తపస్సు నిర్వచనము
చాలా మందికి శ్రీ రమణ మహర్షి, శ్రీ వాశిష్ట గణపతి మునుల గురించి తెలిసే ఉంటుంది. గణపతి ముని రమణుల కన్న ఒక ఏడాది పెద్ద. అరుణాచలంలో ఇద్దరూ కలిసారు.
అప్పటికి గణపతి ముని కావ్యకంఠ బిరుదాంకితులు. బెంగాలు దేశములో గంగానది ఒడ్డున కల నవద్వీపములో తమ కవిత్వ ప్రతిభకి అంబికా దత్తు వంటి విఖ్యాత కవుల చేత పండితుల చేత పరీక్షించబడి అందరినీ తమ కవన ప్రతిభతో అలరించి కావ్యకంఠ బిరుదుపొందారు. ఆశువుగా సంస్కృత భాషలో కవితలు, కావ్యాలు చెప్పారు. సంస్కృతంలో ఎన్నో అష్టావధానాలు చేశారు. వారికి ఎంతో శిష్యవర్గము ఉండేది. కాంగ్రెస్ మహాసభలలో పాల్గొని గాంధీలాంటి వారితో సమముగా ప్రసంగించేవారు. సంస్కృతాన్ని దేశభాషగా చేద్దామని వీరు ప్రవేశపెట్టిన తీర్మానం గాంధీగారి హిందీభాష దేశభాష తీర్మానం ముందు వీగిపోయింది.
మన పూర్వ ఋషులు, మునుల వలె తపస్సు చేసి వారి వలె రాణించి జీవించాలని యవ్వనంలో (తిరువణ్ణామలై రాకపూర్వము) , వారి స్వంతఊరు పరిసరాల్లో, భువనేశ్వర్లో, నాసిక్ లో, ఎన్నో మంత్ర జపములతో ఎంతో తీవ్ర తపస్సు చేశారు.
తిరువణ్ణామలై వచ్చాక వేదములను అభ్యసించారు. అక్కడ, వెల్లూరులోను సంస్కృత, తెలుగు పండితులుగా పనిచేశారు. ఆయనకు మంత్ర, తంత్ర శాస్త్రములు కరతలామకములు. ఎంతో విద్వత్తు, పాండిత్యము, జ్ఞానము కలవారు. మంత్ర, తంత్రములలో దిట్టలు.
ఆయన అప్పటికి బ్రాహ్మణస్వామిగా పిలువబడుతున్న రమణమహర్షిని ఒకసారి కలిసారు. అప్పుడే "శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ..." శ్లోకాన్ని రమణుల పరంగా ఎంతో అందంగా, విద్వత్తుతో అన్వయించారు.
" తెల్లని కౌపీనము ధరించిన వాడు, విష్ణువు వలె ఆత్మచైతన్యము అంతటా నిండిన (విష్ణు శబ్దమునకు అంతటా నిండి ఉండుట అనేది అర్థము) వాడు, నాలుగు అంతఃకరణములైన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములను భుజించిన వాడు (లేకుండా చేసికున్న వాడు), ప్రసన్న వదనుడు" అంటూ ఎంతో విలక్షణంగా, పాండితీ ప్రకర్షతో వ్యాఖ్యానించారు. అందరూ ఎంతో ఆనందించారు.
కొంత కాలము తర్వాత గణపతిముని తెలియని మానసిక అలజడి అనుభవించసాగారు. ఈ మానసిక అసహనము ఆయనను ఎంతో కలచివేయ సాగింది.
"ఇన్ని జపతపములు చేసినా, మంత్ర తంత్రములలో నిష్ణాతుడనైనా, వేదజ్ఞానపరిచయమున్నా, ఎందుకని
ఇలా మానసిక అశాంతి నన్ను పట్టి పీడిస్తోంది? నేర్వవలసినవన్నీ నేర్చాను. తెసుసుకోవలసినవన్నీ తెలుసుకున్నాను. ఈ అశాంతి నుంచి నన్ను ఎవరు బయటపడవేయగలరు? నేను పొందవలసిన అనుభవము నాకు కలగడంలేదేమి?" అని ముని ఎంతో మథనపడసాగారు. అప్పుడు ఆయనకు బ్రాహ్మణస్వామి గుర్తుకు వచ్చారు. ఆయన సామాన్య సన్యాసో, స్వామో కాదు, తనకు తప్పక సాయం చేయగలరు అనిపించింది.
అప్పుడు కృత్తికా ఉత్సవములు జరుగుతున్నాయి. ఊరంతా ఎంతో జనసమ్మర్దము గా ఉంది. స్వామి దర్శనానికి ఎందరో వస్తూంటారు. స్వామి విడిగా దొరుకుతారో లేదో అనుకుంటూ వడిగా అడుగులు వేస్తూ కొండ అధిరోహించసాగారు. మిట్టమధ్యాహ్నం, ఎండ తీవ్రముగా ఉంది. ఆర్తితో ముని కొండ ఎక్కసాగారు.
అదృష్టవశాత్తు బ్రాహ్మణస్వామి ఒక్కరే ఉన్నారు. ముని స్వామికి ప్రవర చెబుతూ సాష్టాంగ నమస్కారము చేసి, తన కుడి చేతితో స్వామి కుడిపాదము, ఎడమ చేతితో స్వామి ఎడమ పాదము పట్టుకొని ఆర్తితో, శ్రద్ధతో ఇలా అన్నారు.
" స్వామీ! నిష్ఠతో మంత్ర జపములు, తీవ్ర తపములు ఆచరించాను. తెసుసుకోవలసినవన్నీ తెలుసుకున్నాను. అయినా తృప్తి లేదు. ఏదో లోటు మనసుని అలజడికి లోను చేస్తూంది. ఆర్తితో విహ్వలుడనైనాను. తపస్సంటే ఏమిటో దయచేసి తెలియజేయవలసింది, నన్ను సాకవలసింది" అవ్నారు.
అప్పటికి స్వామి మాట్లాడి ఎన్నో ఏళ్ళయింది. గొంతు సవరించుకుని తమిళం లో స్వామి గణపతిమునికి ఇలా చెప్పారు.
" ఎక్కడైతే నేను పుడుతోందో అక్కడ మనసుని లీనం చేయడమే తపస్సు.
ఎక్కడైతే మంత్ర శబ్దము జనిస్తోందో అక్కడ మనసుని లీనం చేయడమే తపస్సు"
ఈ మాటలు విన్న గణపతి ముని మనసులో ఆనంద సంద్రాలు పొంగాయి.
అప్పడే, స్వామి సేవకుడు పళనిస్వామి ద్వారా బ్రాహ్మణస్వామి పేరు "వేంకటరామన్" అని తెలుసుకుని, రామన్ ను "రమణ" చేసి, మహర్షి జోడించి, బ్రాహ్మణస్వామి పేరు రమణమహర్షి గా పెట్టారు. అలా గణపతి ముని పెట్టిన రమణమహర్షి పేరు బ్రాహ్మణస్వామికి ప్రసిద్ధముగా స్థిరపడిపోయింది.
రమణుల తపన్నిర్వచనము వారు సతతమూ వాక్రుచ్చే అనుగ్రహభాషణాన్ని ప్రతిఫలిస్తుంది. ఉపనిషత్తులు ప్రతిపాదించిన దశమహావిద్యలలో ఒకటైన దహరా విద్య ఇదియే
చాలా మందికి శ్రీ రమణ మహర్షి, శ్రీ వాశిష్ట గణపతి మునుల గురించి తెలిసే ఉంటుంది. గణపతి ముని రమణుల కన్న ఒక ఏడాది పెద్ద. అరుణాచలంలో ఇద్దరూ కలిసారు.
అప్పటికి గణపతి ముని కావ్యకంఠ బిరుదాంకితులు. బెంగాలు దేశములో గంగానది ఒడ్డున కల నవద్వీపములో తమ కవిత్వ ప్రతిభకి అంబికా దత్తు వంటి విఖ్యాత కవుల చేత పండితుల చేత పరీక్షించబడి అందరినీ తమ కవన ప్రతిభతో అలరించి కావ్యకంఠ బిరుదుపొందారు. ఆశువుగా సంస్కృత భాషలో కవితలు, కావ్యాలు చెప్పారు. సంస్కృతంలో ఎన్నో అష్టావధానాలు చేశారు. వారికి ఎంతో శిష్యవర్గము ఉండేది. కాంగ్రెస్ మహాసభలలో పాల్గొని గాంధీలాంటి వారితో సమముగా ప్రసంగించేవారు. సంస్కృతాన్ని దేశభాషగా చేద్దామని వీరు ప్రవేశపెట్టిన తీర్మానం గాంధీగారి హిందీభాష దేశభాష తీర్మానం ముందు వీగిపోయింది.
మన పూర్వ ఋషులు, మునుల వలె తపస్సు చేసి వారి వలె రాణించి జీవించాలని యవ్వనంలో (తిరువణ్ణామలై రాకపూర్వము) , వారి స్వంతఊరు పరిసరాల్లో, భువనేశ్వర్లో, నాసిక్ లో, ఎన్నో మంత్ర జపములతో ఎంతో తీవ్ర తపస్సు చేశారు.
తిరువణ్ణామలై వచ్చాక వేదములను అభ్యసించారు. అక్కడ, వెల్లూరులోను సంస్కృత, తెలుగు పండితులుగా పనిచేశారు. ఆయనకు మంత్ర, తంత్ర శాస్త్రములు కరతలామకములు. ఎంతో విద్వత్తు, పాండిత్యము, జ్ఞానము కలవారు. మంత్ర, తంత్రములలో దిట్టలు.
ఆయన అప్పటికి బ్రాహ్మణస్వామిగా పిలువబడుతున్న రమణమహర్షిని ఒకసారి కలిసారు. అప్పుడే "శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ..." శ్లోకాన్ని రమణుల పరంగా ఎంతో అందంగా, విద్వత్తుతో అన్వయించారు.
" తెల్లని కౌపీనము ధరించిన వాడు, విష్ణువు వలె ఆత్మచైతన్యము అంతటా నిండిన (విష్ణు శబ్దమునకు అంతటా నిండి ఉండుట అనేది అర్థము) వాడు, నాలుగు అంతఃకరణములైన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములను భుజించిన వాడు (లేకుండా చేసికున్న వాడు), ప్రసన్న వదనుడు" అంటూ ఎంతో విలక్షణంగా, పాండితీ ప్రకర్షతో వ్యాఖ్యానించారు. అందరూ ఎంతో ఆనందించారు.
కొంత కాలము తర్వాత గణపతిముని తెలియని మానసిక అలజడి అనుభవించసాగారు. ఈ మానసిక అసహనము ఆయనను ఎంతో కలచివేయ సాగింది.
"ఇన్ని జపతపములు చేసినా, మంత్ర తంత్రములలో నిష్ణాతుడనైనా, వేదజ్ఞానపరిచయమున్నా, ఎందుకని
ఇలా మానసిక అశాంతి నన్ను పట్టి పీడిస్తోంది? నేర్వవలసినవన్నీ నేర్చాను. తెసుసుకోవలసినవన్నీ తెలుసుకున్నాను. ఈ అశాంతి నుంచి నన్ను ఎవరు బయటపడవేయగలరు? నేను పొందవలసిన అనుభవము నాకు కలగడంలేదేమి?" అని ముని ఎంతో మథనపడసాగారు. అప్పుడు ఆయనకు బ్రాహ్మణస్వామి గుర్తుకు వచ్చారు. ఆయన సామాన్య సన్యాసో, స్వామో కాదు, తనకు తప్పక సాయం చేయగలరు అనిపించింది.
అప్పుడు కృత్తికా ఉత్సవములు జరుగుతున్నాయి. ఊరంతా ఎంతో జనసమ్మర్దము గా ఉంది. స్వామి దర్శనానికి ఎందరో వస్తూంటారు. స్వామి విడిగా దొరుకుతారో లేదో అనుకుంటూ వడిగా అడుగులు వేస్తూ కొండ అధిరోహించసాగారు. మిట్టమధ్యాహ్నం, ఎండ తీవ్రముగా ఉంది. ఆర్తితో ముని కొండ ఎక్కసాగారు.
అదృష్టవశాత్తు బ్రాహ్మణస్వామి ఒక్కరే ఉన్నారు. ముని స్వామికి ప్రవర చెబుతూ సాష్టాంగ నమస్కారము చేసి, తన కుడి చేతితో స్వామి కుడిపాదము, ఎడమ చేతితో స్వామి ఎడమ పాదము పట్టుకొని ఆర్తితో, శ్రద్ధతో ఇలా అన్నారు.
" స్వామీ! నిష్ఠతో మంత్ర జపములు, తీవ్ర తపములు ఆచరించాను. తెసుసుకోవలసినవన్నీ తెలుసుకున్నాను. అయినా తృప్తి లేదు. ఏదో లోటు మనసుని అలజడికి లోను చేస్తూంది. ఆర్తితో విహ్వలుడనైనాను. తపస్సంటే ఏమిటో దయచేసి తెలియజేయవలసింది, నన్ను సాకవలసింది" అవ్నారు.
అప్పటికి స్వామి మాట్లాడి ఎన్నో ఏళ్ళయింది. గొంతు సవరించుకుని తమిళం లో స్వామి గణపతిమునికి ఇలా చెప్పారు.
" ఎక్కడైతే నేను పుడుతోందో అక్కడ మనసుని లీనం చేయడమే తపస్సు.
ఎక్కడైతే మంత్ర శబ్దము జనిస్తోందో అక్కడ మనసుని లీనం చేయడమే తపస్సు"
ఈ మాటలు విన్న గణపతి ముని మనసులో ఆనంద సంద్రాలు పొంగాయి.
అప్పడే, స్వామి సేవకుడు పళనిస్వామి ద్వారా బ్రాహ్మణస్వామి పేరు "వేంకటరామన్" అని తెలుసుకుని, రామన్ ను "రమణ" చేసి, మహర్షి జోడించి, బ్రాహ్మణస్వామి పేరు రమణమహర్షి గా పెట్టారు. అలా గణపతి ముని పెట్టిన రమణమహర్షి పేరు బ్రాహ్మణస్వామికి ప్రసిద్ధముగా స్థిరపడిపోయింది.
రమణుల తపన్నిర్వచనము వారు సతతమూ వాక్రుచ్చే అనుగ్రహభాషణాన్ని ప్రతిఫలిస్తుంది. ఉపనిషత్తులు ప్రతిపాదించిన దశమహావిద్యలలో ఒకటైన దహరా విద్య ఇదియే
No comments:
Post a Comment