Monday, August 20, 2018

అజ్ఞానం; పేరు - పెన్నిధి; ; నా సాహితీ-విజ్ఞాన-జ్ఞాన సృష్టి, పరిశోధన;గతవైభవ చిహ్నాలు

ముసల్దైన ఒక సినీతార ఓ పడుచు వాణ్ణి పెళ్ళాడబోతూంటే మనకు హడావుడి
అసలు సిసలైన కరుణ, సేవా నిరతీ చూపించే వాళ్ళంటే మనకు వికారం మనకు మనమే అసహ్యం
ప్రకృతి విలయాలు సంభవించినపుడల్లా భగవంతుని 
కోపాన్ని తలుచుకోవడం ఆస్తికుల అలవాటు
భగవంతునికి మన వలే వికారాలుంటాయా? ఏమో!
మనుషుల ప్రవర్తనను బట్టి ప్రకృతిని ఉసిగొల్పుతాడా
భగవంతుని తత్త్వం అర్థం చేసి కోని వారిలో
నాస్తికులతో బాటు ఆస్తికులూ ఉంటారు
మన అవగాహనలు, సగం మన ప్రకోపం
మరో సగం మన అజ్ఞానం; భగవంతుడు
కరుణాంతరంగుడు, మన రక్షకుడు; కాడు మన
భక్షకుడు, కాడు మనకు వైరి, మనల కాచు దివ్యుడు
మురారి నీలకంఠుడు, వారి పరివార దేవతలు
దేవుళ్ళు, మనకు మంచినే చేస్తారు, చెడు తలపెట్టరు
కాని ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదు
**********
Every day one or the other dies. And Facebook is full of obituaries and condolences to the departed. From very famous to very limited in popularity get various messages on them out of desire to express. It is becoming habit to read about the dead and ritualistic writings. Public platforms will be like that only. If we don't like, we have to excuse ourselves.
********
మనం ఫేస్బుక్లో ఏం రాసినా, వాగినా ఏం జరగదు కాబట్టి (అలా అని అందరం అనుకుంటున్నాము) నోళ్ళకి అడ్డూ అదుపూ ఆపూ లేకుండా పోయాయి. అమ్మా ఆలీ బూతులు రాస్తున్నారు. రాజకీయం, కుల, మతం విషయాలైతే చెప్పక్కరనేలేదు.
వ్యక్తిగత, సంస్థా దూషణ, భూషణ, తిరస్కారములు నింగినంటుతున్నాయి. అభిమాన, దురభిమానాలను నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా, జుగుప్సాకరముగా, అశ్లీల భాషలో అనాగరికంగా వ్యక్తపరుస్తున్నారు.
మాటల్లో, రాతల్లో మర్యాద, గౌరవము పూర్తిగా నిండుకుంటున్నాయి.
ఇదంతా మన నాగరికతా పేలుడుకి, సంస్కృతి, సంస్కార రాహిత్యానికి సంకేతాలు. మనిషి ఆధునికుడైన కొద్దీ అనాగరిక, ఆటవిక, జంతు ప్రవృత్తులు ఇలా విజృంభించడం మనం ఎన్ని ఆధునిక సౌకర్యాలు అనుభవిస్తున్నా,, సాంకేతికత వాడుతున్నా, మన ప్రవృత్తి, ప్రవర్తనల దృష్ట్యా రాతి యుగంలోనే ఉన్నాము. సంఘంలో జరుగుతున్న ఘోరాలు కూడా దీనికి తార్కాణం.
విద్యావిధానం లోని లోపాలు మన్ని పట్టి పీడిస్తున్నాయి.
*******
మన వ్యక్తిత్వాన్ని పక్కకు పెట్టి నాయకులను, ఇతర రంగాలలోని ప్రముఖులను మనం ఆకాశానికి ఎత్తెయ్యనవసరము లేదు.
మన్ని మనం గౌరవించుకుంటూ, మర్యాద చూపించుకుంటూ ఇతరులను అభిమానించవచ్చు.
గొప్పదనాలు సహజమైనవి కొన్ని, ఆపాదించబడినవి ఎన్నో.
సమాజంలో రకరకాల మనస్తత్వాల వారు రకరకాల రంగాల్లో గొప్పవారిని కీర్తిస్తారు. కాని ఎవరూ ఆ గొప్పవారి గొప్పదనాలను అనుసరించరు. వట్టి పొగడ్తల వల్ల సంఘంలో గొప్పవారు తయారుకారు.
మన అభిమాన, దురభిమానాలు గొప్పవారిని తయారు చేయవు. కాని మిత్రత్వాలను, శత్రుత్వాలను పుట్టించి, పెంచి, పోషిస్తాయి.
ఆవేశపడే అభిమానుల వల్ల ఏ మంచీ జరగదు. ఆవేశం ప్రకృతి సృష్టించిన ప్రళయం లాంటిది. దానికి ఆలోచన ఉండదు. ఆవేశం మాత్రమే విధ్వంసాన్ని మాత్రం సృష్టిస్తుంది.
ప్రకృతి కలిగించే విలయం, ఆవేశపరులు కలిగించే నష్టం ఒకటే.
ఉద్యమేన న సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః
నహి సుప్తస్య సింహస్య ముఖే ప్రవిశంతి మృగాః
అర్థము:
ఉద్దేశించి నంత మాత్రాన పనులు జరగవు; మనోరథములు సిద్ధించవు.
పడుకొని ఉన్న సింహం నోట్లో జంతువులు తమంత తాముగా ప్రవేశించవు.
 ********
Addiction of any kind is a symptom of mental disorder and affects both the body and mental health.
*******
There should be some illusion to make us live in this world.

Else we will be completely bored or peace will be our experience.

*******

మనలో చాలా మందిమి రకరకాల రచయితలం.
అంతర్జాల మాధ్యమ సాలెగూళ్ళు, పత్రికలలో మాత్రమే ప్రచురింపబడేవారు.
ఈ అంతర్జాల మాధ్యమాలతో బాటు అచ్చు పత్రికల్లో కూడా ప్రచురించబడేవారు.
పుస్తకాలు సొంతంగా ప్రచురించుకునేవారు.
ప్రచురణ కర్తలు ప్రచురించేవారు.
ఏ ప్రచురణకూ నోచుకోని వారు.
ఏ ప్రచురణకూ నోచుకోని వారు రచయితలా, కాదా?
ఎన్ని రచనలు ఎక్కడ ప్రచురించబడితే ఒకళ్ళు రచయితలు అవుతారు?
ఎన్ని రచనలు, ఎక్కడ ప్రచురించబడితే అనువాదకులు అవుతారు?
సంఖ్య ముఖ్యమా?
రచయితగా ముద్ర పడాలంటే ఏది లెక్క, చిహ్నం?
ప్రమాణం?
నిజానికి రచయితలంతా ఈ తర్జనభర్జనలు అనుభవించేవారే. అనుభవించిన వారే. అనుభవిస్తూ ఉన్న వారే.
తమ స్థానం, స్థాయి ఎక్కడో, ఏమిటో తెలియని వారే.
*******
సైన్స్ చదువుకోని వాళ్లు, సైన్స్ గురించి ఏమీ తెలియని వాళ్ళు సైన్స్ గురించి మాట్లాడినట్టు, నాస్తికులైనా, మతం గురించి ఏమీ తెలియని వాళ్ళైనా మతం గురించి మాట్లాడతారు, భారతదేశంలో.
******
In India we have limitless freedom from any aspect; in any way.
******
అభిమానము, ఆప్యాయత, ఆత్మీయత, ప్రేమలతోనిండిన మన ఇంట్లోని వారి దగ్గరితనం మన మనసుని క్రుంగనీయదు.
ఏ భగవద్గీత చదవక్కరలేదు, ఏ ఉపన్యాసాలు, ప్రవచనాలు వినక్కరలేదు.
ఆధ్యాత్మిక జ్ఞానములు, ధ్యానాలు, తపస్సులు, శిష్యరికాలు అంటూ తిరగక్కరలేదు.
ఇంటిలోని వారి ప్రేమాభిమానాలు అందనపుడు ఏ ఆధ్యాత్మిక పథము, గురువులు మనఃస్థిమితాన్ని ఈయలేరు. మనసుకు నెమ్మదిని కలిగించలేరు.
ఇంట్లోని ఆప్యాయతలను కాలదన్నుకొని, ఏ ఆశ్రమాలకు చేరినా కావలసిన మనశ్శాంతి దొరకదు. అభిమానము అందించి, అందుకోవడంలోనే శాంతి సౌఖ్యాలు ఉన్నాయి.
********
పేరు - పెన్నిధి
సినీ తారలది ఏది అసలు పేరో ఏది పెట్టుడు పేరో మనకి తెలియదు.‌ మనం పెట్టుడు పేర్లతో గుర్తుంచుకుంటాము.
సన్యాసులు, సినీతారలు తమ అసలు పేర్లతో పిలువబడరు. వారు బయటకు చెప్పకూడదు కూడాను.
తమ ఐడెంటిటీ మర్చిపోవడానికి సన్యాసులు పేరు మార్చుకుంటే సినీతారలు తమ ఐడెంటిటీ మరుగు
పరుచుకోవడానికి పేరు మార్చుకుంటారు.
"పేరులోన ఏమి ఉన్నది పెన్నిధి" అని గిరీశం అందంగా తర్జుమా చేసినా పేరులోనే ఎంతో ఉంది.
మన వ్యక్తిత్వం అంతా పేరుతోనే ముడిపడి ఉంటుంది. మనకి స్పృహ తప్పినపుడు, ఆపరేషన్ అయ్యాక పేరుతో పిలుస్తారు. మనం స్పందిస్తాము.
మన పేరు మనకి ఎంతో గొప్ప. పేరుని తప్పు పలికినా, సరిగా పలకక పోయినా మనకి ఎంతో కోపం వస్తుంది.
ఎంత‌ కోపం, చిరాకు వస్తాయో తెలియాలంటే: On being called Thompson అనే శీర్షిక గల A. G. Gardener ఆంగ్ల వ్యాసం చదవండి.
పేరు, రూపము, గొంతు మనకు ప్రత్యేకం.
*******
నా సాహితీ-విజ్ఞాన-జ్ఞాన సృష్టి, పరిశోధన 1
మాస్తి వేంకటేశ అయ్యంగార్ పేరు వినగానే తమిళం గుర్తొస్తుంది. కాని ఆయన కన్నడ భాషలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత.
నేను కాలేజీలో చదువుతున్నానేమో అప్పటికి. ఆయనలా రచనలు చేయాలనిపించేది. నేను సైన్స్ విద్యార్థినే అయినా సాహిత్యాన్ని అభిమానించే వాడిని. చదివేవాడిని. భారతదేశ ఇతర భాషా కవుల సాహిత్యం అనువాదములలో చదివేవాడిని.
తమిళనాట ఎంతో ప్రసిద్ధి పొందిన రచన శిలప్పదిగారమ్ కథని ఒక ఉత్తరాది రచయిత రాసిన, తెలుగులోకి అనువదించబడిన కణ్ణగి పుస్తకం ద్వారా ఆనందించాను. ప్రొఫెసర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారి అనువాదములతో సుబ్రహ్మణ్య భారతిని పరిచయం చేసికున్నాను. తమిళభాషకి ఎన్నో పురాతన గ్రంథాలను వెలుగులోకి తెచ్చి ఎనలేని సేవ చేసిన స్వామినాథయ్యర్ కృషిని ఒక అనువాదంలో చదివాను. ఆయన ఎలా తమిళనాట ఇంటింటికీ తిరిగి జైనుల కాలం నాటి సన్యాసుల సాహితీ సృష్టిని, రచనలను సంపాదించారో చదివి ముగ్ధుడనయ్యాను.
ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం అన్ని భాగాలు చదివి నా సాహితీ తృష్ణను తీర్చుకున్నాను. నా సాహిత్య దృష్టిని పరిపుష్టం చేసుకున్నాను. యువ భారతి వారు 1970 లలో ప్రచురించిన అన్ని కవితా వైభవాలు, లహరులు కొని చదివి ప్రాచీన తెలుగు సాహిత్యం గురించి తెలుసుకున్నాను. ఇలా ప్రచురించడం యువభారతి వారు తెలుగు వారికి చేసిన మహోపకారం.
వారి ప్రచురణలు చదివి సంస్కృత సాహిత్యాన్ని పరిచయం చేసికున్నాను. తెలుగు సినిమా సాహిత్యం ఎంతో శ్రద్ధగా విన్నాను. ఆ కవుల పటిమకు మనసులోనే పరవశుడనయ్యాను. విపులలో వివిధ భాషల్లో కథలను చదివాను.
నావి వివిధ భాషల కథల అనువాదాలు 16 విపులలో ప్రచురించ బడ్డాయి.
1980లలో ది హెరిటేజ్ అని చందమామ ప్రచురణల వారి ఆంగ్ల మాస పత్రిక ప్రచురించ బడేది. అది ఎంతో గొప్ప ప్రచురణ. భారతీయ భాషలనుంచి కథల అనువాదాలు, భారతీయ సంస్కృతి, సాంప్రదాయములు, తత్త్వశాస్త్రముల గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాసాలు, విషయాలు ప్రచురించ బడేవి. కాని ఆ పత్రిక ఆర్థికంగా నిలదొక్కుకో లేక పోయింది. దాని మనుగడకై చందమామ ప్రచురణల నుంచి ధనం సర్దాల్సి వచ్చేది. అది నచ్చని హెరిటేజ్ సంపాదకులు మనోజ్ దాస్ ఆ పత్రికను మూసి వేయడానికి నిర్ణయించు కొని మూడేళ్ల తరువాత మూసేశారు. ఆ రోజున నాకు కలిగిన వేదన చెప్ప లేనిది.
అలాగే 1990 ల నుంచి ప్రచురించ బడుతున్న సంభాషణ సందేశః అనే సంస్కృత మాస పత్రిక సంస్కృత భాషలో భారతీయ, విదేశీ భాషల కథల సంస్కృతానువాదాలు ప్రచురిస్తూ ఉండేది.
హెరిటేజ్, సంభాషణ సందేశః లలో నాకు నచ్చిన వివిధ భాషల కథలని తెలుగు లోకి అనువదించే వాడిని. ఆ అనువాదాలు విపులకు పంపేవాడిని.
పరశురామ్ అని కలం పేరు కల ఒక ప్రఖ్యాత బెంగాలీ కథకుని కథను "బటేశ్వరుని సృష్టి" పేర అనువదించాను. ఇది నాకెంతో ఇష్టమైన నా అనువాదం. విపులలో ప్రచురింపబడినది. కన్నడ, తమిళ, మరాఠీ, బెంగాలీ, సంస్కృత, మళయాళం, బెలూచీ, ఇలా మొత్తం 16 కథలను అనువదించాను; విపులలో అవన్నీ ప్రచురించ బడ్డాయి. ఇవన్నీ హెరిటేజ్, సంభాషణ సందేశః లలో ప్రచురించబడినవి.
ఆ తర్వాత ఉపనిషత్తులు, బ్రహ్మజ్ఞానం, బౌద్ధం, జైనం, షడ్ దర్శనములు, రమణ మహర్షి భాషణములు ఇలా తత్త్వ శాస్త్ర గ్రంథాలను చదవడం లోకి మారి సాహితీ సృష్టిని, అనువాదాలను కొద్దిగా ప్రక్కకు పెట్టాను.
మనం మన జీవితంలో వివిధ దశలలో వివిధ రకాల సాహిత్యానికి, జ్ఞానానికి, కళలకు ఆకర్షింప బడతాము. ముందరి ఆకర్షణ కొత్త ఆకర్షణతో సన్నగిల్లుతుంది.
నేను తెలుగు, సంస్కృతం, ఆంగ్ల, ఫ్రెంచ్, జర్మన్ భాషలలో సాహితీ సృష్టి, అనువాద పరిశ్రమ చేస్తున్నాను. నేను చదివిన, నాకు సమానంగా ఇష్టమైన విజ్ఞాన శాస్త్ర పరిశోధననూ కొనసాగిస్తున్నాను. మన తత్త్వ శాస్త్ర గ్రంథాలలోని విజ్ఞాన శాస్త్రాంశాలను వ్యాసములుగా రాస్తున్నాను.
ఇలా నా సాహితీ, విజ్ఞాన శాస్త్ర, జ్ఞాన పరిశోధనా ప్రస్థానం కొనసాగుతోంది.
******
గతవైభవ చిహ్నాలు
వేదాల్లో అన్నీ ఉన్నాయి అంటూ కోర్చోడం కన్నా
మనం ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని ఆ జ్ఞానంతో సుసంపన్నం చెయ్యాలి; లేకపోతే మనవన్నీ
వట్టి మాటలు; కట్టి పెట్టడం మంచిది, శ్రేయస్కరం
ఎప్పుడో భారతీయులు గొప్పవారు, అంటూ ప్రకటించుకోవడం కన్నా ఇప్పుడూ అంతటి వారం అయ్యి చూపాలి; లేకపోతే మన మాటలు వట్టి
గొప్పలుగా మిగిలిపోతాయి; దున్ననివాడు పండించలేడు
తత్త్వశాస్త్రాన్ని మథించిన అచార్యుల నీడన
బ్రతుకక మనమూ మథించి నవనీతం తీయాలి
మదించి కూచుంటే మిడి మిడి జ్ఞానులు అంత
తత్త్వాన్నీ తుప్పు పట్టించేస్తారు, తప్పుడు కూతలు కూస్తారు
బంగరు ఆభరణములను సాకేంతగా, సాకినట్టుగా
విలువనెరిగి శ్రద్ధాభక్తులతో వినియోగించుకోవాలి
మా తాతలనాడు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అంటే సరిపోదు; సరిపడా శ్రమ పడాలి
ఆస్తులు వినియోగించుకొని అభివృద్ధి చెందుతూ
ఆస్తులు పెంచాలి; కూచుని తింటే కొండలైనా కరిగిపోతాయి
అర్హులైన వారసులవ్వాలంటే అంతటి వారం కావాలి
వట్టి మాటలతో శూన్యహస్తములతో వారికి సరితూగలేము
********

No comments:

Post a Comment