Friday, May 20, 2016

భారతదేశంలో ఎన్నికలు - పాలకులు



భారతదేశంలో ఎన్నికలు - పాలకులు


నిన్న, మొన్న జరిగిన రాష్ట్రాల ఎన్నికలలో దక్షిణాదిన ఒక రాష్ట్రంలో తాయిలాలు ఎక్కువగా ఎర జూపి, అవినీతి ఆరోపణలమీద జైలుకెళ్ళొచ్చిన leader మళ్ళీ అధికారం పీఠం ఎక్కబోతున్నారు.
ప్రజాస్వామ్యంలో జరిగే అనర్ధాలలో ఇటువంటి అవినీతిపరులు, ఆపై కొందరు రౌడీలు, నేరస్థులు, అసాంఘిక శక్తులు ఎన్నికవడం.

సత్తా లేని పౌరులు తమకు ఇచ్చే తాయిలాలు, జరగబోయే మేళ్ళు దృష్టిలో ఉంచుకొని ఇలా ఓట్లేస్తే అవినీతి, నేరాలు, రౌడీతనం, అసాంఘిక కార్యకలాపములు చట్టబద్ధమై పోయినట్టు లెక్క.

మరింక anti-corruption bureau లు, పోలీసులు, కోర్టులు, హడావుడీ, CBI, NIA లు ఎందుకు? దండగ కదా! సామాన్యులకొక న్యాయం, పాలకులకు, డబ్బున్నవారికీ మరొక న్యాయం మన కళ్ళెదురుగుండా ఇంత ఘన ప్రమాణములో జరుగుతోంటే మామూలు పౌరులు మాత్రమే ఎందుకు శిక్షించబడాలి?

దీనికి సమాధానం మనలని ఏలుతున్న రాజకీయ పార్టీలు, నాయకులు, పాలకులు, వీరి అండదండలున్న కార్పొరేట్ లు, మేధావులు, ఇతర super rich citizens నుంచి లభించదు.

భారత రాజ్యాంగాన్ని, రాజసాన్ని, న్యాయ వ్యవస్థను లెక్కచేయని, వాటికి భయపడని, వాటిని నిర్వీర్యపరిచే వ్యక్తులు పాలకులవడం ప్రజాస్వామ్యం ద్వారా జరుగుతున్నపిపుడు ప్రజాస్వామ్యం గొప్ప ఏమిటి? రాచరికం లోనూ ఇలాగే జరుగుతుంది.

ఆనువంశిక పాలనగా భారతదేశంలో రాజకీయ పార్టీలు తమ పార్టీలను నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడడం లేదా?

పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నవెరూ చూడడం లేదనుకున్నట్టు భారతదేశంలో ప్రజాస్వామ్యం నిర్వహింపబడుతోంది. ఇదంతా ప్రజాస్వామ్యమ్యాన్ని అపహసించడం. ప్రజాస్వామ్యాన్ని నిర్వహించడం కాదు.
దీని వల్ల తెలుస్తున్నదేమిటంటే ప్రజల కొఱకు, ప్రజల చేత, ప్రజల వల్ల నిర్వహింపబడేది ప్రజాస్వామ్యం అనే అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డ్ లాంటి నిర్వచనాన్ని ఉటంకించడం వృథా. ప్రజాస్వామ్యాన్ని వేళాకోళం చెయ్యడం. అవమానపరచడం. చిన్నబుచ్చడం.

రాచరికంతో సమానంగా ప్రజాస్వామ్యం నిర్వహింపబడుతున్నప్పుడు ప్రజాస్వామ్యం అనే గుదిబండను మనమెందుకు మోయాలి?

ప్రధాన మంత్రి ప్రత్యేకంగా పరిపాలిస్తానని అధికారంలోనికి వచ్చారు. మరి???.

బహుశా ఆయన సమాధానం ఇలా ఉండవచ్చు:

"ఆదర్శాలు వల్లించడం వేరు, వాస్తవాలు వేరు. ఎన్నికల వేడిలో ఎన్నో మాటలు చెబుతాము. ఎలక్షన్ మేనిఫెస్టో వేరు రాజకీయం వేరు. ఎవరిని పడితే వారిని ఎన్నుకునే దేశంలో ప్రధానమంత్రి ఒక్కడూ ఏమి చేయగలడు? వాడూ మానవ మాత్రుడే కదా!

అయినా ఇంట్లో కూర్చుని నిర్వచనాలు బట్టీ పట్టే మామూలు మనుషులకు ఎన్నికలంటే తెలుసా? రాజకీయం తెలుసా? ఎన్ని సర్దుకోవడాలుంటాయి ఒక దేశాన్ని ఏలడంలో! ఆదర్శాలు వల్లించడంతో దేశం నడవదు. దేశాన్ని నడిపించలేము.

జైలుకెళ్ళొచ్చిన ముఖ్యమంత్రుల తోనూ సర్దుకోవాలి, జైలుకి వెళ్ళబోయే ముఖ్యమంత్రులతోనూ సర్దుకోవాలి; అవినీతి ఆరోపణలున్న పార్టీలనీ దూరం చేసుకోకూడదు.

ఆదర్శాలు వల్లించడం మానసిక అనారోగ్య చిహ్నము. సర్దుబాటులు చేసుకుంటూ, ఇస్తూ, తీసికుంటూ, అమాయక ముఖ్యమంత్రుకు ఏమీ ఇవ్వకుండాను, ఆ రాష్ట్రాన్ని, ఆ ప్రజలను దువ్వుతూ గడపడం, ఇవన్నీ
దేశాన్ని‌ ఏలడంలో భాగాలు."

No comments:

Post a Comment