మాయ చిత్రములు 3
ఏది లేదో అది మాయ అని;
దేని ద్వారా మనం ఈ చరాచర ప్రపంచాన్ని గ్రహణకు తెచ్చుకొని మానసికంగా వ్యవహరిస్తున్నామో దానిని మాయ అంటారని 2 వ భాగంలో నిర్వచించుకున్నాము.
మాయ పదాన్ని చాలామందిమి సరిగా అవగాహన చేసికోలేదు.
అదృశ్యమై పోవడం, లేకుండా పోవడం మాయ గురించి వినగానే మనకు స్ఫురించే అర్థాలు.
మూడవ భాగంలో మాయ మానసిక శక్తికి పర్యాయ పదం అని తెలుసుకున్నాము. అన్ని మానసిక కార్యకలాపాలు నిర్వర్తించే అంతఃకరణములు మాయ యొక్క విభూతులే అని గమనించాము.
అంతఃకరణముల పరిణామములే వృత్తులని; "యోగః చిత్తవృత్తి నిరోధః" అంటే ఈ అంతఃకరణముల పరిణామములను నిరోధించు కోవడమనీ అనుకున్నాము.
"చేతోవృత్తిరుపేత్య తిష్టతి సా భక్తిరిత్యభిదీయతే" అని ఈ అంతఃకరణముల పరిణామములను జరగకుండా చేసికోవడమే భక్తి అనీ అన్నాము.
మాయావిభూతులైన అంతఃకరణ పరిణామముల వలన మనకు, మనలో మానసిక దశలు ఏర్పడతాయి. ఇవి:
జాగ్రత్ సుషుప్తి - మెళకువ తో కూడిన నిద్ర.
ఈ దశలో కావలిస్తే, సంకల్పిస్తే మాయ అంతఃకరణములుగా విభూతి చెంది, అంతఃకరణములు పరిణమించి జ్ఞాన, కర్మేంద్రియానుసంధానంతో మానసిక కార్య కలాపాలు జరుపుతాయి.
సుషుప్తి - గాఢనిద్ర.
ఈ దశలో మాయా పరిణామములు సంభవించవు.
మాయ అంతఃకరణములుగా విభూతి చెందదు. మానసిక కార్యకలాపాలు జరగడం ఉండదు.
మానసిక కార్య కలాపాలు నిర్వర్తించబడక విరమింపబడి ఉండడాన్ని నిద్ర అంటారు. ఈ దశ మనసు నిండుకున్న దశ. ఇప్పుడు దృష్టిలో తమము ఉంటుంది.
ఈ రెండు దశల్లోనూ దృష్టి విశ్రాంతమై ఉంటుంది.
మిగతా రెండు :
జాగ్రత్ - మెళకువ
మెళకువ మానసిక దశలో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియాలు ( మాట, ధ్వని - గొంతు - స్వరపేటిక కదలికలు; చేతుల కదలికలు, కాళ్ళ కదలికలు, ప్రేవుల కదలికలు, జననేంద్రియ కదలికలు) పనిచేస్తూ ఉంటాయి.
హావ భావములు అనుగుణంగా కళ్ళ కదలికలు, ముఖ భంగిమల మార్పు కర్మేంద్రియాలు కిందే లెక్కకు వస్తాయి.
అంతఃకరణములు జ్ఞాన, కర్మేంద్రియాలతో కలిసి పనిచేయడమే మానసిక కార్యకలాపాలు జరగడం. ఇది మెళకువ మానసిక దశలో జరుగుతుంది. అంతఃకరణములు బయటి భౌతిక ప్రపంచం లోని విషయములతో అనుసంధానించబడి విషయ, విషయానుభవ గ్రహణం చేస్తాయి. మస్తిష్కంలో ప్రపంచం, వాసనలు గా ఏర్పరిచి భద్రపరచి మరల అవసరమై నప్పుడు దృష్టికి తెస్తాయి. ఈ దశలో అంతఃకరణములకు బహిర్ముఖ దృష్టి ఉంటుంది.
స్వప్న - కల
కల మానసిక దశలో అంతఃకరణములు కర్మేంద్రియాలతో కలిసి పనిచేస్తాయి. జ్ఞానేంద్రియములు పనిచేయవు. ఈ దశలో మనసు తానే మెళకువ మానసిక దశలో జ్ఞానేంద్రియముల సహాయముతో నిర్మించిన విషయ ఆంతర ప్రపంచం నుంచి విషయములను గ్రహిస్తుంది.
మనసు ఆంతర ప్రపంచం నుంచి విషయములను గ్రహించడమే తలపులు కలగడం; భావములు జనించడం అన్నా, ఉదయించడం అన్నా ఇదే.
కల మానసిక దశలో అంతఃకరణములు అంతర్ముఖ దృష్టిని కలిగి ఉంటాయి. ఆంతరప్రపంచంతో మనసు, విషయానుభవములను వాసనలుగా మార్చి మరల సంకల్ప వికల్పములను కలిగించే చిత్తము మస్తిష్కంలోని;
దృశ్యం, శబ్ద, వాసనలు, రుచులు, స్పర్శలు, వేడిమి, చల్లదనం లను, అవి కలిగించిన అనుభవములను వెలికి తీసి మానసిక దృష్టిలోకి తెస్తాయి.
అంతఃకరణములు మాయయైపోవడమే జాగ్రత్ సుషుప్తి, సుషుప్తి దశల ఉదయం.
ఇలా జాగ్రత్ సుషుప్తి, జాగ్రత్, స్వప్న దశలలో మాయ విభూతి పొంది, అంతఃకరణములు గా మారి జ్ఞాన కర్మేంద్రియాలతో కలిసి పనిచేయడమే మానసిక కార్య కలాపాలు జరగడం లేదా నిర్వర్తింపబడడం.
మనకు కలుగు సకల జ్ఞానములు, భాషా జ్ఞానం, ఇతర పరిజ్ఞానములు, కౌశలములు ఈ పద్ధతి లో జరుగుతాయి.
మాయ గురించి మరిన్ని విశేషాలు, వివరాలు తరువాయి భాగం లో.
ఏది లేదో అది మాయ అని;
దేని ద్వారా మనం ఈ చరాచర ప్రపంచాన్ని గ్రహణకు తెచ్చుకొని మానసికంగా వ్యవహరిస్తున్నామో దానిని మాయ అంటారని 2 వ భాగంలో నిర్వచించుకున్నాము.
అదేవిధంగా చిదాభాస, ప్రణవం, స్ఫోట మాయకు నామాంతరములనీ చెప్పుకున్నాము.
చిత్ శక్తి మేధలో ప్రతి ఫలనం చెంది చిదాభాస గా మారుతుంది. ఇది మాయ లేదా
మానసిక శక్తీ. ఈ మానసిక శక్తి విభూతులే అంతఃకరణములు. మనసు, బుద్ధి,
చిత్తము, అహంకారములు అంతఃకరణములు.
మాయామయ, మాయానిర్మిత అంతఃకరణ పురోధాన, తిరోధాన పరిణామములే మానసిక కార్యకలాపాలు. అంతఃకరణముల పరిణామమునే వృత్తి అంటారు. అంతఃకరణములు పరిణమించకుండా, పనిచేయకుండా విరమింపబడి ఉంటే అది నివృత్తి. ఆధ్యాత్మిక సాధకులకు ఈ పరిభాష పరిచయమే.
మాయా మయమ్ ఇదమ్ జగత్
ఇది మనకు పరిచయమైన సంస్కృత వాక్యము. అద్వైత సారము.
మాయచే జగత్ నిర్మింపబడింది అని దీని అర్థం. జగత్ అంతా మాయామయము. మనసు మెళకువ మానసిక దశలో జ్ఞానేంద్రియముల సాయంతో బయటి భౌతిక ప్రపంచాన్ని గ్రహిస్తుంది. దానిని మస్తిష్కంలో ప్రపంచంగా భద్రపరుస్తుంది. బయటి భౌతిక ప్రపంచం విషయములతో నిండిఉంటుంది. వీటిని శక్తి పరంగా తన్మాత్రలు అంటారు.
కళ్ళకు కాంతి శక్తి, చెవులకు శబ్దం, ధ్వని (యాంత్రిక శక్తి),
ముక్కుకు, నాలికకు రసాయన శక్తి, చర్మానికి స్పర్శ ( యాంత్రిక శక్తి ), వేడిమి, చల్లదనం ( ఉష్ణ శక్తి) తన్మాత్రలు. ఇవి విషయ శక్తులు. విషయాలు ఇవి: దృశ్యాలు (కళ్ళు), శబ్దములు, ధ్వనులు, మాటలు (చెవి), వాసనలు (ముక్కు), రుచులు (నాలిక), స్పర్శ, వేడిమి, చల్లదనం (చర్మం).
ఈ విషయములు గ్రహింపబడుతున్నప్పడు అదే సమయంలో అవి కలిగించే అనుభవములను విషయానుభవములు అంటారు. వీటిని చిత్తం వాసనలుగా ఏర్పరిచి, భద్రపరచి మరల తానే వాసనా ప్రకోపం కలిగించి సంకల్ప, వికల్పములను, అనుభవాల జాగరణను చేస్తుంది. భాషలు నేర్చుకుంటున్నప్పడు ఇదే విధంగా జరుగుతుంది. మాటలు, వాక్యములు కలిగించే అర్థ స్పృహనూ, స్మరణాన్నీ చిత్తమే కలిగిస్తుంది, చేస్తుంది.
మనిషికి తన వివిధ భౌతిక, మానసిక, సాంఘిక స్థితి గతుల గురించిన తలుపులే అహంకారం. వాటి వల్ల కలిగే అహంభావం, మమకారం, అన్ని మానసిక వికారములూ మనసు, చిత్తంల ద్వారానే, వల్లనే కలుగుతాయి.
బుద్ధి తర్కాన్నీ, విచక్షణా సామర్థ్యాన్ని కలిగిస్తుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ అంతఃకరణములన్నీ మాయా విభూతులే, అవతారములే. అంతఃకరణములు పరిణమించి పనిచేయడం మాయా పరిణామములే. అంతఃకరణములు పనిచేస్తూండడమే మానసిక కార్యకలాపాలు జరగడం.
అలా, ప్రపంచంలో ఐదు అంశలు ఉన్నాయి, అవి - ఆస్తి భాతి ప్రియం; నామం, రూపం. ఇందులో ఆస్తి భాతి ప్రియం బ్రహ్మ రూపము. నామము, రూపము జగత్ రూపము.
తరువాయి 4 వ భాగం లో.
****************
మాయ చిత్రములు 4మాయామయ, మాయానిర్మిత అంతఃకరణ పురోధాన, తిరోధాన పరిణామములే మానసిక కార్యకలాపాలు. అంతఃకరణముల పరిణామమునే వృత్తి అంటారు. అంతఃకరణములు పరిణమించకుండా, పనిచేయకుండా విరమింపబడి ఉంటే అది నివృత్తి. ఆధ్యాత్మిక సాధకులకు ఈ పరిభాష పరిచయమే.
మాయా మయమ్ ఇదమ్ జగత్
ఇది మనకు పరిచయమైన సంస్కృత వాక్యము. అద్వైత సారము.
మాయచే జగత్ నిర్మింపబడింది అని దీని అర్థం. జగత్ అంతా మాయామయము. మనసు మెళకువ మానసిక దశలో జ్ఞానేంద్రియముల సాయంతో బయటి భౌతిక ప్రపంచాన్ని గ్రహిస్తుంది. దానిని మస్తిష్కంలో ప్రపంచంగా భద్రపరుస్తుంది. బయటి భౌతిక ప్రపంచం విషయములతో నిండిఉంటుంది. వీటిని శక్తి పరంగా తన్మాత్రలు అంటారు.
కళ్ళకు కాంతి శక్తి, చెవులకు శబ్దం, ధ్వని (యాంత్రిక శక్తి),
ముక్కుకు, నాలికకు రసాయన శక్తి, చర్మానికి స్పర్శ ( యాంత్రిక శక్తి ), వేడిమి, చల్లదనం ( ఉష్ణ శక్తి) తన్మాత్రలు. ఇవి విషయ శక్తులు. విషయాలు ఇవి: దృశ్యాలు (కళ్ళు), శబ్దములు, ధ్వనులు, మాటలు (చెవి), వాసనలు (ముక్కు), రుచులు (నాలిక), స్పర్శ, వేడిమి, చల్లదనం (చర్మం).
ఈ విషయములు గ్రహింపబడుతున్నప్పడు అదే సమయంలో అవి కలిగించే అనుభవములను విషయానుభవములు అంటారు. వీటిని చిత్తం వాసనలుగా ఏర్పరిచి, భద్రపరచి మరల తానే వాసనా ప్రకోపం కలిగించి సంకల్ప, వికల్పములను, అనుభవాల జాగరణను చేస్తుంది. భాషలు నేర్చుకుంటున్నప్పడు ఇదే విధంగా జరుగుతుంది. మాటలు, వాక్యములు కలిగించే అర్థ స్పృహనూ, స్మరణాన్నీ చిత్తమే కలిగిస్తుంది, చేస్తుంది.
మనిషికి తన వివిధ భౌతిక, మానసిక, సాంఘిక స్థితి గతుల గురించిన తలుపులే అహంకారం. వాటి వల్ల కలిగే అహంభావం, మమకారం, అన్ని మానసిక వికారములూ మనసు, చిత్తంల ద్వారానే, వల్లనే కలుగుతాయి.
బుద్ధి తర్కాన్నీ, విచక్షణా సామర్థ్యాన్ని కలిగిస్తుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ అంతఃకరణములన్నీ మాయా విభూతులే, అవతారములే. అంతఃకరణములు పరిణమించి పనిచేయడం మాయా పరిణామములే. అంతఃకరణములు పనిచేస్తూండడమే మానసిక కార్యకలాపాలు జరగడం.
అలా, ప్రపంచంలో ఐదు అంశలు ఉన్నాయి, అవి - ఆస్తి భాతి ప్రియం; నామం, రూపం. ఇందులో ఆస్తి భాతి ప్రియం బ్రహ్మ రూపము. నామము, రూపము జగత్ రూపము.
తరువాయి 4 వ భాగం లో.
****************
మాయ పదాన్ని చాలామందిమి సరిగా అవగాహన చేసికోలేదు.
అదృశ్యమై పోవడం, లేకుండా పోవడం మాయ గురించి వినగానే మనకు స్ఫురించే అర్థాలు.
మూడవ భాగంలో మాయ మానసిక శక్తికి పర్యాయ పదం అని తెలుసుకున్నాము. అన్ని మానసిక కార్యకలాపాలు నిర్వర్తించే అంతఃకరణములు మాయ యొక్క విభూతులే అని గమనించాము.
అంతఃకరణముల పరిణామములే వృత్తులని; "యోగః చిత్తవృత్తి నిరోధః" అంటే ఈ అంతఃకరణముల పరిణామములను నిరోధించు కోవడమనీ అనుకున్నాము.
"చేతోవృత్తిరుపేత్య తిష్టతి సా భక్తిరిత్యభిదీయతే" అని ఈ అంతఃకరణముల పరిణామములను జరగకుండా చేసికోవడమే భక్తి అనీ అన్నాము.
మాయావిభూతులైన అంతఃకరణ పరిణామముల వలన మనకు, మనలో మానసిక దశలు ఏర్పడతాయి. ఇవి:
జాగ్రత్ సుషుప్తి - మెళకువ తో కూడిన నిద్ర.
ఈ దశలో కావలిస్తే, సంకల్పిస్తే మాయ అంతఃకరణములుగా విభూతి చెంది, అంతఃకరణములు పరిణమించి జ్ఞాన, కర్మేంద్రియానుసంధానంతో మానసిక కార్య కలాపాలు జరుపుతాయి.
సుషుప్తి - గాఢనిద్ర.
ఈ దశలో మాయా పరిణామములు సంభవించవు.
మాయ అంతఃకరణములుగా విభూతి చెందదు. మానసిక కార్యకలాపాలు జరగడం ఉండదు.
మానసిక కార్య కలాపాలు నిర్వర్తించబడక విరమింపబడి ఉండడాన్ని నిద్ర అంటారు. ఈ దశ మనసు నిండుకున్న దశ. ఇప్పుడు దృష్టిలో తమము ఉంటుంది.
ఈ రెండు దశల్లోనూ దృష్టి విశ్రాంతమై ఉంటుంది.
మిగతా రెండు :
జాగ్రత్ - మెళకువ
మెళకువ మానసిక దశలో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియాలు ( మాట, ధ్వని - గొంతు - స్వరపేటిక కదలికలు; చేతుల కదలికలు, కాళ్ళ కదలికలు, ప్రేవుల కదలికలు, జననేంద్రియ కదలికలు) పనిచేస్తూ ఉంటాయి.
హావ భావములు అనుగుణంగా కళ్ళ కదలికలు, ముఖ భంగిమల మార్పు కర్మేంద్రియాలు కిందే లెక్కకు వస్తాయి.
అంతఃకరణములు జ్ఞాన, కర్మేంద్రియాలతో కలిసి పనిచేయడమే మానసిక కార్యకలాపాలు జరగడం. ఇది మెళకువ మానసిక దశలో జరుగుతుంది. అంతఃకరణములు బయటి భౌతిక ప్రపంచం లోని విషయములతో అనుసంధానించబడి విషయ, విషయానుభవ గ్రహణం చేస్తాయి. మస్తిష్కంలో ప్రపంచం, వాసనలు గా ఏర్పరిచి భద్రపరచి మరల అవసరమై నప్పుడు దృష్టికి తెస్తాయి. ఈ దశలో అంతఃకరణములకు బహిర్ముఖ దృష్టి ఉంటుంది.
స్వప్న - కల
కల మానసిక దశలో అంతఃకరణములు కర్మేంద్రియాలతో కలిసి పనిచేస్తాయి. జ్ఞానేంద్రియములు పనిచేయవు. ఈ దశలో మనసు తానే మెళకువ మానసిక దశలో జ్ఞానేంద్రియముల సహాయముతో నిర్మించిన విషయ ఆంతర ప్రపంచం నుంచి విషయములను గ్రహిస్తుంది.
మనసు ఆంతర ప్రపంచం నుంచి విషయములను గ్రహించడమే తలపులు కలగడం; భావములు జనించడం అన్నా, ఉదయించడం అన్నా ఇదే.
కల మానసిక దశలో అంతఃకరణములు అంతర్ముఖ దృష్టిని కలిగి ఉంటాయి. ఆంతరప్రపంచంతో మనసు, విషయానుభవములను వాసనలుగా మార్చి మరల సంకల్ప వికల్పములను కలిగించే చిత్తము మస్తిష్కంలోని;
దృశ్యం, శబ్ద, వాసనలు, రుచులు, స్పర్శలు, వేడిమి, చల్లదనం లను, అవి కలిగించిన అనుభవములను వెలికి తీసి మానసిక దృష్టిలోకి తెస్తాయి.
అంతఃకరణములు మాయయైపోవడమే జాగ్రత్ సుషుప్తి, సుషుప్తి దశల ఉదయం.
ఇలా జాగ్రత్ సుషుప్తి, జాగ్రత్, స్వప్న దశలలో మాయ విభూతి పొంది, అంతఃకరణములు గా మారి జ్ఞాన కర్మేంద్రియాలతో కలిసి పనిచేయడమే మానసిక కార్య కలాపాలు జరగడం లేదా నిర్వర్తింపబడడం.
మనకు కలుగు సకల జ్ఞానములు, భాషా జ్ఞానం, ఇతర పరిజ్ఞానములు, కౌశలములు ఈ పద్ధతి లో జరుగుతాయి.
మాయ గురించి మరిన్ని విశేషాలు, వివరాలు తరువాయి భాగం లో.
No comments:
Post a Comment