మాయ చిత్రములు 5
పూర్ణమదః పూర్ణమిదమ్
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమ్ ఏవ అవశిష్యతే
ఉన్నది మరొకలా కనపడితే దాన్ని భ్రాంతి అంటారు.
ఇలా ఎందుకు జరుగుతుంది?
పూర్ణమదః పూర్ణమిదమ్
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమ్ ఏవ అవశిష్యతే
ఇది మనందరికీ బాగా తెలిసిన ఉపనిషత్ శ్లోకం.
ఇందులో అదః ఆత్మని, ఇదమ్ చరాచర ప్రపంచం యొక్క ( మానసిక ) కార్యకలాపాలని తెలియజేస్తాయి. అదః ని
అహమ్ అనీ అంటారు.
అహమ్ గమనికకు, ఇదమ్, కల, మెళకువ మానసిక దశలలో జరిగే అంతఃకరణ పురోధాన తిరోధానయుత పరిణామము లకు చిహ్నం.
అహమ్ నే బ్రహ్మమనీ, ఆత్మయనీ అంటారు. అలా బ్రహ్మము, ఆత్మ గమనికకు మారుపేర్లు.
ఊపిరులు తీసి వదలడం వల్ల ఆత్మశక్తి జనిస్తుంది. ఆత్మ శక్తినే చిత్ శక్తి అనీ అంటారు. ఈ చిత్ శక్తి మేధలో ప్రతి ఫలనం చెంది చిదాభాస గా మారుతుంది. ఈ చిదాభాసనే
మాయ అంటారని అనుకున్నాం. మాయ ముందుకు, వెనుకకు అంతఃకరణముల రూపంలో మార్పు చెందడమే మనలో మానసిక కార్య కలాపాలు జరగడం.
అద్వైత స్థితిలో అహమ్, ఇదమ్ అని విడిగా ఉండక, అహమ్-అహమ్ వరుసగా, గమనికా ప్రవాహం మాత్రం ఉంటుంది. మానసిక కార్యకలాపాలు జరుగవు. జాగ్రత్ సుషుప్తి దశలో సంకల్పిస్తే జరుగుతాయి. గాఢనిద్ర, జాగ్రత్ సుషుప్తిలు అద్వైత స్థితులు.
కల, మెళకువ మానసిక దశలలో అంతఃకరణములు, జ్ఞాన, కర్మేంద్రియాలతో కలిసి పనిచేసి మనల్ని మానసికంగా పనిచేసేలా చేస్తాయి. ఈ స్థితిని ద్వైత స్థితి అంటారు. ఈ దశలలో ( కల, మెళకువ ) అహమ్ - ఇదమ్
అని రెండు గా గమనిక (లో) - ప్రపంచం ( మానసిక ) గా ఉంటుంది.
ఈ మానసిక కార్యకలాపాలు అన్నీ మానసిక శక్తి (మాయ)
యొక్క మార్పులు. కన్నడ భాషలో నిజగుణయోగి అనే ఆయన రాసిన వేదాంత చింతామణి అనే గ్రంథంలో, వేదాంత పరిచ్ఛేదంలో మాయకు ఐదు పేర్లు చెప్పారు.
అవి: తమస్సు; మాయ; మోహం; అవిద్య; అనిత్యం.
జీవచైతన్యాన్ని మఱుగుపరిచేది కనుక తమస్సనీ;
జగద్రూపమైన తనను వేరుగా తోపీంచుటకు కారణమైనది కనుక మాయ యనీ;
అట్లు తోపించు జగమున శుక్తి రజత భ్రాంతి కలిగించేది కనుక మోహమనీ;
విద్యను చెఱపినందున అవిద్య అనీ;
సద్రూపమునకు అన్యమైనందున అనిత్యమనీ;
చెప్పబడింది.
అద్వైత వేదాంత సారమైన
బ్రహ్మ సత్ జగత్ మిథ్యా
జీవో బ్రహ్మ ఏవి న అపరః
వాక్యార్థాన్ని;
రజ్జు సర్ప భ్రాంతి గురించి
తరువాయి భాగం లో పరామర్శిద్దాము.
శుభం భూయాత్!
మాయ చిత్రములు 6ఇందులో అదః ఆత్మని, ఇదమ్ చరాచర ప్రపంచం యొక్క ( మానసిక ) కార్యకలాపాలని తెలియజేస్తాయి. అదః ని
అహమ్ అనీ అంటారు.
అహమ్ గమనికకు, ఇదమ్, కల, మెళకువ మానసిక దశలలో జరిగే అంతఃకరణ పురోధాన తిరోధానయుత పరిణామము లకు చిహ్నం.
అహమ్ నే బ్రహ్మమనీ, ఆత్మయనీ అంటారు. అలా బ్రహ్మము, ఆత్మ గమనికకు మారుపేర్లు.
ఊపిరులు తీసి వదలడం వల్ల ఆత్మశక్తి జనిస్తుంది. ఆత్మ శక్తినే చిత్ శక్తి అనీ అంటారు. ఈ చిత్ శక్తి మేధలో ప్రతి ఫలనం చెంది చిదాభాస గా మారుతుంది. ఈ చిదాభాసనే
మాయ అంటారని అనుకున్నాం. మాయ ముందుకు, వెనుకకు అంతఃకరణముల రూపంలో మార్పు చెందడమే మనలో మానసిక కార్య కలాపాలు జరగడం.
అద్వైత స్థితిలో అహమ్, ఇదమ్ అని విడిగా ఉండక, అహమ్-అహమ్ వరుసగా, గమనికా ప్రవాహం మాత్రం ఉంటుంది. మానసిక కార్యకలాపాలు జరుగవు. జాగ్రత్ సుషుప్తి దశలో సంకల్పిస్తే జరుగుతాయి. గాఢనిద్ర, జాగ్రత్ సుషుప్తిలు అద్వైత స్థితులు.
కల, మెళకువ మానసిక దశలలో అంతఃకరణములు, జ్ఞాన, కర్మేంద్రియాలతో కలిసి పనిచేసి మనల్ని మానసికంగా పనిచేసేలా చేస్తాయి. ఈ స్థితిని ద్వైత స్థితి అంటారు. ఈ దశలలో ( కల, మెళకువ ) అహమ్ - ఇదమ్
అని రెండు గా గమనిక (లో) - ప్రపంచం ( మానసిక ) గా ఉంటుంది.
ఈ మానసిక కార్యకలాపాలు అన్నీ మానసిక శక్తి (మాయ)
యొక్క మార్పులు. కన్నడ భాషలో నిజగుణయోగి అనే ఆయన రాసిన వేదాంత చింతామణి అనే గ్రంథంలో, వేదాంత పరిచ్ఛేదంలో మాయకు ఐదు పేర్లు చెప్పారు.
అవి: తమస్సు; మాయ; మోహం; అవిద్య; అనిత్యం.
జీవచైతన్యాన్ని మఱుగుపరిచేది కనుక తమస్సనీ;
జగద్రూపమైన తనను వేరుగా తోపీంచుటకు కారణమైనది కనుక మాయ యనీ;
అట్లు తోపించు జగమున శుక్తి రజత భ్రాంతి కలిగించేది కనుక మోహమనీ;
విద్యను చెఱపినందున అవిద్య అనీ;
సద్రూపమునకు అన్యమైనందున అనిత్యమనీ;
చెప్పబడింది.
అద్వైత వేదాంత సారమైన
బ్రహ్మ సత్ జగత్ మిథ్యా
జీవో బ్రహ్మ ఏవి న అపరః
వాక్యార్థాన్ని;
రజ్జు సర్ప భ్రాంతి గురించి
తరువాయి భాగం లో పరామర్శిద్దాము.
శుభం భూయాత్!
ఉన్నది మరొకలా కనపడితే దాన్ని భ్రాంతి అంటారు.
ఇలా ఎందుకు జరుగుతుంది?
బయటి భౌతిక ప్రపంచం లోని వస్తు సముదాయాన్ని మనసు జ్ఞానేంద్రియముల సహాయముతో గ్రహించి మస్తిష్కంలో ఆంతర ప్రపంచం గా ముద్రిస్తుంది.
ఇది మెళకువ మానసిక దశలో జరుగుతుంది.
ఈ ఆంతర ప్రపంచం నుంచి మనసే వస్తు సముదాయ ముద్రలని గ్రహిస్తుంది. ఇది కల మానసిక దశలో అంతర్ముఖ దృష్టిని పొంది తలపుల రూపంలో వెలికి తీస్తుంది.
ఈ మెళకువ, కల దశలు ఒకే సమయంలో ఒక దాని తర్వాత ఒకటి చక చకా కలుగుతూ, బహిర్ముఖ, అంతర్ముఖ దృష్టులు ఏర్పడి మానసిక కార్యకలాపాలు జరుగుతాయి.
బయటి భౌతిక ప్రపంచం లోని ఒక వస్తువుని బహిర్ముఖ దృష్టి ద్వారా చూసి, అంతలోనే మనసు అంతర్ముఖమై ఆంతర ప్రపంచం నుంచి బయటి ప్రపంచంలో చూసిన వస్తువును అకార, ఇతర సదృశాలతో సమమైన వస్తువు గా మనకి కనిపింపజేస్తుంది.
అలా ముత్యపు చిప్ప మెరుస్తూ వెండిలా భాసిస్తుంది.
శుక్తి - రజత భ్రాంతి.
తాడు పాములా అనిపిస్తుంది.
రజ్జు - సర్ప భ్రాంతి.
మనసు ఇలా నిజాన్ని (ఉన్నదానిని) అబద్ధం గా (లేని దానిగా) చూపడం భ్రాంతి. లేని దాన్ని ఉన్నదానిగా చూపడం భ్రమ. భ్రమలు తలపులు గా ఉంటాయి. భ్రాంతి ఉన్న వస్తువు ని అబద్ధపు వస్తువు గా చూపుతుంది.
ఈ భ్రమ, భ్రాంతులు కలగడానికి మనసు తప్పుగా విషయ లేదా వస్తు గ్రహణం చేయడం.
మనసు ద్వారా గ్రహణము, చిత్తం ద్వారా గ్రహింపు ఏర్పడతాయి. బుద్ధి తర్కాన్నీ, విచక్షణా సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అహంకారం అనేది మన గురించి మనకు ఏర్పడిన, కలిగే భావ సముదాయము. తలపుల సమూహం. అహంభావ, మమకారాలని ఏర్పరిచే, కలిగించే అనుభవాలకు కారకం. కారణం.
మానసిక కార్యకలాపాలు జరిపే చిత్ శక్తి రూపమే మాయ.
ఉన్నది, ఉండేది బ్రహ్మము (గమనిక) ఒక్కటే. మిగతావన్నీ వచ్చి పోయేవే. ఆభాసలు. ఆనింపులు. అంతర్ముఖ దృష్టితో మనసు గ్రహించిన భావ సముదాయమే జగత్. ఇది భావముల రూపంలో గమనికలోకి వచ్చిపోయేది.
మిథ్యా పదానికి రెండు అర్థాలు. ఒకటి నిజము కానిది. అబద్ధమైనది. అద్దములోని మన ప్రతిబింబం మిథ్య.
అది నిజము కానిది. మన ముఖం నిజమైనది. ప్రతి బింబానికి వస్తువు గా అస్తిత్వం లేదు. ఉనికి లేదు. అద్దం లేకపోయినా, ముఖం లేకపోయినా ప్రతిబింబం ఉండదు.
దానికి స్వంతంగా, స్వయంగా అస్తిత్వం, ఉనికి లేదు. అది అద్దంలో కాంతి పరావర్తనం వల్ల ఏర్పడిన నిజము కాని ఒక అబద్ధం.
రెండవ అర్థం శాశ్వతత్వం లేనిది.
అలాగే జగత్ ఒక అబద్ధం. ఆభాస. మనసుచే కల్పించబడింది. దృష్టి లోకి వచ్చి పోయేది. శాశ్వతం కానిది. మానసిక దశ, అవస్థలని బట్టి ఏర్పడేది. మనసు చూపే, మనసే అయిన భావ పరంపర.
నిజము గమనిక. ఇది వ్యక్తి (భావ రూపంలో) ఉన్నప్పుడు, లేనప్పుడూ ఉండేది. మెళకువ, కల మానసిక దశలలో వ్యక్తిత్వం, వ్యక్తిత్వ భావన ఉంటాయి.
అలా, వ్యక్తిత్వం రూపంలో జీవాత్మ ఉన్నా, జాగ్రత్ సుషుప్తి, సుషుప్తి దశల్లో లేకున్నా ఎల్లప్పుడూ, సర్వ కాల (భావ), సర్వావస్థలయందూ ( మానసిక అవస్థలు, లేదా దశలు) ఉండేది, గమనిక గా ఉండేది బ్రహ్మము, ఆత్మ.
బ్రహ్మము, ఆత్మ ఒకటే. అయమ్ ఆత్మా బ్రహ్మా.
అహం బ్రహ్మాస్మి - నేను గమనికకు, దష్టికి మరియొక పేరు.
జీవాత్మ ( దృష్టిలో వ్యక్తిత్వ స్పృహ) ఉన్నా, పరమాత్మ (దృష్టిలో వ్యక్తిత్వ స్పృహ లేకున్నా) ఉండేది, రెంటికీ ఆలవాలమైనది ఒకటే. అదే దృష్టి రూపమైన బ్రహ్మము.
అంచేత జీవ భావమునందు, బ్రహ్మానుభవమునందు ఉండే గమనిక ఒకటే. ఒక్కటే. వేరు కాదు.
జీవో బ్రహ్మ ఏవ న అపరః.
ఇది బ్రహ్మ, ఆత్మ జ్ఞాన సారాంశము. అద్వైత వేదాంత సారము.
భావములు సుఖదుఃఖ కారణములు. అభావము శాంతి. ఆనందము, మౌనము.
ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!
ఇది మెళకువ మానసిక దశలో జరుగుతుంది.
ఈ ఆంతర ప్రపంచం నుంచి మనసే వస్తు సముదాయ ముద్రలని గ్రహిస్తుంది. ఇది కల మానసిక దశలో అంతర్ముఖ దృష్టిని పొంది తలపుల రూపంలో వెలికి తీస్తుంది.
ఈ మెళకువ, కల దశలు ఒకే సమయంలో ఒక దాని తర్వాత ఒకటి చక చకా కలుగుతూ, బహిర్ముఖ, అంతర్ముఖ దృష్టులు ఏర్పడి మానసిక కార్యకలాపాలు జరుగుతాయి.
బయటి భౌతిక ప్రపంచం లోని ఒక వస్తువుని బహిర్ముఖ దృష్టి ద్వారా చూసి, అంతలోనే మనసు అంతర్ముఖమై ఆంతర ప్రపంచం నుంచి బయటి ప్రపంచంలో చూసిన వస్తువును అకార, ఇతర సదృశాలతో సమమైన వస్తువు గా మనకి కనిపింపజేస్తుంది.
అలా ముత్యపు చిప్ప మెరుస్తూ వెండిలా భాసిస్తుంది.
శుక్తి - రజత భ్రాంతి.
తాడు పాములా అనిపిస్తుంది.
రజ్జు - సర్ప భ్రాంతి.
మనసు ఇలా నిజాన్ని (ఉన్నదానిని) అబద్ధం గా (లేని దానిగా) చూపడం భ్రాంతి. లేని దాన్ని ఉన్నదానిగా చూపడం భ్రమ. భ్రమలు తలపులు గా ఉంటాయి. భ్రాంతి ఉన్న వస్తువు ని అబద్ధపు వస్తువు గా చూపుతుంది.
ఈ భ్రమ, భ్రాంతులు కలగడానికి మనసు తప్పుగా విషయ లేదా వస్తు గ్రహణం చేయడం.
మనసు ద్వారా గ్రహణము, చిత్తం ద్వారా గ్రహింపు ఏర్పడతాయి. బుద్ధి తర్కాన్నీ, విచక్షణా సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అహంకారం అనేది మన గురించి మనకు ఏర్పడిన, కలిగే భావ సముదాయము. తలపుల సమూహం. అహంభావ, మమకారాలని ఏర్పరిచే, కలిగించే అనుభవాలకు కారకం. కారణం.
మానసిక కార్యకలాపాలు జరిపే చిత్ శక్తి రూపమే మాయ.
ఉన్నది, ఉండేది బ్రహ్మము (గమనిక) ఒక్కటే. మిగతావన్నీ వచ్చి పోయేవే. ఆభాసలు. ఆనింపులు. అంతర్ముఖ దృష్టితో మనసు గ్రహించిన భావ సముదాయమే జగత్. ఇది భావముల రూపంలో గమనికలోకి వచ్చిపోయేది.
మిథ్యా పదానికి రెండు అర్థాలు. ఒకటి నిజము కానిది. అబద్ధమైనది. అద్దములోని మన ప్రతిబింబం మిథ్య.
అది నిజము కానిది. మన ముఖం నిజమైనది. ప్రతి బింబానికి వస్తువు గా అస్తిత్వం లేదు. ఉనికి లేదు. అద్దం లేకపోయినా, ముఖం లేకపోయినా ప్రతిబింబం ఉండదు.
దానికి స్వంతంగా, స్వయంగా అస్తిత్వం, ఉనికి లేదు. అది అద్దంలో కాంతి పరావర్తనం వల్ల ఏర్పడిన నిజము కాని ఒక అబద్ధం.
రెండవ అర్థం శాశ్వతత్వం లేనిది.
అలాగే జగత్ ఒక అబద్ధం. ఆభాస. మనసుచే కల్పించబడింది. దృష్టి లోకి వచ్చి పోయేది. శాశ్వతం కానిది. మానసిక దశ, అవస్థలని బట్టి ఏర్పడేది. మనసు చూపే, మనసే అయిన భావ పరంపర.
నిజము గమనిక. ఇది వ్యక్తి (భావ రూపంలో) ఉన్నప్పుడు, లేనప్పుడూ ఉండేది. మెళకువ, కల మానసిక దశలలో వ్యక్తిత్వం, వ్యక్తిత్వ భావన ఉంటాయి.
అలా, వ్యక్తిత్వం రూపంలో జీవాత్మ ఉన్నా, జాగ్రత్ సుషుప్తి, సుషుప్తి దశల్లో లేకున్నా ఎల్లప్పుడూ, సర్వ కాల (భావ), సర్వావస్థలయందూ ( మానసిక అవస్థలు, లేదా దశలు) ఉండేది, గమనిక గా ఉండేది బ్రహ్మము, ఆత్మ.
బ్రహ్మము, ఆత్మ ఒకటే. అయమ్ ఆత్మా బ్రహ్మా.
అహం బ్రహ్మాస్మి - నేను గమనికకు, దష్టికి మరియొక పేరు.
జీవాత్మ ( దృష్టిలో వ్యక్తిత్వ స్పృహ) ఉన్నా, పరమాత్మ (దృష్టిలో వ్యక్తిత్వ స్పృహ లేకున్నా) ఉండేది, రెంటికీ ఆలవాలమైనది ఒకటే. అదే దృష్టి రూపమైన బ్రహ్మము.
అంచేత జీవ భావమునందు, బ్రహ్మానుభవమునందు ఉండే గమనిక ఒకటే. ఒక్కటే. వేరు కాదు.
జీవో బ్రహ్మ ఏవ న అపరః.
ఇది బ్రహ్మ, ఆత్మ జ్ఞాన సారాంశము. అద్వైత వేదాంత సారము.
భావములు సుఖదుఃఖ కారణములు. అభావము శాంతి. ఆనందము, మౌనము.
ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!
No comments:
Post a Comment