వర్జనీయము, అనాగరికము
బంగారములు కొని లాకర్లలో పెట్టి
సింగారములకై పార్లర్ల చుట్టూ తిరుగు
సంస్కృతి; కుటుంబముతో రంగారు
బంగారు జీవనము వద్దని ఒంటరిగ
జీవించు ఇచ్ఛ; తమ వారికై జీవించుట
అవుట్ ఆఫ్ ఫేషన్; బాధ్యతలు స్వీకరించుటకు
బంగారములు కొని లాకర్లలో పెట్టి
సింగారములకై పార్లర్ల చుట్టూ తిరుగు
సంస్కృతి; కుటుంబముతో రంగారు
బంగారు జీవనము వద్దని ఒంటరిగ
జీవించు ఇచ్ఛ; తమ వారికై జీవించుట
అవుట్ ఆఫ్ ఫేషన్; బాధ్యతలు స్వీకరించుటకు
మనసు రాదు; మేధావులును ఎన్ జీ వో లును
ఇతర సమాజ కార్యకర్తలును, కుటుంబములకు
వ్యతిరేకముగ ప్రతిపాదించి; నాగరికత, సంస్కృతి
సమన్వయ జీవనమునకు మంగళము పలుకుచున్నారు
ఉద్యోగము చేసి ధన సంపాదనము చేయుచు
స్వతంత్రముగ జీవించవలెనని నవీనుల నిర్దేశనలు;
ఒకరికొకరు ఏమి గాక తరువాతి తరమైన పిల్లల సాకక,
ముందరి తరమైన ముదుసలుల గాలికి వదలు
దాక్షిణ్య రహిత అప్రాచ్య ధోరణులు
మనకు ఖేదము మిగుల్చును; మనసులు
రగిలి ఆ జ్వాలల సుఖ సంతోషములు ఆవిరగును
తమవారికేమిగాని సంస్కృతి వర్జనీయము, అనాగరికము
*****************
శాంత రసము - నా అవగాహనా క్రమము
నవరసములలో శాంతము ఎందుకు ఉందో మొదటిసారి ఉన్నత పాఠశాలలో వాటి గురించి తెలుగు మాష్టారు చెప్పినపుడు నాకు తెలియలేదు. అసలు రసము అన్నా, శాంతము అన్నా నా బుల్లి బుఱ్ఱకు సరిగా అర్థము కాలేదు. మిగతా రసముల విషయంలో సందేహం కలగలేదు గాని శాంతరసము విషయమే తికమకగా ఉండేది. శాంతము అంటే ప్రశాంతత అని అర్థము అయ్యింది కాని రసములలో అది ఉండడం, దాని రసస్థానము, రసస్వరూపము, శాంతరసాస్వాదనము విశదము కాలేదు.
రసము అంటే మనఃస్థితి అని పెద్దవుతున్న కొద్ది కొద్దిగా తెలవడం మొదలు పెట్టింది. శాంతము తప్ప మిగిలిన రసస్థితులలో మనసు ఉద్వేగము చెందుతుంది అని గమనించాను. ఆ రస స్థితులలో చిత్త ప్రకంపనములు ఎక్కువగా ఉంటాయని తెలవనారంభించింది. ఈ రెండు విషయములు గమనించిన తరువాత శాంతరసస్థితి గురించి నెమ్మదిగా అవగాహనకానారంభించింది.
రస స్థితి మనసు అనుభవ స్థితి అనీ తోచింది. చిత్తానుభవ స్థితీ ఇదే అనీ అనిపించింది.
ఇతర సమాజ కార్యకర్తలును, కుటుంబములకు
వ్యతిరేకముగ ప్రతిపాదించి; నాగరికత, సంస్కృతి
సమన్వయ జీవనమునకు మంగళము పలుకుచున్నారు
ఉద్యోగము చేసి ధన సంపాదనము చేయుచు
స్వతంత్రముగ జీవించవలెనని నవీనుల నిర్దేశనలు;
ఒకరికొకరు ఏమి గాక తరువాతి తరమైన పిల్లల సాకక,
ముందరి తరమైన ముదుసలుల గాలికి వదలు
దాక్షిణ్య రహిత అప్రాచ్య ధోరణులు
మనకు ఖేదము మిగుల్చును; మనసులు
రగిలి ఆ జ్వాలల సుఖ సంతోషములు ఆవిరగును
తమవారికేమిగాని సంస్కృతి వర్జనీయము, అనాగరికము
*****************
శాంత రసము - నా అవగాహనా క్రమము
నవరసములలో శాంతము ఎందుకు ఉందో మొదటిసారి ఉన్నత పాఠశాలలో వాటి గురించి తెలుగు మాష్టారు చెప్పినపుడు నాకు తెలియలేదు. అసలు రసము అన్నా, శాంతము అన్నా నా బుల్లి బుఱ్ఱకు సరిగా అర్థము కాలేదు. మిగతా రసముల విషయంలో సందేహం కలగలేదు గాని శాంతరసము విషయమే తికమకగా ఉండేది. శాంతము అంటే ప్రశాంతత అని అర్థము అయ్యింది కాని రసములలో అది ఉండడం, దాని రసస్థానము, రసస్వరూపము, శాంతరసాస్వాదనము విశదము కాలేదు.
రసము అంటే మనఃస్థితి అని పెద్దవుతున్న కొద్ది కొద్దిగా తెలవడం మొదలు పెట్టింది. శాంతము తప్ప మిగిలిన రసస్థితులలో మనసు ఉద్వేగము చెందుతుంది అని గమనించాను. ఆ రస స్థితులలో చిత్త ప్రకంపనములు ఎక్కువగా ఉంటాయని తెలవనారంభించింది. ఈ రెండు విషయములు గమనించిన తరువాత శాంతరసస్థితి గురించి నెమ్మదిగా అవగాహనకానారంభించింది.
రస స్థితి మనసు అనుభవ స్థితి అనీ తోచింది. చిత్తానుభవ స్థితీ ఇదే అనీ అనిపించింది.
మనసు ఉద్వేగము చెందని రస స్థితి శాంతరసస్థితి అనిపించింది.
చిత్తప్రకంపనములు తక్కువ వడితో ఉంటాయనీ అనిపించింది. మిగిలిన రసములను
అనుభవిస్తోంటే మనసు ఉనికి ఉంటుందని ఆ యా విషయములను అనుభవిస్తూంటుందని
గ్రహణకు వచ్చింది. శాంత రసానుభవ స్థితిలో మనసు నిర్మలమై ఉంటుందనిపించింది.
మనసుండదనిపించింది.
బ్రహ్మజ్ఞానము లేక ఆత్మజ్ఞానము అవగాహన చేసికుంటూంటే శాంత రసానుభవస్థితి మరింత విశదము
కానారంభించింది. పరమాత్మ స్థితి శాంతరసస్థితి అని తెలిసింది.
అందుకనే విష్ణుని
శాంతాకారం భుజగశయనం .......
అని శాంతస్వరూపునిగా వర్ణించారు.
అదే విధముగా శివుని
శాంతం పద్మాసనస్థితం........
అని వర్ణించారు.
లలితా సహస్రనామములో దేవిని ఎన్నో నామములలో శాంతస్వరూపిణిగా అభివర్ణించారు. ఇతర దైవములను, దేవతలను, దేవుళ్ళను కూడ శాంతస్వరూపులుగా చెప్పారు. అలా శాంతరసస్థితి భగవత్ స్థితి అనీ తెలిసింది.
పరమాత్మ స్థితిలో మనసు మొదలైన అంతఃకరణములు ఆత్మ చిత్ రూపంలో లీనమై ఉపశమించి విరమింపబడి ఉంటాయని తెలిసింది. ఆ స్థితిలోనే వ్యక్తిత్వ స్పృహ కూడా ఉండదని అర్కలాపములుతరాపములుతర అంతఃకరణములు పనిచేయక ఉపసంహరింపబడి ఉన్న చిత్ స్థితి శాంతరసస్థితి అనీ అవగాహనకు వచ్చింది.
రసోsవై సః అనే ఉపనిషత్ మహావాక్యమూ ఈ విషయాన్నే చెబుతోందని తెలిసింది. మిగిలిన ఎనిమిది రస స్థితులలో మనసు ఉద్వేగము చెంది ఆ రసానుభవాన్ని ఇస్తుందని, శాంత రసస్థితి విషయంలో మనసు తనే అదృశ్యమైపోయి, స్థిమితాన్ని, నెమ్మదివి ఇస్తుందని తెలిసింది.
నిర్మలమైన మనసే (విషయ, విషయానుభవ గ్రహణా రాహిత్య స్థితి) ఆత్మయనీ, పరమాత్మ యనీ, శాంతస్థితి
ఆ అంతఃకరణ పరిణామరహిత మౌనానంద స్థితియనీ గ్రహణకొచ్చింది.
అలా శాంతమూ ఒక రసమేననీ, శాంతరసస్థితి మనసు విరమింపబడినపుడు, మానసిక కార్యకలాపములు ఆగినపుడు అనుభవానికి వస్తుందనీ తెలిసింది. మిగతా రస స్థితులు మనసు పనిచేస్తున్నప్పుడు కలుగుతాయి. శాంతరసస్థితి మనసు పని చేయడం ఆపేసినపుడు అనుభవానికి వస్తుందనీ, ఇది పరమాత్మ రస స్థితి యనీ, సమస్త దైవ, దేవతా, దేవ స్వరూపములు శాంత భూయిష్ఠములనీ అవగతమైంది.
శాంతరసస్థితి దివ్యస్థితి యనీ జీవబ్రహ్మైక్యము జరిగినపుడు అనుభవానికి వస్తుందని, అంతఃకరణములు అప్పుడు విరమింపబడి ఉండి మానసిక కార్య కలాపములు జరగకుండా ఉపశమించి ఉంటాయనీ తెలిసంది. మిగతా రసానుభవములు మనసు అనుభవ స్థితులైతే, శాంతరసస్థితి మనసు ఆత్మలో లీనమై ఉనికి కోల్పోయిన అభావ స్థితి అనీ అనిపించింది. శాంతము రసములలో ఒకటి అనడానికి అభ్యంతర పెట్టలేదు నా మనసిప్పడు. అది ఆత్మలో లీనమై పోయింది కదా!
***********
కన్ను మూయని వారెవరు?
కన్ను మూయని వారెవరు? రాజైన పుడమికి చక్రవర్తైన
పేరుమోసిన రాజకీయనాయకుడైన పేరులేని నిరుపేదైన
అందరు పీల్చుదురు చివరి శ్వాసలు; అగును వారి
శరీరములు జడములు; ఆ పై ఆ శరీరములు శవములు;
బ్రహ్మజ్ఞానము లేక ఆత్మజ్ఞానము అవగాహన చేసికుంటూంటే శాంత రసానుభవస్థితి మరింత విశదము
కానారంభించింది. పరమాత్మ స్థితి శాంతరసస్థితి అని తెలిసింది.
అందుకనే విష్ణుని
శాంతాకారం భుజగశయనం .......
అని శాంతస్వరూపునిగా వర్ణించారు.
అదే విధముగా శివుని
శాంతం పద్మాసనస్థితం........
అని వర్ణించారు.
లలితా సహస్రనామములో దేవిని ఎన్నో నామములలో శాంతస్వరూపిణిగా అభివర్ణించారు. ఇతర దైవములను, దేవతలను, దేవుళ్ళను కూడ శాంతస్వరూపులుగా చెప్పారు. అలా శాంతరసస్థితి భగవత్ స్థితి అనీ తెలిసింది.
పరమాత్మ స్థితిలో మనసు మొదలైన అంతఃకరణములు ఆత్మ చిత్ రూపంలో లీనమై ఉపశమించి విరమింపబడి ఉంటాయని తెలిసింది. ఆ స్థితిలోనే వ్యక్తిత్వ స్పృహ కూడా ఉండదని అర్కలాపములుతరాపములుతర అంతఃకరణములు పనిచేయక ఉపసంహరింపబడి ఉన్న చిత్ స్థితి శాంతరసస్థితి అనీ అవగాహనకు వచ్చింది.
రసోsవై సః అనే ఉపనిషత్ మహావాక్యమూ ఈ విషయాన్నే చెబుతోందని తెలిసింది. మిగిలిన ఎనిమిది రస స్థితులలో మనసు ఉద్వేగము చెంది ఆ రసానుభవాన్ని ఇస్తుందని, శాంత రసస్థితి విషయంలో మనసు తనే అదృశ్యమైపోయి, స్థిమితాన్ని, నెమ్మదివి ఇస్తుందని తెలిసింది.
నిర్మలమైన మనసే (విషయ, విషయానుభవ గ్రహణా రాహిత్య స్థితి) ఆత్మయనీ, పరమాత్మ యనీ, శాంతస్థితి
ఆ అంతఃకరణ పరిణామరహిత మౌనానంద స్థితియనీ గ్రహణకొచ్చింది.
అలా శాంతమూ ఒక రసమేననీ, శాంతరసస్థితి మనసు విరమింపబడినపుడు, మానసిక కార్యకలాపములు ఆగినపుడు అనుభవానికి వస్తుందనీ తెలిసింది. మిగతా రస స్థితులు మనసు పనిచేస్తున్నప్పుడు కలుగుతాయి. శాంతరసస్థితి మనసు పని చేయడం ఆపేసినపుడు అనుభవానికి వస్తుందనీ, ఇది పరమాత్మ రస స్థితి యనీ, సమస్త దైవ, దేవతా, దేవ స్వరూపములు శాంత భూయిష్ఠములనీ అవగతమైంది.
శాంతరసస్థితి దివ్యస్థితి యనీ జీవబ్రహ్మైక్యము జరిగినపుడు అనుభవానికి వస్తుందని, అంతఃకరణములు అప్పుడు విరమింపబడి ఉండి మానసిక కార్య కలాపములు జరగకుండా ఉపశమించి ఉంటాయనీ తెలిసంది. మిగతా రసానుభవములు మనసు అనుభవ స్థితులైతే, శాంతరసస్థితి మనసు ఆత్మలో లీనమై ఉనికి కోల్పోయిన అభావ స్థితి అనీ అనిపించింది. శాంతము రసములలో ఒకటి అనడానికి అభ్యంతర పెట్టలేదు నా మనసిప్పడు. అది ఆత్మలో లీనమై పోయింది కదా!
***********
కన్ను మూయని వారెవరు?
కన్ను మూయని వారెవరు? రాజైన పుడమికి చక్రవర్తైన
పేరుమోసిన రాజకీయనాయకుడైన పేరులేని నిరుపేదైన
అందరు పీల్చుదురు చివరి శ్వాసలు; అగును వారి
శరీరములు జడములు; ఆ పై ఆ శరీరములు శవములు;
కాని ప్రజాహితులు, కవిసత్తములు, ఉత్తములు
శాస్త్రములలో దిట్టలు, లలితకళా కోవిదులు,
సాంకేతిక రంగమున నిష్ణాతులు, ప్రముఖ క్రీడాకారులు,
సినీ వినువీధిని వెలుగు తారకలు మాత్రమగుదురు
కీర్తి కాయులు; మరణము లేదు వారికి; చిరంజీవులు
వారు; సంఘము మరువలేదు వారిని ధన్యులు వారు
********
పెద్దలు చెప్పిన మాటలు
పెద్దలు చెప్పిన మాటలు అంతర్జాలంలో నలుగురికీ పంచడం కన్న
వాటిని మనం మన జీవితంలో ఆచరించి లాభపడుట మిన్న
గంగా నదీ స్నాన పుణ్యముపై కావ్యము వెలయించుట కన్న
గంగా నదిలో స్నానము చేసి విశ్వేశ్వరునికి మ్రొక్కుట మిన్న
రాలిపోవును పండుటాకులు ఎండిపోవును సెలయేళ్ళు
ప్రకృతి ధర్మమున అన్నియు తారు మారగును, ఉనికి,
రాక పోకల యందు మన ఇష్టాయిష్టముల ప్రసక్తి లేదు;
అంతయు మన బుల్లి బుర్రలకు అందని శక్తి పరిణామ లీలలు
శాస్త్రములలో దిట్టలు, లలితకళా కోవిదులు,
సాంకేతిక రంగమున నిష్ణాతులు, ప్రముఖ క్రీడాకారులు,
సినీ వినువీధిని వెలుగు తారకలు మాత్రమగుదురు
కీర్తి కాయులు; మరణము లేదు వారికి; చిరంజీవులు
వారు; సంఘము మరువలేదు వారిని ధన్యులు వారు
********
పెద్దలు చెప్పిన మాటలు
పెద్దలు చెప్పిన మాటలు అంతర్జాలంలో నలుగురికీ పంచడం కన్న
వాటిని మనం మన జీవితంలో ఆచరించి లాభపడుట మిన్న
గంగా నదీ స్నాన పుణ్యముపై కావ్యము వెలయించుట కన్న
గంగా నదిలో స్నానము చేసి విశ్వేశ్వరునికి మ్రొక్కుట మిన్న
రాలిపోవును పండుటాకులు ఎండిపోవును సెలయేళ్ళు
ప్రకృతి ధర్మమున అన్నియు తారు మారగును, ఉనికి,
రాక పోకల యందు మన ఇష్టాయిష్టముల ప్రసక్తి లేదు;
అంతయు మన బుల్లి బుర్రలకు అందని శక్తి పరిణామ లీలలు
No comments:
Post a Comment