30 కిలోమీటర్లు
దీనిని ప్రథమ తిరుపతి అంటారు. విష్ణు మూర్తి ఆలయము. దేవుని పేరు దేవాదినాథన్. అమ్మవారు అమృతవల్లితాయార్. విశిష్టాద్వైత వేదాన్తులలో ప్రసిద్దులైన వేదాంతదేశికులకి ఈ దేవాలయముతో గాఢానుబంధము ఉంది. ఈ ఆలయము ఒక నదిని ఆనుకుని ఒడ్డున ఉంది. పక్కన ఒక చిన్ని కొండ ఉంది. దీని మీద లక్ష్మీ హయగ్రీవుల ఆలయము ఉంది. ఆలయము పక్కనే ఒక ప్రదేశము లో వేదాంత దెశికులకి హయగ్రీవ దర్శనము జరిగింది. హయగ్రీవులు వైష్ణవ సాంప్రదాయములో తత్త్వ గురువులు. శ్రీ దక్షిణా మూర్తి శైవ సంప్రదాయములో తత్త్వ గురువులు.
చిదంబరం (70), వైద్యనాథన్, శీర్కాలి, అబిరామి (100) దేవాలయములు వరసగా ఈ వైపు ఉన్నాయి.. ఇంకాస్త ముందుకు వెళితే కుంభకోణం, తంజావూరు, తిరుచిరాపల్లి, శ్రీరంగం వస్తాయి.
నేను డిసెంబర్ నెలలో పాండిచేరి నుంచి వచ్చేస్తాను. మా స్వగ్రామము భిమవరములో స్థిరడతాను. అందుకే ఈ చిన్న స్మరణ.
No comments:
Post a Comment