మనిషి మంచి-మర్యాద
మనిషిని గౌరవించి అతని మర్యాదకు భంగం కలగకుండా ప్రవర్తించడం ఈ రోజుల్లో అరుదైపోయింది.
మత గురువులు, కుల నాయకులు, మేధావులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, ఇతర వృత్తులలో ఉన్నవారు, ఎవరైనా సరే తోటి మనుషుల సున్నితత్వాన్ని గణించకుండా దున్నపోతు వ్యవహారంలా ప్రవర్తించడం ఎక్కువ మందికి రివాజై పోయింది.
"సామాన్యులకు" ఏమీ తెలియదని వారితో ఎలా ప్రవర్తించినా తమకేమీ కాదని పైన ఉదహరించిన పెద్ద మనుషులకు నమ్మకం కలిగిపోయింది. మర్యాద చూపించడం కరిగిపోయింది.
మనిషిని గౌరవించి అతని మర్యాదకు భంగం కలగకుండా ప్రవర్తించడం ఈ రోజుల్లో అరుదైపోయింది.
మత గురువులు, కుల నాయకులు, మేధావులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, ఇతర వృత్తులలో ఉన్నవారు, ఎవరైనా సరే తోటి మనుషుల సున్నితత్వాన్ని గణించకుండా దున్నపోతు వ్యవహారంలా ప్రవర్తించడం ఎక్కువ మందికి రివాజై పోయింది.
"సామాన్యులకు" ఏమీ తెలియదని వారితో ఎలా ప్రవర్తించినా తమకేమీ కాదని పైన ఉదహరించిన పెద్ద మనుషులకు నమ్మకం కలిగిపోయింది. మర్యాద చూపించడం కరిగిపోయింది.
మనిషిని గౌరవించకుండా, మర్యాద చూపించకుండా "బిచ్చగాణ్ణి" చూసినట్లు చూడడం సంస్కృతి అయింది.
ఈ వాస్తవం మారాలి.
****************
సిరిచూలు మన్మథుడు;
కొండల రాకొమరిత చూలు
గణాధిపతి; చదువుల తల్లి
చూలు నారదమునీంద్రుడు;
అందరు మనల చల్లగ చూచి
యోగ క్షేమముల వహింతురుగాక!
****************
కాగితపు, ఇ- ప్రచురణలు -పురస్కారాలు-సన్మానాలు
ఇ-ప్రచురణలని చిన్నచూపు చూడటం నేటి సాహితీ, ఇతర రంగముల సంస్కృతి. ఇ-ప్రచురణలను పురస్కారములకు గణింపరు. ఎందుకు? ఏమో!!?
రచయిత లేక కవి లేక సాహితీ వేత్త గుర్తింపు పొందాలంటే తన సాహితీ, విజ్ఞాన, శాస్త్ర, జ్ఞాన సృష్టిని ప్రచురించి తీరాలి. పురస్కారాలు ఇవ్వడానికి కాగితపు పుస్తకంగా ప్రచురించిన పుస్తకాలనే గణనలోకి తీసికుంటారు.
ఈ వాస్తవం మారాలి.
****************
సిరిచూలు మన్మథుడు;
కొండల రాకొమరిత చూలు
గణాధిపతి; చదువుల తల్లి
చూలు నారదమునీంద్రుడు;
అందరు మనల చల్లగ చూచి
యోగ క్షేమముల వహింతురుగాక!
****************
కాగితపు, ఇ- ప్రచురణలు -పురస్కారాలు-సన్మానాలు
ఇ-ప్రచురణలని చిన్నచూపు చూడటం నేటి సాహితీ, ఇతర రంగముల సంస్కృతి. ఇ-ప్రచురణలను పురస్కారములకు గణింపరు. ఎందుకు? ఏమో!!?
రచయిత లేక కవి లేక సాహితీ వేత్త గుర్తింపు పొందాలంటే తన సాహితీ, విజ్ఞాన, శాస్త్ర, జ్ఞాన సృష్టిని ప్రచురించి తీరాలి. పురస్కారాలు ఇవ్వడానికి కాగితపు పుస్తకంగా ప్రచురించిన పుస్తకాలనే గణనలోకి తీసికుంటారు.
ఒక కవి లేక రచయిత తన రచన ప్రచురించబడాలంటే నానా తంటాలు పడాలి. ఏ
ప్రచురణకర్త ప్రచురించడానికి ముందుకు రాడు. అంతర్జాలము, ఇ-ప్రచురణలు లేని,
ఒక్క ప్రచురించబడిన రచనే అందరిని చేరగల రోజుల్లో కాగితపు ప్రచురణ తప్ప మరో
మార్గం లేదు. అప్పడు పెట్టిన ఈ నియమాన్ని ఇప్పుడూ తప్పదనడం, ఆ విషయాన్ని
రచయితలు, కవులపై రుద్దడం మార్పుని ఆహ్వానించలేని చాదస్తపు మనుషుల
మూర్ఖత్వాన్ని తెలియజేస్తుంది. కాగితపు ప్రచురణ పొందిన రచనే పురస్కారాలకి
గాని, ఇతర సన్మానాలకి గాని అర్హం అంటే, ఈ పాతకాలపు మనుషుల గురించి ఏమి
మాట్లాడితే వారు మారతారు?
ప్రచురణకర్తలు నియంతలుగా రాజ్యం చేస్తున్న నేటి ప్రచురణారంగంలో ఒక రచన ప్రచురించబడడం తేలిక కాదు. తమ రచన ప్రాచుర్యం, గుర్తింపు పొందాలనుకునే "బడుగు" రచయితలు తమ రచనని కాగితపు ప్రచురణ చేయడం తప్ప మరో గతి లేక పోవడం, సాంకేతికత ఇంతలా వటవృక్షంగా ఎదిగిన నేడు సిగ్గుపడాల్సిన విషయం. కాగితపు పుస్తకంగానే ప్రచురించబడి తీరాలనే ఈ నియమం రచయితలకు, కవులకు ఆర్ధికంగా ఎంతో భారం కూడాను. చేతిచమురు భాగవతం ఆడాలంటే అందరికీ ఆర్ధిక స్తోమత ఉండదు. రచయిత, కవి అనిపించుకోవడానికి ఆర్ధిక స్తోమతకీ ముడి పెట్టడం అన్యాయం. అనవసరం.
కాగితపు ప్రచురణ జరగని రచనలో సాహితీ, ఇతర విలువలు ఎలా హ్రస్వమౌతాయో అంతుపట్టని విషయం.
రచనని ఒక్క కాగితపు ప్రచురణలోనే గుర్తిస్తాం అనేది పసితనం.
పురస్కారాలకు, ఇతర సన్మానాలకి ఇ-ప్రచురణలని, కాగితపు ప్రచురణలతో సమానంగా గుర్తించడం సాహితీ క్షేత్రంలో వెంటనే జరగవలసిన పరిణామం.
రచనలో, కవితలో పస ముఖ్యం కాని ప్రచురణ ఎలా జరిగింది అనేది గుర్తింపుకి పునాది కారాదు.
ఇ-ప్రచురణలను పురస్కారములకు కాగితపు ప్రచురణలతో సమానంగా గుర్తించడం వల్ల ఎందరో రచయితలు, కవులు అనవసర ఆర్ధిక ఇబ్బందుల నుంచి రక్షింపబడతారు.
ఇది అందరు మేధావులు, కవులు, విమర్శకులు, రచయితలు, పురస్కార ప్రదాతలు, ఇతర సన్మాన నిర్వాహకులు గమనించి తీరవలసిన విషయం. మార్పుకు శ్రీకారం చుట్టి తీరవలసిన సమయం.
ప్రచురణకర్తలు నియంతలుగా రాజ్యం చేస్తున్న నేటి ప్రచురణారంగంలో ఒక రచన ప్రచురించబడడం తేలిక కాదు. తమ రచన ప్రాచుర్యం, గుర్తింపు పొందాలనుకునే "బడుగు" రచయితలు తమ రచనని కాగితపు ప్రచురణ చేయడం తప్ప మరో గతి లేక పోవడం, సాంకేతికత ఇంతలా వటవృక్షంగా ఎదిగిన నేడు సిగ్గుపడాల్సిన విషయం. కాగితపు పుస్తకంగానే ప్రచురించబడి తీరాలనే ఈ నియమం రచయితలకు, కవులకు ఆర్ధికంగా ఎంతో భారం కూడాను. చేతిచమురు భాగవతం ఆడాలంటే అందరికీ ఆర్ధిక స్తోమత ఉండదు. రచయిత, కవి అనిపించుకోవడానికి ఆర్ధిక స్తోమతకీ ముడి పెట్టడం అన్యాయం. అనవసరం.
కాగితపు ప్రచురణ జరగని రచనలో సాహితీ, ఇతర విలువలు ఎలా హ్రస్వమౌతాయో అంతుపట్టని విషయం.
రచనని ఒక్క కాగితపు ప్రచురణలోనే గుర్తిస్తాం అనేది పసితనం.
పురస్కారాలకు, ఇతర సన్మానాలకి ఇ-ప్రచురణలని, కాగితపు ప్రచురణలతో సమానంగా గుర్తించడం సాహితీ క్షేత్రంలో వెంటనే జరగవలసిన పరిణామం.
రచనలో, కవితలో పస ముఖ్యం కాని ప్రచురణ ఎలా జరిగింది అనేది గుర్తింపుకి పునాది కారాదు.
ఇ-ప్రచురణలను పురస్కారములకు కాగితపు ప్రచురణలతో సమానంగా గుర్తించడం వల్ల ఎందరో రచయితలు, కవులు అనవసర ఆర్ధిక ఇబ్బందుల నుంచి రక్షింపబడతారు.
ఇది అందరు మేధావులు, కవులు, విమర్శకులు, రచయితలు, పురస్కార ప్రదాతలు, ఇతర సన్మాన నిర్వాహకులు గమనించి తీరవలసిన విషయం. మార్పుకు శ్రీకారం చుట్టి తీరవలసిన సమయం.
No comments:
Post a Comment