Sunday, September 10, 2017

Abdication in the Self - Divine Wisdom;ఉచితం ;సంఘానికి మేధావురల అపకారం; కాలావగాహన ; పురస్కారము - రచనా పటిమ; మతము మంటిగడ్డాయె;

Abdication in the Self - The Divine Wisdom

Indian spirituality as originated in and with and evolved through the Upanishads and later supplemented and complemented through the Buddhism, the Jainism, the Shaddarsanas, and later spiritual masters is the Divine Wisdom. It is essentially the Knowledge of the Self, known popularly as Brahmajnaana or Aatmajnaana.

The Brahmajnaana reveals the true nature of the original state of mind and origin, structure, function and control of mind.

This path through knowledge is known as experiencing what the true awareness of "I".

The Upanishads say the real "I" is neither experience, thought/feeling, or utterance but pure consciousness sans all these mental functions in the awareness. The path of knowing and experiencing the real nature of "I" is the most beautiful and rewarding spiritual path towards permanently being the Being sans the adjective "human".

As is well-known ego represents the "human" aspect of awareness. Ego is the projection of the mind about the individual-personal traits, character,social status etc., and super-imposition on the Self in the form of experiences/senses -meanings-, thoughts/feelings, utterances. . If this reality is realized and the true spirit of the "I" in the form of Self is the consciousness as Unoccupied Awareness or Content-free Contentment, one is pure consciousness sans any mental functions in the awareness. Then the mind rests in the recesses of its origin, form, sustain-er, terminator and extinguisher.

This ability to be Being with mind absorbed in Itself - the Being , the abdication of the individual in the Self happens / takes place.

Self is nothing but Being-Pure Consciousness-Bliss - the Mind-Time - Transcendent Awareness. Silence is being experiences in the form of silent mind and transcends mind and its functions - when mind is working also - by providing the awareness of the mental functions in the form of experiences/meanings. thoughts/feelings/sentences, utterances/actions/reactions - both physical and psychological- and the State of their cessation.

This is the Diving wisdom, the essence of Brahmajnaana.
**********

Do governments have courage to identify and take action on the remaining cult leaders like ram Rahim and care for citizens' welfare and well-being?
*********
Let us do our work in a concentrated way. No other Guru, or Swami or Ananda is necessary to guide us on meditation. 

Meditation is concentrated doing.
**********
8-9-2017

పరిమళించే కాంతి
మిరుమిట్లు గొలిపే గొంతు
కవి ఊహకు లేదు అడ్డు ఆపు
కవితకేదీ కాదనర్హం ఊహకేదీ కాదు
అసమంజసం; గగన కుసుమములు
కవిసమయములు; మిగతావీ అలాగే

********
ఉచితం

బడుగులు ఎక్కువ ఓట్లు ఇచ్చు
కులముల వారు ప్రభుత్వ స్థలముల
నాక్రమించి వాసములుందురు; చిన్న చితక
దుకాణములు నడిపెదరు; రాజకీయులు

వారి అనుయాయులు బడా నేరగాళ్లు 
అన్ని రకాల స్థలములను ఆక్రమించెదరు; రియల్ ఎస్టేట్ వ్యాపారములు చేసికొనుచు కోట్లు గడించెదరు
ఎవ్వరు కిమ్మనరు; ప్రభుత్వములు గుడ్డి యగును;

మిగిలిన పౌరులు స్థలముల కొని ఇళ్ళు కట్టు కొనెదరు; ఈ కేటగిరీ వారికి స్థలముల నాక్రమించు లైసెన్స్ లేదు; అది ఓటు బ్యాంకులకు రాజకీయులకు 
వారి వారికి కరడు కట్టిన నేరగాళ్ళకు మాత్రం ఉచితం

**********

సంఘానికి మేధావుల అపకారం

"బ్రాహ్మణానాం అనేకత్వం" అనే నానుడి ప్రసిద్ధమే. అయితే ఎక్కువ మంది అనుకుంటున్నట్టు "బ్రాహ్మణ కులానికి చెందినవారిలో ఏకత్వం ఉండదు అని దీని అర్థం కాదు.

ఇక్కడ బ్రాహ్మణులు అనే మాట బ్రాహ్మణ కులానికి సంబంధించినది కాదు. బ్రాహ్మణులు అంటే పండితులు, మేధావులు, తత్త్వవేత్తలు, కవులు అనే అర్థంలో తీసి కోవాలి.

పండితులము, మేధావులము, తత్త్వ వేత్తలము, కవులము అనుకునేవారిలో ఏ విషయం మీదా ఏకాభిప్రాయం ఉండదు. వీరందరూ తలొకరు తలో అభిప్రాయం చెబుతారు. తమ అభిప్రాయం మీద నిలబడి, మిగతావారి నందరినీ, వారి అభిప్రాయాలను తీసిపారేస్తారు. ఏ ఇద్దరు మేధావులు, తత్త్వ వేత్తలు తమ అభిప్రాయాలను అనుసరించి వాదులాడంకుంటారు తప్ప ఇద్దరూ ఒకే అంగీకారానికి రారు. మిగతావాళ్ళని రానివ్వరు. తర్కం, మేధ, బుద్ధీ, సమయం, అన్నీ వాదులాట లోనే వ్యర్థం చేసికుంటారు. 

తమ వాదమే గొప్పదని నిరంతరం వాదములలో మునిగి తేలుతారు. గమ్యానికి చేరరు, చేరనీయరు, చేరలేరు. సమన్వయం వారికి తెలియని విద్య.

బ్రహ్మ సూత్రములలో 

తత్ తు సమన్వయాత్.  

అని సూత్రీకరించారు. 

ఈ సూత్రము ఆత్మ తత్త్వం విషయంలో చెప్పినా, అన్ని విషయాలకు, జ్ఞానాలకు, తత్త్వాలు, వాదాలకు సమానంగా చెందుతుంది. 

పూర్వము ఉపనిదనుయాయులు, బౌద్ధులు, జైనులు, న్యాయ,వైశేషికులు; సాంఖ్య, యోగ దర్శనములు వారు; పూర్వ, ఉత్తర మీమాంసీకులు, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత వేదాంతులు, చార్వాకులు;

ఆపై 

వీర వైష్ణవులు, వీర శైవులు, ఇతర సామాజిక న్యాయానుయాయులు, క్రైస్తవము, ఇస్లాం, శిఖ్ మతం, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, నక్సలైట్లు, మావోయిస్టులు, టెర్రరిస్టులు, ఇతర ప్రసిద్ధ వాదముల వారు ఒకరి మాట ఒకరు వినరు. ఒకరి మాట ఒకరికి గిట్టదు. ఒకరి మాట ఒకరు ఒప్పుకోరు.

సమాజంలో వీరందరూ సమాంతరంగా ఉంటూ, వీరంగం చేస్తూ తమ తమ వాదములతో అరిచి గీ పెడుతూ, కాట్లాడుకుంటూ, కొట్లాడుకుంటూ సంఘంలోని వారికి ఆనందం, శాంతి, సుఖాలు లేకుండా చేస్తారు. వివిధ వాదాల మధ్య సమన్వయం కోసం ఎన్నడూ కృషి చేయరు. 

తమ తమ వాదాలను, సిద్ధాంతాలను, తత్త్వాలను సంఘం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తూంటారు. సొమాన్యులు అటూ ఇటూ చేరి వీధుల్లో, పత్రికల్లో, టి.వి. ఛానళ్ళలో, అంతర్జాల వేదికలపై, ఇంకా ‌ఇటువంటి మాధ్యమాల్లో కొట్టుకుంటూంటారు. చంపుకుంటూంటారు కూడా. 

సత్యదర్శనము, తత్త్వదర్శనము పక్కకు పెట్టి తర్కం, మేధ సాయాలతో కిందా, మీదా పడుతూంటారు. అనవసరంగా కొట్లాడుకుంటారు. కాని ఏ వాదము మిగతా వాదాలను లేకుండా చేయలేదు అనే సత్యం వీరికి గోచరించదు. అనుయాయులకు గోచరించ నీయరు. 

మానవుడు నాగరికత, సంస్కృతి నేర్చిన నాటి నుంచీ
ఈ వాదులాటలు, దెబ్బలాటలు నిరంతరంగా సాగుతూనే ఉన్నాయి. సాగుతున్నాయి. సాగుతూనే ఉంటాయి. మేధావులు, తత్త్వవేత్తలు, పండితులు, కవులలోని ఈ అనైక్యత సంఘానికి తలనొప్పి కలిగిస్తూనే ఉంది. వీళ్ళకి సాగతీత తప్ప మరొక మంచి, పనికొచ్చే విషయం తెలియదు. 

ఈ అనైక్యత శ్రంతి మించి, మితి మీరి అమాయకులు ఊచకోతకి వేదికలు ఏర్పడతాయి. 

సంఘం ఈ మేధావుల అనైక్యత వల్ల కలిగే దుష్పరిణామాలను మౌనంగా భరిస్తూనే ఉంది. భరిస్తోంది. భరిస్తూ ఉంటుంది. సంఘానికి మేలు చేయడానికి ఉద్యమించే మేధావులు మంచి చేయడం మర్చిపోయి వాదనలలో, దెబ్బలాటలలో గడుపుతూ తమ జీవితాలను నిరర్ధకం చేసుకుంటారు. సంఘాన్ని సుఖంగా, మనశ్శాంతిగా ఉండనివ్వరు.

సామాన్యులకన్న మేధావులే సంఘానికి ఎక్కువ అపకారం చేస్తారు. చేస్తున్నారు. చేస్తూనే ఉంటారు.

7-9-2017

కాలావగాహన

కాలము అనునది ప్రత్యేకముగా లేదు. ఉన్నది పదార్ధము, శక్తి, ఆకాశము, అవకాశము, చోటు, చర్యలు, ప్రతి చర్యలు. శక్తి సాయంతో పదార్ధం స్థితి మారుతుంది. పదార్ధము ద్వారా శక్తి రూపము మారుతుంది. శక్తి, పదార్ధముల మార్పులే, పరిణామములే చర్యలు, ప్రతి చర్యలు.

ఆకాశము, అవకాశము, చోటు Space, శూన్యము - (ఇవన్నీ సమానార్ధకాలే) - ఉండడం వల్ల పదార్థాలు వహించబడుతున్నాయి. శక్తి పరిణమిస్తోంది. 

చర్యలు జరగడం వల్ల కాలము సృష్టించబడుతోంది. కాలమునకు స్వయముగా ఉనికి లేదు. శక్తి, పదార్ధ పరిణామములు లేక కాలము, కాలగమనము లేవు. 

సూర్యుడు  (సూర్యుని గతి శాస్త్రీయంగా కాదన్నా, మనకి సూర్యోదయ, సూర్యాస్తమయములు కలగడం వల్ల ఆ భ్రమ కలుగుతోంది కనుక సూర్యగతి చెప్పబడింది), చంద్రుడు, గ్రహముల గతి వలన కాలం సృష్టి జరుగుతోంది. ఈ గమనములు, చర్యలు, ప్రతి చర్యలు లేక కాలము లేదు.

కాల స్పృహ మనుషులకు మాత్రమే ప్రత్యేకం. కాలగమన దృష్టి, కాల గణన మానవుల నాగరికత, సంస్కృతుల వల్ల సృష్టించబడి ప్రాచుర్యం లోకి వచ్చింది. 

గమనము, పరిణామము, అగుట కాల స్వరూపమునకు ఆలంబనలు. కాలం గడుస్తోంది కాబట్టి చంద్రుడు, ఇతర గ్రహములు చలించుట లేదు. అవి చలిస్తున్నాయి కనుక కాలం గమన స్పృహ, భ్రమ, భ్రాంతి కలుగుతున్నాయి. కాలాతీతము అంటే పరిణామము కాని, గమనము కాని, అగుట కాని లేనిది

మొక్క చెట్టు అవుతుంది. బాలిక స్త్రీ అవుతుంది. యువతులు ముసలివారు అవుతారు. ఉష్ణ శక్తి సహాయంతో నీరు ఆవిరి అవుతుంది. కాలం గడుస్తోంది కాబట్టి మనకు వివిధ వయో అవస్థలు కలగటం లేదు. జీవ సహజంగా మనం వృద్ధులం అవుతాము తప్ప కాల గమనం వల్ల కాదు. అసలు కాలమే లేదు. ఇంక గమనమెక్కడ?

స్వయం ప్రతిపత్తి లేని ఊహా భాగము కాలము. పూర్తి మానసికము. మన జ్ఞాపకములు, గుర్తు గతం. మన ఊహలు, అపోహలు, భయాలు, ఆందోళనలు, భవిష్యత్తు.

మన గమనిక వర్తమానము.

6-9-2017

పురస్కారము - రచనా పటిమ

పుస్తకాలకు పురస్కారాలు రావడం న్యాయనిర్ణేతల అభిరుచి పై ఆధారపడి ఉంటుంది. రచన మీద తక్కువ శాతం జడ్జీల వ్యక్తిత్వం మీద ఎక్కువ శాతం అధారపడి ఉంటుంది.

ఏ పురస్కారాలైనా ఇంతే.‌ పురస్కార ప్రదానానికి ఎన్నికైన దాన్ని బట్టి మనం కళాసృష్టి పసపై అభిప్రాయం ఏర్పరిచుకోనవసరం లేదు. పురస్కారము రావడం సృష్టి మంచి చెడ్డలు, అల్పత్వము, ఘనము, రచనలో పటిమ కన్న న్యాయమూర్తుల ఇష్టాయిష్టాలను మాత్రమే  తెలియజేస్తుంది. 

అందుకని, పురస్కారాలు వస్తే మంచిదే. రానంత మాత్రాన ఆ రచనలు, సృష్టులు తక్కువ రకంవి కావు.

కాని సమాజం పురస్కార గ్రహీతలను ఎక్కువగా ఆదరిస్తుంది. పాఠకులు, ప్రేక్షకులు, వీక్షకులు తమ రస హృదయంతో, ఆస్వాదనా గరిమతో కవులను, రచయితలను, ఇతర లలిత కళా సృష్టి కర్తలను ఆదరిస్తారు. ఇదే సృష్టి కర్తకు పదికోట్ల రెట్లు సంతృప్తిని ఇస్తుంది. ఆదీ పురస్కార ప్రదానమే.
******

మతము మంటిగడ్డాయె

మతము మంటిగడ్డాయె; ఉత్సవాలు
మూర్ఖుల చేతిలోని రాయాయె
కోతికి కొబ్బరి దొరికిన చందమాయె
భారతదేశమున మతము ప్రజాస్వామ్య ఘోరమాయె

పూజల కన్న జనఘోషలెక్కువాయె
ప్రార్థనల కన్న లౌడ్ స్పీకర్ గోలలెక్కువాయె
మనసర్పించుట కన్న ఆడంబరములెక్కువాయె
ఎవరు నేడు నిర్వచించుచున్నారు మతమును?
ఎవరు నిర్వహించుచున్నారు గందరగోళపు వేడుకలను; ఉత్సవములు కోల్పోయె హుందా

ప్రజల వద్ద బలవంతముగా విరాళములు గుంజుట
రివాజాయె; ఉత్సవముపేరిట తాగి తైతెక్కలాడుట సంబరమాయె; ఆచారవ్యవహారముల అజ్ఞానుల
సందడి వేషమాయె; భగవంతుని అర్చించుట సున్నయ్యె; శుష్క వచనములు శూన్య హస్తముల రాజకీయ నాయకులు అనుయాయులు కబ్జా చేసిరి 
గుడులను ఉత్సవములను జుగుప్సాకరముగా;

ప్రార్థనాలయములు ప్రాంతీయ ఛోటా నాయకులకు
ఆదాయ ధామములయ్యె; గొఱ్ఱె దాటు జనులు
భక్తులై ఇహ పరములకు చెడుచు, భక్తిని ఆధ్యాత్మికతను కొండెక్కించుచున్నారు కలిసి
నిర్వాహకులతో; అంతయు అగమ్యగోచరమైనది
*******

No comments:

Post a Comment