నిర్దుష్టమైన తెలుగుభాషను రూపొందించడం అవసరం
మాండలికాలు ఎన్ని ఉన్నా, నిర్దుష్ట
భాష ఒకటి ఉండాలి. మాతృభాషగా మనం తెలుగు భాషను మన మాండలికంలో
నేర్చుకోవచ్చు. కాని తెలుగు మాతృభాష కాని వారు తెలుగు నేర్చుకోవడానికి
మాండలికాల అంటు సోకని నిర్దుష్టత కల భాష ఉండాలి.
జర్మన్ భాషకు జర్మనీలో, ఆస్ట్రియాలో, స్విట్జర్
లాండ్లో, బెల్జియమ్ లో, నెదర్
లాండ్స్ లో వివిధ మాండలికాలున్నాయి. కాని జర్మన్ మాతృభాష కాని వారు నేర్చుకోవడానికి వీలుగాఏ మాండలికము అంటు సోకని ఒక నిర్దుష్ట జర్మన్ భాషను రూపొందించారు. అన్నిరకముల శాస్త్రములు రచించడానికీ, అధ్యయన,
అధ్యాపనములకు మాండలికములంటని నిర్దుష్ట భాష కావాలి.
తెలుగు భాషను, మాతృభాష కాని భారతీయులు, విదేశీయులు
నేర్చుకోవడానికి వీలుగా ఒక నిర్దుష్ట భాషను
రూపొందించాలని తెలుగునాట విభజన చేసిన రెండు రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయములలో
ఎటువంటి ప్రయత్నము జరుగుతున్నట్టు కనిపించదు. అన్నిరకముల శాస్త్రములు
రచించడానికీ, అధ్యయన, అధ్యాపనములకు మాండలికములంటని నిర్దుష్ట భాష కావాలి.
రాజకీయనాయకులకు రాజకీయం తప్ప మరేమీ తెలియదు. కాని విద్యాలయములలో పనిచేసే
ఆచార్యులు రాజకీయనాయకులని అనుకరించ కూడదు. అనుసరించకూడదు.
కవిత్రయము, నాచన సోమనాథుడు, శ్రీనాథుడు, పోతన, పృభృత కవి
వర్యులు తెలుగు జాతికి చెందుతారు. ఆంధ్రాకో, తెలంగాణాకో
మాత్రం చెందరు. జ్ఞానము, విజ్ఞానము, లలితకళలను, ఇతర సామాజిక
నేర్పరితనాలను రాజకీయనాయకులు నిర్ణయించరాదు. వారిని వీటిలో ప్రవేశించనీయరాదు. తగలేస్తారు. తగలేస్తున్నారు. సాహిత్యము,
సారస్వత సృష్టులకు మాత్రమే భాష ఏర్పడలేదు. అన్నిరకముల శాస్త్రములు రచించడానికీ,
అధ్యయన, అధ్యాపనములకు మాండలికములంటని నిర్దుష్ట భాష కావాలి.
విద్య ఇంత దీన స్థితిలోనుండడానికి చదువు గురించి ఏమీ తెలియని
రాజకీయనాయకుల ప్రమేయం విద్యా విధానాలలోను, విద్యాలయముల
నిర్వహణ లోనూ ఉండడమే ముఖ్య కారణము. వారే, భాష పేరుతో, మాండలికాల
పేరుతో పౌరులను ఆటవికులుగా మార్చగలగడం భారతీయుల, భారతదేశపు
దురదృష్టము.
అదే దురదృష్టము తెలుగు భాషకు, సంస్కృతికి
పట్టింది. అందుకే తెలుగు మాతృబాష కాక, తెలుగు
నేర్చుకుందామనుకునే ఇతర భారతీయులకు, విదేశీయులకు
నేర్చుకోవడానికి వీలుగా నిర్దుష్టమైన, మాండలికాల
అంటు సోకని తెలుగు భాషను రూపొందించాలని తెలుగునాట ఏ
విశ్వవిద్యాలయము, ఆచార్యులు ప్రయత్నమే చేయటం
లేదు. ఇది ఒక అవసరం అని వారికి అనిపించటము లేదు.
ప్రాంతీయ దురభిమానాలు, సిద్ధాంత మత్తు మందులు, కుల
దురభిమానాలు, వాద రాద్ధాంతములు తెలుగు సాహితీ
సృష్టిని భ్రష్టు పట్టించాయి.
కొన్ని వర్గాల బాధలు, జీవన వ్యవహారములు మాత్రమే
సాహితీసృష్టికి వస్తువులు, మరేమీ కావని సంకుచితంగా, విద్వేష
పూరితంగా ఆలోచించే కుహనా మేధావులు ఇప్పడు అన్ని
పతనములకు కారకులు. మిగతా శాస్త్రములను ఎవరూ తెలుగు భాషలో
రాయటం లేదు, అనువాదములు చేయడానికి ప్రయత్నించటం లేదు. అందుకనే తెలుగు భాషకు
నిర్దుష్ట భాష ఒకటి కావాలని తోచటం లేదు, అనిపింతటంలేదు. ఎంత సేపూ ఆస్తిక, నాస్తిక
చర్చలు, వాదముల ప్రశంసలు, అభిశంసనలు, ప్రాంతీయ దురభిమాన కావేషములు ఇలా
నిర్దుష్టమైన తెలుగు భాష ఆవిష్కరణకు నడుంకట్టనీయడం లేదు.
వారికి aesthetics లేవు. ఉంటాయనీ తెలియదు. ఈ వస్తు చర్చ తప్ప మరే సాహితీ లక్షణముల
ప్రసక్తే తేరు ఈ మహానుభావులు. కాదేద కవితకనర్హం, కుక్కపిల్ల, - సబ్బుబిళ్ళలతో
సహా అన్న సాహితీ యుగకర్తను శ్రీ శ్రీ ని కూడా లెక్కచేయరు ఈ
సాహితీ నిర్దేశకులు.
వారి పరిమిత పాండిత్యము, వివిధ శాస్త్ర, విజ్ఞాన శాస్త్ర జ్ఞానముల అవగాహనా లేమి మాత్రమే తెలుగు
సాహితీ సృష్టిని, శాస్త్ర నిర్మాణమును నిర్దేశించడం నేటి సాహితీ, వివిధ సాంఘిక,
విజ్ఞాన శాస్త్ర నిర్మాణాధ్యయనాధ్యాపనా, భాషాధ్యయనా, అధ్యాపనా అరాచకము.
ఇటువంటి పరిస్థితులలో తెలుగు మాతృభాష కాని ఇతరులు నేర్చుకునేందుకు, సాహితీ, వివిధ
సాంఘిక, విజ్ఞాన శాస్త్ర నిర్మాణాధ్యయనాధ్యాపనా, భాషాధ్యయనాధ్యాపనములకు నిర్దుష్టమైన తెలుగు భాషను రూపొందించే ప్రయత్నమునందు
ఏ విశ్వవిద్యాలయము, ఆచార్యులు దృష్టి పెట్టరు.
పెట్టలేరు.
అసలు ఇటువంటి అవసరం ఉంటుందని, ఉందని, తెలుగు
భాషాసంస్కృతుల వృద్ధికి, అభివృద్ధికి ఇది ఒక సోపానమని ఈ సంకుచిత, పరిమిత
జ్ఞానము, పాండిత్యము, విద్వత్తు, మేధ కల ఆచార్యులు కలలో కూడా అనుకోరు. అనుకోలేరు.
తమ తమ విద్వేష పూరిత భావములను, సిద్ధాంత
ప్రేమను, వివిధ కుల, వాద
దురభిమానములను, మనసు నిండా నింపుకొని కంపు కొట్టే ఉపన్యాసములను ఇస్తూ, వ్యాసములు
రాస్తూ, టి.వి కార్యక్రమములలో
ఊదరగొట్టే విశ్వవిద్యాలయ ఆచార్యులు, కుహనా
మేధావులు ఎప్పటికీ గ్రహించలేరు. తెలుగు భాషకు, ఆ భాషలో సాహితీ,
వివిధ సాంఘిక, విజ్ఞాన శాస్త్ర నిర్మాణ, అధ్యయనాధ్యాపనములకు ప్రయోజనకరంగా వ్యవహరించలేరు.
Manchi visleshana tho suuchana cheshaaru. Post Baagundhi .
ReplyDeleteసంతోషమండీ రామచంద్ర విట్టల్ గారు!
ReplyDeleteసంతోషమండీ రామచంద్ర విట్టల్ గారు!
ReplyDeleteఎంతో సంతోషం.తప్పకుండాను.
ReplyDeleteవిశ్వవిద్యాలయములు ఇందుకోసం ప్రయత్నించాలి. తెలుగు విశ్వవిద్యాలయములలో భౌతిక, రసాయన, జీవ మొదలైన విజ్ఞాన శాస్త్ర విభాగములు అసలు లేనే లేవు. జ్ఞానము అంటే తెలియని వారు విశ్వవిద్యాలయములను నిర్వహిసితున్నాకు. తెలుగు అకాడమీ చేసినంత కృషి,పని చేయడానికి పండితులు, మేధావులు,శాస్త్రజ్ఞులు, ఆసక్తి, అంకిత భావము కలవారు నేటి విశ్వవిద్యాలయములలో లేరు.
Deleteవిశ్వవిద్యాలయములు ఇందుకోసం ప్రయత్నించాలి. తెలుగు విశ్వవిద్యాలయములలో భౌతిక, రసాయన, జీవ మొదలైన విజ్ఞాన శాస్త్ర విభాగములు అసలు లేనే లేవు. జ్ఞానము అంటే తెలియని వారు విశ్వవిద్యాలయములను నిర్వహిసితున్నాకు. తెలుగు అకాడమీ చేసినంత కృషి,పని చేయడానికి పండితులు, మేధావులు,శాస్త్రజ్ఞులు, ఆసక్తి, అంకిత భావము కలవారు నేటి విశ్వవిద్యాలయములలో లేరు.
Deleteనేను వున్నాను
ReplyDelete