Wednesday, October 28, 2015

Disrespecting language learning and usage

The disrespect shown to spelling and grammar frequently seen in most of the write-ups available on-line and print media is bad culture. The attention missing for proper pronunciation in all media is further insulting to the learning process. When you neglect language learning and usage which is prevalent in India on mass scale, the essential ingredient for learning and teaching is missing. This trend makes India weak in intellectual and scholarly contributions to knowledge and research. Language must be respectfully learnt and used sans spelling and grammatical mistakes for decent academics.
The casual attitude exhibited by majority of "educated" individuals in India towards language learning and usage is both irritating and saddening.

Monday, October 26, 2015

Wisdom and Knowledge

Wisdom and Knowledge

Wisdom and Knowledge are not the same. Knowledge is acquisition of information. Wisdom is application of knowledge. As living beings we have common sense genetically. We also are equipped with intuition which is flash of understanding, insight or experience. Commonsense and intuition are available to all living beings, to animals and human beings. Literacy or schooling or scholarship or mastering various disciplines is not necessary for having commonsense and intuition. They are automatic from birth. 

Many times Knowledge objects and obstructs use of commonsense and intuition. Wisdom is nothing but commonsense and intuition. Always intuition and commonsense are right and correct compared to "guidance" from knowledge.

Many form opinions based on knowledge and argue endlessly when truth is obvious through use of commonsense and intuition. Scholarship and intellectual abilities acquired through knowledge sometimes will act as deterrent for acquiring fresh knowledge and closes the mind if fresh knowledge is in confrontation with already acquired information or fact. Thus mind becomes closed and stubborn.
*********
Wisdom and Knowledge

Wisdom and Knowledge are not the same. Knowledge is acquisition of facts and information through formal schooling process.

Wisdom is ability to apply and use the knowledge. Also every human being and other living beings, the animals, also have commonsense inbuilt in the organism genetically. And intuition will be formed through learning, understanding, insight and experience and flashes itself at moments of necessity automatically.

The knowledge acquired through schooling and other means. No schooling or other academic processes are necessary for possessing commonsense and intuition. Many times Knowledge and scholarship acquired through reading and intellectual pursuits will be objecting and obstructing acquiring fresh knowledge if that information is not in tune with already existing facts or information. Thus acquired knowledge closes the mind.

Many form opinions based on acquired knowledge and argue endlessly though the truth is obvious through commonsense and intuition. One must know commonsense and intuition are not different from wisdom. Commonsense is natural intelligence and wisdom. Any amount of schooling or learning can match it in usefulness to us.

Monday, October 19, 2015

అవార్డీల ఆగడములు


  అవార్డీల ఆగడములు


ఇప్పటి కవులు, రచయితలు, కథా, నవలాకారులు, సాహితీ విమర్శకులు, ఇతర సాహతీస్రష్టలు గమనించవలసిన ముఖ్యాంశం ఒకటున్నది. అది: ఒకే విషయాన్ని గురించి భిన్న దృక్పథాలు ఉంటాయి. సామరస్యముతో మాత్రమే సమాజంలో సుఖశాంతులు తీసికొనిరాగలము. నిజానికి సాంకేతికత ఇంతగా అందుబాటులోనున్న ఈవేళ సామరస్యము తేవడం చాలా తేలిక.

రచయితకు రాజకీయ ఇష్టాయిష్టములు ఉండవచ్చు, కాని రచనా వ్యాసంగాన్ని, సాహితీసృష్టులను రాజకీయం చేయకూడదు. ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధము లేని అకాడమీ అవార్డులు వెనక్కి ఇస్తే ఎవరికి నష్టం? ఇంతకు మించిన ఘోరాలు జరిగినపుడు ఈ ఆక్రోశాలు, ఆక్రందనలు, అసహనములు, ఆందోళనలు, ఆవేదనలు ఎందుకు చూపించబడలేదు? భారత దేశములో చాలా అవార్డులు ఎలా వస్తాయో అందరికీ తెలుసు. తామేదో పత్తిత్తులమనుకొని అవాకులు చెవాకులు పేలడం హాస్యాస్పదము. అమాయకత్వము. అవార్డులు వెనక్కి ఇవ్వడము పసితనము, కుఱ్ఱతనము కూడా.

ఇప్పటి ఈ అవార్డీలైన రచయితల తతంగాన్ని అన్నిటికీ అతీతులైన వారు గమనిస్తోంటే చిన్నపిల్లల ఉడుకుమోత్తనంలా ఉంది. ఈ వీరి తీరు, అపరిపక్వతను, పరిణితి శూన్యతను, అవగాహనా రాహిత్యాన్ని దండిగా చూపిస్తోంది. మిగతా సాహతీస్రష్టలకు, పండితులు, మేధావులు అయిన పౌరులకు ఈ అవార్డీల తీరు చిరాకుగా ఉంది.

వీరికి మాత్రమే గుణాగుణములను నిర్ణయించే శక్తి ఉన్నదా? అవార్డులు రాని గొప్పవారైన సాహతీస్రష్టలు ఎందరు లేరు? వారికీ మంచీ చెడూ నిర్ణయించే శక్తి సామర్ధ్యములు ఉన్నాయి. ఈ అవార్డీల దృష్టే అంత భారతదేశపు దృష్టీ కాదు. ఎందుకు వారిని వారు అవార్డీలు ఇలా పలుచన చేసికుంటున్నారో తెలియదు. ఇతర మేధావులకు, పండితులకు, సాహతీస్రష్టలకు, విమర్శకులకు వీరి ఆక్రోశాల వెనుక గల రాచకీయము తెలుసు. ఇది తెలుసుకొని, వారి రచనలు వారు చేసుకుంటూ అవార్డీలు జీవించడం మంచిది.

ఈ అవార్డీలకి భారతదేశము అందరి తరఫునా మాట్లాడే అధికారము కాని, అర్హత కాని లేవు. వారి పక్షపాత ధోరణిని ఎందరో పట్టించుకోరు. ఇదంతా ఒక రాజకీయ వ్యవహారము. సాహిత్యానికి, మేధకూ ఈ అలజడికి ఏమీ సంబంధము లేదు. విజ్ఞులందరికీ‌ ఈ తమాషా ఎందుకో, ఏమిటో పూర్తిగా తెలుసు!

Saturday, October 17, 2015

కృష్ణుండు యశోద బుల్లివాడు


 http://images6.fanpop.com/image/photos/33200000/Lord-Krishna-gods-of-hinduism-33227313-1195-1527.jpg



 కృష్ణుండు యశోద బుల్లివాడు


కృష్ణుండు యశోద బుల్లివాడు
కృష్ణుండు అర్జునిని చెలికాడు
కృష్ణుండు రాధా మానసచోరుడు
కృష్ణుండు భగవద్గీతాచార్యుడు

మాధవుడు మనవాడు
మనలోని‌ మామంచివాడు
బందుగుడు, హితుడు,
స్నేహితుడు; భగవంతుడు

కృష్ణభక్తి అలవడుట జన్మ జన్మాంతర
పుణ్యఫలము; కృష్ణుండు మనసున
నిండుట అష్టాక్షరీ మంత్రోపాసనా ఫలితము
ద్వైతము అద్వైతముల సారము ఆది దైవము

రాక్షసాంతకుడు రమణీ సంగ రసోల్లాసుడు
మన యోగక్షేమముల వహించు దైవతము
రాసలీల వలె జగములనేలు జనుల కాచు
శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్, ఉడిపి వాసియును

భాగవతుల భావనా దర్శనా గమ్యము
కుభూపతుల శిక్షించె కుంతీపుత్రరక్షకుడు
"పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ
దుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి"
యుగే యుగే" అని మనకై అవతరించు దైవవతంసము

పరబ్రహ్మ దృష్టి, ఆత్మతృప్తికై సృజన, మనసు ఆగడములు, పనికిరాని పరిశోధనలు, తత్త్వము, కావ్యాధ్యయనము,

 పరబ్రహ్మ దృష్టి

ఆకాశమున దిక్కులు లేవు, ఎల్లలు లేవు
నడి సంద్రమున చుట్టు పక్కలు లేవు, రేవులు లేవు
ప్రజ్ఞానస్థితిని ప్రపంచము లేదు, ఇంద్రియసంచలనము లేదు
దృష్టి పరబ్రహ్మమైనపుడు జీవుడు లేడు, సుఖదుఃఖములు లేవు
******

 ఆత్మతృప్తికై సృజన


లోకులు పలువురు వారి రుచులు చూడ జాడ వేరు;
విచక్షణలు సిద్దాంత ప్రీతులు పలు రకములు; జనుల
మెప్పించుటకై సాహితీ సృష్టి చేయుట అవివేకము, కంచి
గరుడ సేవ; ఆత్మ తృప్తికై రచనలు చేయుట, కవితలల్లుట
వివేకము, మానసిక శాంతి; నిర్మల హృదయమున హృద్యంగా
మరిన్ని కవనములు వెలయు; సాహితీ ప్రియులు తమంత తామే
చదివెదరు, మురిసెదరు నచ్చిన; మెచ్చెదరు మనస్ఫూర్తిగ; తెలిపెదరు
ఆత్మీయముగా; ఆత్మతృప్తికై సృజియించిన నిలచును కలకాలము
 *******

 మనసు ఆగడములు

జీవులు పరిణమించెనో లేక భగవంతుడు సృష్టించెనో
మనుషుల గాథలు బాధలు వేదనలు హాయిలు
ఎక్కువగా స్వయంకృతములో విధి చెక్కడములొ
ఏది ఏమయిననూ సుఖ దుఃఖములు మనసు నిర్మితములు
********


పనికిరాని పరిశోధనలు


కుజగ్రహంపై నీరుంటేనేమి
చంద్రునిపై మంచుంటేనేమి
జీవము జీవులు ఈ అనంత
విశ్వంలో మరొక చోట ఉంటే
మనకేమి ఒరిగింది; మన కష్ట
సుఖముల పట్టించుకొనుట
ముఖ్యము ఎవరైనా ఎప్పుడైనా;
విజ్ఞానశాస్త్ర ప్రగతులు వారి విశేషములు
మానవ పరిజ్ఞాన వృద్ధికి; అవి
సాంకేతికతగా మారు లోపల
మన జీవితములు గట్టెక్కుటెప్పుడు
ఉగ్రవాదులు, స్వార్ధ నాయకులు
సంఘవిద్రోహ శక్తులు విజృంభించకుండ
ఎవరాపగలరో ఎప్పుడాపగలరో ఆ రోజు
మనకు పండగ; మనకు సుఖశాంతులు
లేనపుడు ఈ పరిశోధనలు శుద్ధ దండగ
********

తత్త్వము 


తత్త్వమును గాలికి వదలి వైచి వ్యక్తుల పట్టుకు
వేలాడుట భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయము కాదు;
తత్త్వము, గురువు సమానము; జీవితాంతము
ఒకనికి శిష్యపరమాణువుగ బ్రతుకు గడుపుట
ఉపనిత్ సంప్రదాయము కాదు; సర్వతంత్ర స్వతంత్రత
తత్త్వశాస్త్ర అవగాహనా పరమార్ధము; అన్ని బంధముల
నుంచి విడుదల; అన్ని కామితముల నుంచి ముక్తి; అహం
భావ మమకారములనుంచి మోక్షము; వ్యక్తిత్వ స్పృహనుంచి
బయటపడి పరమాత్మ స్పృహయే ఊపిరి కాగ
వేదాంత వాక్యార్థములందు సదా రమించుచు
శోకవిహీనులై, నిర్మల మానసమున శాంతానందమౌనములు
ప్రతిఫలింప భక్తి స్థితియందు తత్పరుడై పరాత్ పరుడగుట తత్త్వానుభవము
ఉపనిషత్ స్రష్టల దివ్యానుభవము; అందరు ఆచార్యుల నిర్గుణ స్థితి
అదియే లఘువు గురువునందు ఐక్యమగుట; నిర్వాణ స్థితి; పరబ్రహ్మానుభవము
ద్వైత భావము పోనిదే అద్వైతానుభవము అవదు
వ్యక్తిత్వము ఖాళీ చేయు ప్రదేశమే పరమాత్మ వెలుగు చోటు

కావ్యాధ్యయనము


శబ్దకోశము ప్రక్కన లేకుండ అర్థము కారు
నన్నయ తిక్కన పాల్కురికి సోమన పోతన
శ్రీనాథుడు ఎఱ్ఱాప్రగ్గడ నాచన సోమన మొల్ల విశ్వనాథ
శబ్దకోశము ప్రక్కనున్నను అర్థము కారు నవీనకవులు
నవీనకవులు, వారి అనుభవములు భావములు వాక్కులు సంకీర్ణములు:
కవితలు సంక్లిష్ట భావ మయములు; రస హీనములు అనుభవ శూన్యములు,
పొడి మాటలు; పదములు సరళమైతే చాలదు
అనుభవ, భావ ప్రకటనము సరళము కావలె; సిద్దాంత
రాద్దాంతములు‌ ఆవేశ కావేషములు ద్వేషములు
అసూయలు ఈర్ష్యలు కావ్యసృష్టిని, ఆస్వాదనను
చెరుపును; కారు వంది మాగధులు పనికొచ్చు విమర్శకులు
భట్రాజులై పరస్పర ముఖస్తుతుల చేసెదరు కాలయాపనము
కవి తన కవితలో ప్రతిఫలించును; కమనీయ
భావముల కలిగించి మన స్మృతిలో వెలుగును;
కవినిరంకుశుడు; రవి కాంచనిచో
తాను కాంచును; రమణీయార్థప్రతి
పాదక శబ్దములతో కావ్యము కూర్చును;
విశ్వశ్రేయము కావ్య పరమార్ధమని
ఎఱిగిన జిజ్ఞాసువు; భావుకుడు, ఋషి;
"వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్"; అతని ఉవాచ
 

Friday, October 16, 2015

పరమ సుఖము; సకల జ్ఞాన కళా మూర్తి; సంస్కారహీనుల నమ్మకాలు

పరమ సుఖము

ప్రసంగము సుఖము కొందరికి మౌనముగ ఉండుట సుఖము ఇంకొందరికి
సత్సంగము సుఖము కొందరికి తరుణ రమణీ సంగము సుఖము కొందరికి

మనసును మాధవునిలో లీనము చేయుట సుఖము భక్తులకు
సరసపద విన్యాసముతో కవితలల్లుట సుఖము కవివరేణ్యులకు

గంధర్వగానమున గంగాధరునికి గళార్చన చేయుట సుఖము గాయకులకు
ఇంద్రభవనముల జీవించుచు మద్యమాంసమానినీ సాంగత్యము సుఖము,
సంపన్నులకు, పన్నులెగవేయువారికి, వారిని కాచు నాయకులకు, అధికారులకు;
భారత దేశపు పురాతనత్వమును ఆ ఉన్నతిని నాగరికతను సంస్కారహీనముగ
గేలిచేయుట సుఖము కొందరు "మేధావులకు", హేతువాదులకు, నాస్తికులకు;
సుఖము వేరు వేరు మనిషి మనిషికి; అతనికి ఆమెకు; ఒక్కటి కాదు సుఖ నిర్వచనము

మనుషులెందరో అభిరుచులెన్నియో సుఖములన్ని;
పరమపురుషుని నిరంతర ధ్యానము పరమ సుఖము


సకల జ్ఞాన కళా మూర్తి

మనిషి ఊహలో అందముంది మనిషి చూపులో అందముంది
మనిషి గమనికలో అందముంది మనిషి మనసులో అందముంది

నీరు సమతలంలో ప్రవహిస్తూంటే నదియని
కొండల గుట్టల పరుగెడుతుంటే సెలయేరని
ఎత్తులనుంచి చెంగున దూకుతుంటే జలపాతమని
మురిసి తన్మయత్వం చెందుతాడు; ఆ కదలికలలో
సంగీతం వింటాడు హోరులలో శ్రావ్యత "కంటాడు"
వట్టి నీటి కదలికలకే ఇన్ని పేర్లు పెడతాడు ఆనందిస్తాడు

చప్పని పెదవుల కలయికని అధరసుధారసమంటాడు
వయసొచ్చిన కన్నియని విరబూసిన గున్నమావియంటాడు
ఎదకొచ్చిన చిన్నిగోవు అంటాడు; రమణీ సాంగత్యమున
ఏవేవో మధురిమలు స్వర్గములంటాడు; గొప్ప భావుకుడు

తనలోనే పరమాత్మని కంటాడు తనే పరమపురుషుడనంటాడు
జ్ఞానమున ఇంగితమున పరమేశ్వరునికి సరిజోదు అనిపిస్తాడు

జ్ఞానముల సాంకేతిక జ్ఞానముల లలితకళల నేర్పరితనముల
సృష్టించి పెంచి రమిస్తాడు; రాగముల విరాగముల సమముగ
వర్ధిల్లుతాడు; రక్తి విరక్తులకు లోనై కూడా శాంతస్వరూపునిగ
వెలుగొందగలడు; కారుణ్యమున భగవంతుడే అతడు, ఆమె తోడు

దేముళ్ళ దేవతల గుళ్ళలో నిలబెట్టగలడు మనసులో నింపుకొనగలడు మనిషి
అతడు మనీషి అపర బ్రహ్మ లయకారకుడు సమస్తము నింపుకున్న నిండిన విష్ణువు
తత్త్వవేత్త, విజ్ఞానఖని, ధన్వంతరి, విశ్వకర్మ, ఐంద్రజాలికుడు, ఆటగాడు, పాటగాడు
మనిషి సృష్టిలో ఆణిముత్యము ప్రకృతిలో విశేష ప్రతిభావంతుడు త్యాగశీలి సుగుణాలరాసి



సంస్కారహీనుల నమ్మకాలు

గుడిలో భగవంతుని రాయి మాత్రమే కదా అన్న మేధావి హేతువాది
నాస్తికుడు నాలుగు రోడ్ల కూడలిలో సిద్దాంత కర్త శిల్పానికి ప్రణమిల్లుతాడు

దేవుడిని మనిషే సృష్టించాడని మతాన్ని తీసిపారేసే‌ నాస్తికుడు
మనిషే సృష్టించిన సిద్దాంతానికి ఊడిగం చేస్తాడు బానిసవుతాడు

భగవంతునికి‌ పూజల పునస్కారముల వల్ల ఏమీ ఒరగదనే మేధావి
ప్రతి ఏటా తమ హేతువాద నాయకునికి జయంతోత్సవం చేస్తాడు

భగవంతుడు ఉన్నాడనడం లేడనడం రెండూ నమ్మకానికి
సంబంధించినవే అని ఎప్పటికీ నాస్తికుడు గ్రహించలేడు,
దెబ్బలాడగలడు అంతే; తోటి వారి హృదయముల గాయము చేయు
దుర్భాషలు మాత్రము ఆడగలడు; సంస్కారహీనులకు బుద్ధి బుర్ర ఉండవు

Tuesday, October 13, 2015

తపస్సు నిర్వచనము

తపస్సు నిర్వచనము

చాలా మందికి శ్రీ రమణ మహర్షి, శ్రీ వాశిష్ట గణపతి మునుల గురించి తెలిసే ఉంటుంది. గణపతి ముని రమణుల కన్న ఒక ఏడాది పెద్ద. అరుణాచలంలో ఇద్దరూ కలిసారు.

అప్పటికి గణపతి ముని కావ్యకంఠ బిరుదాంకితులు. బెంగాలు దేశములో గంగానది ఒడ్డున కల నవద్వీపములో తమ కవిత్వ ప్రతిభకి అంబికా దత్తు వంటి విఖ్యాత కవుల చేత పండితుల చేత పరీక్షించబడి అందరినీ తమ కవన ప్రతిభతో‌ అలరించి కావ్యకంఠ బిరుదుపొందారు. ఆశువుగా సంస్కృత భాషలో కవితలు, కావ్యాలు చెప్పారు. సంస్కృతంలో ఎన్నో అష్టావధానాలు చేశారు. వారికి ఎంతో శిష్యవర్గము ఉండేది. కాంగ్రెస్ మహాసభలలో పాల్గొని గాంధీలాంటి వారితో సమముగా ప్రసంగించేవారు. సంస్కృతాన్ని దేశభాషగా చేద్దామని వీరు ప్రవేశపెట్టిన తీర్మానం గాంధీగారి హిందీభాష దేశభాష తీర్మానం ముందు వీగిపోయింది.

మన పూర్వ ఋషులు, మునుల వలె తపస్సు చేసి వారి వలె రాణించి జీవించాలని యవ్వనంలో‌ (తిరువణ్ణామలై రాకపూర్వము) , వారి స్వంతఊరు పరిసరాల్లో, భువనేశ్వర్లో, నాసిక్ లో, ఎన్నో మంత్ర జపములతో ఎంతో తీవ్ర తపస్సు చేశారు.

తిరువణ్ణామలై వచ్చాక వేదములను అభ్యసించారు. అక్కడ, వెల్లూరులోను సంస్కృత, తెలుగు పండితులుగా పనిచేశారు. ఆయనకు మంత్ర, తంత్ర శాస్త్రములు కరతలామకములు. ఎంతో విద్వత్తు, పాండిత్యము, జ్ఞానము కలవారు. మంత్ర, తంత్రములలో దిట్టలు.

ఆయన అప్పటికి బ్రాహ్మణస్వామిగా పిలువబడుతున్న రమణమహర్షిని ఒకసారి కలిసారు. అప్పుడే "శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ..." శ్లోకాన్ని రమణుల పరంగా ఎంతో అందంగా, విద్వత్తుతో అన్వయించారు.

" తెల్లని కౌపీనము ధరించిన వాడు, విష్ణువు వలె ఆత్మచైతన్యము అంతటా నిండిన (విష్ణు శబ్దమునకు అంతటా నిండి ఉండుట అనేది అర్థము) వాడు, నాలుగు అంతఃకరణములైన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములను భుజించిన వాడు (లేకుండా చేసికున్న వాడు), ప్రసన్న వదనుడు" అంటూ ఎంతో విలక్షణంగా, పాండితీ ప్రకర్షతో వ్యాఖ్యానించారు. అందరూ ఎంతో ఆనందించారు.

కొంత కాలము తర్వాత గణపతి‌ముని తెలియని మానసిక అలజడి అనుభవించసాగారు. ఈ మానసిక అసహనము ఆయనను ఎంతో కలచివేయ సాగింది.

"ఇన్ని జపతపములు చేసినా, మంత్ర తంత్రములలో నిష్ణాతుడనైనా, వేదజ్ఞానపరిచయమున్నా, ఎందుకని
ఇలా మానసిక అశాంతి నన్ను పట్టి పీడిస్తోంది? నేర్వవలసినవన్నీ నేర్చాను. తెసుసుకోవలసినవన్నీ తెలుసుకున్నాను. ఈ అశాంతి నుంచి నన్ను ఎవరు బయటపడవేయగలరు? నేను పొందవలసిన అనుభవము నాకు కలగడంలేదేమి?" అని ముని ఎంతో మథనపడసాగారు. అప్పుడు ఆయనకు బ్రాహ్మణస్వామి గుర్తుకు వచ్చారు. ఆయన సామాన్య సన్యాసో, స్వామో కాదు, తనకు తప్పక సాయం చేయగలరు అనిపించింది.

అప్పుడు కృత్తికా ఉత్సవములు జరుగుతున్నాయి. ఊరంతా ఎంతో జనసమ్మర్దము గా ఉంది. స్వామి దర్శనానికి ఎందరో వస్తూంటారు. స్వామి విడిగా దొరుకుతారో లేదో అనుకుంటూ వడిగా అడుగులు వేస్తూ కొండ అధిరోహించసాగారు. మిట్టమధ్యాహ్నం, ఎండ తీవ్రముగా ఉంది. ఆర్తితో ముని కొండ ఎక్కసాగారు.

అదృష్టవశాత్తు బ్రాహ్మణస్వామి ఒక్కరే ఉన్నారు. ముని స్వామికి ప్రవర చెబుతూ సాష్టాంగ నమస్కారము చేసి, తన కుడి చేతితో స్వామి కుడిపాదము, ఎడమ చేతితో స్వామి ఎడమ పాదము పట్టుకొని ఆర్తితో, శ్రద్ధతో ఇలా అన్నారు.
" స్వామీ! నిష్ఠతో మంత్ర‌ జపములు, తీవ్ర తపములు ఆచరించాను. తెసుసుకోవలసినవన్నీ తెలుసుకున్నాను. అయినా తృప్తి లేదు. ఏదో లోటు మనసుని అలజడికి లోను చేస్తూంది. ఆర్తితో విహ్వలుడనైనాను. తపస్సంటే ఏమిటో దయచేసి తెలియజేయవలసింది, నన్ను సాకవలసింది" అవ్నారు.

అప్పటికి స్వామి మాట్లాడి ఎన్నో ఏళ్ళయింది. గొంతు సవరించుకుని తమిళం లో స్వామి గణపతి‌మునికి ఇలా చెప్పారు.

" ఎక్కడైతే నేను పుడుతోందో అక్కడ మనసుని లీనం చేయడమే తపస్సు.

ఎక్కడైతే మంత్ర శబ్దము జనిస్తోందో అక్కడ మనసుని లీనం చేయడమే తపస్సు"

ఈ మాటలు విన్న గణపతి ముని మనసులో ఆనంద సంద్రాలు పొంగాయి.

అప్పడే, స్వామి సేవకుడు పళనిస్వామి ద్వారా బ్రాహ్మణస్వామి పేరు "వేంకటరామన్" అని తెలుసుకుని, రామన్ ను "రమణ" చేసి, మహర్షి జోడించి, బ్రాహ్మణస్వామి పేరు రమణమహర్షి గా పెట్టారు. అలా గణపతి ముని పెట్టిన రమణమహర్షి పేరు బ్రాహ్మణస్వామికి ప్రసిద్ధముగా స్థిరపడిపోయింది.

రమణుల తపన్నిర్వచనము వారు సతతమూ వాక్రుచ్చే అనుగ్రహభాషణాన్ని ప్రతిఫలిస్తుంది. ఉపనిషత్తులు ప్రతిపాదించిన దశమహావిద్యలలో ఒకటైన దహరా విద్య ఇదియే

Monday, October 12, 2015

నేనూ - నా సాహితీసృష్టులు

నేనూ - నా సాహితీసృష్టులు

నేనూ కవితలల్లుతాను రచనలు చేస్తాను నలుగురిలా;
కానీ కవిగా గాని రచయితగా గాని లేదు గుర్తింపు నాకు;

అంతర్జాల మాధ్యమంలో కోకొల్లలు నా సాహితీసృష్టులు
తెలుగు ఆంగ్లం సంస్కృతంలో వెలయిస్తాను సాహిత్యం;

నేను నా సృష్టులను అచ్చు వేయింంచుకోలేదు; పేరు పడిన
విమర్శకులకు నేను, నా రచనలు పరిచయంలేవు

కొందరు పాఠకులు ఆదరంగా ఆనందంగా పఠిస్తారు
నా సాహిత్యాన్ని; సంతోషాన్ని తెలుపుతారు కూడా;

అలా నేనో సాహతీస్రష్టను; చేతి చమురు భాగోతంలా
ఖర్చుపెట్టి రచనలు అచ్చేయించుకునే దృష్టి లేదు

విమర్శకుల నలుగురైదుగురి సాన్నిహిత్యము, స్నేహం
లేవు; తెలియును ఆంధ్రగోదావరీ సలిలముల మౌనముగా
కలియు కిన్నెరసాని నా కవితాస్రవంతి, అట నిశ్శబ్దముగ
వీచు పరిమళ భరిత అనిలము నా‌ రచనాలహరి యని;

ఇది చాలు నాలో సాహితీ నిర్మాణ ఉత్సాహ ఝరి ఉప్పొంగుటకు, కొండవాగై ;
పరుగులెత్తుటకు; ఆత్మతృప్తికై సాహిత్యము సృష్టించెద; ధన్యుడనయ్యెద తదాచరణమున;

Saturday, October 10, 2015

ఆధ్యాత్మికత-ఉప్పు

ఆధ్యాత్మికత-ఉప్పు

ఇక్కడే భగవంతుని చూతమన్న
ఎందరికో మనసుకు పట్టదు;
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి
సుదూర యాత్రల ఆలయముల
దేవుని దేవిని దర్శింపగోరెదరు;
సతత భగవన్నామస్మరణమున
తండ్రితో సదా గడుపుదమన్న
చాలామందికి చిన్నచూపు, వినరు;


ఆ సన్యాసియో ఈ యతియో తన
శిష్యపరమాణువుగ స్వీకరించు వరకు
జన్మ ధన్యము కాలేదనుకొనుచు వారి
అనుగ్రహమునకై వేచిచూచు వింత ప్రకృతులు

రామనామమో కృష్ణ మంత్రమో
కడతేర్చునన్న నమ్మరు; ఆధ్యాత్మికత
అనుకొనుచు ఆశ్రమముల చుట్టూ
తిరిగెదరు; డబ్బు దస్కము సమర్పించెదరు

ఈశ్వరుడు గురువు ఆత్మ రూపములలో
దైవము కరుణించునన్న ఈశ్వరుని వదిలి
కుహనా గురువుల పట్టుకొని కడతేరని
బ్రతుకుల కాలయాపనము చేసెదరు

నీవును నీకు గురువువే నీ స్ఫురణలే
నీకు దారి చూపించునన్న‌ తమ శక్తిని
తాము తక్కువగ అంచనా వేసికొని
కరతలామలకమైన మోక్షమునకై
వడిదుడుకులు పడెదరు; విధివిహిత
ధర్మముల నిర్లక్ష్యము చేసి మృగతృష్ణలో
దాహము తీర్చుకొనుటకై పరువులెత్తెదరు

ఆధ్యాత్మికత పేరుతో కావలసినవారిని,
నిజ బాధ్యతలను విడిచిపెట్టి‌, వారికి
వీరికి బానిసలై తత్త్వము ఎఱుగకనే
చివరికి శరీరముల విడిచిపెట్టెదరు

జీవితమున రుచికై, నిరామయముగ విధి
విహిత ధర్మముల నిర్వర్తించుటకై
తత్త్వము, ఆధ్యాత్మికత; రుచికై ఉప్పు,
అంతియకాని ఉప్పే తినరాదు; తినలేము

Friday, October 9, 2015

The Nirbhayas

The Nirbhayas

The Nirbhaya kind of incident in Bangalore yesterday can be easily blamed on animal and brutal nature of some men.  Same thing happened in Bhopal recently. Unfortunately, many such incidents have been still happening after nirbhaya Delhi episode.

What the women themselves are doing for their safety? Governments will be certainly unable to provide police help or protection to each and every needy woman travelling alone. Moreover the protectors themselves are likely to be such men!

This reality must dawn on everybody, especially girls when they travel alone in the night time and hence must take necessary measures for their protection and wellbeing-- before they become easy and vulnerable targets for animals in the form of such men.

This is a gigantic problem which has certain solutions in addition to some police or security protection, like women taking care of themselves, being concerned about their own welfare. They will have to take necessary precaution for their safety and wellbeing in view of tremendous dangers that may fall upon them while they are outside their home. Self help is the best help at times.

Just blaming men, society or governments will not solve the problem that has its basis on the human nature and its misbehavior which cannot be simply wished away as the same is bound to happen on par with other criminal activities such as murder, robbery, corruption, and cheating. Saints and seers hardly roam during the nights for nothing to happen to the vulnerable members of our society.

నిజమైన వారసులమౌదాం

నిజమైన వారసులమౌదాం

మా తాతలనాడు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండనక
చేతులు ముడుచుకు కూర్చోక ఆ గొప్పదనాలకు నిజమైన వారసులమౌదాం;

సంస్కృత భాష సంగణకయంత్ర భాషయని చంకలుగుద్దుకోక
సంస్కృతభాషను నేర్చి రామాయణ మహాభారతముల చదువుదాం

మా ఋషులు మహాతపస్సంపన్నులని పరిపరి విధముల పొగిడి అలిసి అంతతో
ఆగక మనమూ ఉపనిత్ ధ్యానపద్ధతుల నేర్చి బుద్ధిని సానపెట్టుకొని స్వస్థతనొందుదాం

చరక శుశ్రుతుల మహా భిషగ్ వర్యులని ఆకాశానికెత్తి విరమింపక మనమూ
వైద్యశిఖామణులం అవుదాం, వారిచ్చిన జ్ఞానాన్ని అవగతము చేసికొని ఉపయోగిద్దాం

వ్యాసవాల్మీకులంత స్రష్టలమై విశ్వశ్రేయఃకరమైన రసభరిత కావ్యముల వెలయించుదాం
శంకరరామానుజమధ్వాచార్యుల సరసన చేరుదాం బ్రహ్మజ్ఞానసంపన్నులమై బ్రహ్మములమై

ఆర్యభట్టు గణితగ్రంథములను వల్లెవేద్దాం
ఖగోళజ్ఞానమున నిష్ణాతులమౌదాం, సున్నను
మించిన ఉపయోగకర విషయాన్ని కనిబెడదాం
జ్యామితిని అవుపోసనపట్టి క్రొత్త సిద్దాంతులమౌదాం

మీమాంసకులమై సప్తమ, అష్టమ, నవమ, దశమ దర్శనముల సృష్టిద్దాం
ఉపనిషత్తుల మరల వ్యాఖ్యానిద్దాం; బౌద్ధజైనతత్త్వముల తిరిగి పరిశీలిద్దాం

"వసుధైక కుటుంబకమ్" అన్న నానుడిని నిజం చేద్దాం
"ఆనో భద్రాః క్రతవోయంతు విశ్వతః" అని ప్రార్ధిద్దాం

మా తాతలనాడు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండనక
చేతులు ముడుచుకు కూర్చోక ఆ గొప్పదనాలకు నిజమైన వారసులమౌదాం

నేటి సాహితీ ధోరణులు

నేటి సాహితీ ధోరణులు

మనిషి నాగరికత నేర్చినప్పటినుంచీ, సంస్కృతీ సమాంతరంగా వర్ధిల్లింది. సంస్కృతికి పట్టుకొమ్మలు లలితకళలు. లలితకళలలో సాహిత్యానికి ప్రత్యేకత ఉంది. భాష నాగరికతకు, సంస్కృతికి మూలాధారము. జీవము. మిగిలిన లలితకళలకు సాహిత్యము ప్రాణము.

భాష సాహిత్యమునకు ఊపిరి. సాహిత్యమునకు పలు ప్రయోజనములు ఉన్నాయి. ప్రజల జీవితాలను ప్రతిబింబిస్తుంది. ప్రజల జీవనవిధానాన్ని స్నేహితునివలె సూచిస్తుంది. సరియైన పంథాలో పెడుతుంది. సరిదిద్దుతుంది. సాహతీస్రష్టలు సంఘానికి మార్గదర్శకులు.

సాహతీస్రష్టలు ఋషులై, జ్ఞానము, పాండిత్యము, వివిధవిషయములపై అవగాహన, కరుణ, కలిగి సర్వజనశ్రేయోకాములై తమ రచనల ద్వారా స్ఫూర్తినిస్తారు.

దురదృష్టవశాత్తు నేడు భారతదేశంలో ద్వేష విద్వేషముల పంచడానికి, సంస్కృతీ సాంప్రదాయముల నిరసించడానికీ తమ పరిమిత అవగాహనతో, "మేధ" తో ఎందరో రాస్తున్నారు. ఈ రచనలు మార్గదర్శకములుగా ఉండటం లేదు.
ఒక కులానికో, వర్గానికో, ప్రాంతానికో, ప్రాంతీయతత్వానికో లింగానికో, సిద్ధాంతానికో, మతానికో, మతమూఢత్వానికో, హేతువాదానికో, నాస్తికతకో, వత్తాసు పలుకుతూ వందిమాగధితనం కలిగి ఉంటున్నాయి. సార్వజనీనత ఈ రచనలలో కాగడా పెట్టి వెతికినా కనిపించటంలేదు. వారికి నచ్చిన కులమో, లింగమో, ప్రాంతమో, సిద్దాంతమో దాటి వారి రచనా వస్తువులు పోవడంలేదు.

ఇతర వర్గములను, కులములను, లింగములను, ప్రాంతములను, సంస్కృతులను, సాంప్రదాయములను, సిద్ధాంతములను దునుమాడడానికి మాత్రమే అన్నట్టు సాహితీసృష్టి జరుగుతోంది. సంస్కారము, నాగరికత అటకనపెట్టి ఆటవికులవలె రచనలు చేస్తున్నారు. విమర్శకులూ అలాగే వర్గాలుగా విడిపోయారు. వర్గపోరాటానికి మాత్రమే సాహితీసృష్టి అన్నట్టు తయారుచేశారు, సంకుచిత మనస్కులైన సాహితీకారులు.
ఇటువంటి వాతావరణములో సున్నితత్వానికి, సామరస్యానికి, సంస్కారయుత వర్తనానికీ‌, చోటున్న సాహితీ సృష్టికి దారులు మూసివేయబడ్డాయి.

ఈ అసహనము సంఘంలో అశాంతికి మాత్రమే దారి తీస్తోంది. ఏదో వర్గాన్ని దునుమాడక పోతే అది సాహిత్యమే కాదన్న ధోరణులు పెరిగాయి. ఇది గర్హనీయము. ఈ క్రింది సూక్తులను సాహతీస్రష్టలు మరచిపోకుండా ఉంటే‌ ఉపయోగకరమైన సాహిత్యము సృష్టించబడుతుంది.

వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్!
రమణీయార్థప్రతిపాదక శబ్దః కావ్యః!
విశ్వశ్రేయమ్ కావ్యపరమార్ధమ్!,