Friday, November 17, 2017

మెట్ట వేదాంతము; ఇంద్రజాలము - వైష్ణవ మాయ; Running parties ; Problems; Duration and Metrical Aspects of Time; శాంతి ప్రవచనములు

మెట్ట వేదాంతము
వేదాంతమన్న సతత పరిప్రశ్నము కాదు. మౌనముగా సంయమనంతో తన విధ్యుక్త ధర్మములను నిర్వర్తించుట. అయినవారితో ఇష్టాగోష్టిగా గడుపుట. పూజలు, పునస్కారములు నియమంగా, నియతంగా చేయడం. కుటుంబాన్ని విడచి మెట్ట వేదాంతము ప్రవచించుట సనాతన ధర్మ ఆచరణ కాదు. ఆధ్యాత్మికత మన కోసం. ఇతరులకు ప్రకటనము కొరకు కాదు. ఆడంబరము, హడావుడి, ఎప్పుడూ ఎదో మాట్లాడుతూ ఉండడము వేదాంతావగాహన కాదు.

*********


ఇంద్రజాలము - వైష్ణవ మాయ

అవినీతి లేని దేశమే లేదు
పోపొమ్మంది ఇందిరమ్మ
అవినీతిని అంటకాగుచున్నారు
అందరు రాష్ట్ర నాయకులు, వారి
అనుయాయులు, అక్రమ సంపాదనలు
మరిగిన చిన్నా పెద్దా ఉద్యోగులు నాయకులు
ఉద్యోగులే వందల కోట్లు అవినీతితో
గడిస్తుంటే, వారి యజమానులు ఇంకెంత
గడిస్తున్నారో? ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున
మేస్తుందా? అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు
తమ తమ స్థాయి మేరకు ప్రభుత్వ సొమ్ము హాం పట్
అంటున్నారు; ప్రతి ప్రభుత్వ పని లోను
వాటాలు; వంద రూపాయల ప్రభుత్వ పనిలో
ఎనభై రూపాయలు వివిధ పందికొక్కులకు ఆహారం
పని నాసిరకం లేదా కాగితముల మీద మాత్రమే జరుగుతుంది
అవినీతి ఉద్యోగుల కొమ్ము కాసే నాయక శిరోమణులు మంత్రివర్యులు
ఉప ఖజానా ఉద్యోగులు కోట్లు తింటున్నారంటే
అండదండలు లేకుండా అలా తినగలరా?
ప్రభుత్వం పక్కనే ఉండగా విజయవాడలో అందరు
కలిసి పర్యాటక రంగాన్ని అథోగతికి నెడుతుంటే
పోచికోలు కబుర్లు తప్ప క్రియ లేని ప్రభుత్వాధినేతలు
అమరావతిని కట్టడం ముందు రాష్ట్రములో రోడ్ల నిర్మాణం
రవాణా,అవినీతి, పోలవరం కట్టుబడి లా సాగుతున్నాయి
ఎంతసేపూ ఏమార్చి మళ్లీ ఎన్నికలు గెలవడమే గమ్యం
ప్రభత్వాధినేత అయినా ప్రతిపక్ష నాయకుడైనా
అంతా వారి చిత్తం; పేదలకై కబుర్లు; ధనవంతులు
అస్మదీయులకై పనులు: అంతా ఇంద్రజాలము
వైష్ణవ మాయ; ప్రజాస్వామ్యమన్న కొందరి కి అవినీతి
పట్టం కట్టుట; దోపిడీకి లైసెన్సు ఇచ్చుట; కలియో
పేదల ఉధ్ధరింపో, సామాజిక న్యాయ పరిరక్షణమో
**********
Problems

Most of the problems in our life are imagined problems and thus do not exist in reality.. They are projections of mind in disturbance or confusion or ignorance or innocence or misguidance or wrong perception. Management of mind takes care of them and "solves" them.
**********
Running parties

running parties based on family hierarchy is the conscious adaptation of democracy in our country. Our voters cannot recognize any party other than family set up or dictatorial style in parties. The undeserving expectations of the have-nots, castes and communities on social justice plank , and the pampering of them by family run political parties with freebies, concessions, is bane of our democracy.
***********
Duration and Metrical Aspects of Time

The nature of time when studied reveals two aspects of itself – durational (period) and metrical (counting). We are aware of both these aspects in our daily worldly and scientific usage. We have clocks, watches, calendars, almanacs…. to monitor and measure time as a duration and flow.
The durational aspect of time comes into picture when the period of a process concerning matter or anti-matter or energy in space is compared with an external uniform process- the process going on in a time-measuring device. Actually processes, natural or non-natural, are initiated and go on guided by natural forces and cease to happen because of natural forces. It is known to us that the nature of such natural forces varies depending on the size and form of matter and the domain of activity and magnitude of energies and time-periods involved. So far we have identified four such natural forces- the gravitational, electro-magnetic, strong- and weak- nuclear forces. These four natural forces cause movement (transition), change (in phase and state of matter and form of energy) and becoming (ex: growth of organism) to matter and/or energy.
We utilize the durational aspect of time also to ‘record’ the periods of various processes taking place in the universe, which none of us need experience. We have identified many periods of happenings, from the period of nuclear transition (10-23 sec) to the age of the universe (1017 sec). The machines developed by us can ‘experience’ the durations of happenings whose magnitude is in tiny fractions of a second. The machines can follow and monitor such durations. The interval between two moments, the beginning and cessation, is the duration of that process or ‘absolute period’ of that process.
Time, in the sense of instants of time, is the numerable or metrical aspect of time. These instants serve exactly the same purpose as page numbers do to a book. Imagine that a book is bound properly in the order of narration and the page numbers are not put. Does the absence of page numbers on the pages of such a book change, alter or influence the course of narration? No. The page numbers just facilitate us for quick reference. Similar purpose is served by instants of time which facilitate us to refer to what had happened prior to our presence, what is happening in our presence and what will happen later to our presence. As individual numbers do not have any other significance except for being in sequential order so also individual instants of time do not have any other significance than being the divisions of duration, of movement of earth round the sun or of the process going on in a clock.
Thus instants of time are just ‘numerals’ that are used to signify or characterize durations of various processes. This type of metrical aspect of time is the other sense in which time is understood. It is important here to realize that any movement, change or becoming concerning matter or anti-matter or state or form of energy create time. In other words time is caused by the processes, natural or non-natural.
A period is absent in the absence of a process. Duration is absent in the absence of a period. ‘Time’ is absent in the absence of duration. Thus time is missing in the absence of a process, natural or non-natural. Time is dependent on a natural or non-natural process for its being. It has no independent existence from the process or event or happening- physical, chemical, biological, psychological, cosmological, social, political or likewise. Such a physical existence as flow and period of a happening is the physical time. Thus the being and becoming of matter and energy is physical time.
Time takes various loci (paths - straight line, circle, reversal) of time while ‘flowing’. Ancient Indians proposed cyclic path. We all modern people are following the idea of Galileo that path of time flow is a straight line, i.e., linear passage of time.
The observation of them demonstrates that the locus of time-flow is none other than the course of the path and direction of the course of the process selected.
Actually there is no passage of time. There is only ongoing of processes involving changes to matter and energy.
********

శాంతి ప్రవచనములు

కలత చెందకే మనసా!
బాధ నొందకే మనసా!

జనని భారతి గుండె తెగి
నిరంతరముగా రుధిర ధారలు
స్రవించుచున్నను
అమ్మ కన్నులు ఆర్ద్రమ్ములై
ఎడతెగక అశ్రువులు వర్షించుచున్నను
తల్లడిల్లకే మనసా!
కుదురు వీడకే మనసా!
జ్ఞాన దారిద్ర్యముచే బలహీనపడిన
జనుల మనసుల తిష్ట వేసి
ఉన్మాదులు ఇంద్రజాలికులు
నటులు ఆటగాళ్ళు సంకుచిత నాయకులు
అగ్ర తాంబూలమందినను
దిగులు చెందకే మనసా!
వెతలు వీడవే మనసా!
యంత్రమునకు బానిసై మనిషి తనను తాను
నిష్ప్రయోజకునిగా మార్చుకున్నను
ఆశ్చర్య పడకే మనసా!
ఆరాటము వలదే మనసా!
డబ్బు సంపాదించుటలు మాత్రము ధ్యేయమై
తోటి మనుషుల జీవుల ప్రాణములు తృణమై
అందరు పీల్చు గాలిని త్రాగు నీటిని తిను తిండిని
కొందరు ప్రాణాంతకముగ కలుషితము చేయుచున్నను
ఆందోళన వలదే మనసా! అలజడి చెందకే మనసా!
అడ్డ దారులు త్రొక్కి పదవులు పొంది
అడ్డముగా ధనము ప్రోగుచేయువారికి
"చదువు" "విజ్ఞానము" "బుద్ధి" "నేర్పరితనము"
దాస్యము చేయుచున్నను
కలత వలదే మనసా!
వ్యథ నొందకే మనసా!
అరణ్యములు ఎడారులైనను ఋతువుల ఆగమనము
క్రమము తప్పుచున్నను; కరువు కాటకములు వరదలు
జనుల ఎన్ని ఇక్కట్ల పాలు చేసినను
బెంబేలు పడకే మనసా!
ధైర్యము వీడకే మనసా!
పరికించు ప్రకృతిని
పరితపించకు పొంది వికృతిని
చూడు నెలవంక వయ్యారాలను
మర్చిపో అమవస నిశలు
ఆనందించు శారదరాత్రుల
మర్చిపో చిత్తడి ముంచు జల్లులు; జడి వానలు
వాడిన పూల సరసన
గమనించు వికసింపబోవు మొగ్గలు
కనవే మనసా! కలతలు వీడవే మనసా!
కలరు మనుషుల
దుష్టుల మించు శిష్టులు
మూర్ఖుల అణచు జ్ఞానులు
మృగ తత్త్వముల మచ్చిక చేయు
సర్వజన శ్రేయోకాములు
శాంతించు మనసా! శాంతించు ప్రియ వయస్యా!




Wednesday, November 15, 2017

German verse; French Verse; Sleep; Sanskrit verse; తొలి చినుకు; Natural disasters and natural disorders;వాడిపోతున్న లతానికుంజం

My German verse and English translation published in International Multi-lingual Anthology, Poetic Prism, 2017, conducted by CCVA - Cultural Center Vijayawada and Amaravati, A Plus Center, on 11th and 12th, November, 2017, at Vijayawada.

DIE SCHÖNHEIT UND DIE WAHRHEIT


Ich bin der verehrer
Die Schönheit und Die Wahrheit
In dem Schleier
Als rätsel
Obwohl
Mehr offenherzig;
Kann
Die nackheit bezaubern
Entzükend
Und
Auch dauethaft

English Translation

BEAUTY AND TRUTH

Beauty and Truth
In veiled state;
Though
More revealing,
Can bareness
Charm
As enchantingly
And lastingly?
**********
French Verse
La Vie
Dr. Varanasi Ramabrahmam

Nous sommes arrivés pleurant
Nous avons grandes entrainés
Nous sommes fatigués au cours de la vie
On dit « il / elle » à décédé
About the poem: An attempt is made in this small poem to say about our life in the briefest way.
English Translation

THE LIFE
Crying we enter
Enticed we grow
Tired (tried) we feel
Died others say
*********

My English verse published in International Multi-lingual Anthology, Poetic Prism, 2017, conducted by CCVA - Cultural Center Vijayawada and Amaravati, A Plus Center, on 11th and 12th, November, 2017, at Vijayawada.
Sleep
Sleep is natural to many 
But it denies itself to so many
Sleep is calmness within
When ego rests in The Self
Sleep pervades into Inner recesses of consciousness
And the awareness recedes
Sleep is silence
To happenings
Within and without the body
Conscious but unaware
Sleep is the experience of the Self
And The Self is the sleep’s seer Guide and terminator
Sleep is cessation of Mental activities within
And is free from interference of self-consciousness
Is tonic to mental ailments and malfunctions 
Sleep is the bliss, the peace and the tranquility of mind

**********
My Sanskrit verse and English translation published in International Multi-lingual Anthology, Poetic Prism, 2017, conducted by CCVA - Cultural Center Vijayawada and Amaravati, A Plus Center, on 11th and 12th, November, 2017, at Vijayawada.

श्री कनकदुर्गा स्तवम्

डॉ. वाराणसी रामब्रह्मम्

आत्मना दर्शयामि मनसा भजामि
बुद्ध्या जानामि चित्तेन स्मारामि
आनन्दरूपिण्यां कनकदुर्गायां
लीनं करोमि मिथ्याहं ममत्वं च
श्रीदेवी प्रीतिवृद्धये उपासयामि
महादेवीं त्रिपुरसुन्दरीम् शारदांम्
प्रसन्न दृष्टि युताम् शिवकामेश्वरीम्
सुस्थिर अनन्य भक्ति प्रदात्रीं भवानीं श्रियंम्
तटिल्लता तन्वीं दरहासोज्वलन्मुखीम्
कृष्णा नदी तटस्थ इन्द्रकीलाद्रि इन्द्राणीं
शिव मनोवल्लरीं मल्लेश्वर प्रणयणीम्
विमलां विजयवाटिकापुराधीश्वरीम्

English tranlation

In Praise of Goddess Kanakadurga!
I sight Her through my self
I sing Her with my heart
I know Her with my mind
I repeatedly chant Her in my thoughts.
Into Kanakadurga, the very embodiment of bliss,
Do I sink, submerging my false sense of self and identity.
I meditate upon the goddess hoping to augment her favour
I pray to Mahadevi, Tripura Sundari, Sarada Sivakameswari,
whose gaze makes all calm – She offers unassailable, undivided loyalty.
I bow to Bhavani, Sri,
Her body a streak of lightning,
her face ablaze with a cavernous smile.
She resides on Indra Kiladri, on the banks of the Krishna river.
Indrani, entwined around Shiva’s heart like a creeper,
the beloved of Lord Malleswara, Eternally pure, our lady of Vijayawatika.

Goddess Kanadurga is the presiding deity of Vijayawada,
situated on the banks of river Krishna in Andhra Pradesh.
Malleswara is Lord Siva, the beloved consort of goddess Kanakadurga.
**********
The Telugu verse recited by me at Multi-lingual poets' meet, 11-11-2017, Vijayawada
డా. . వారణాసి రామబ్రహ్మం
తొలి చినుకు
తొలి చినుకు స్పర్శ కు కలిగెను హర్షము
రావే రావే తొందరగా; చల్లదనము తేవే వర్షమా!
ఎండలకు ఎండిన చెరువులు, కట్టివేసిన కాలువలు
గాడుపులకు తట్టుకోలేని మా అందరి పైన
కురియవె తొలకరి జల్లులు
ఆహ్లాద భరితము చేయవే మనసును వాన నేస్తమా!
మిత్రుడవు నీవు; మిత్రుని తాప క్లేశము నుంచి రక్షించెదవు
'వానా వానా వల్లప్ప" అని; తొలి చినుకుల కలిగిన పులకాంకురములతో
గంతులు వేసితిమి; చిందులేస్తూ జల్లులలో తడిసితిమి చిన్నప్పుడు;
తిట్లు తింటిమి పెద్దలచే; అయిననూ అప్పుడు మా ఆనందము ఇసుమంతైనా తగ్గలేదు;
ఇప్పుడును మేము గంతులు వేయక పోయినను
చిందులు త్రొక్కక పోయినను; మా మనములు ఆనంద నాట్యము చేయుచున్నవి
నీ స్పర్శ కే ప్రేయసిని క్షణము మరుతుము కొన్ని క్షణములును
రావే రావే ప్రేయసి హృదయమున కురియవే హర్షపు వలపు జల్లులు!
తొలిచినుకు స్పర్శ; ప్రేయసి వలపుల పరామర్శ ఒకటే
ఆహ్లాదపు జల్లులు కురియును; తడియును మనసు
ప్రేయసీ ప్రణయార్ద్రతల; ఆమె ముద్దుల జల్లుల
వర్షమే హర్షము; ప్రణయిని, వలపుల రమణి, మనసు పంచిన తరుణి
తొలి చినుకు స్పర్శ కు కలిగెను హర్షము
రావే రావే తొందరగా; చల్లదనము పంచవే వర్షమా!
----------
Theme: The pleasant experience of falling of first rain drops is described.
*********
Natural disasters and natural disorders

Natural disasters do not happen be announcing in advance. It is the nature of them to hit suddenly. Human beings cannot o any thing but suffer and experience the disastrous consequences.

Nature only has direction to happen because of changes within unknown to us. It suddenly erupts. Natural has only emotion and not discrimination. It appears to follow its own guidelines, forces and rules not at all aware of or considering others rues and woos.

So also human beings. There are many human beings erupting suddenly to harm the other human beings and society and environment.

They are in the form of terrorists, fundamentalists, criminals, murderers,politicians, offenders to civilized society by their illegal and corrupt actions, self-styled god-men and -women, entertainers and also "intellectuals" of worst kind.

They are equivalent in causing damage and destruction as natural calamities. Ordinary human beings suffer because of natural calamities and natural disorders in human beings.

HUMAN BEINGS ARE LEFT HELPLESS AND RENDERED ACTION-LESS BY THESE WICKED NATURAL HAPPENINGS AND TRAITS.

Religions, culture, civilization are developed so that they can shield humans from the disorders of fellow criminal minded people. But these institutions themselves have become inspirations for destruction and dastardly actions.

Very unfortunate and dangerous situation is existing around us as pollution of atmosphere and environment.

*******

వాడిపోతున్న లతానికుంజం

మౌర్యులపై ఆంద్ర శాతవాహనుల విజయపరంపరలలో
రాజరాజనరేంద్రుని కృష్ణరాయని
ధవళ కీర్తి చంద్రికలలో
నన్నయ మొదలు "కరుణశ్రీ" వరకు
జాలువారిన రసపద్యకవితా లహరులలో
రామదాసు అన్నమయ్య త్యాగరాజుల
సంగీత సాహిత్య మధుర సమ్మేళనములో
గురజాడ కందుకూరి జాషువా శ్రీశ్రీ దేవులపల్లులు
నక్షత్రాలై అలరారు నవ్యసాహితీ వినీలాకాశంలో
గోదావరి కృష్ణవేణీ పెన్న తుంగభద్రల
పవిత్ర నదీ జల ప్రవాహములో
అమరావతీ శిల్పసౌందర్యంలో
కూచిపూడి నాట్యంలో
నాగార్జున వేమన్న కొడవటిగంటిల
సునిశిత ఆలోచనా స్రవంతులలో
ప్రతిఫలించే తెలుగుదనం
అందమైన లతా నికుంజం
వాడిపోతున్నది
చేతకాని వారి చేతులలో
ఎండిపోవుచున్నది
వివిధ రీతులలో

Monday, November 13, 2017

MARRIAGE SUTRAS AND BONDS; Human beings;

MARRIAGE SUTRAS AND BONDS
INDIVIDUALS ELIGIBLE AND THEIR QUALIFICATIONS FOR GETTING MARRIED
Marriage is for those who can take responsibility.
Marriage is not a pastime. Marriage is a sincere and serious obligation.
Marriage is not a stepping stone to get divorce. Marriage is not the initial and prime action to apply for divorce.
Marriage is for those who can bear inconvenience.
Marriage is for those who can transcend ego and live for family.
Marriage is for those who can love and serve.
Marriage is for those who can withstand the vicissitudes of life together and support the spouse and other family members.
Marriage is between two families not merely between two individuals.
Marriage is for those who can adjust.
Marriage is for those who want to have offspring and are ready to suffer sacrifices in bringing it up with responsibility and loving care.
Marrying is not doing favour to others but doing favour to oneself.
Marriage is not being subservient to spouse but sharing happiness and unhappiness of all family members and being a psychological pivot to them and to self.
Marriage is not for those who see it as a burden or discomfiture.
Marriage is opposite of divorce. Marriage is a life long togetherness.
It is marriage which sustains the society providing physical and psychological care, well-being and welfare through all phase of human beings for human beings. Mother (wife) and father (husband) are two chief, essential and loving supports to marriage.
Marriage is for those who willingly, voluntarily and joyfully take forward family culture and traditions.
Marriage is for those who are happy to be hosts to friends and relatives.
Marriage is for those who are ready and do not mind for compromises.
Marriage is not for those who have high degree ego and individuality.
Marriage is for those who can take living together and life with spouse and other family members as a meditative spiritual journey.
Marriage is for those who can love be loved.
Marriage is for those who have common sense and are wise.
Marriage is for those who are willing to cook and undertake other household chores.

**********

Human Beings

A human being is known and characterized by his thoughts and feelings only.
A human being is a psychological being; not a physical being.
Thus the physico-chemical and physiological aspects of human being are essential in categorizing an individual. They are reflected as psychology. Mind is man/woman. There is no human being sans considering one's thoughts and feelings.
Also a human being is Divine if one is beyond one's mind, one's thoughts and feelings - the ego.

Sunday, November 12, 2017

స్థలాలు - మనుషులు; అమ్మాయిలు, ఆడవారు; ఇదే మాయ; ఆత్మారామము, రామబ్రహ్మము; భారతీయ తత్త్వ చింతన

మనిషి పరిమితియే భగవంతుడు. మనిషి పరిణితియే భగవంతుడు.

స్థలాలు - మనుషులు

ఆ రోజుల్లో పనికిరాని స్థలాలు ఇప్పుడు కోట్లు 
గడిస్తున్నాయి, వెధవలని ముఖ్యులను చేస్తున్నాయి

ఎప్పటికీ పనికొచ్చే మనుషులు పనికిరాని చదువులు 
చదివి, ఎందుకూ పనికి రాకుండా పోతున్నారు , ప్చ్!

స్థలాలకున్న విలువ మనుషులకు లేదు
**********

అమ్మాయిలు, ఆడవారు


అందమైన మగవారితో మాట్లాడడానికి
అమ్మాయిలు, ఆడవారు ఇష్టపడతారు
అందవిహీనులతో మాట్లాడడానికి ఇష్టపడరు
వారిని వదిలించుకోవడానికి కష్టపడతారు
ఎంతైనా "కన్యా వరయితే రూపం"
అనాకారులకు అందవిహీనులకు పాపం
***********
ఇదే మాయ

బట్టతల ఉన్నవారికి తలపై వెంట్రుకలిష్టం
వెంట్రుకలు దట్టంగా ఉన్నవారికి బాబ్డ్ హెయిర్ ఇష్టం

లేనిది కావాలనుకోవడం, ఉన్నది ఊడగొట్టుకోవడం
మనుషులకిష్టం; ఉన్నది లెక్క చేయదు మనసు;
పోగొట్టుకున్న దానికై యుగములు కుములుతుంది
అంతా భావనలే, అన్నీ తలపులే; మన తలపులే,

మన ఆలోచనలే మనం; మనసు గారడీ మనం
వాస్తవం గణించని ఊహలే ఊపును మనల; నిజముపై 
ఆనింపులే తాడును పామును చేయును;
కల మెళకువను తప్పుదారి పట్టించును; ఇదే మాయ
***********
ఆత్మారామము, రామబ్రహ్మము,

ఆత్మారామము, రామబ్రహ్మము, పరబ్రహ్మము, మోక్షము, శాంతి, మౌనము, ఆనందము సమానార్థకములు. తత్పరములు. ఉపనిషత్ వాక్య తాత్పర్యములు. భగవదానుభవములు. భగవత్ స్ఫురణలు. భాగవతుల మనములు. భక్తుల హృదయములు.
వేదాంత వాక్య రమణ స్థితులు. మనసు విరామ స్థితులు. రామ స్థితులు. అద్వైతానంద రమ్య స్థితులు. విభక్తి భక్తి యైన స్థితులు. పశ్యంతీ, మధ్యమా, వైఖరులు పరా యందు లీనమైన స్థితులు. పరమశివ, శ్రీమన్నారాయణ వాస స్థితులు.
కైలాస, వికుంఠ (వైకుంఠ) స్థితులు. మనసు గంతులు, గతులు ఆగిన నిర్మల మానసిక స్థితులు.
దివ్య, దైవ, దేవతా స్థితులు. మనం, మనము, నిండుకున్న నిండు స్థితులు. పూర్ణ స్థితులు. పరిపూర్ణ స్థితులు. విశ్వాసము పండిన స్థితులు. సుఖదుఃఖాలు ఎండిన ప్రశాంత స్థితులు. మన వ్యక్తిత్వములు పరమాత్మలో లీనమైన స్థితులు. సద్గతి పొందిన స్థితులు. శుద్ధజ్ఞాన స్థితులు.
పరమేశ్వర సదానంద చిదానంద స్థితులు.
పరమేశ్వరి కరుణాంతరంగ స్థితులు.
*************
భారతీయ తత్త్వ చింతన

భారతీయ తత్త్వ చింతనను ఉపయోగించుకొని హిందూ మతం వెలిసింది. భారతీయ తత్త్వ చింతన, హిందూ మతం ఒకటి కాదు. భారతీయ తత్త్వ చింతన మతాతీతం. హిందూ మతము కర్మలకు సంబంధించినది. ఆచార, వ్యవహారములు, పూజలకు, పురస్కారాలకు పెద్దపీట వేస్తుంది.
భారతీయ తత్త్వ చింతన భగవత్ తత్త్వ దర్శనము. ఇందు మతం ప్రసక్తి లేదు. హిందూ మతము భారతీయ తత్త్వ చింతన పై ఆధారపడి ఉంది.
భారతీయ తత్త్వ చింతన కుల, ప్రాంత, దేశ, భాషా, మతాతీతము. సర్వతంత్ర స్వతంత్రము. జ్ఞానోద్దీపకము. మనసును వికసింపచేయును. 
మనసును నియమించును. మూఢనమ్మకములను పోగొట్టి నిజరూప దర్శనము చేయించును


********


Thursday, November 9, 2017

మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర 2


మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర 8
1-11-2017
ఐజ్వాల్ సందర్శనం
శబ్ద బ్రహ్మ సిద్ధాంతము అన్ని భాషలకు వర్తించే భాషా తత్త్వశాస్త్రం. దీనిని గురించి మరొకసారి.
సాంప్రదాయ దుస్తుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు అందగిస్తారు. పాశ్చాత్య లేక పంజాబీ డ్రెస్ ఆడువారికి సౌకర్యం అయిన ఈ రోజుల్లో సంప్రదాయ దుస్తులు ధరిస్తే అందంగా ఉంటారు, అలా ధరిస్తే బాగుండును అనుకోవడం ఒక నేరంగా పరిణమించింది ఈ రోజున. మేధావులు, ఉమెన్స్ లిబ్ వాళ్ళు, స్త్రీ వాదులు, స్త్రీ పురుషులను విడదీయడంలో ఎంతో సఫలీకృతులయ్యారు. ఆడ, మగా మధ్య దూరం బాగా పెరుగిపోతుంది. కలిసిమెలిసి ఉండి జీవితాలను పెంచుకోవాల్సిన, పండించు కోవలసిన వారు ఎడమొహం పెడమొహంగా తయారవుతున్నారు.
పెళ్ళికి ముందే ఆడువారికి, మగవారు, మొగుళ్ళ మీద తప్పుడు అభిప్రాయాలు కలిగించ బడుతున్నాయి. ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. ప్రమాదాలు తెచ్చి పెడుతుంది కూడా. మగవారు ఆడువారిని బాధ పెట్టడానికి మాత్రమే ఉన్నారు; స్త్రీలను వేధించడం, ఎక్సప్లాయిట్ చేయడమే మగవారి ప్రవృత్తి అని బోధలు చేస్తున్నారు. స్త్రీలందరూ దేవతలని, పురుషులు రాక్షసులని పాఠాలు చెప్పబడుతున్నాయి. మంచి, చెడ్డ అందరిలోనూ ఉంటుందని ఎవరూ చెప్పడంలేదు. స్త్రీకి పురుషుడు ఏ విషయం లోనూ సాటిరాడనీ, స్త్రీ పురుషుల సమానత్వం మిథ్య అనీ అంటున్నారు. స్త్రీ అనే సూర్యుని ముందు వెల వెల బోయే దివిటీ పురుషుడని తీసిపారేస్తున్నారు. ఇన్నాళ్లలా స్త్రీ ని అణచి ఉంచడం పురుషునికి ఇక ఎంత మాత్రమూ వీలుకాదని ఘోషిస్తున్నారు మేధావులు, స్త్రీ వాదులు.
మిజోరమ్ యాత్రలో ఈ స్త్రీ పురుషుల భారతం ఏమిటంటే; మిజో అమ్మాయిలు సంప్రదాయ పరికిణీల దుస్తులలో ఎంతో అందంగా కనిపించారు. మన తెలుగు అమ్మాయిలు కూడా మన సంప్రదాయ దుస్తులైన ఓణీ, పరికిణీలలో ఎంతో అందంగా కనిపిస్తారు. కాని ఈ దుస్తులను ధరించడం దాదాపు మృగ్యమైపోయింది. వాళ్ళు ఓణీ, పరికిణీ ధరించి అందంగా కనిపించి కనువిందు చేయాలనుకోవడం Male chauvinism, improperly viewing women and writing about them అనే అపవాదు వస్తుందా అని ఒక చిన్న ఆలోచన వచ్చింది.
సంప్రదాయ దుస్తులు ధరించిన మిజో అమ్మాయిలు ప్రకృతి వలె సుందరంగా కనిపించారు అని చెప్పాను కదా. మీ ఫొటోస్ తీసికోవచ్చా , నా వ్యాసములో పెడతాను అంటే వాళ్ళు ఎంతో సంతోషము గా ఒప్పుకుని ఫొటోస్ తీసికోనిచ్చ్చారు. మంచి పోజులు ఇచ్చారు కూడాను. స్త్రీ పురుషులిద్దరూ ప్రకృతి స్వరూపాలే అయినా స్త్రీలు ప్రకృతికి మరింత దగ్గరగా ఉంటారు. మరింత ప్రకృతి మయంగా ఉంటారు. A thing of beauty is a joy forever ; beauty lies in the eyes of the beholder . అనీ మనకు మాటలున్నాయి కదా.
సమాజములో మృగాళ్లు ఎక్కువ అయిపోయి స్త్రీలను చెరుస్తూ నానా భీభత్సము సృష్టిస్తున్న ఈ నాడు లలితముగా, రమణీయ దృష్టితో స్త్రీని, ఆమె సోయగాన్ని చూడడం కూడా విరసంగా మారింది. రసాస్వాదన కల మగవారిని, ఆడవారు అర్ధరాత్రి లేదా ఎప్పుడైనా ఒంటరిగా దొరికినప్పుడు వారిపై అత్యాచారం చేసే మగవారిని ఒకే రాటకు కట్టి మాట్లాడుతున్నఇప్పటి పరిస్థితులలో సౌందర్యము గురించి మాట్లాడడము వర్ణించడము కొద్దిగా risk గా తయారయ్యింది. పుర్రచేతివాద ధోరణి పుణ్యమా అని ప్రేమ కవిత్వం, శృంగార వర్ణనలు అంటరానివి అయిపోయాయి తెలుగునాట. బడుగుల కష్టాలు కలతలు, స్త్రీల పట్ల ప్రవర్తన, వారి విమోచన ల పై కవిత్వాలు అల్లడమే కవుల విధిగా మార్చేశారు విమర్శకులు. అట్టి పరిస్థితులలో ప్రకృతి సహజమైన స్త్రీ పురుష ఆకర్షణ, లలిత శృంగార భావముల గురించి కవనాలు చెప్పడం ఇంచుమించు నిషేధింప బడింది ఈ రోజుల్లో.
నా దృష్టిలో ఇది ఒక దుస్థితి. విచారకరమైన పరిస్థితి.

మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర 9
1-11-2017
ఐజ్వాల్ సందర్శనం

మేము మిజో భాష, దానిలో ఉన్న పాత రాత  గ్రంథములు గురించి జరుగుతున్న సదస్సుకి వెళ్ళాము. దానికి  ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి ముఖ్య అతిథి. ఆ సదస్సు మిజో విశ్వవిద్యాల మిజో భాషా  విభాగము నిర్వహిస్తోంది.

మిజోభాషా విభాగాధిపతి దానిని ఆంగ్లం, మిజో భాషలలో ప్రసంగించి ప్రారంభించారు. ఆయన అప్పటికి ప్రతి ఏడాది ఒక పుస్తకం చొప్పున 25 పుస్తకాలు ప్రచురించారు. మిజో భాష మీద, మిజో భాషలో. ఈ సదస్సులో అయన ప్రచురణా రజతోత్సవం కూడా కలిసి జరుగుతోంది.

నేను కూడా ఇన్నాళ్ళ గుంజాటన తరువాత నా పుస్తకములు నేనే చేతిచమురు భాగోతం లా ప్రచురించుకోవడం మొదలు పెట్టాను. మొదటగా The Hill -stream" అనే కవితా సంపుటిని  వెలువరించాను. మరొకటి "Conversation with Lord Krishna" రాబోతోంది. ఇంకా చాలా రకముల పుస్తకములు ప్రచురణలు చెయ్యాలని ఉంది. చూద్దాము.

సదస్సు బాగా జరిగింది. ఆ సదస్సుకి ముగ్గురు Elders వచ్చారు.  చర్చి fathers  ని మిజోరమ్ లో Elders అంటారు. వీరు ముగ్గురు మిజోలె. ముగ్గురు 90 లు దాటినవారే. ఒకాయన శతాధిక వృద్ధులు (107) సంవత్సరముల వయస్సు ఆయనిది. అందులో ఒకాయన ఒక ప్లెడ్జి లాంటిది చేయించారు. School  of Humanities Dean  కూడా మాట్లాడారు. మిజో భాషని భారత రాజ్యాంగ 8వ అధికరణములో  చేర్చే ప్రయత్నం మిజో భాషా పరిషత్తు చేస్తోందని, రాజకీయముగా కూడా మద్దతు లభించి ప్రయత్నం జరిగితే సద్యోఫలితం ఉంటుందని అన్నారు.

మన తెలుగాయన Prof . సుబ్బారావు గారు, Delhi యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయ్యారు, ఈశాన్య రాష్ట్రాల భాషా పై చాలా ఉపయోగకరమైన పరిశోధన చేశారు. మేఘాలయ భాషలు కాశి, గారో భాషా మరియు మిజో భాషా సాహిత్యాలపై మంచి పరిశోధనలు చేశారు. ఆయనతో కాస్సేపు ముచ్ఛటించాము. ఆయన గొప్ప పండితుడు, పరిశోధకుడు. ముఖ్య మంత్రి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

అక్కడి మిజో విద్యార్థినీ విద్యార్థులతో ఫోటోలు దిగాము. సాంప్రదాయ దుస్తులలో మిజో అమ్మాయిలు ఏంటో అందముగా ఉన్నారు. కార్యక్రమములో మిజో భాషా విభాగపు విద్యార్థినీ విద్యార్థులు తో కూడిన coir మిజో పాటల మంచి సంగీత గానము చేశారు. గిటార్ తో ఒక విద్యార్థి బాగా సహకారము చేసాడు. సదస్సు చివర మిజో అమ్మాయిలూ అబ్బాయిలు పాడుతుండగా ఒక విద్యార్థి విద్యార్థిని మిజో నృత్యం చేశారు. ఎంతో కను విందుగా ఉంది. ఆ తరవాత భోజనం. మిజో సాంప్రదాయ భోజనం. మాంసాహారమూ ఉంటుంది. మేము వాళ్ళని అడిగి అందులోని శాకాహారము తెప్పించుకున్నాము. అన్నము  సమోసా, పచ్చి కూరలు, ఒక వెజిటల్ కూర, అప్పడాలతో భోజనం చేసాము అనిపించాము.

ఆ తరువాత millenium మాల్ చూసాము. అక్కడనుండి ATC - Aizawl Theological College చూడడానికి వెళ్ళాము. ఈ కాలేజీ మిజోరమ్ లోని అన్నిటికంటే ఎత్తైన పర్వతం మీద ఎత్తైన శిఖరం మీద ఉంది. అక్కడ వాతావరణం, నిశ్శబ్దం నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి.

నేను French భాష నేర్చుకుంటున్నప్పుడు ఒక పాఠంలో ఇద్దరు వృద్ధ దంపతులు paris నుంచి వఛ్చి ఒక పల్లెటూరులో స్థిరపడతారు.

అప్పుడు భర్త భార్యతో :  écoute  se silence అంటాడు.  Listen to the silence అని  భావము. అంటే ఈ నిశ్శబ్దాన్ని విను అని అర్థం. నాకు ఆ మాట ఎంతో  కూడా. 

అటువంటి నిశ్శబ్దాన్ని అక్కడ నేను విన్నాను.  ఎంతో ముగ్దుడనయ్యాను. ఇక్కడే ఉండిపోవాలని  యాథాలాపంగా అన్నాను. దాని మీద Prof. జ్యోతికుమార్ గొప్ప వేళాకోళం చేశాడు.  ఇప్పుడు ఈ వయసు లో మతం మారితే ఎలాగండీ? మా  అందరి గతి ఏమిటి ; మీఇంట్లో వాళ్లు, madam  ఎలాగ అంటూ చాలాసేపు కంగారుపడినట్టు నటించాడు.  We enjoyed it so much. 

ATC భారత దేశంలోని అన్ని డినామినేషన్ christian లకి Christian Theology లో training ఇస్తుంది.

ఆ తరువాత ఐజ్వాల్ ట్రాఫిక్ దాటుకొని మా యూనివర్సిటీ గెస్ట్ హౌస్ కి చేరేసరికి బాగా శ్రా0తులము అయ్యాము. వెంటనే పడుకుని సేద తీరాము. మరునాడు తిరుగు ప్రయాణము. మేము మిజోరమ్ పర్యటనని ఎంతో ఆస్వాదించాము. తో గో తో To go to Mijoram and be there is  a beautiful and  peaceful spiritual pilgrimage. ఒక ప్రశాంతిని కలిగించే గాఢ ఆధ్యాత్మికానుభవము. అక్కడే ఉంటె చాలు మనసు నెమ్మది పొందుతుంది. ఏ ధ్యానాలు, ఉపాసనలు అవసరము లేదు. పర్వతములు, పర్వత శ్రేణులు, పర్వత సానువులు, లోయలు ఎంతో గొప్ప ధ్యానానుభవాన్ని, ఉపాసనానుభవాన్ని ఇస్తాయి. ఇటువంటి చోట్లకి వెళ్లడమే ప్రశాంతతను ఇస్తుంది. పెద్ద వృక్షములు పర్వతములపై దట్టముగా పెరిగి, పరచుకొని పచ్చదనం  తో అలరారుతో మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. అక్కడ పర్వత శ్రేణులన్నీ నిశ్శబ్ద నిలయాలు. మనుషులూ మంచివారు. స్నేహ స్వభావులు. మృదు మనస్కులు. శాకాహారము దొరుకుతుంది. ఒకే చోట మాంసాహారము, శాకాహారము విడి విడి గా  దొరికే restaurant లు ఉంటాయి. విడిగా శాకాహార భోజనం దొరికే restaurants ఉండవు.

మరునాడు (2-11-2017) న మళ్ళీ Johny  యే  మమ్మల్ని  విమానాశ్రయము దగ్గర దింపాడు. ఆతను టెన్త్ క్లాస్ ఫెయిల్. . అతని భార్య మిజోరమ్ యూనివర్సిటీలో Commerce Department లో Assistant Professor. ఈ వాస్తవము నన్ను ఎంతో ఉల్లాసపరచింది. సమతల ప్రదేశాల్లోని అమ్మాయిలకు ఏదైనా సందేశం ఇస్తుందా అనిపించింది . ఐజ్వాల్ నుంచి కలకత్తా అక్కడినుంచి మెయిల్ లో నిడదవోలు, అక్కడినుంచి  Seshaadri Express లో భీమవరం చేరాము..









Snippets; నమ్మకము,నాటి యక్షప్రశ్నకు నేటి సమాధానం; జీవుడు సున్నయ్యె, ప్రణయిని; భూగోళమున గందరగోళము ;


Life is a foreign language; all men mispronounce it. - Christopher Morley
************
నమ్మకము

నమ్మకము లేక శాంతి లేదు. బ్రతుకులో సుఖం లేదు. నమ్మకము కలిగి ఉండడమే అసలు చదువు. చదువువల్ల మనము వికసించాలి. ప్రశాంతత నొందాలి. అటువంటి చదువే చదువు. చదువు మనిషికి జీవనోపాధి కలిగించాలి. జ్ఞానం కలిగించాలి. బ్రతుకును జీవించడానికి సపద మనోబలం, ధైర్యము, చాతుర్యము ఇవ్వాలి. అటువంటి చదువు ఉపయోగకరమైనది. అవసరమైనది. చదువు మనసును బ్రతుకును ఉద్ధరించాలి. కరుణ, అనురాగములను పెంచాలి. మనలని మనుషులని చెయ్యాలి. భగవత్తత్వమును అర్థము చేసికొని దివ్యమైన తలపులతో జీవించేలా చేయాలి.

***********
We are many times crazy about and are die hard fans of the heroes and
heroines of the reel life. Why should not we be heroes and heroines in
our real life? Why should we remain as admirers for life? Let us be the
admired and adored.

****************
సింధు కన్యకు హరి అందం
అద్రి సుతకు హరుడందం
పుస్తకపాణికి బ్రహ్మ అందం
మనసుకు గోవింద ధ్యానమందం

*************
రాముడు శివుని ప్రతిష్ట చేసి అభిషేకించును, అర్చించును
శివుడు సతతము రామ నామమును జపియించును
నిటలాక్ష నీలమేఘ సంకాశ మేనివాడు అద్వైతులు, ఒకరే
ఒకటే స్మార్తులమై శివకేశవుల అభేదమును చాటింతము
************
Human beings learn everything by imitation and aping right from infancy, starting from talking; what all we see, hear, read, know, mingle with, make us ape and imitate that information. So it is always wise to be choosy in our reading, mingling and the like activities.
**********
నాటి యక్షప్రశ్నకు నేటి సమాధానం

మహాభారతంలో యక్ష ప్రశ్నల ఘట్టంలో యక్షుడు ధర్మరాజును ప్రపంచం లోని గొప్ప వింత ఏమిటి అని అడుగుతాడు.
నిత్యమూ మన కళ్ళ ఎదుట ఇందరు మరణిస్తున్నా మనం మాత్రం ఇక్కడ ఉట్టికట్టుకు వేలాడతాము, ఈ భూమి పై మనం శాశ్వతంగా ఉంటామనుకోవడం వింతల్లోకి వింత అని సమాధానం ఇస్తాడు.

ఇదే ప్రశ్నని యక్షుడు నాకు ఇప్పుడు వేసి ఉంటే, నేను ఇలా ‌సమాధానం చెప్పేవాడిని.
ఇంజనీరింగ్ చదివిన వాళ్ళలో ఐదు శాతానికి మాత్రమే ఒక మాదిరి ఉద్యోగాలు వచ్చి మిగిలిన వారంతా నిరుద్యోగులు, చిరుద్యోగులుగా మిగిలి పోవడం నిత్యమూ చూస్తున్నా తమ ధన, మాన, ప్రాణములను, తమ పిల్లల ప్రాణములను కార్పొరేట్ స్కూళ్ల, కాలేజీల పరం చేస్తున్న తల్లిదండ్రుల సంఖ్య తామరతంపరగా పెరిగిపోవడం వింతల్లో కెల్లా వింత అని సమాధానం చెప్పేవాడిని.
అందరికీ ఇంగితం పెరగాలి అని నా ప్రార్థన.
ఎన్నో అందమైన, ఆకర్షణీయమైన, ఖరీదైన రకరకాల ఆభరణములు ధరించి నగల దుకాణం ప్రకటనలో పాల్గొనే సౌందర్యవతి నగలు ఆమె సొంతం కాదు, నగల దుకాణం యజమానివి. అలాగే మనం అనుభవించే సకల సంపదలకు యజమానులం మనం కాదు, యజమానులు భగవంతుడు, ప్రకృతీ.
************
జీవుడు సున్నయ్యె

పెన్నుతో పుస్తకంపై రాసే రోజులు పోయె
మన్నులో ఆటలాడుకొని పెద్దలచే
తిట్లు తిన్న రోజులునూ పోయె
ఆధునిక ఉపకరణములతో చదువు, ఆటలు
ముడిపడె; చదువన్న ఆటలన్న అర్థములు మారె
భౌతికముగ కష్టపడక నాజూకు నేర్చి నేడు
మనిషి తన శరీరమునే నిర్లక్ష్యము చేయుచుండె;
"శరీరమాద్యఖలుధర్మసాధనం" పోయి శరీర
విహిత కర్మములు ఉపకరణముల పాలాయె
జీవితము యాంత్రికమాయె జీవుడు సున్నయ్యె
**********

భూగోళమున గందగోళము
అమ్మలు లేరు నేడు అందరు 
ఉద్యోగములు చేయు ముద్దుగుమ్మలె 

తండ్రులు లేరు నేడు అందరు 
మరొకరిని జ్ఞానము అడుగువారే 

ఉపాధ్యాయులు లేరు నేడు అందరు 
యాజమాన్యముల ఊడిగము చేయు వారే 

జ్ఞానులు లేరు నేడు అందరు కుటీర, భారీ  
పరిశ్రమల వంటి ఆశ్రమములు నడుపు వారే 

నా వారు లేరు నేడు అందరు 
"కృత్రిమ - virtual " స్నేహితులే 
బందుగులే అంతర్జాలమున 
సాలెగూళ్లందు సమూహములందు 

మనసున మనసు కలుపుట మరచె మనిషి 
మర మనిషాయె తగ్గిరి ప్రాణ స్నేహితులు 
ప్రాణమునకు ప్రాణమిచ్చు తల్లి తండ్రియును 
గురువు దైవము వంటి అమ్మ నాన్నలు 
అంతయు గందరగోళమాయె భూగోళమున 

**********

Tradition is like pole star; so are the wise words of seers. We may not reach pole star but we can take the direction it provides to chart the course of our life boat.
********
Women started saying women are equal to men in all aspects. Now it changed to women are more equal to men. Women now say that they do many things better than men. We, men, wish men and women remain equal.
*********
ప్రణయినితో చెట్టాపట్టాలేసుకుని/ ప్రణయ గీతములనాలాపించుకొనుచు/ 
రసగానమున మురియుచు ప్రేమ భాషణముల పరవశించుచు/ 
సఖి, ప్రకృతుల సోయగానాల కులుకుచు/ 
ప్రణయ వ్యాహ్యాళిని స్వర్గమును చవి చూచెద ప్రకృతిలో లీనమై

Sunday, November 5, 2017

మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర 1

మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర 
కలకత్తా ప్రయాణం
మిజోరాంలో ఐజ్వాల్ లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో కార్బన్ మెనేజ్మెంట్ మీద ఒక జాతీయ సెమినార్ అక్టోబర్ 30, 31 లలో జరుగుతోంది. దానికి ఒక పేపర్ పంపాను. అది సెమినార్ లో ప్రెజెంటేషన్ కి ఎన్నికైంది. దాని శీర్షిక:
"The ill effects of international dissonance on carbon management on environment and life systems".
ఐజ్వాల్ మిజోరాం రాజధాని. అక్కడ 2001 ప్రాంతంలో కేంద్ర విశ్వవిద్యాలయం స్థాపించారు. ఇప్పుడు అది ఒక పేరెన్నికగన్న విశ్వవిద్యాలయం గా ఎదిగింది. ఆ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విభాగం ఈ సెమినార్ నిర్వహిస్తోంది. ఇలా కాన్ఫరెన్స్ లకి హాజరవడం, ఆయా ప్రదేశాలకి సతీసమేతంగా వెళ్ళి చూచి రావడం గత 15 ఏళ్ళుగా నాకు వీలవుతోంది.
ఈ సారి కూడా సతీసమేతంగా ఐజ్వాల్ బయలుదేరాము. మా భీమవరం నుంచి సర్కార్లో రాజమండ్రి వెళ్లి అక్కడ హౌరా మెయిల్ ఎక్కి కలకత్తా వెళ్ళడం మొదటి దశ. కోల్కతా నుంచి విమానంలో ఐజ్వాల్ వెళ్తాము. మిగిలిన విశేషాలు సశేషం.

మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర 
29-10-2017
కలకత్తా ప్రయాణం 
నాకు చదువంటే ప్రాణం. ఈ లక్షణం నాకు మా అమ్మగారి నుంచి అబ్బింది. ఆవిడ చదువు ఆ రోజుల్లో పరిస్థితుల వల్ల 3 వ తరగతితో ఆగిపోయినా, ఎన్నో పుస్తకాలు చదివారు ఆవిడ.
ఆవిడ చదివి ఇంటో ఉంచిన శివ, వైశాఖ, మాఘ, అష్టాదశ పురాణములు 8,9 క్లాసుల్లో చదివాను. 3, 4 క్లాసులకి బాలల బొమ్మల రామాయణం, భారతం, భాగవతం, పంచతంత్రం చదివాను. 6,7 క్లాసులకి తెలుగులో డిటెక్టివ్ నవలలు చదివేవాడిని. 9, 10, 11 క్లాసుల్లో తెలుగు రచయిత్రుల సాంఘిక నవలలు చదివాను.
మా అమ్మగారు మరెన్నో పాటలు, కీర్తనలు రాసుకుని చదువుకునే వారు. ఇప్పటికీ ఆవిడ రాసిన నోటు పుస్తకాలు పాటలతో మా ఇంట్లో ఉన్నాయి. అలాగే పుస్తకాలు ఎక్కువగా చదవడం, ఆంగ్లభాషా ప్రావీణ్యం మా నాన్నగారి నుంచి వచ్చాయి.
చదువు కోవడం, జ్ఞాన, విషయ సముపార్జన, రకరకాల విషయాల గురించి చదవడం, నాకంటూ ఒక అవగాహన ఏర్పరచు కోవడం నాకు అలవాటు. అంచేత నేను చదివినది, పాఠం చెప్పినది భౌతిక శాస్త్రం అయినా వివిధ విజ్ఞాన, సాంఘిక శాస్త్రాలు, తత్త్వాలు, సాహిత్యం, నాకు సమానంగా ఇష్టం.
భాషలు నేర్చుకోవడమూ ఇష్టం. ఆ ఇష్టంతోనే
స్కూళ్ళలో నేర్చుకున్న తెలుగు, ఇంగ్లీష్, హిందీ లకు అదనంగా జర్మన్, ఫ్రెంచ్, సంస్కృత భాషలు నేర్చుకున్నాను. రాజకీయం, ఆటలు, సంగీతం, సినిమాలు, పర్యావరణ పరిరక్షణ ఇష్టమైన విషయాలు. నాకంటూ చాలా విషయాల మీద
నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. అన్నింటినీ నా సాహితీ, విజ్ఞాన, తత్త్వశాస్త్రాల రచనా, కవితా, వ్యాస పరంపరలలో వ్యక్తపరుస్తూంటాను. ఉపనిషత్తులు, బౌద్ధ, జైన, చార్వాక, షడ్ దర్శనములలో ఉన్న విషయాలపై కూలంకషంగా అధ్యయనం చేసి అవగాహన కలిగించుకునేందుకు ప్రయత్నిస్తూంటాను. మేము స్మార్తులము. వివిధ శాస్త్రాలు, వాదాలు, సిద్ధాంతాలు, మతములను సమన్వయ పరచడం మా వృత్తి, ప్రవృత్తి కూడా.
ఆ విధి, బాధ్యత, వృత్తి ధర్మంలో భాగంగా సమన్వయానికై తాపత్రయ పడడం, వెతకడం, కృషి చేయడం నా ప్రవృత్తిలో భాగం. ఈ సందర్భంగా ఎందరో కుహనా మేధావులను, వివిధ వృత్తుల్లోని వ్యక్తులను, వారి మూర్ఖత్వాలను ఎండగట్టడం ఈ కృషిలోని భాగం.
నిజానికి నేనే కాదు, నావంటి వారు చాలామంది ఉన్నారు. కాని మా సంగీత స్వరాలు కొందరి గోల, గొడవల్లో అస్సలు వినిపించడం లేదు. కాకుల అరుపులలో కోయిల గానం వినిపించనట్లు.
నా సహాధ్యాయులెందరో ఈ ప్రకృతి, ప్రవృత్తి దీక్ష కలవారు. సంఘానికి మంచి విజ్ఞత కలవారి వల్లే జరుగుతుంది. మిగతా కుహనా మేధావులు పాలలో విషపు చుక్కవంటివారు. వారి వల్ల ప్రమాదమే కాని ప్రయోజనం లేదు.
ఇంతకీ మేము రాజమండ్రిలో హౌరా మెయిల్ ఎక్కాము. కలకత్తాకు ప్రయాణిస్తున్నాము.

మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర
29-10-2017
కలకత్తా ఆగమనం
హౌరా మెయిల్ లో సుఖంగా ప్రయాణం చేసి హౌరా స్టేషన్ చేరాము. మెయిల్ ఇరవై నిమిషాల ఆలస్యంగా హౌరా చేర్చింది.
దారిలో మేం తెచ్చుకున్న నూపప్పు పులిహార, దద్ధ్యోజనం లతో రైల్లో మధ్యాహ్న, సాయంకాల భోజనాలు కానిచ్చాము. రైల్లో కేటరింగ్ భోజనం చేయడం ఖర్చు, బాగుంబకపోవడం. CAG చెప్పినట్లుగా ఆ భోజనం, ఇతర పదార్ధాలు "జంతువులు" కూడా తినలేవు. మనల్ని ఇలా అందరూ దోచుకునే వారే. రైలు ప్రయాణాల్లో, ఆటో వాళ్ళు, టేక్సీ వాళ్ళు అందరికీ మనం బకరాలమే. మన్ని చూస్తే చాలు వాళ్ళకి పరమోత్సాహం. వీరు వారిని వారు నియంత్రించుకోరు. మన్ని దోచడమే వాళ్ళ వృత్తి. పండగ రోజులొస్తే బస్సులవాళ్ళ దురాశకు అంతే లేదు. టికెట్ ధర ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తారు. గతిలేక మనం అన్ని డబ్బులు పెట్టి టికెట్ కొని పండుగలలో ప్రయాణాలు చేయాలి. గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు జరగడం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనం ఇలా అన్ని విషయాల్లోనూ నిస్సహాయంగా బతకడం నిజంగా శోచనీయం. ప్రభుత్వాలు ఏమీ నియంత్రించే ప్రయత్నాలే చేయవు. చేయలేవు. మనం స్వతంత్రులమో, పరతంత్రులమో!?
హౌరా స్టేషన్ లో దిగాక, ప్రీపెయిడ్ టాక్సీ కుదుర్చుకుని ఆరింటికి కలకత్తా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరాము. టాక్సీ 250 రూపాయలు మాత్రమే అయింది. కలకత్తా విమానాశ్రయాన్ని ఇదివరకు డమ్ డమ్ ఎయిర్ పోర్ట్ అనేవారు. డమ్ డమ్ ప్రాంతంలో ఉంది అందుకని. అలాగే మద్రాసు లో మీనంబాకం, ఢిల్లీ పాలం, బొంబాయి శాంతాక్రుజ్, బెంగుళూరులో జలహళ్ళి, హైదరాబాద్ బేగంపేట అని ఆయా విమానాశ్రయాలకు పేర్లు ఉండేవి. ఇవి జ్ఞాపకముంటే సోషల్ బిట్ పేపర్లో ఒక మార్కు ఖాయంగా వచ్చేది.
ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలను చూడాలని ఎప్పటినుండో కోరిక. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రాలలో ఎక్కువగా వేర్పాటు వాదాలుండేవి.
మొదటి వీటిని ‌సమిష్టిగా నీఫా - NEFA - North East Frontier Area or Agency అనేవారు. అవి ఇప్పటి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం. తరువాత వాటిని ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పరిచారు.
వాటిలో మిజోరాం ఒకటి. ఇది పర్వతమయ గిరిజన ప్రాంతం. ఐజ్వాల్ దీనికి రాజధాని. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ప్రకారం ఐజావ్ల్ అనవచ్చు.
కలకత్తా నుంచి ఐజ్వాల్ కు ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్, ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి. వాటి వాటి టికెట్ ఖరీదుల్లో తేడాలుంటాయి. మాకు జెట్ ఎయిర్వేస్ లో ఒక్కొక్క టికెట్ ఒక దిశలో రెండు వేల రూపాయలు పడింది.
కలకత్తా విమానాశ్రయం లో సేదదీరి, బోర్డింగ్ పాస్ తీసికొని, సెక్యూరిటీ చెక్ దగ్గరకు వచ్చాము. మా ఆవిడ కొన్ని కాస్మెటిక్స్, బోరోప్లస్ హేండ్ లగేజ్ లో మర్చిపోయింది. అది టెన్‌షన్ కలిగించింది. ఈ టెర్రరిస్టుల పుణ్యమా అని మనం జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. వాళ్ళ టెర్రరిస్టుల కార్యకలాపాలు అడ్డుకునేందుకు మనలాంటి సామాన్యులకు ఇబ్బందులు.
ఇప్పటికే నాలుగైదుసార్లు విమానప్రయాణాలు చేసినా ఈ విషయాలకు మేమింకా అలవాటు పడలేదు. మొబైల్ ఛార్ధరు, ఎనర్జీ పేక్ హేండ్ లగేజ్ లో తీసికెళ్ళచ్చో లేదో అనుమానం. కొందరు బెల్ట్ కూడా సెక్యూరిటీ చెక్ ముందు తీసెయ్యమంటారు. కొందరు పరవాలెదంటారు. పర్స్ తో సహా ముందు ట్రేలో పెట్టెయ్యాలి. నేను పర్స్ మర్చిపోయాను. ‌సెక్యూరిటీ వాడు క్లాస్ పీకాడు. ఈ టెన్షన్లు దాటుకొని ఏమీ జరగకుండా సెక్యూరిటీ నుంచి పూర్తి చేసుకున్నాము.
మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర 4
29-10-2017
కలకత్తా - ఐజ్వాల్ ప్రయాణం
మిజోరాం, నాగాలాండ్ చేరడానికి విమాన ప్రయాణం ఉత్తమం. అస్సాం ద్వారా బస్ లో రోజులు పడుతుంది. రైలు అస్సాం తో ఆగిపోతుంది. సరిహద్దుల్లో కీలకమైన ఈ రాష్ట్రాలలో రోడ్లు, రైళ్ళు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఇంతవరకు అభివృద్ధి చేయలేదో అప్పటి ప్రభుత్వాలకే తెలియాలి. సమగ్ర పాలన ఆ ప్రభుత్వాలకు తెలియదు. ఒక్క దళితుల వృద్ధి గురించి మాట్లాడితే - ఆ మాటలకు కార్యరూపం
ఈయనవసరం లేకుండా - ఓట్లు వచ్చి పడుతూంటే సమగ్ర పాలన గురించి అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోనవసరం లేకపోయింది. చైనా తన సరిహద్దుల్లో, ఆక్రమించిన ప్రాంతాల్లో ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించచుకుంటోంది? తన ఆక్రమణలను సుస్థిరం చేసుకుంటోంది. అందుకోసం సరిహద్దు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడానికి కూడా
సంశయించడంలేదు. టిబెట్, దక్షిణ చైనా సముద్రం, ఇలా ఎన్నో ఉదాహరణలు.
కాశ్మీర్లో, కాశ్మీర్లో రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు పెంపొందించి ఉంటే ఆ ప్రాంతం మిగతా దేశంతో సన్నిహితమవడానికి వీలు ఉండేది. ఇన్ని సంవత్సరాలనుంచీ వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టినప్పటికీ సమస్య, సమస్య లాగే ఉండిపోయింది. అదే రవాణా సదుపాయాల మీద ఖర్చు చేసి ఉంటే సమస్య కొద్దిగా నైనా పరిష్కరింప బడడానికి ఉపయోగకరంగా ఉండి ఉండేది.
కోల్కతా నుంచి ఐజ్వాల్ కు ప్రొద్దుట 10-15 కి‌ జెట్ ఎయిర్వేస్ వాళ్ళనే రెండు ఫ్లైట్స్ వున్నాయి. మొదటి మా ఫ్లైట్ కి గేట్ నెంబరు 16 అని‌ బోర్డింగ్ పాస్ లో రాశారు. 40 నిమిషాల ముందు గేట్ నెంబరు 23సి, అనీ 23 డి అనీ ఊపారు. ఇలా సందిగ్ధంలో ఎందుకు ఉంచుతారో అర్థం కాదు. సికింద్రాబాద్ స్టేషన్ లోనూ అంతే నర్సాపురం ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం ఒకటని చివరి నిమిషంలో ఇంకో ప్లాట్ ఫారం కి మార్చిన సందర్భాలు ఎన్నో. ఆ గందరగోళంలో నేను రెండు మూడుసార్లు ఇరుక్కున్నాను. ముసలి ముతక లగేజీలతో పడ్డ అవస్థ చెప్పనలవికాదు. అధికారులు మనతో ఇలా ఎందుకు ఆడుకుంటారో తెలియదు.
అలా ఊగి చివరికి మా ఫ్లైట్ ఎక్కాము. ఆ విమాన ప్రయాణం బహు సుందరంగా ఉంది. వాల్మీకి మహర్షి సుందరకాండలో హనుమంతుని లంకాయానంలో ఆకాశాన్ని సముద్రం తో ఉపమిస్తారు. ఆ ఉపమానాలు ఈ విమాన ప్రయాణంలో నాకు కనిపించాయి. దానితోపాటు కొన్ని చోట్ల ఆకాశం కింద, పైనా కనిపించి అందించింది. మేఘాలు దూదిపింజల్లా ఉండి అంతను అలుముకున్నాయి.
ఆ దృశ్యం నయన మనోహరంగా ఉంది. మొత్తం ప్రయాణం మేఘాలు మధ్యనుంచే జరిగింది. మిజోరాం వస్తోందనగా‌ పచ్చని ఎత్తైన పర్వతాలు కనిపించాయి. అప్పటినుండి ప్రకృతి సౌందర్యం కనువిందులు చేసింది.
మిజోరాం పర్వత శ్రేణులు, సానువుల్లో ఉన్న ప్రాంతం. గిరిజనుల వాసస్థానం. మిజో అంటే highlander అని అర్థంట. ఎత్తైన పర్వత శిఖరాలపై నివసించడానికి మొగ్గు చూపేవాడు అని వాళ్ళ భాషలో అర్థం.
ఐజ్వాల్ విమానాశ్రయాన్ని Lengpui విమానాశ్రయం అంటారు. విమానాశ్రయం బుల్లిది. తిరుపతి విమానాశ్రయం కన్న చిన్నది. ఒకేసారి రెండు విమానాలు హేండిల్ చేయబడతాయి అంతే. విమానాశ్రయ పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. విమానాశ్రయం చుట్టూ ఎత్తైన పచ్చటి కొండలు. వాతావరణం చల్లగా ఉంది. మేం విమానం దిగేసరికి 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. కలకత్తా విమానాశ్రయం లో కలిసిన మిజోరాం యూనివర్సిటీ ప్రొఫెసర్ బార్తేందు మాకెంతో సహకారం అందించారు. ఆయనకు కృతజ్ఞతలు. ఆయనే స్వయంగా మా సామాను తీసుకోవడంలో ఇతరత్రా ఎంతో సాయం చేశారు.
ఐజ్వాల్ విమానాశ్రయం లో మనం దిగగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫొటో కూడా ఉంచుకోవాలి. ఒక ఫార్మ్ పూర్తిచేయాలి. వాళ్ళు ఎంట్రీ‌ కమ్ ఐడెంటిటీ పాస్ ఇస్తారు. మిజోరాం లో ఉన్నంత సేపూ మన దగ్గర ఆ ఐడెంటిటీ కార్డు ఉండాలి.
ఐజ్వాల్ విమానాశ్రయం లో ప్రీపెయిడ్ టాక్సీ ఫెసిలిటీ ఉంది. బార్తేందుగారు మమ్మల్ని గైడ్ చేసి యూనివర్సిటీ గెస్ట్ హౌస్ కి టాక్సీ బుక్ చేసి పెట్టారు. అక్కడినుంచి యూనివర్సిటీ కి 40 కి.మీ దూరం. 1300 రూపాయలు ఫేర్.
అక్కడినుంచి యూనివర్సిటీ కి ప్రయాణం ప్రకృతి సౌందర్యం, దృశ్యాల మయం. చుట్టూ ఎత్తైన పర్వతాలతో పచ్చగా శోభిల్లే దృశ్యం. మధ్యలో ఒక నది వచ్చింది. లోతుగా కింద ప్రవహిస్తోంది. మేం టాక్సీ ఎక్కాం, వర్షం మొదలయ్యింది. వాతావరణం మరింత చల్లబడినా ఎంతో ఆహ్లాదంగా, ఆనంద కరంగా ఉంది. ఇళ్ళు చాలా తక్కువ కనిపించాయి. రోడ్ అంచున స్టీల్, కాంక్రీట్ పిల్లర్లపై లేపిన ఇళ్ళు. ఇంచుమించు అన్నింటికీ రేకు రూఫ్ లు. ఊళ్ళు చాలా తక్కువ. ఊళ్ళన్నీ కొండ చరియలపై ఉన్నవే.
ప్రయాణం గంటకుపైగా పట్టింది. అన్నీ ఎక్కడాలు, దిగడాలతో ప్రయాణం జరిగింది. వర్షం పడుతూనే ఉంది. గెస్ట్ హౌస్ చేరి స్నానపానాదులు ముగించుకొని, లంచ్ చేసి విశ్రమించాము.
వర్షం పడుతూ అలా చూస్తూ ఉండి పోయేలా చేసింది. యూనివర్సిటీ కేంపస్, గెస్ట్ హౌస్ బాగున్నాయి. ఇండియా-న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ ఆస్వాదించి నిద్రలోకి జారుకున్నాము.
మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర
30, 31-10-2017
మిజో యూనివర్సిటీ లో సమయ యాపనం.
మిజోరాం యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో కూర్చుని, ఎదురుగా కనువిందు చేస్తున్న ప్రకృతి దృశ్యాల సౌందర్యం చూస్తూ ఈ రచన చేస్తున్నాను. మేము వచ్చిన రోజు, మరునాడు (29, 30 తారీఖు లలో) వర్షం పడుతూనే ఉండి చల్లదనం ఇచ్చి ఆ వాతావరణంలోని అందచందాలు, హాయి అందించింది. 30 వ తేదీన కాన్ఫరెన్స్ మొదలు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగింది. వైస్ ఛాన్సలర్, మిగతా పెద్దలు ప్రారంభోపన్యాసాలం ఇచ్చారు. అంతా అంగరంగ వైభవంగా జరిగింది.
మధ్యాహ్నం 1-30 కు నా ఉపన్యాసం జరిగింది. ఉపన్యాసక వృత్తిలో ఉన్న మాకు ఉపన్యాసాలివ్వడం చేప పిల్ల సరస్సులో ఈదడం లాంటిది. నేను సంపన్న దేశాలు, ముఖ్యంగా అమెరికా వాతావరణ పరిరక్షణ ప్రయత్నాలను ఎలా నీరుగారుస్తున్నాయో వివరించడం. 4 శాతం జనాభా ఉన్న అమెరికా 25 శాతం కార్బన్ Co2 విడుదలలు చేస్తోంది. రియో, కోపెన్ హాగెన్, క్యోటో, పారిస్ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని, అన్ని తీర్మానాలను బలపరచి మళ్ళీ "తూనా బొడ్డు" అనుకొని ఆ తీర్మానాలను తాను పట్టించుకోవడం లేదని ప్రకటించింది. దేశాధినేతలు మారగానే, లేదా మరేదో కారణాల చేత దేశాల అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగడం అమెరికాకు చెల్లింది. అలాగే మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలూనూ ఇలా ఆటలు ఆడుతున్నాయి.
ఈ అభివృద్ధి చెందిన దేశాలకు కావలసినది వ్యాపారం. పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చిందీ ఈ పాశ్చాత్య దేశాలే. దాని వల్ల లాభపడి అభివృద్ధి చెందిన దేశాలుగా ముద్ర వేసుకున్నదీ అవే.. పరిశ్రమల ద్వారా వాతావరణాన్ని కలుషితం చేయడం మొదలు పెట్టిందీ అవే. ఇప్పుడు వాతావరణం కాలుష్యం ప్రపంచానికి అత్యంత ప్రమాదం అని గోల, గొడవ చేస్తున్నవీ అవే. ఆ పేరుతో తాము పెంపొందించిన గ్రీన్ టెక్నాలజీ ని మిగతా దేశాలకు అమ్మి లాభపడాలని చూస్తున్నవీ అవే. ఇదంతా గ్లోబల్ వార్మింగ్ నియంత్రణ కన్న, గ్లోబల్ వ్యాపార ధోరణే ఎక్కువ.
పారిశ్రామిక విప్లవం తో మొదలైన వాతావరణ కాలుష్యం, ఇంతై వటుడింతై త్రివిక్రమముడిగా మారే స్థితికి చేర్చి అందర్నీ భయపెడుతున్నవీ ఈ సంపన్న దేశాలే. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ధనవంతుల కొమ్ము కాసే దేశం. ముఖ్యంగా రిపబ్లికన్లు ఈ విషయంలో ఏమీ సిగ్గుపడరు. ఈ మధ్యే పొరిస్ ఒప్పందం నుంచి అమెరికాని ఏక పక్షంగా తెప్పించిన
దేశాధ్యక్షుడు ట్రంప్ పన్ను రేటుని విపరీతంగా తగ్గించాడు.
అమెరికాయే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు పారిశ్రామిక వేత్తల కొమ్మే కాస్తున్నాయి. వ్యవసాయం, నీటి, గాలి కాలుష్యాల గురించి పట్టించుకోవడం లేదు. వ్యవసాయాన్ని గాలికి వదిలేశారు. ఇంకా మా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో వరిచేలన్నిటిని రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. ఇవి వాతావరణానికి కలిగించే హాని ఉపద్రవమైనది. కానీ ఏ నాయకుడు, పాలకుడు, పౌరుడు ఈ విషయం అస్సలు పట్టించుకోవడం లేదు.
ఎందుకంటే వారే నాయకులు, వారే పాలకులు, వారే లాభపడే పౌరులు.
రాష్ట్రాల, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలులు కాగితపు పులులు, కోరలు తీసిన పాములు వలె నిరర్ధకంగా ఉన్నాయి. వాతావరణ కాలుష్య నియంత్రణపై అవి చేస్తున్నది సున్నా. ఏమీ లేదు.
ప్రభుత్వాలు కూడా జిడిపి పై పెట్టిన దృష్టి వాతావరణ కాలుష్య నియంత్రణకు పెట్టడం లేదు. గ్రీన్ టెక్నాలజీ ఉపయోగించడం పై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నాయి. ఆర్గానిక్ వ్యవసాయోత్పత్తులు ఎలా అమితమైన ధరలు కలిగిఉంటాయో, గ్రీన్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిన వస్తువులు అమితమైన ధరలను కలిగి ఉంటాయి. సామాన్యులకు అందుబాటులో ఉండవు.
మనకి అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు. పారిశ్రామిక, వ్యవసాయ కాలుష్యాలు, ఇప్పటి నాగరికత, కాలుష్య సంస్కృతి కావాలొ, వాతావరణ పరిరక్షణ కావాలొ మనం నిర్ణయించు కోవాలి. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. మనందరం ఈ లైఫ్ స్టైల్ మార్చుకోలేము. మనకు, మన తరువాతి తరాలకు వాతావరణ కాలుష్యం, కార్బన్ ఎమిషన్స్ కలిగించే, మన అస్తిత్వానికి భంగం కలిగించే తీవ్ర పరిణామాల నుంచి తప్పించుకోలేము.
మిజోరాం నవ యువతిలా స్నిగ్ధ మనోహరంగా చలాకీగా కల్మష రహితంగా ఎంతో నిర్మలంగా ఉంది. పూర్వకాలపు కన్నెపిల్లలా, మానసిక కాలుష్య, కశ్మల రహితంగా చక్కగా ఉంది. పారిశ్రామికీకరణ పేరుతో ఆ నైర్మల్యాన్ని పోగొట్టకోవద్దని అక్కడున్న మిజోరాం యూనివర్సిటీ యువ విద్యార్థినీ, విద్యార్థులను అర్థిస్తూ నా ప్రసంగాన్ని ముగించాను.
మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర
1-11-2017
ఐజ్వాల్, మిజోరమ్ సందర్శనం
మిజోరాం యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో కూర్చుని సూర్యోదయం చూస్తూ, ఆ ఎండని ఆనందిస్తూ, ఈ రచన చేస్తున్నాను. ఇప్పుడే గెస్ట్ హౌస్ నుంచి చుట్టూ కనిపించే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి వచ్చాను. ఇక్కడ ఈ రోజుల్లో పగలు ఉష్ణోగ్రత 22 నుంచి 25 డిగ్రీల దాకా ఉంటుంది. వర్షం కురుస్తోంటే 18 డిగ్రీలు ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 16, 18 మధ్య ఉంటాయి. ఆహ్లాదంగా ఉంటుంది. పొద్దున్న 4-30 కు తెల్లవారి పోతుంది. సాయంకాలం 4 - 4-15 కి సూర్యుడు అస్తమిస్తాడు. 5 గంటలకు పూర్తిగా చీకటి పడిపోతుంది.
ప్రొఫెసర్ జ్యోతి కుమార్ మాకు కుటుంబ మిత్రుడు. అతను మిజోరాం యూనివర్సిటీ లో కామర్స్ ప్రొఫెసర్. మా భీమవరమే. వాళ్ళ నాన్నగారు డి.ఎన్.ఆర్. కాలేజీ పి.జి. డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. 1984 నుంచీ మా స్నేహం. ఐజ్వాల్ సందర్శనార్థం అతను ఒక వెహికల్ సమకూర్చి మాతో వచ్చాడు. డ్రైవ్ చేసినది "జాన్", అతని కొలీగ్ భర్త. అతను సాంఘిక సంక్షేమ కార్యక్రమాల పై వర్క్ షాప్ లు నిర్వహిస్తూ ఉంటాడు. ఎంతో మంచి వాడు. ఎఫీషియంట్ డ్రైవర్. మిజోరాం రోడ్లన్నీ పర్వతాల అంచులపై ఉంటాయి. అంతా ఎక్కడం, దిగడం.
వంపులెక్కువ. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.
మొదటి మేము సోలమన్ టెంపుల్ కి వెళ్ళాము. ఇది ఐజ్వాల్ సిటీ సెంటర్ లో ఒక కొండపై ఉంది. ఐజ్వాల్ ఊరు, మిజోరాం లో అన్ని ప్రాంతాలు కొండ చరియలపై ఉన్నాయి. కొండలు, లోయలు. ఇళ్ళు అన్నీ కొండ కిందనుంచి పైకి దాకా ఉంటాయి. ఐజ్వాల్ రోడ్లు చాలా ఇరుకు. అటొక వెహికల్, ఇటొక వెహికల్ రాగలవు అంతే. అంచేత ఇక్కడ ట్రాఫిక్ డిసిప్లిన్ చాలా ఎక్కువ. వెహికల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వెళ్తాయి. ఓవర్ టేకింగ్ ప్రశ్న లేదు. హారన్లు వినిపించవు. పెద్దకార్లకు ఐజ్వాల్ లో చోటులేదు. అన్నీ చిన్నకార్లే. ఆ రోడ్లమీద చిన్న కారులు మాత్రమే పడతాయి.
మిజోరాం లో చర్చిలని టెంపుల్ అంటారు. మిజోరాం ఇదివరకు అస్సాంలో భాగం. గవర్నమెంట్ రాని లోతట్టు ప్రాంతాలకు మిషనరీలు వచ్చి విద్యా, వెద్య సౌకర్యాలు ప్రజలకు అందించారు. క్రిస్టియానిటి కి మిజోరాం ప్రసిద్ధి చెందినది, పేరు మోసినది. ఇక్కడ చర్చ్ లు చాలా డినామినేషన్లతో ఉన్నాయి. డినామినేషన్ అంటే, కేథలిక్, ప్రొటెస్టెంట్ లో లా.
Christian పదాన్ని Kristian అని రాస్తారు.
మిజోరాం లో నూటికి నూరు మంది క్రిష్టియన్లు. వీరు ట్రూ క్రిష్టియన్లు. మనుషులు సాధువులు, మంచివారు, స్వాతంత్ర్య ప్రియులు.
అమ్మాయిలు, అబ్బాయిలు అందంగా ఉన్నారు. ఎక్కువ మందిది పసిమి నిమ్మ చాయ. చాలా మర్యాదస్థులు. నాగరికత విధ్వంసకరంగా ప్రజల్ని పాడుచేయలేదు. నూటికి నూరు శాతం మాంసాహారులు. అమ్మాయిలు, అబ్బాయిల కన్నా చురుకు, బాధ్యత వహించే వారు. అమ్మాయిలు తమ కన్న చదువులో, ఉద్యోగం లో, (నిరుద్యోగి అయినా), ఆర్థిక స్థితిలో, వయసులో తక్కువైన అబ్బాయిలను పెళ్ళి చేసుకుంటారు. ప్రేమ కలిగితే తప్ప పెళ్ళి చేసుకోరు. తల్లిదండ్రులు, నచ్చకపోతే ఒకటి, రెండు సార్లు చెప్పి ఇంక ఊరుకుంటారు. మన వైపులా పరువు హత్యలుండవు. కాని విడాకు ల రేటూ ఎక్కువే.


మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర
1-11-2017
ఐజ్వాల్ సందర్శనం
31 వ తారీఖున కాన్ఫరెన్స్ అయిపోయాక, మా స్నేహితుడు ప్రొఫెసర్ జ్యోతి కుమార్ తో కలిసి ఐజ్వాల్, చుట్టుపక్కల చూడడానికి బయలుదేరాము.
ఐజ్వాల్ నగరం మిజోరమ్ యూనివర్సిటీకి 15 కి.మీ. దూరంలో ఉంది. మొదటగా మేము సోలమన్ టెంపుల్, చర్చి చూడడానికి వెళ్ళాము. ఇది ఒక పర్వతంపై ఉంది. చర్చినంతా పాలరాతితో కట్టారు. చుట్టూ ప్రదేశాన్ని ప్లాస్టిక్ పూలతో అలంకరించారు. అవి ఎంతో ఆకర్షణీయంగా ఉండి కనువిందు చేశాయి. చర్చ్ లోపల ఎంతో విశాలంగా, అందంగా క్రొత్తదనం ఉట్టిపడుతూ, కళాత్మకమైన బెంచీలతో అలరింది.
ఈ సోలమన్ టెంపుల్ Presbyterian చర్చి డినామినేషన్ కి చెందినది. మిజోరం లో ఎక్కువ మంది ఉండే డినామినేషన్. ఎక్కువ ప్రాచుర్యం, ప్రాధాన్యత ఉన్నది. చర్చ్ చాలా ప్రశాంతంగా ఉంది. మేము తప్ప ఎవరూ లేరు. అక్కడ ఉన్న స్వీపర్స్ తో ఒక ఫొటో దిగాము. చాలా బాగా వచ్చింది.
మేము తర్వాత ఐజ్వాల్ లోనే మరొక కొండపై ఉన్న Synod Conference Centre, Mission Vengeance లో జరుగుతున్న Three Day National Seminar on Writing in Mizo Manuscripts కి హాజరయ్యాము. దానిని మిజోరం యూనివర్సిటీ, మిజో భాషా శాస్త్ర విభాగం నిర్వహిస్తోంది. దానిని మిజోరం ముఖ్యమంత్రి Pu Lal Thanhawla ప్రారంభిస్తున్నారు. మిజో భాషలో Lalpa అంటే భగవంతుడు అని అర్థం.
అక్కడ ఆడువారి, మగవారి పేర్లలో Lal ఉండి తీరుతుంది. Pu మగవారికి గౌరవవాచకం. Pi ఆడువారికిి గౌరవవాచకం. మగవారి పేర్లు a తోను, ఆడువారి పేర్లు i తోను ముగుస్తాయి. మా స్నేహితుడు ప్రొఫెసర్ జ్యోతి కుమార్ ని జ్యోతి Jyothi​ అని పిలుస్తారు. అలా అతని పేరు మిజోలో ఫెమినైన్ పేరు అయ్యింది. . వాళ్ళ డిపార్ట్మెంట్ లోనే Rama Ra మాmaswamy అనే పేరు కల లేడీ కొలీగ్ ఉన్నారు. అలా ఆవిడ పేరు మిజోలో మగవారి పేరయ్యింది. ఇలాగే ఉంటాయి సంస్కృతుల సమ్మేళనపు వింతలు.
ప్రొఫెసర్ జ్యోతి కుమార్ కొలీగ్, మిజోభాషా విభాగం అధ్యక్షుడు మేము వెళ్ళే సరికి ప్రారంభోపన్యాసం అప్పుడే మొదలుపెడ్తున్నారు. ముందు ఆంగ్లంలోను, ఆ తర్వాత మిజో భాషలోను మాట్లాడారు. నేను పనిచేసిన దక్షిణ భారత దేశప్రాంతంలో జాతీయ కార్యక్రమాల్లో కూడా వాళ్ళ మాతృభాష లోనే మాట్లాడతారు. మిజోలు ఎంతో నాగరీకంగా వ్యవహరించారు. మనకి భాష రానప్పుడు మాట్లాడుతూంటే ఆ మాటలు రణగొణ ధ్వనులు గా వినిపిస్తాయి. భాష నేర్చుకుంటున్నప్పుడు లోపల ఒక ప్రక్రియ జరుగుతుంది.మనకు రాని భా‌ష విషయంలో ఈ ప్రక్రియ జరిగి ఉండదు కనుక ధ్వనులుగా మాటలు​ ఉండి పోతాయి. శబ్దములుజ్ఞానం ఉపయోగించుకొని అర్థరహితములై అవగాహన కలుగదు. పతంజలి, భర్తృహరి భాషావగాహన, భాషా తత్త్వం ల మీద బ్రహ్మ జ్ఞానం ఉపయోగించుకొని శబ్దబ్రహ్మ సిద్ధాంతం వెలయించారు.