నా సంస్కృత భాషాధ్యయనం, "సారస్వత సృష్టి"
సంస్కృత భాష నేర్చుకోవాలని నాకు కోరిక. 9 వ తరగతికి వచ్చే వరకు నేను చదివిన స్కూల్లో - మలకపల్లి, కొవ్వూరు దగ్గర, పశ్చిమగోదావరి జిల్లా - సంస్కృతం లేకపోవడం వల్ల ఆ దృష్టే రాలేదు.
9 వ తరగతిలో (1965-66) మా నాన్నగారికి వేగేశ్వరపురం అనే ఊరు బదిలీ అయింది. ఈ ఊరు మలకపల్లికి 5 కిమీ పోలవరం వైపు ఉంది. గోదావరి ఒడ్డు. మా నాన్నగారు అప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్. అంతకు ముందు మా నాన్నగారు బి. ఎడ్. అసిస్టెంట్ గా ఉన్నప్పుడు వేగేశ్వరపురంలోనే (1953) పుట్టాను. మళ్ళీ 9 వ తరగతికి ఆ ఊరే వచ్చాం.
నా భాషాధ్యయనం -1 లో ( నా బ్లాగ్ లో ఉంది) నా ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి మా నాన్నగారి ప్రభావం ఎంతుందో వివరించాను. మా నాన్నగారు ఇంగ్లీష్ మరియు సోషల్ టీచర్. హెడ్ మాస్టర్ అయ్యాక కూడా SSLC (11 th standard) వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పేవారు.
వేగేశ్వరపురం స్కూల్ లో సంస్కృతం ఉంది. ఆ మాస్టారు చేరమనీ అన్నారు. కాని అప్పుడు సంస్కృతం తీసుకుంటే మార్కులు తక్కువ వస్తాయేమో, క్లాస్ ఫస్ట్ రానేమోనని తీసుకోలేదు. అలాగే స్కూల్ పోతుందేమో అని ప్రెసిడెంట్ స్కౌట్
గా ఎన్నికైనా ఢిల్లీ వెళ్ళలేదు. అలా సంస్కృతం నేర్చుకోవడం మొదలు కాలేదు. కాని కోరిక పోలేదు.
గా ఎన్నికైనా ఢిల్లీ వెళ్ళలేదు. అలా సంస్కృతం నేర్చుకోవడం మొదలు కాలేదు. కాని కోరిక పోలేదు.
ఇంతలో M.Sc. అయిపోయింది (1974). ఒక 6 నెలలు ఖాళీ వచ్చింది. మా భీమవరంలో ఉన్న సంస్కృతం కాలేజీలోని లెక్చరర్ గారి దగ్గర సంస్కృత భాష ఓనమాలు మొదలు పెట్టాను. కొన్నాళ్ళు నేర్చుకునే సరికి రిసెర్చ్ లో సీటు వచ్చి హైదరాబాద్ ఆర్. ఆర్. లాబ్స్ (ఇప్పుడు IICT) లో JRF గా చేరాను. అలా తర్వాత University of Hyderabad లో రిసెర్చ్ కి మారాను. పి హెచ్. డి. కూడా పూర్తయింది. ఈ మధ్యలో CIEFL ( ఇప్పుడు English and Foreign Languages University - EFL University) లో జర్మన్ మూడు ఈవెనింగ్ కోర్సులు చేశాను. Advanced Diploma in German పూర్తయింది కూడాను.
పి హెచ్. డి. పూర్తయ్యాక (1983-84) వచ్చిన ఖాళీ సమయంలో హైదరాబాద్ దోమల్ గూడా లో ఉన్న రామకృష్ణ మిషన్ వాళ్ళు ఈవెనింగ్ కోర్సులో సంస్కృతం నేర్పుతున్నారని తెలిసి అందులో చేరాను. అక్కడ గురువుగారు మంచి ఉపాధ్యాయులు. సంస్కృతాన్ని సరళంగా, ఆసక్తికరంగా బోధించే వారు. కాని రెండు నెలలవకుండా బెంగళూరు I. I. Sc. లో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ వచ్చింది. బెంగళూరు వెళ్ళి పోయాను సంస్కృత భాషాధ్యయనాన్ని ఆపేసి. భాష మీద పట్టేమీ రాలేదు అప్పటికి.
కాని అదే సమయంలో చందమామ ప్రచురణల వారు సంస్కృత చందమామ ప్రచురించడం ప్రారంభించారు. దానికి చందా కట్టి తెప్పించుకోవడం మొదలు పెట్టాను. పూర్తిగా అర్థం కాక పోయినా ఏదో చదువుతూండే వాడిని. శ్రమగా ఉండేది. ఎక్కువ గా చదవలేక పోయేవాడిని. బలవంతంగా కొన్నాళ్ళు చదివి ఆపేశాను. భాషలో ఏవిధమైన ప్రవేశమూ రాలేదు.
తరువాత కొన్నాళ్ళు మా ఊరు భీమవరంలో ఉద్యోగం చేశాను. అప్పుడుకూడా అడపాదడపా సంస్కృతాన్ని చూస్తూ టచ్ లో ఉంచుకున్నాను.
ఇంతలో పాండిచ్చేరి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి యానాంలో చేరాను. అప్పుటికి కొద్ది స్థిమితం కలిగింది, సమయమూ దొరికింది. అప్పుడు సంస్కృతం మీదికి దృష్టి మళ్ళింది.
అప్పుడు బెంగళూరు లో విశ్వ హిందూ ప్రతిష్ఠాపన వారు సంస్కృతం పోస్టల్ కోచింగ్ మొదలెట్టారు. అందులో చేరాను. కౌముది పాస్ అయ్యాను. వారి కోచింగ్ పాఠాలు సరళంగా, ఆసక్తిని రేకిస్తూ ఉండేవి.
అప్పటికే నేను తెలుగు, ఆంగ్ల వ్యాకరణములతో సరి పోల్చుకుంటూ జర్మన్ నేర్చుకొని సఫలీకృతుడిని అయ్యాను. జర్మన్ నేర్చుకుంటున్నప్పుడే విభక్తుల ప్రాముఖ్యం, ఉపయోగం తెలిసాయి. అలాగే జర్మన్ భాషలో ప్రతి పదము పుంలింగ, స్త్రీ లింగ, నపుంసక లింగ శబ్దాలలో ఏదో ఒకటి అవుతుంది. లింగ, వచనాలని బట్టి, వాటిని బట్టి విభక్తులలో పదం చివరలు మారతాయి. జర్మన్ భాషలో రెండే వచనాలు. జర్మన్ వారికి నామవాచకము అంటే ఇష్టం. అది వాక్యం లో ఎక్కడ వచ్చినా సరే పెద్దక్షరం రాస్తారు. మనమూ రాయాలి. మన తెలుగు భాషలా ఒక్కో వర్గానికి ఒక్కో లిపి, భాష ఉండవు. అందరికీ కావ్య భాష ఒకటే.
సంస్కృతం, తెలుగులలో సంబోధన ప్రథమా విభక్తితో ఎనిమిది విభక్తులు. జర్మన్ లో నాలుగు విభక్తులే. Prepositions విభక్తులకి ప్రత్యేకంగా ఉంటాయి. ఆంగ్ల భాషలో విభక్తుల పని proposition లు చేస్తాయి. అంచేత విభక్తులు ఆంగ్లభాషలో ప్రత్యేకంగా చెప్పరు. ఆంగ్ల భాషలో పదాలు లింగ పరంగా ఉండవు. అది ఒక సౌలభ్యం ఆంగ్ల భాష నేర్చుకోవడానికి. పదాల చివర్లూ మారవు.
ఫ్రెంచ్ భాషలో పదాలు పుంలింగ, స్త్రీ లింగ పదాలుగా ప్రత్యేకంగా ఉంటాయి. లింగ, వచన పరంగా పదాల చివర్లు మారుతాయి. ఫ్రెంచ్ వారికి విశేషణములు అంటే చాలా ఇష్టం. వారు కలల మనుషులు. వారికి క్రియాన్వయంలో, tenses లో కన్న కలలు చెప్పడానికి ఒక tense ఏర్పరచు కున్నారు. అంతటి భావప్రియులు ఫ్రెంచ్ వారు.
అన్ని జాతుల వారు ఒకే ఫ్రెంచ్ భాష రాస్తారు.
అన్ని జాతుల వారు ఒకే ఫ్రెంచ్ భాష రాస్తారు.
ఇంతలా పక్కకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, భాషల స్వరూప స్వభావాలు క్రమాలు విజ్ఞులు తెలుసుకోవడం అవసరం. భాష ఎలా చెబితే అలా నేర్చుకోవాల్సిందే. బేరాలు, తర్కాలు ఉండవు. న్యాయాన్యాలు ఉండవు. అందరికీ ఒకటే న్యాయం. సామాజిక న్యాయం అంటూ ఉండదు.
ఆంగ్ల భాషలో put పుట్, but బట్ అవుతుందంతే. అడగడానికి, తర్కించడానికి వీలులేదు.
సంస్కృత భాష సంస్కరించ బడిన ఏ భాషా?
సంస్కృతం పరిణమించక మునుపు పాలి, పైశాచీ, బ్రాహ్మీ మొదలైన ప్రాకృత భాషలు చెలామణీలో ఉండేవి.
సంస్కృత భాష ప్రత్యేకంగా రూపొందించబడిన భాష.
సంస్కృత భాషలో మన ప్రాచీన గ్రంథాలు అన్ని రంగాలవి ఉన్నాయి. ప్రస్తుతం సంస్కృతం ఎన్నో దేశాల వారిని ఆకర్షిస్తున్న భాష. దురదృష్టవశాత్తు భారతదేశంలోనే సంస్కృత భాషను ఒక మతం యొక్క, కులం యొక్క భాషగా భ్రమించి ద్వేషించే నాస్తికులు, హేతువాదులు ఎక్కువ. వారికి ఈ అకారణ ద్వేషం ఎందుకో తెలియదు. కేరళలో ముస్లిములు, క్రైస్తవవులు ఎంతో ప్రీతితో సంస్కృత భాష నేర్చుకుంటారు.
సంస్కృత భాషలో మన ప్రాచీన గ్రంథాలు అన్ని రంగాలవి ఉన్నాయి. ప్రస్తుతం సంస్కృతం ఎన్నో దేశాల వారిని ఆకర్షిస్తున్న భాష. దురదృష్టవశాత్తు భారతదేశంలోనే సంస్కృత భాషను ఒక మతం యొక్క, కులం యొక్క భాషగా భ్రమించి ద్వేషించే నాస్తికులు, హేతువాదులు ఎక్కువ. వారికి ఈ అకారణ ద్వేషం ఎందుకో తెలియదు. కేరళలో ముస్లిములు, క్రైస్తవవులు ఎంతో ప్రీతితో సంస్కృత భాష నేర్చుకుంటారు.
నాకు సంస్కృత భాష అంటే ఇష్టం. నేను నేర్చుకున్నాను. సంస్కృత భాష నేర్చుకోవడాన్ని వేగవంతం చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. 1990 లలో నేను ఆత్మదర్శనం అనే ఒక తెలుగు పుస్తకం మా కొలీగ్ ఇస్తే చదివాను. దానిని కొండూరి వీరరాఘవాచార్యులు రచించారు. ఆ పుస్తకం చదువుతూంటే "జ్ఞ" అనే పదం నన్ను ఆకర్షించింది.
"జ్ఞ" అంటే to know. వెంటనే నాకు ఒక స్ఫురణ వచ్చింది. ఆత్మ మనలో ఉండడం వల్ల మనం తెలుసుకో గలుగుతున్నాం అనీ మనకు అన్ని రకముల జ్ఞానములు కలుగుతున్నాయని. ఆ స్ఫురణనే పెంచుకొని ఆత్మజ్ఞానాన్ని నాదైన దృష్టితో చూడడం మొదలుపెట్టాను. నిజానికి నాదైన దృష్టి మన ఉపనిషత్ స్రష్టల దృష్టి అని తరవాత్తరవాత తెలిసింది. వ్యాఖ్యానాల వల్ల రూపు మారిపోయింది అనీ అర్థం అయింది.
ఆస్తికులు సంస్కృత భాషను దేవభాష అంటారు. అంతటి దివ్యత్వం ఉంది సంస్కృత భాషలో.
నేను విశ్వహిందూ ప్రతిష్టాన బెంగళూరు వారి పోస్టల్ కోచింగ్లో సంస్కృతం నేర్చుకోవడం మొదలు పెట్టిన రోజుల్లోనే ఆత్మజ్ఞానం అవగాహన కలగడం ప్రారంభించింది అని ముందు భాగంలో చెప్పాను.
కొండూరి వీరరాఘవాచార్యుల ఆత్మ దర్శనం పుస్తకం చదువుతున్న రోజుల్లోనే గుంటూరి లక్ష్మీకాంతం గారు రచించిన "నాయన" అనే శీర్షిక కల పుస్తకం నా చేతికి అందింది. ఆ రచయిత అన్నగారి కుమారులు గుంటూరి రామకృష్ణ గారు నాకు పరిచయం అయ్యారు. ఆయన మంచి జ్ఞాన సంపన్నులు. అన్ని విధముల పుస్తకాలు చదివి మంచి అవగాహన సంపాదించిన వారు. ఆయనతో సంభాషణలు నాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండేవి.
మా మాటల్లో ఆయన నన్ను కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని తెలుసా అని అడిగారు. తెలియదని చెప్పారు. అప్పుడు ఆయన కావ్యకంఠ గణపతి ముని గురించి టూకీగా చెప్పారు. నేను గణపతి ముని వ్యక్తిత్వం పట్ల, జీవితం పట్ల, ఆయన ప్రజ్ఞా పాటవాల పట్ల ఆకర్షితుడనయ్యాను. "నాయన" ఆయన ఆత్మకథ.
"నాయన" పుస్తకం నాకు ఇచ్చి చదవమన్నారు. నేను ఏక బిగిని చదివేసాను. ఎంతో ప్రభావితుడ నయ్యాను. ఆ చదవడంలో గణపతి ముని రమణ మహర్షిని గురువుగా భావించారని తెలిసి రమణ
మహర్షి మీద ఆసక్తి కలిగి, పెరిగింది.
మహర్షి మీద ఆసక్తి కలిగి, పెరిగింది.
అంతవరకు రమణమహర్షి గురించి నాకు తెలిసినది చాలా స్వల్పం. చలం తన చివరి రోజులు రమణాశ్రమంలో గడిపాడు అనే సందర్భంలో మాత్రమే రమణమహర్షి గురించి విన్నాను. ఆయన ప్రతిభ "నాయన" పుస్తకం చదివాక తెలిసింది. "నాయన" అనేది రమణమహర్షి గణపతి మునిని పిలిచే పిలుపు అనీ తెలిసింది.
నాయన 1905 ప్రాంతంలో బ్రాహ్మణ స్వామిగా పిలువబడుతున్న స్వామిని ఒకటి రెండు సార్లు కలుసుకొని, మూడవ సారి ఎంతో ఆర్తితో మహర్షిని తపస్సు అంటే ఏమిటి అని అడిగి ఆయన సమాధానానికి అప్రతిభుడై, తక్షణం బ్రాహ్మణ స్వామిని గురువుగా స్వీకరించి, ఆయన అసలు పేరు వేంకట రామన్ అని తెలుసుకొని ఆయనకు రమణ
మహర్షి అని పేరు పెట్టారు. ఆ పేరే బ్రాహ్మణ స్వామికి
స్థిరపడింది. అదే సమయంలో శ్రీ గణపతి ముని ఇంద్రాణీ సప్తశతి తెలుగు అనువాదం చదివాను. ఆయన ప్రతిభా వ్యుత్పన్నల గురించి మరొక సారి ప్రస్తుతిస్తాను. రమణుల గురించి ప్రత్యేకంగా రాస్తాను.
మహర్షి అని పేరు పెట్టారు. ఆ పేరే బ్రాహ్మణ స్వామికి
స్థిరపడింది. అదే సమయంలో శ్రీ గణపతి ముని ఇంద్రాణీ సప్తశతి తెలుగు అనువాదం చదివాను. ఆయన ప్రతిభా వ్యుత్పన్నల గురించి మరొక సారి ప్రస్తుతిస్తాను. రమణుల గురించి ప్రత్యేకంగా రాస్తాను.
నా సంస్కృత భాషాధ్యయనానికీ దీనికి సంబంధం ఉంది. ఉపనిషత్తులు, భారతీయ తత్త్వశాస్త్రం సంస్కృతంలో రచించబడ్డాయి. ఆత్మజ్ఞానం గురించి సంస్కృతభాషలో ప్రవేశం ఉండి తీరాలని చాదస్తుల, సాంప్రదాయీకుల నమ్మకం. మరోమాట చెబితే వినరు. మాట్లాడితే, శంకరుని, రామానుజులని, మధ్వాచార్యులని ఉటంకించే సాంప్రదాయ వాదులు,
ఆచార్యుల వ్యాఖ్యానాలను చిలుక పలుకుల్లా అప్పచెబుతారు. వారికి కల అవగాహన పరిమితం.
తమ తత్త్వంలో, సాంప్రదాయంలో, వేదాంతంలో నిష్ణాతులైన వీరు "వారి సాంప్రదాయం అనే నూతిలో కప్పలు". మరొక వివరణ అస్సలు వినరు.
ఆచార్యుల వ్యాఖ్యానాలను చిలుక పలుకుల్లా అప్పచెబుతారు. వారికి కల అవగాహన పరిమితం.
తమ తత్త్వంలో, సాంప్రదాయంలో, వేదాంతంలో నిష్ణాతులైన వీరు "వారి సాంప్రదాయం అనే నూతిలో కప్పలు". మరొక వివరణ అస్సలు వినరు.
ఇటువంటి వారు సంస్కృతం రాని నా వ్యాఖ్యను కొట్టిపారేస్తారు. అందుకని సంస్కృతం నేర్చుకొని తీరవలసిన అవసరం కలిగింది నాకు. నాకు తరువాత సంస్కృత భాషతో సంబంధం లేకుండా ఆత్మ/బ్రహ్మ జ్ఞానముల మీద అవగాహన కలిగినా
విమర్శకులను తట్టుకోవడానికి సంస్కృత భాషలో అభినివేశం ఉండి తీరాలని నిశ్చయించుకున్నాను.
విమర్శకులను తట్టుకోవడానికి సంస్కృత భాషలో అభినివేశం ఉండి తీరాలని నిశ్చయించుకున్నాను.
భాష మీద పట్టు రావాలంటే ప్రతి భాషలోనూ వ్యాకరణం, శబ్ద సంపదా మన సొంతం చేసుకోవాలని నాకు అర్ధం అయ్యింది. సంస్కృత భాషకు సంబంధించినంతవరకు పదాలు ఇంచుమించులో తెలుగు వారమైన మనకు పరిచయమే. జర్మన్ భాష నేర్చుకోవడం వల్ల విభక్తుల ప్రాముఖ్యం, పదాల చివర్లు వచన, లింగ, విభక్తులని బట్టి మారతాయనీ తెలిసింది.
స్కూల్ లో తెలుగు విభక్తులు నేర్చుకున్నా మాతృభాష అవడం వల్ల పదాల చివర్లు మారడం అనే స్పృహ కలగలేదు. ఈ విషయం తెలియక 9 వ తరగతిలో మా హిందీ మాష్టారు మాకు హిందీ వ్యాకరణం చెబుతూంటే ఎందుకు సరిగా అర్థమవలేదో ఇప్పుడు తెలిసింది. హిందీలో కూడా శబ్దాల స్త్రీ, పుంలింగ విభాగాన్ని, వచనాన్ని బట్టి కా, కీ, కే లు వస్తాయని ఈ సందర్భంలో తెలిసింది. పదాన్ని బట్టి చివర్లు మారతాయి అని అప్పటికి అనుభవం కాలేదు. స్పృహా రాలేదు. జర్మన్ భాష నేర్చుకోవడం వల్ల ఈ స్పృహ కలిగింది.
ఆ స్పృహతో సంస్కృతం నేర్చుకోవడం తేలిక అయింది. వ్యాకరణాన్ని ఆంగ్ల వ్యాకరణంతో సరిపోల్చి నేర్చుకున్నా. దానితో వ్యాకరణం సులువుగా మచ్చికైంది. పదాలు తెలిసినవే. దానితో పాటు సంస్కృతం చందమామ చదవడం కూడా మొదలుపెట్టాను. పోస్టల్ కోచింగ్ ఎలాగా ఉంది.
ఒక విధమైన సులువుతో ఆడుతూ పాడుతూ సంస్కృత భాషాధ్యయనాన్ని ఆనందిస్తూ చేశాను.
ఒక విధమైన సులువుతో ఆడుతూ పాడుతూ సంస్కృత భాషాధ్యయనాన్ని ఆనందిస్తూ చేశాను.
ఆ హుషారులో సంస్కృతంలో "పరాన్నజీవినః" అని ఒక చిన్న కథ రాసి సంభాషణ సందేశః కి పంపించాను. అది ప్రచురించ బడింది. ఆ తర్వాత ఇంకో 3 కథలు, 3 వ్యాసాలు సంభాషణ సందేశః లో ప్రచురించ బడ్డాయి. అవి:
కథలు:
విస్మృతిః; బ్రిగీటా, అనాఘ్రాతమపి ఆఘ్రాతం పుష్పమ్
వ్యాసములు:
శూన్యాని; కాలః నామ; ఆత్మా-మనః-ధ్యానమ్
కొన్ని కవితలు రాసాను. అవి:
గిరిఝరిః, సౌందర్య లహరి; విష్ణు వైభవమ్
కనకదుర్గా స్తవమ్; శ్రీ రామచంద్రాష్టకమ్;
త్రిపురసుందరీ దశశ్లోకీ; శ్రీ కమలాంబికా ద్వాదశ మంజరీ స్తోత్రమ్; కోऽహమ్
అహంశబ్ద తాత్పర్య దర్శనమ్ - అనే వ్యాసం కూడా రాసాను.
నేను సంప్రాయబద్ధంగా సంస్కృతం నేర్చుకోలేదు. కావ్యాలు చదువుకోలేదు. ఆధునిక పద్ధతిలో నా అంతట నేను నేర్చుకున్నాను. నా భాషా పాటవం సంస్కృతంలో కథలు, వ్యాసములు, ఛందస్సులేని కవితలు రాయడానికి సుబ్బరంగా సరిపోతుంది. ఉపనిషత్ వాజ్ఞయం, ఇతర దర్శనములు, సూత్ర కావ్యములు చదివి అర్థం చేసుకొనేందుకు సరిపోతుంది.
నేను సంప్రాయబద్ధంగా సంస్కృతం నేర్చుకోలేదు. కావ్యాలు చదువుకోలేదు. ఆధునిక పద్ధతిలో నా అంతట నేను నేర్చుకున్నాను. నా భాషా పాటవం సంస్కృతంలో కథలు, వ్యాసములు, ఛందస్సులేని కవితలు రాయడానికి సుబ్బరంగా సరిపోతుంది. ఉపనిషత్ వాజ్ఞయం, ఇతర దర్శనములు, సూత్ర కావ్యములు చదివి అర్థం చేసుకొనేందుకు సరిపోతుంది.
తరువాత Elements of Cognitive Science I Ancient Indian Spiritual Wisdom అనే పరిశోధనా కార్యక్రమంలో మునిగిపోయి సంస్కృత సారస్వత సృష్టి చేయలేకపోయాను. నేను సంస్కృతంలో చేసిన సాహిత్య సృష్టి అత్యల్పము. కాని నాకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చింది.
మళ్ళీ త్వరలో సంస్కృత సారస్వత సృష్టి మొదలుపెట్టాలని సంకల్పం.
No comments:
Post a Comment