Tuesday, August 29, 2017

మా ఖాట్మండూ ప్రయాణం 1, 2



మా ఖాట్మండూ ప్రయాణం 1

ISKCON వారి ఆధ్వర్యంలో ఖాట్మండులో ఆగస్టు 18, 19 తేదీల్లో జరిగే Science and Scientist సదస్సులో పాల్గొనేందుకు నేను, మా ఆవిడ భీమవరం నుంచి నేపాల్ బయలుదేరాము. నేను ఆ సదస్సులో Consciousness Studies and Quantum Mechanics అనే శీర్షికతో ఆ సదస్సులో నా పరిశోధనా పత్రం సమర్పించడానికి ఎన్నిక అయింది.
 
ప్రస్తుతం ప్రపంచంలో conscioudness మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అన్ని దేశాల్లో ఎందరో శాస్త్రవేత్తలు, తత్త్వవేత్తలు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు, కంప్యూటర్ నిపుణులు ఇలా ఎన్నో రంగాలనుంచి consciousness గురించి అవగాహన కలిగించుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు. వీరిలో కొందరు ఖాట్మండూ సదస్సుకి వచ్చి తమ తమ పరిశోధనల గురించి ఉపన్యసిస్తారు. అందులో నేను ఒకడిని.
 
క్వాంటమ్ మెకానిక్స్ consciousness studies లో ఉపయోగిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు అంటూంటారు. కాని క్వాంటమ్ మెకానిక్స్ అందుకు సరిపోదని నా అవగాహన. ఉపనిషత్తులలో కల consciousness studies elements మీద నేను చాలా ‌పరిశోధనా పత్రాలు సమర్పించాను. వీటి గురించి, ఈ విషయంలో క్వాంటమ్ మెకానిక్స్ పరిధుల గురించి మాట్లాడతాను.
 
నేను మా ఆవిడ ఈ సదస్సులో పాల్గొనేందుకు మా ఊరు భీమవరం నుంచి బయలుదేరాము. నేను అమాయకపు చాదస్తుణ్ణి. ప్రయాణానికి మంచి చెడ్డలు చూసుకుంటో ఉంటాను. అస్తమానూ చూసుకోకుండా అంతా వింత. ఇలా ప్రయాణానికి మంచి చెడ్డలు చూసుకోవడం మా నాన్నగారి నుంచి వచ్చిన సంప్రదాయం. మా పిల్లలని ఇందులోకి రానివ్వలేదు. ఈ రోజుల్లో అది వీలు పండని పని. వాళ్ళని ఈ విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఇలా మంచి చెడ్డలు చూసుకోవడం అలవాటు వద్దు అని చెప్పాను. నేనే పట్టించుకోలేక వదల్లేక తంటాలు పడుతూంటాను. ఈ సారి ఈ తాపత్రయలో పడ్డాను. 4-30 లోపులో ఇంటి నుంచి బయలుదేరాలి.
 
మా భీమవరం నుంచి రాజమండ్రి కి పొద్దున్న మూడు ఎక్స్ప్రెస్ లు ఉన్నాయి. శేషాద్రి, సర్కారు, LTT- Visakhapatnam express. శేషాద్రి 3-30 కి. సర్కారు 5-20 కి. LTT- 6-30 కి. LTT- కి వెళ్దామని అనుకున్నాం.
ఈ రోజుల్లో రైళ్ళలో ఇచ్చే ఫుడ్ ఎంత చండాలంగా ఉంటుందో మనందరికీ అనుభవమే. ఆ విషయం భారత దేశపు అగ్ర ఆడిటర్ గారు తమ రిపోర్ట్ లో ఉటంకించారు కూడా. అందుకని మా ఆవిడ నాకిష్టమైన, ఉండే, పులిహార, దద్ధ్యోజనం చేయడానికి 2-30 కి లేచింది. 4 గంటలకు ఇద్దరు తయారైపోయాం. అంతే పొద్దున్నే ఆటో దొరకటం ఇబ్బంది. కానీ మొత్తానికి ఆటో దొరికి 4-30 లోపులో ఇంటి నుంచి బయలుదేరాము.
 
మేము స్టేషన్ కి వచ్చేసరికి 5 అయింది. శేషాద్రి ఆలస్యం అయ్యి దొరికింది. 6-30 కి రాజమండ్రి చేరాము. 9-15 కి హౌరా మెయిల్. వచ్చింది, ఎక్కాం. ఏసి రిజర్వేషన్ దొరకలేదు. S-12 లో‌ దొరికింది. ఈ మధ్య స్లీపర్ క్లాస్ ప్రయాణం మా చిన్నప్పటి జనరల్ బోగీ ప్రయాణంలా తయారైంది. 72 బెర్త్ లకి 120 మంది ప్రయాణికులు ఉన్నారు. మా బెర్త్ లు ఆక్రమించబడి ఉన్నాయి. అంతా‌ ఇరుకు. ఎలాగో సర్దుకుని కూర్చున్నాము. కాలు కదపడానికి చోటు లేదు.
మనందరం ఎంత సర్దుకొని జీవించాల్సి వస్తోందో. ఒక్కటీ రూలు ప్రకారం ఉండదు. జరగదు. అంతా అస్తవ్యస్తం.
అయినా తప్పదు బతికెయ్యాలి. బోగీ టిటిఇ చేతులు ఎత్తేశాడు.
 
ఆ వాతావరణంలో హౌరాదాక ప్రయాణించాము. హౌరా నుంచి రాక్సల్ మీదుగా నేపాల్లో ప్రవేశించాలి. హౌరా రాక్సల్ ప్రయాణం తరువాతి భాగంలో. ఆ రైల్లో ఏసి 2 టైర్ లో రిజర్వేషన్ దొరికింది.
 
మా ఖాట్మండూ యాత్ర 2

కలకత్తాలో అగుట (ఆ)

ఇప్పుడు ఈ నగరాన్ని కోల్కతా అంటున్నారు. నేను వేరొక వ్యాసంలో అన్నట్టు, ఈ రాజకీయ నాయకులకు పరిపాలించడం చేతకాక, అందరి సంక్షేమానికి కృషి చేయడం రాక, చేతకాక, పరిపాలన అంటే ఏమిటో తెలియక, ఊళ్ళ పేర్లు మార్చి తమ ప్రాంతీయ ‌సంస్కృతికి ఏదో ఊడపీకేసేమని పేరు తెచ్చుకోవడానికి ఎన్నుకున్న సులభమార్గమిది. అల్లా మీద రుద్దినవే చెన్నెయ్, ముంబై, కోల్కతా, కొల్లమ్, కోచి, బెంగాలి, కులబరుగి, రాజమహేంద్రవరం, బంగళూరు మొదలైనవి.‌ ప్రజలకి రోడ్లు బాగుండాలి. ధరలు పెరగకుండా ఉండాలి, విద్యా, ఆరోగ్య సౌకర్యాలు బాగుండాలి, శాంతి భద్రతలు ఉండాలి అని ఉంటుంది కాని ఊర్ల పేర్లు ఏముంటే వారికి ఏం ఒరుగుతుంది. ఇది నేతలకు తెలుసు. కాని వారికి ఇంత కన్నా పరిపాలించడం చేతకాదు. అందుకే ఈ ఊళ్ళ పేర్ల మార్పులు.
నేను కలకత్తా ఇది వరకు రెండు సార్లు వచ్చాను. రెండు సార్లు కాన్ఫరెన్స్ లకే. ఒకటి రామకృష్ణా మిషన్ వాళ్ళు, రెండవది ఈ ISKCON వాళ్ళే.
 
మొదటిది Knowledge systems in Indian philosophy మీద, రెండవది Synthesis of Science and Religion మీద. ఆ రెండు సార్లు మా మామగారి సౌజన్యంతో వారి ఆఫీస్ గెస్ట్ హౌస్ లో ఒక సారి, మా మామగారి సహోద్యోగి ఇంటో రెండవ సారి ఉన్నాను. మొదటి సారి వచ్చి నపుడు రెండు కాళీ ఆలయాలు, రామకృష్ణా మిషన్ బేలూర్ హెడ్ క్వార్టర్స్, కలకత్తా ఊరు చూశాను. కలకత్తాకు 150 కిమీ దూరంలో గంగానది ఒడ్డున ఉన్న మాయాపూర్ లో కల ISKCON head quarters చూశాను. గంగా జలం శిర‌సున జల్లుకుంటోంటే ఒకాయన ఏ ఊరు అని అడిగాడు. ఆంధ్రప్రదేశ్ అన్నాను. ఇదంతా 1995 వి‌షయం. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడతీతకు 20 ఏళ్ల ముందు.
ఆ రెండు సార్లు నేను ఒక్కడినే వచ్చాను. మాయాపూర్ లోని గంగ బంగ్లాదేశ్ లో ప్రవేశించగానే పద్మానది అవుతుంది. టిబెట్ లోని యా త్సు నది మన బ్రహ్మపుత్ర అయినట్టు. పేర్లతోటి మన అనుబంధం విడదీయలేనిది.

No comments:

Post a Comment