నేటి సాహితీ ధోరణులు
మనిషి నాగరికత నేర్చినప్పటినుంచీ, సంస్కృతీ సమాంతరంగా వర్ధిల్లింది. సంస్కృతికి పట్టుకొమ్మలు లలితకళలు. లలితకళలలో సాహిత్యానికి ప్రత్యేకత ఉంది. భాష నాగరికతకు, సంస్కృతికి మూలాధారము. జీవము. మిగిలిన లలితకళలకు సాహిత్యము ప్రాణము.
భాష సాహిత్యమునకు ఊపిరి. సాహిత్యమునకు పలు ప్రయోజనములు ఉన్నాయి. ప్రజల జీవితాలను ప్రతిబింబిస్తుంది. ప్రజల జీవనవిధానాన్ని స్నేహితునివలె సూచిస్తుంది. సరియైన పంథాలో పెడుతుంది. సరిదిద్దుతుంది. సాహతీస్రష్టలు సంఘానికి మార్గదర్శకులు.
సాహతీస్రష్టలు ఋషులై, జ్ఞానము, పాండిత్యము, వివిధవిషయములపై అవగాహన, కరుణ, కలిగి సర్వజనశ్రేయోకాములై తమ రచనల ద్వారా స్ఫూర్తినిస్తారు.
దురదృష్టవశాత్తు నేడు భారతదేశంలో ద్వేష విద్వేషముల పంచడానికి, సంస్కృతీ సాంప్రదాయముల నిరసించడానికీ తమ పరిమిత అవగాహనతో, "మేధ" తో ఎందరో రాస్తున్నారు. ఈ రచనలు మార్గదర్శకములుగా ఉండటం లేదు.
ఒక కులానికో, వర్గానికో, ప్రాంతానికో, ప్రాంతీయతత్వానికో లింగానికో, సిద్ధాంతానికో, మతానికో, మతమూఢత్వానికో, హేతువాదానికో, నాస్తికతకో, వత్తాసు పలుకుతూ వందిమాగధితనం కలిగి ఉంటున్నాయి. సార్వజనీనత ఈ రచనలలో కాగడా పెట్టి వెతికినా కనిపించటంలేదు. వారికి నచ్చిన కులమో, లింగమో, ప్రాంతమో, సిద్దాంతమో దాటి వారి రచనా వస్తువులు పోవడంలేదు.
ఇతర వర్గములను, కులములను, లింగములను, ప్రాంతములను, సంస్కృతులను, సాంప్రదాయములను, సిద్ధాంతములను దునుమాడడానికి మాత్రమే అన్నట్టు సాహితీసృష్టి జరుగుతోంది. సంస్కారము, నాగరికత అటకనపెట్టి ఆటవికులవలె రచనలు చేస్తున్నారు. విమర్శకులూ అలాగే వర్గాలుగా విడిపోయారు. వర్గపోరాటానికి మాత్రమే సాహితీసృష్టి అన్నట్టు తయారుచేశారు, సంకుచిత మనస్కులైన సాహితీకారులు.
ఇటువంటి వాతావరణములో సున్నితత్వానికి, సామరస్యానికి, సంస్కారయుత వర్తనానికీ, చోటున్న సాహితీ సృష్టికి దారులు మూసివేయబడ్డాయి.
ఈ అసహనము సంఘంలో అశాంతికి మాత్రమే దారి తీస్తోంది. ఏదో వర్గాన్ని దునుమాడక పోతే అది సాహిత్యమే కాదన్న ధోరణులు పెరిగాయి. ఇది గర్హనీయము. ఈ క్రింది సూక్తులను సాహతీస్రష్టలు మరచిపోకుండా ఉంటే ఉపయోగకరమైన సాహిత్యము సృష్టించబడుతుంది.
వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్!
రమణీయార్థప్రతిపాదక శబ్దః కావ్యః!
విశ్వశ్రేయమ్ కావ్యపరమార్ధమ్!,
మనిషి నాగరికత నేర్చినప్పటినుంచీ, సంస్కృతీ సమాంతరంగా వర్ధిల్లింది. సంస్కృతికి పట్టుకొమ్మలు లలితకళలు. లలితకళలలో సాహిత్యానికి ప్రత్యేకత ఉంది. భాష నాగరికతకు, సంస్కృతికి మూలాధారము. జీవము. మిగిలిన లలితకళలకు సాహిత్యము ప్రాణము.
భాష సాహిత్యమునకు ఊపిరి. సాహిత్యమునకు పలు ప్రయోజనములు ఉన్నాయి. ప్రజల జీవితాలను ప్రతిబింబిస్తుంది. ప్రజల జీవనవిధానాన్ని స్నేహితునివలె సూచిస్తుంది. సరియైన పంథాలో పెడుతుంది. సరిదిద్దుతుంది. సాహతీస్రష్టలు సంఘానికి మార్గదర్శకులు.
సాహతీస్రష్టలు ఋషులై, జ్ఞానము, పాండిత్యము, వివిధవిషయములపై అవగాహన, కరుణ, కలిగి సర్వజనశ్రేయోకాములై తమ రచనల ద్వారా స్ఫూర్తినిస్తారు.
దురదృష్టవశాత్తు నేడు భారతదేశంలో ద్వేష విద్వేషముల పంచడానికి, సంస్కృతీ సాంప్రదాయముల నిరసించడానికీ తమ పరిమిత అవగాహనతో, "మేధ" తో ఎందరో రాస్తున్నారు. ఈ రచనలు మార్గదర్శకములుగా ఉండటం లేదు.
ఒక కులానికో, వర్గానికో, ప్రాంతానికో, ప్రాంతీయతత్వానికో లింగానికో, సిద్ధాంతానికో, మతానికో, మతమూఢత్వానికో, హేతువాదానికో, నాస్తికతకో, వత్తాసు పలుకుతూ వందిమాగధితనం కలిగి ఉంటున్నాయి. సార్వజనీనత ఈ రచనలలో కాగడా పెట్టి వెతికినా కనిపించటంలేదు. వారికి నచ్చిన కులమో, లింగమో, ప్రాంతమో, సిద్దాంతమో దాటి వారి రచనా వస్తువులు పోవడంలేదు.
ఇతర వర్గములను, కులములను, లింగములను, ప్రాంతములను, సంస్కృతులను, సాంప్రదాయములను, సిద్ధాంతములను దునుమాడడానికి మాత్రమే అన్నట్టు సాహితీసృష్టి జరుగుతోంది. సంస్కారము, నాగరికత అటకనపెట్టి ఆటవికులవలె రచనలు చేస్తున్నారు. విమర్శకులూ అలాగే వర్గాలుగా విడిపోయారు. వర్గపోరాటానికి మాత్రమే సాహితీసృష్టి అన్నట్టు తయారుచేశారు, సంకుచిత మనస్కులైన సాహితీకారులు.
ఇటువంటి వాతావరణములో సున్నితత్వానికి, సామరస్యానికి, సంస్కారయుత వర్తనానికీ, చోటున్న సాహితీ సృష్టికి దారులు మూసివేయబడ్డాయి.
ఈ అసహనము సంఘంలో అశాంతికి మాత్రమే దారి తీస్తోంది. ఏదో వర్గాన్ని దునుమాడక పోతే అది సాహిత్యమే కాదన్న ధోరణులు పెరిగాయి. ఇది గర్హనీయము. ఈ క్రింది సూక్తులను సాహతీస్రష్టలు మరచిపోకుండా ఉంటే ఉపయోగకరమైన సాహిత్యము సృష్టించబడుతుంది.
వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్!
రమణీయార్థప్రతిపాదక శబ్దః కావ్యః!
విశ్వశ్రేయమ్ కావ్యపరమార్ధమ్!,
No comments:
Post a Comment