మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర
కలకత్తా ప్రయాణం
మిజోరాంలో ఐజ్వాల్ లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో కార్బన్ మెనేజ్మెంట్ మీద ఒక జాతీయ సెమినార్ అక్టోబర్ 30, 31 లలో జరుగుతోంది. దానికి ఒక పేపర్ పంపాను. అది సెమినార్ లో ప్రెజెంటేషన్ కి ఎన్నికైంది. దాని శీర్షిక:
"The ill effects of international dissonance on carbon management on environment and life systems".
ఐజ్వాల్ మిజోరాం రాజధాని. అక్కడ 2001 ప్రాంతంలో కేంద్ర విశ్వవిద్యాలయం స్థాపించారు. ఇప్పుడు అది ఒక పేరెన్నికగన్న విశ్వవిద్యాలయం గా ఎదిగింది. ఆ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విభాగం ఈ సెమినార్ నిర్వహిస్తోంది. ఇలా కాన్ఫరెన్స్ లకి హాజరవడం, ఆయా ప్రదేశాలకి సతీసమేతంగా వెళ్ళి చూచి రావడం గత 15 ఏళ్ళుగా నాకు వీలవుతోంది.
ఈ సారి కూడా సతీసమేతంగా ఐజ్వాల్ బయలుదేరాము. మా భీమవరం నుంచి సర్కార్లో రాజమండ్రి వెళ్లి అక్కడ హౌరా మెయిల్ ఎక్కి కలకత్తా వెళ్ళడం మొదటి దశ. కోల్కతా నుంచి విమానంలో ఐజ్వాల్ వెళ్తాము. మిగిలిన విశేషాలు సశేషం.
మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర
మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర
29-10-2017
కలకత్తా ప్రయాణం
నాకు చదువంటే ప్రాణం. ఈ లక్షణం నాకు మా అమ్మగారి నుంచి అబ్బింది. ఆవిడ చదువు ఆ రోజుల్లో పరిస్థితుల వల్ల 3 వ తరగతితో ఆగిపోయినా, ఎన్నో పుస్తకాలు చదివారు ఆవిడ.
ఆవిడ చదివి ఇంటో ఉంచిన శివ, వైశాఖ, మాఘ, అష్టాదశ పురాణములు 8,9 క్లాసుల్లో చదివాను. 3, 4 క్లాసులకి బాలల బొమ్మల రామాయణం, భారతం, భాగవతం, పంచతంత్రం చదివాను. 6,7 క్లాసులకి తెలుగులో డిటెక్టివ్ నవలలు చదివేవాడిని. 9, 10, 11 క్లాసుల్లో తెలుగు రచయిత్రుల సాంఘిక నవలలు చదివాను.
మా అమ్మగారు మరెన్నో పాటలు, కీర్తనలు రాసుకుని చదువుకునే వారు. ఇప్పటికీ ఆవిడ రాసిన నోటు పుస్తకాలు పాటలతో మా ఇంట్లో ఉన్నాయి. అలాగే పుస్తకాలు ఎక్కువగా చదవడం, ఆంగ్లభాషా ప్రావీణ్యం మా నాన్నగారి నుంచి వచ్చాయి.
చదువు కోవడం, జ్ఞాన, విషయ సముపార్జన, రకరకాల విషయాల గురించి చదవడం, నాకంటూ ఒక అవగాహన ఏర్పరచు కోవడం నాకు అలవాటు. అంచేత నేను చదివినది, పాఠం చెప్పినది భౌతిక శాస్త్రం అయినా వివిధ విజ్ఞాన, సాంఘిక శాస్త్రాలు, తత్త్వాలు, సాహిత్యం, నాకు సమానంగా ఇష్టం.
భాషలు నేర్చుకోవడమూ ఇష్టం. ఆ ఇష్టంతోనే
స్కూళ్ళలో నేర్చుకున్న తెలుగు, ఇంగ్లీష్, హిందీ లకు అదనంగా జర్మన్, ఫ్రెంచ్, సంస్కృత భాషలు నేర్చుకున్నాను. రాజకీయం, ఆటలు, సంగీతం, సినిమాలు, పర్యావరణ పరిరక్షణ ఇష్టమైన విషయాలు. నాకంటూ చాలా విషయాల మీద
నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. అన్నింటినీ నా సాహితీ, విజ్ఞాన, తత్త్వశాస్త్రాల రచనా, కవితా, వ్యాస పరంపరలలో వ్యక్తపరుస్తూంటాను. ఉపనిషత్తులు, బౌద్ధ, జైన, చార్వాక, షడ్ దర్శనములలో ఉన్న విషయాలపై కూలంకషంగా అధ్యయనం చేసి అవగాహన కలిగించుకునేందుకు ప్రయత్నిస్తూంటాను. మేము స్మార్తులము. వివిధ శాస్త్రాలు, వాదాలు, సిద్ధాంతాలు, మతములను సమన్వయ పరచడం మా వృత్తి, ప్రవృత్తి కూడా.
స్కూళ్ళలో నేర్చుకున్న తెలుగు, ఇంగ్లీష్, హిందీ లకు అదనంగా జర్మన్, ఫ్రెంచ్, సంస్కృత భాషలు నేర్చుకున్నాను. రాజకీయం, ఆటలు, సంగీతం, సినిమాలు, పర్యావరణ పరిరక్షణ ఇష్టమైన విషయాలు. నాకంటూ చాలా విషయాల మీద
నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. అన్నింటినీ నా సాహితీ, విజ్ఞాన, తత్త్వశాస్త్రాల రచనా, కవితా, వ్యాస పరంపరలలో వ్యక్తపరుస్తూంటాను. ఉపనిషత్తులు, బౌద్ధ, జైన, చార్వాక, షడ్ దర్శనములలో ఉన్న విషయాలపై కూలంకషంగా అధ్యయనం చేసి అవగాహన కలిగించుకునేందుకు ప్రయత్నిస్తూంటాను. మేము స్మార్తులము. వివిధ శాస్త్రాలు, వాదాలు, సిద్ధాంతాలు, మతములను సమన్వయ పరచడం మా వృత్తి, ప్రవృత్తి కూడా.
ఆ విధి, బాధ్యత, వృత్తి ధర్మంలో భాగంగా సమన్వయానికై తాపత్రయ పడడం, వెతకడం, కృషి చేయడం నా ప్రవృత్తిలో భాగం. ఈ సందర్భంగా ఎందరో కుహనా మేధావులను, వివిధ వృత్తుల్లోని వ్యక్తులను, వారి మూర్ఖత్వాలను ఎండగట్టడం ఈ కృషిలోని భాగం.
నిజానికి నేనే కాదు, నావంటి వారు చాలామంది ఉన్నారు. కాని మా సంగీత స్వరాలు కొందరి గోల, గొడవల్లో అస్సలు వినిపించడం లేదు. కాకుల అరుపులలో కోయిల గానం వినిపించనట్లు.
నా సహాధ్యాయులెందరో ఈ ప్రకృతి, ప్రవృత్తి దీక్ష కలవారు. సంఘానికి మంచి విజ్ఞత కలవారి వల్లే జరుగుతుంది. మిగతా కుహనా మేధావులు పాలలో విషపు చుక్కవంటివారు. వారి వల్ల ప్రమాదమే కాని ప్రయోజనం లేదు.
ఇంతకీ మేము రాజమండ్రిలో హౌరా మెయిల్ ఎక్కాము. కలకత్తాకు ప్రయాణిస్తున్నాము.
మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర
29-10-2017
కలకత్తా ఆగమనం
హౌరా మెయిల్ లో సుఖంగా ప్రయాణం చేసి హౌరా స్టేషన్ చేరాము. మెయిల్ ఇరవై నిమిషాల ఆలస్యంగా హౌరా చేర్చింది.
దారిలో మేం తెచ్చుకున్న నూపప్పు పులిహార, దద్ధ్యోజనం లతో రైల్లో మధ్యాహ్న, సాయంకాల భోజనాలు కానిచ్చాము. రైల్లో కేటరింగ్ భోజనం చేయడం ఖర్చు, బాగుంబకపోవడం. CAG చెప్పినట్లుగా ఆ భోజనం, ఇతర పదార్ధాలు "జంతువులు" కూడా తినలేవు. మనల్ని ఇలా అందరూ దోచుకునే వారే. రైలు ప్రయాణాల్లో, ఆటో వాళ్ళు, టేక్సీ వాళ్ళు అందరికీ మనం బకరాలమే. మన్ని చూస్తే చాలు వాళ్ళకి పరమోత్సాహం. వీరు వారిని వారు నియంత్రించుకోరు. మన్ని దోచడమే వాళ్ళ వృత్తి. పండగ రోజులొస్తే బస్సులవాళ్ళ దురాశకు అంతే లేదు. టికెట్ ధర ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తారు. గతిలేక మనం అన్ని డబ్బులు పెట్టి టికెట్ కొని పండుగలలో ప్రయాణాలు చేయాలి. గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు జరగడం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనం ఇలా అన్ని విషయాల్లోనూ నిస్సహాయంగా బతకడం నిజంగా శోచనీయం. ప్రభుత్వాలు ఏమీ నియంత్రించే ప్రయత్నాలే చేయవు. చేయలేవు. మనం స్వతంత్రులమో, పరతంత్రులమో!?
మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర
29-10-2017
కలకత్తా ఆగమనం
హౌరా మెయిల్ లో సుఖంగా ప్రయాణం చేసి హౌరా స్టేషన్ చేరాము. మెయిల్ ఇరవై నిమిషాల ఆలస్యంగా హౌరా చేర్చింది.
దారిలో మేం తెచ్చుకున్న నూపప్పు పులిహార, దద్ధ్యోజనం లతో రైల్లో మధ్యాహ్న, సాయంకాల భోజనాలు కానిచ్చాము. రైల్లో కేటరింగ్ భోజనం చేయడం ఖర్చు, బాగుంబకపోవడం. CAG చెప్పినట్లుగా ఆ భోజనం, ఇతర పదార్ధాలు "జంతువులు" కూడా తినలేవు. మనల్ని ఇలా అందరూ దోచుకునే వారే. రైలు ప్రయాణాల్లో, ఆటో వాళ్ళు, టేక్సీ వాళ్ళు అందరికీ మనం బకరాలమే. మన్ని చూస్తే చాలు వాళ్ళకి పరమోత్సాహం. వీరు వారిని వారు నియంత్రించుకోరు. మన్ని దోచడమే వాళ్ళ వృత్తి. పండగ రోజులొస్తే బస్సులవాళ్ళ దురాశకు అంతే లేదు. టికెట్ ధర ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తారు. గతిలేక మనం అన్ని డబ్బులు పెట్టి టికెట్ కొని పండుగలలో ప్రయాణాలు చేయాలి. గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు జరగడం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనం ఇలా అన్ని విషయాల్లోనూ నిస్సహాయంగా బతకడం నిజంగా శోచనీయం. ప్రభుత్వాలు ఏమీ నియంత్రించే ప్రయత్నాలే చేయవు. చేయలేవు. మనం స్వతంత్రులమో, పరతంత్రులమో!?
హౌరా స్టేషన్ లో దిగాక, ప్రీపెయిడ్ టాక్సీ కుదుర్చుకుని ఆరింటికి కలకత్తా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరాము. టాక్సీ 250 రూపాయలు మాత్రమే అయింది. కలకత్తా విమానాశ్రయాన్ని ఇదివరకు డమ్ డమ్ ఎయిర్ పోర్ట్ అనేవారు. డమ్ డమ్ ప్రాంతంలో ఉంది అందుకని. అలాగే మద్రాసు లో మీనంబాకం, ఢిల్లీ పాలం, బొంబాయి శాంతాక్రుజ్, బెంగుళూరులో జలహళ్ళి, హైదరాబాద్ బేగంపేట అని ఆయా విమానాశ్రయాలకు పేర్లు ఉండేవి. ఇవి జ్ఞాపకముంటే సోషల్ బిట్ పేపర్లో ఒక మార్కు ఖాయంగా వచ్చేది.
ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలను చూడాలని ఎప్పటినుండో కోరిక. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రాలలో ఎక్కువగా వేర్పాటు వాదాలుండేవి.
మొదటి వీటిని సమిష్టిగా నీఫా - NEFA - North East Frontier Area or Agency అనేవారు. అవి ఇప్పటి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం. తరువాత వాటిని ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పరిచారు.
మొదటి వీటిని సమిష్టిగా నీఫా - NEFA - North East Frontier Area or Agency అనేవారు. అవి ఇప్పటి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం. తరువాత వాటిని ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పరిచారు.
వాటిలో మిజోరాం ఒకటి. ఇది పర్వతమయ గిరిజన ప్రాంతం. ఐజ్వాల్ దీనికి రాజధాని. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ప్రకారం ఐజావ్ల్ అనవచ్చు.
కలకత్తా నుంచి ఐజ్వాల్ కు ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్, ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి. వాటి వాటి టికెట్ ఖరీదుల్లో తేడాలుంటాయి. మాకు జెట్ ఎయిర్వేస్ లో ఒక్కొక్క టికెట్ ఒక దిశలో రెండు వేల రూపాయలు పడింది.
కలకత్తా విమానాశ్రయం లో సేదదీరి, బోర్డింగ్ పాస్ తీసికొని, సెక్యూరిటీ చెక్ దగ్గరకు వచ్చాము. మా ఆవిడ కొన్ని కాస్మెటిక్స్, బోరోప్లస్ హేండ్ లగేజ్ లో మర్చిపోయింది. అది టెన్షన్ కలిగించింది. ఈ టెర్రరిస్టుల పుణ్యమా అని మనం జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. వాళ్ళ టెర్రరిస్టుల కార్యకలాపాలు అడ్డుకునేందుకు మనలాంటి సామాన్యులకు ఇబ్బందులు.
ఇప్పటికే నాలుగైదుసార్లు విమానప్రయాణాలు చేసినా ఈ విషయాలకు మేమింకా అలవాటు పడలేదు. మొబైల్ ఛార్ధరు, ఎనర్జీ పేక్ హేండ్ లగేజ్ లో తీసికెళ్ళచ్చో లేదో అనుమానం. కొందరు బెల్ట్ కూడా సెక్యూరిటీ చెక్ ముందు తీసెయ్యమంటారు. కొందరు పరవాలెదంటారు. పర్స్ తో సహా ముందు ట్రేలో పెట్టెయ్యాలి. నేను పర్స్ మర్చిపోయాను. సెక్యూరిటీ వాడు క్లాస్ పీకాడు. ఈ టెన్షన్లు దాటుకొని ఏమీ జరగకుండా సెక్యూరిటీ నుంచి పూర్తి చేసుకున్నాము.
మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర 4
29-10-2017
కలకత్తా - ఐజ్వాల్ ప్రయాణం
మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర 4
29-10-2017
కలకత్తా - ఐజ్వాల్ ప్రయాణం
మిజోరాం, నాగాలాండ్ చేరడానికి విమాన ప్రయాణం ఉత్తమం. అస్సాం ద్వారా బస్ లో రోజులు పడుతుంది. రైలు అస్సాం తో ఆగిపోతుంది. సరిహద్దుల్లో కీలకమైన ఈ రాష్ట్రాలలో రోడ్లు, రైళ్ళు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఇంతవరకు అభివృద్ధి చేయలేదో అప్పటి ప్రభుత్వాలకే తెలియాలి. సమగ్ర పాలన ఆ ప్రభుత్వాలకు తెలియదు. ఒక్క దళితుల వృద్ధి గురించి మాట్లాడితే - ఆ మాటలకు కార్యరూపం
ఈయనవసరం లేకుండా - ఓట్లు వచ్చి పడుతూంటే సమగ్ర పాలన గురించి అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోనవసరం లేకపోయింది. చైనా తన సరిహద్దుల్లో, ఆక్రమించిన ప్రాంతాల్లో ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించచుకుంటోంది? తన ఆక్రమణలను సుస్థిరం చేసుకుంటోంది. అందుకోసం సరిహద్దు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడానికి కూడా
సంశయించడంలేదు. టిబెట్, దక్షిణ చైనా సముద్రం, ఇలా ఎన్నో ఉదాహరణలు.
ఈయనవసరం లేకుండా - ఓట్లు వచ్చి పడుతూంటే సమగ్ర పాలన గురించి అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోనవసరం లేకపోయింది. చైనా తన సరిహద్దుల్లో, ఆక్రమించిన ప్రాంతాల్లో ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించచుకుంటోంది? తన ఆక్రమణలను సుస్థిరం చేసుకుంటోంది. అందుకోసం సరిహద్దు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడానికి కూడా
సంశయించడంలేదు. టిబెట్, దక్షిణ చైనా సముద్రం, ఇలా ఎన్నో ఉదాహరణలు.
కాశ్మీర్లో, కాశ్మీర్లో రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు పెంపొందించి ఉంటే ఆ ప్రాంతం మిగతా దేశంతో సన్నిహితమవడానికి వీలు ఉండేది. ఇన్ని సంవత్సరాలనుంచీ వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టినప్పటికీ సమస్య, సమస్య లాగే ఉండిపోయింది. అదే రవాణా సదుపాయాల మీద ఖర్చు చేసి ఉంటే సమస్య కొద్దిగా నైనా పరిష్కరింప బడడానికి ఉపయోగకరంగా ఉండి ఉండేది.
కోల్కతా నుంచి ఐజ్వాల్ కు ప్రొద్దుట 10-15 కి జెట్ ఎయిర్వేస్ వాళ్ళనే రెండు ఫ్లైట్స్ వున్నాయి. మొదటి మా ఫ్లైట్ కి గేట్ నెంబరు 16 అని బోర్డింగ్ పాస్ లో రాశారు. 40 నిమిషాల ముందు గేట్ నెంబరు 23సి, అనీ 23 డి అనీ ఊపారు. ఇలా సందిగ్ధంలో ఎందుకు ఉంచుతారో అర్థం కాదు. సికింద్రాబాద్ స్టేషన్ లోనూ అంతే నర్సాపురం ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం ఒకటని చివరి నిమిషంలో ఇంకో ప్లాట్ ఫారం కి మార్చిన సందర్భాలు ఎన్నో. ఆ గందరగోళంలో నేను రెండు మూడుసార్లు ఇరుక్కున్నాను. ముసలి ముతక లగేజీలతో పడ్డ అవస్థ చెప్పనలవికాదు. అధికారులు మనతో ఇలా ఎందుకు ఆడుకుంటారో తెలియదు.
అలా ఊగి చివరికి మా ఫ్లైట్ ఎక్కాము. ఆ విమాన ప్రయాణం బహు సుందరంగా ఉంది. వాల్మీకి మహర్షి సుందరకాండలో హనుమంతుని లంకాయానంలో ఆకాశాన్ని సముద్రం తో ఉపమిస్తారు. ఆ ఉపమానాలు ఈ విమాన ప్రయాణంలో నాకు కనిపించాయి. దానితోపాటు కొన్ని చోట్ల ఆకాశం కింద, పైనా కనిపించి అందించింది. మేఘాలు దూదిపింజల్లా ఉండి అంతను అలుముకున్నాయి.
ఆ దృశ్యం నయన మనోహరంగా ఉంది. మొత్తం ప్రయాణం మేఘాలు మధ్యనుంచే జరిగింది. మిజోరాం వస్తోందనగా పచ్చని ఎత్తైన పర్వతాలు కనిపించాయి. అప్పటినుండి ప్రకృతి సౌందర్యం కనువిందులు చేసింది.
ఆ దృశ్యం నయన మనోహరంగా ఉంది. మొత్తం ప్రయాణం మేఘాలు మధ్యనుంచే జరిగింది. మిజోరాం వస్తోందనగా పచ్చని ఎత్తైన పర్వతాలు కనిపించాయి. అప్పటినుండి ప్రకృతి సౌందర్యం కనువిందులు చేసింది.
మిజోరాం పర్వత శ్రేణులు, సానువుల్లో ఉన్న ప్రాంతం. గిరిజనుల వాసస్థానం. మిజో అంటే highlander అని అర్థంట. ఎత్తైన పర్వత శిఖరాలపై నివసించడానికి మొగ్గు చూపేవాడు అని వాళ్ళ భాషలో అర్థం.
ఐజ్వాల్ విమానాశ్రయాన్ని Lengpui విమానాశ్రయం అంటారు. విమానాశ్రయం బుల్లిది. తిరుపతి విమానాశ్రయం కన్న చిన్నది. ఒకేసారి రెండు విమానాలు హేండిల్ చేయబడతాయి అంతే. విమానాశ్రయ పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. విమానాశ్రయం చుట్టూ ఎత్తైన పచ్చటి కొండలు. వాతావరణం చల్లగా ఉంది. మేం విమానం దిగేసరికి 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. కలకత్తా విమానాశ్రయం లో కలిసిన మిజోరాం యూనివర్సిటీ ప్రొఫెసర్ బార్తేందు మాకెంతో సహకారం అందించారు. ఆయనకు కృతజ్ఞతలు. ఆయనే స్వయంగా మా సామాను తీసుకోవడంలో ఇతరత్రా ఎంతో సాయం చేశారు.
ఐజ్వాల్ విమానాశ్రయం లో మనం దిగగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫొటో కూడా ఉంచుకోవాలి. ఒక ఫార్మ్ పూర్తిచేయాలి. వాళ్ళు ఎంట్రీ కమ్ ఐడెంటిటీ పాస్ ఇస్తారు. మిజోరాం లో ఉన్నంత సేపూ మన దగ్గర ఆ ఐడెంటిటీ కార్డు ఉండాలి.
ఐజ్వాల్ విమానాశ్రయం లో ప్రీపెయిడ్ టాక్సీ ఫెసిలిటీ ఉంది. బార్తేందుగారు మమ్మల్ని గైడ్ చేసి యూనివర్సిటీ గెస్ట్ హౌస్ కి టాక్సీ బుక్ చేసి పెట్టారు. అక్కడినుంచి యూనివర్సిటీ కి 40 కి.మీ దూరం. 1300 రూపాయలు ఫేర్.
అక్కడినుంచి యూనివర్సిటీ కి ప్రయాణం ప్రకృతి సౌందర్యం, దృశ్యాల మయం. చుట్టూ ఎత్తైన పర్వతాలతో పచ్చగా శోభిల్లే దృశ్యం. మధ్యలో ఒక నది వచ్చింది. లోతుగా కింద ప్రవహిస్తోంది. మేం టాక్సీ ఎక్కాం, వర్షం మొదలయ్యింది. వాతావరణం మరింత చల్లబడినా ఎంతో ఆహ్లాదంగా, ఆనంద కరంగా ఉంది. ఇళ్ళు చాలా తక్కువ కనిపించాయి. రోడ్ అంచున స్టీల్, కాంక్రీట్ పిల్లర్లపై లేపిన ఇళ్ళు. ఇంచుమించు అన్నింటికీ రేకు రూఫ్ లు. ఊళ్ళు చాలా తక్కువ. ఊళ్ళన్నీ కొండ చరియలపై ఉన్నవే.
ప్రయాణం గంటకుపైగా పట్టింది. అన్నీ ఎక్కడాలు, దిగడాలతో ప్రయాణం జరిగింది. వర్షం పడుతూనే ఉంది. గెస్ట్ హౌస్ చేరి స్నానపానాదులు ముగించుకొని, లంచ్ చేసి విశ్రమించాము.
వర్షం పడుతూ అలా చూస్తూ ఉండి పోయేలా చేసింది. యూనివర్సిటీ కేంపస్, గెస్ట్ హౌస్ బాగున్నాయి. ఇండియా-న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ ఆస్వాదించి నిద్రలోకి జారుకున్నాము.
మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర
30, 31-10-2017
మిజో యూనివర్సిటీ లో సమయ యాపనం.
మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర
30, 31-10-2017
మిజో యూనివర్సిటీ లో సమయ యాపనం.
మిజోరాం యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో కూర్చుని, ఎదురుగా కనువిందు చేస్తున్న ప్రకృతి దృశ్యాల సౌందర్యం చూస్తూ ఈ రచన చేస్తున్నాను. మేము వచ్చిన రోజు, మరునాడు (29, 30 తారీఖు లలో) వర్షం పడుతూనే ఉండి చల్లదనం ఇచ్చి ఆ వాతావరణంలోని అందచందాలు, హాయి అందించింది. 30 వ తేదీన కాన్ఫరెన్స్ మొదలు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగింది. వైస్ ఛాన్సలర్, మిగతా పెద్దలు ప్రారంభోపన్యాసాలం ఇచ్చారు. అంతా అంగరంగ వైభవంగా జరిగింది.
మధ్యాహ్నం 1-30 కు నా ఉపన్యాసం జరిగింది. ఉపన్యాసక వృత్తిలో ఉన్న మాకు ఉపన్యాసాలివ్వడం చేప పిల్ల సరస్సులో ఈదడం లాంటిది. నేను సంపన్న దేశాలు, ముఖ్యంగా అమెరికా వాతావరణ పరిరక్షణ ప్రయత్నాలను ఎలా నీరుగారుస్తున్నాయో వివరించడం. 4 శాతం జనాభా ఉన్న అమెరికా 25 శాతం కార్బన్ Co2 విడుదలలు చేస్తోంది. రియో, కోపెన్ హాగెన్, క్యోటో, పారిస్ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని, అన్ని తీర్మానాలను బలపరచి మళ్ళీ "తూనా బొడ్డు" అనుకొని ఆ తీర్మానాలను తాను పట్టించుకోవడం లేదని ప్రకటించింది. దేశాధినేతలు మారగానే, లేదా మరేదో కారణాల చేత దేశాల అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగడం అమెరికాకు చెల్లింది. అలాగే మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలూనూ ఇలా ఆటలు ఆడుతున్నాయి.
ఈ అభివృద్ధి చెందిన దేశాలకు కావలసినది వ్యాపారం. పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చిందీ ఈ పాశ్చాత్య దేశాలే. దాని వల్ల లాభపడి అభివృద్ధి చెందిన దేశాలుగా ముద్ర వేసుకున్నదీ అవే.. పరిశ్రమల ద్వారా వాతావరణాన్ని కలుషితం చేయడం మొదలు పెట్టిందీ అవే. ఇప్పుడు వాతావరణం కాలుష్యం ప్రపంచానికి అత్యంత ప్రమాదం అని గోల, గొడవ చేస్తున్నవీ అవే. ఆ పేరుతో తాము పెంపొందించిన గ్రీన్ టెక్నాలజీ ని మిగతా దేశాలకు అమ్మి లాభపడాలని చూస్తున్నవీ అవే. ఇదంతా గ్లోబల్ వార్మింగ్ నియంత్రణ కన్న, గ్లోబల్ వ్యాపార ధోరణే ఎక్కువ.
పారిశ్రామిక విప్లవం తో మొదలైన వాతావరణ కాలుష్యం, ఇంతై వటుడింతై త్రివిక్రమముడిగా మారే స్థితికి చేర్చి అందర్నీ భయపెడుతున్నవీ ఈ సంపన్న దేశాలే. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ధనవంతుల కొమ్ము కాసే దేశం. ముఖ్యంగా రిపబ్లికన్లు ఈ విషయంలో ఏమీ సిగ్గుపడరు. ఈ మధ్యే పొరిస్ ఒప్పందం నుంచి అమెరికాని ఏక పక్షంగా తెప్పించిన
దేశాధ్యక్షుడు ట్రంప్ పన్ను రేటుని విపరీతంగా తగ్గించాడు.
దేశాధ్యక్షుడు ట్రంప్ పన్ను రేటుని విపరీతంగా తగ్గించాడు.
అమెరికాయే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు పారిశ్రామిక వేత్తల కొమ్మే కాస్తున్నాయి. వ్యవసాయం, నీటి, గాలి కాలుష్యాల గురించి పట్టించుకోవడం లేదు. వ్యవసాయాన్ని గాలికి వదిలేశారు. ఇంకా మా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో వరిచేలన్నిటిని రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. ఇవి వాతావరణానికి కలిగించే హాని ఉపద్రవమైనది. కానీ ఏ నాయకుడు, పాలకుడు, పౌరుడు ఈ విషయం అస్సలు పట్టించుకోవడం లేదు.
ఎందుకంటే వారే నాయకులు, వారే పాలకులు, వారే లాభపడే పౌరులు.
ఎందుకంటే వారే నాయకులు, వారే పాలకులు, వారే లాభపడే పౌరులు.
రాష్ట్రాల, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలులు కాగితపు పులులు, కోరలు తీసిన పాములు వలె నిరర్ధకంగా ఉన్నాయి. వాతావరణ కాలుష్య నియంత్రణపై అవి చేస్తున్నది సున్నా. ఏమీ లేదు.
ప్రభుత్వాలు కూడా జిడిపి పై పెట్టిన దృష్టి వాతావరణ కాలుష్య నియంత్రణకు పెట్టడం లేదు. గ్రీన్ టెక్నాలజీ ఉపయోగించడం పై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నాయి. ఆర్గానిక్ వ్యవసాయోత్పత్తులు ఎలా అమితమైన ధరలు కలిగిఉంటాయో, గ్రీన్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిన వస్తువులు అమితమైన ధరలను కలిగి ఉంటాయి. సామాన్యులకు అందుబాటులో ఉండవు.
మనకి అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు. పారిశ్రామిక, వ్యవసాయ కాలుష్యాలు, ఇప్పటి నాగరికత, కాలుష్య సంస్కృతి కావాలొ, వాతావరణ పరిరక్షణ కావాలొ మనం నిర్ణయించు కోవాలి. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. మనందరం ఈ లైఫ్ స్టైల్ మార్చుకోలేము. మనకు, మన తరువాతి తరాలకు వాతావరణ కాలుష్యం, కార్బన్ ఎమిషన్స్ కలిగించే, మన అస్తిత్వానికి భంగం కలిగించే తీవ్ర పరిణామాల నుంచి తప్పించుకోలేము.
మిజోరాం నవ యువతిలా స్నిగ్ధ మనోహరంగా చలాకీగా కల్మష రహితంగా ఎంతో నిర్మలంగా ఉంది. పూర్వకాలపు కన్నెపిల్లలా, మానసిక కాలుష్య, కశ్మల రహితంగా చక్కగా ఉంది. పారిశ్రామికీకరణ పేరుతో ఆ నైర్మల్యాన్ని పోగొట్టకోవద్దని అక్కడున్న మిజోరాం యూనివర్సిటీ యువ విద్యార్థినీ, విద్యార్థులను అర్థిస్తూ నా ప్రసంగాన్ని ముగించాను.
మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర
1-11-2017
మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర
1-11-2017
ఐజ్వాల్, మిజోరమ్ సందర్శనం
మిజోరాం యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో కూర్చుని సూర్యోదయం చూస్తూ, ఆ ఎండని ఆనందిస్తూ, ఈ రచన చేస్తున్నాను. ఇప్పుడే గెస్ట్ హౌస్ నుంచి చుట్టూ కనిపించే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి వచ్చాను. ఇక్కడ ఈ రోజుల్లో పగలు ఉష్ణోగ్రత 22 నుంచి 25 డిగ్రీల దాకా ఉంటుంది. వర్షం కురుస్తోంటే 18 డిగ్రీలు ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 16, 18 మధ్య ఉంటాయి. ఆహ్లాదంగా ఉంటుంది. పొద్దున్న 4-30 కు తెల్లవారి పోతుంది. సాయంకాలం 4 - 4-15 కి సూర్యుడు అస్తమిస్తాడు. 5 గంటలకు పూర్తిగా చీకటి పడిపోతుంది.
ప్రొఫెసర్ జ్యోతి కుమార్ మాకు కుటుంబ మిత్రుడు. అతను మిజోరాం యూనివర్సిటీ లో కామర్స్ ప్రొఫెసర్. మా భీమవరమే. వాళ్ళ నాన్నగారు డి.ఎన్.ఆర్. కాలేజీ పి.జి. డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. 1984 నుంచీ మా స్నేహం. ఐజ్వాల్ సందర్శనార్థం అతను ఒక వెహికల్ సమకూర్చి మాతో వచ్చాడు. డ్రైవ్ చేసినది "జాన్", అతని కొలీగ్ భర్త. అతను సాంఘిక సంక్షేమ కార్యక్రమాల పై వర్క్ షాప్ లు నిర్వహిస్తూ ఉంటాడు. ఎంతో మంచి వాడు. ఎఫీషియంట్ డ్రైవర్. మిజోరాం రోడ్లన్నీ పర్వతాల అంచులపై ఉంటాయి. అంతా ఎక్కడం, దిగడం.
వంపులెక్కువ. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.
వంపులెక్కువ. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.
మొదటి మేము సోలమన్ టెంపుల్ కి వెళ్ళాము. ఇది ఐజ్వాల్ సిటీ సెంటర్ లో ఒక కొండపై ఉంది. ఐజ్వాల్ ఊరు, మిజోరాం లో అన్ని ప్రాంతాలు కొండ చరియలపై ఉన్నాయి. కొండలు, లోయలు. ఇళ్ళు అన్నీ కొండ కిందనుంచి పైకి దాకా ఉంటాయి. ఐజ్వాల్ రోడ్లు చాలా ఇరుకు. అటొక వెహికల్, ఇటొక వెహికల్ రాగలవు అంతే. అంచేత ఇక్కడ ట్రాఫిక్ డిసిప్లిన్ చాలా ఎక్కువ. వెహికల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వెళ్తాయి. ఓవర్ టేకింగ్ ప్రశ్న లేదు. హారన్లు వినిపించవు. పెద్దకార్లకు ఐజ్వాల్ లో చోటులేదు. అన్నీ చిన్నకార్లే. ఆ రోడ్లమీద చిన్న కారులు మాత్రమే పడతాయి.
మిజోరాం లో చర్చిలని టెంపుల్ అంటారు. మిజోరాం ఇదివరకు అస్సాంలో భాగం. గవర్నమెంట్ రాని లోతట్టు ప్రాంతాలకు మిషనరీలు వచ్చి విద్యా, వెద్య సౌకర్యాలు ప్రజలకు అందించారు. క్రిస్టియానిటి కి మిజోరాం ప్రసిద్ధి చెందినది, పేరు మోసినది. ఇక్కడ చర్చ్ లు చాలా డినామినేషన్లతో ఉన్నాయి. డినామినేషన్ అంటే, కేథలిక్, ప్రొటెస్టెంట్ లో లా.
Christian పదాన్ని Kristian అని రాస్తారు.
మిజోరాం లో నూటికి నూరు మంది క్రిష్టియన్లు. వీరు ట్రూ క్రిష్టియన్లు. మనుషులు సాధువులు, మంచివారు, స్వాతంత్ర్య ప్రియులు.
Christian పదాన్ని Kristian అని రాస్తారు.
మిజోరాం లో నూటికి నూరు మంది క్రిష్టియన్లు. వీరు ట్రూ క్రిష్టియన్లు. మనుషులు సాధువులు, మంచివారు, స్వాతంత్ర్య ప్రియులు.
అమ్మాయిలు, అబ్బాయిలు అందంగా ఉన్నారు. ఎక్కువ మందిది పసిమి నిమ్మ చాయ. చాలా మర్యాదస్థులు. నాగరికత విధ్వంసకరంగా ప్రజల్ని పాడుచేయలేదు. నూటికి నూరు శాతం మాంసాహారులు. అమ్మాయిలు, అబ్బాయిల కన్నా చురుకు, బాధ్యత వహించే వారు. అమ్మాయిలు తమ కన్న చదువులో, ఉద్యోగం లో, (నిరుద్యోగి అయినా), ఆర్థిక స్థితిలో, వయసులో తక్కువైన అబ్బాయిలను పెళ్ళి చేసుకుంటారు. ప్రేమ కలిగితే తప్ప పెళ్ళి చేసుకోరు. తల్లిదండ్రులు, నచ్చకపోతే ఒకటి, రెండు సార్లు చెప్పి ఇంక ఊరుకుంటారు. మన వైపులా పరువు హత్యలుండవు. కాని విడాకు ల రేటూ ఎక్కువే.
మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర
1-11-2017
ఐజ్వాల్ సందర్శనం
1-11-2017
ఐజ్వాల్ సందర్శనం
31 వ తారీఖున కాన్ఫరెన్స్ అయిపోయాక, మా స్నేహితుడు ప్రొఫెసర్ జ్యోతి కుమార్ తో కలిసి ఐజ్వాల్, చుట్టుపక్కల చూడడానికి బయలుదేరాము.
ఐజ్వాల్ నగరం మిజోరమ్ యూనివర్సిటీకి 15 కి.మీ. దూరంలో ఉంది. మొదటగా మేము సోలమన్ టెంపుల్, చర్చి చూడడానికి వెళ్ళాము. ఇది ఒక పర్వతంపై ఉంది. చర్చినంతా పాలరాతితో కట్టారు. చుట్టూ ప్రదేశాన్ని ప్లాస్టిక్ పూలతో అలంకరించారు. అవి ఎంతో ఆకర్షణీయంగా ఉండి కనువిందు చేశాయి. చర్చ్ లోపల ఎంతో విశాలంగా, అందంగా క్రొత్తదనం ఉట్టిపడుతూ, కళాత్మకమైన బెంచీలతో అలరింది.
ఐజ్వాల్ నగరం మిజోరమ్ యూనివర్సిటీకి 15 కి.మీ. దూరంలో ఉంది. మొదటగా మేము సోలమన్ టెంపుల్, చర్చి చూడడానికి వెళ్ళాము. ఇది ఒక పర్వతంపై ఉంది. చర్చినంతా పాలరాతితో కట్టారు. చుట్టూ ప్రదేశాన్ని ప్లాస్టిక్ పూలతో అలంకరించారు. అవి ఎంతో ఆకర్షణీయంగా ఉండి కనువిందు చేశాయి. చర్చ్ లోపల ఎంతో విశాలంగా, అందంగా క్రొత్తదనం ఉట్టిపడుతూ, కళాత్మకమైన బెంచీలతో అలరింది.
ఈ సోలమన్ టెంపుల్ Presbyterian చర్చి డినామినేషన్ కి చెందినది. మిజోరం లో ఎక్కువ మంది ఉండే డినామినేషన్. ఎక్కువ ప్రాచుర్యం, ప్రాధాన్యత ఉన్నది. చర్చ్ చాలా ప్రశాంతంగా ఉంది. మేము తప్ప ఎవరూ లేరు. అక్కడ ఉన్న స్వీపర్స్ తో ఒక ఫొటో దిగాము. చాలా బాగా వచ్చింది.
మేము తర్వాత ఐజ్వాల్ లోనే మరొక కొండపై ఉన్న Synod Conference Centre, Mission Vengeance లో జరుగుతున్న Three Day National Seminar on Writing in Mizo Manuscripts కి హాజరయ్యాము. దానిని మిజోరం యూనివర్సిటీ, మిజో భాషా శాస్త్ర విభాగం నిర్వహిస్తోంది. దానిని మిజోరం ముఖ్యమంత్రి Pu Lal Thanhawla ప్రారంభిస్తున్నారు. మిజో భాషలో Lalpa అంటే భగవంతుడు అని అర్థం.
అక్కడ ఆడువారి, మగవారి పేర్లలో Lal ఉండి తీరుతుంది. Pu మగవారికి గౌరవవాచకం. Pi ఆడువారికిి గౌరవవాచకం. మగవారి పేర్లు a తోను, ఆడువారి పేర్లు i తోను ముగుస్తాయి. మా స్నేహితుడు ప్రొఫెసర్ జ్యోతి కుమార్ ని జ్యోతి Jyothi అని పిలుస్తారు. అలా అతని పేరు మిజోలో ఫెమినైన్ పేరు అయ్యింది. . వాళ్ళ డిపార్ట్మెంట్ లోనే Rama Ra మాmaswamy అనే పేరు కల లేడీ కొలీగ్ ఉన్నారు. అలా ఆవిడ పేరు మిజోలో మగవారి పేరయ్యింది. ఇలాగే ఉంటాయి సంస్కృతుల సమ్మేళనపు వింతలు.
ప్రొఫెసర్ జ్యోతి కుమార్ కొలీగ్, మిజోభాషా విభాగం అధ్యక్షుడు మేము వెళ్ళే సరికి ప్రారంభోపన్యాసం అప్పుడే మొదలుపెడ్తున్నారు. ముందు ఆంగ్లంలోను, ఆ తర్వాత మిజో భాషలోను మాట్లాడారు. నేను పనిచేసిన దక్షిణ భారత దేశప్రాంతంలో జాతీయ కార్యక్రమాల్లో కూడా వాళ్ళ మాతృభాష లోనే మాట్లాడతారు. మిజోలు ఎంతో నాగరీకంగా వ్యవహరించారు. మనకి భాష రానప్పుడు మాట్లాడుతూంటే ఆ మాటలు రణగొణ ధ్వనులు గా వినిపిస్తాయి. భాష నేర్చుకుంటున్నప్పుడు లోపల ఒక ప్రక్రియ జరుగుతుంది.మనకు రాని భాష విషయంలో ఈ ప్రక్రియ జరిగి ఉండదు కనుక ధ్వనులుగా మాటలు ఉండి పోతాయి. శబ్దములుజ్ఞానం ఉపయోగించుకొని అర్థరహితములై అవగాహన కలుగదు. పతంజలి, భర్తృహరి భాషావగాహన, భాషా తత్త్వం ల మీద బ్రహ్మ జ్ఞానం ఉపయోగించుకొని శబ్దబ్రహ్మ సిద్ధాంతం వెలయించారు.
No comments:
Post a Comment