Wednesday, September 27, 2017

మన బాధ్యతలు, విధులు; పారిజాతపు పువ్వులు ఏరడం; మనం - లబ్ధ ప్రతిష్టులు; Public speaking;

మన బాధ్యతలు, విధులు

రిలీజైన సినిమాలు చూసి వాటిని విజయవంతం చేయడానికే మనం జీవిస్తున్నాము.

ఎన్నికల్లో పోటీ చేసే నాయకులను ఎన్నుకొని వారికి పదవులు కట్టబెట్టడానికే బతుకుతున్నాం మనం.
షాపుల్లో, ఆన్ లైన్లో అమ్మే రకరకాల వస్తువులు కొనడానికే మన బ్రతుకులు.

అవినీతి పరులైన ఉద్యోగులకు లంచాలిచ్చి మన పని చేయించుకోవడానికే మనం ఉన్నాం.
ప్రైవేటు స్కూళ్ళలో, కాలేజీల్లో, విశ్వ విద్యాలయాలలో, ఇతర విద్యాలయాలలో మన పిల్లలను చేర్చి భారీగా ఆ యాజమాన్యాలకు ఫీజులు చెల్లించేందుకే మన జీవితాలు.

దొంగలు, దుర్మార్గులు, దోపిడీ దారులు, ఉగ్ర వాదులు, మూర్ఖ, హంతక మతానుయాయులు వారి దౌర్జన్యం, దౌష్ట్యాలు, భరించడానికే మన జీవితాలు.

మేధావులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు, ఇతర కవులు, సాహితీ కారులు, లలితకళాస్రష్టలు వారి, వారి పైత్యాలకనుగుణంగా నోటికొచ్చినట్టు వాగినా, మన మనసులు కష్టపెట్టే సృష్టులు చేసినా పల్లెత్తు మాట అనకుండా మౌనంగా రోదించడానికే మనం పుట్టినది.

అందరూ వారి ఉనికికి, వృద్ధి, అభివృద్ధులకు, పేరు, ప్రతిష్టలుకు మన మీదే ఆధారపడి ఉన్నారు.
ఎలా నిర్వహిస్తామో మన బాధ్యతలు విధులు!!!!!?

*************

పారిజాతపు పువ్వులు ఏరడం

ప్రకృతి మనకు ఎన్నో చెట్లని, ఫల, పుష్పాలను ఇచ్చింది. అవన్నీ మనకు ఉపయోగపడేవే. ఆనందం కలిగించేవే.

రిటైర్ అయ్యాక నేను మా దొడ్లో మిగతా కొన్ని మొక్కలతో పాటు పారిజాతపు మొక్క కూడా వేశాను. అది ఏడాదిన్నరకే పూయడం మొదలు పెట్టింది. ఇప్పుడు పెద్ద మొక్క అయింది. ఎన్నో పూవులు పూస్తోంది.

ఫలం, పత్రం, పుష్పం, తోయములతో దేనితోనైనా తనను మనస్ఫూర్తిగా పూజిస్తే చాలునని తనను అర్చించడానికి ఆడంబరాలు అక్కర్లేదు అనీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సెలవిచ్చాడు. మనసు ముఖ్యం కాని, దేనితో పూజించారని తాను అస్సలు చూడనని భగవానుని సందేశం. భగవానుడే స్వయముగా చెప్పినా మనం ఖాతరు చేయం. భగవంతుని అర్చించడంలో మన ఆస్తి, అంతస్థు, డబ్బు, దస్కం ప్రతిబింబించి తీరాలని మన దర్పం. చిత్తం చెప్పుల మీద ధోరణిలో పూజలు, పునస్కారములు నిర్వర్తిస్తాము. మన గొప్ప, సంఘంలో మన స్థాయి మన భగవదారాధనలో‌ కనిపించి తీరాలని మన తత్త్వము.

ఇంతకీ పూవులతో అర్చిస్తే సరిపోయే స్వామిని అంగ రంగ వైభవంగా అర్చిస్తాము. మన పోజంతా అక్కడే కొడతాము. మన అమాయకత్వానికి, ఈ అజ్ఞానానికి, భగవంతుడు నవ్వుకోడా? నిజానికి మనం భగవంతుని ఉనికిని నమ్మడం లేదు. ఆయన లేడన్నట్టు అన్ని అక్రమాలు చేస్తూ మళ్ళీ ఆయనకే మన అహం భావంతో అతిగా, అట్టహాసంగా పూజలు, అర్చనలు చేసి ఆయన్ని "కొనాలనుకుంటాం".

ఇంతకీ పారిజాత సుమములకు కృష్ణ పరమాత్మకు ఎంతో అనుబంధం ఉంది. సత్యభామా దేవి‌ అలక మాన్పడానికి అమరావతినే ముట్టడించారడు పురుషోత్తముడు. పారిజాత వృక్షాన్ని సత్యభామా దేవి ఉద్యానవనంలో నాటాడు. తన ప్రియ సఖి అలక మాన్పించి ఆమెకు ఆనందం కలిగించి మరింత ప్రీతి పాత్రుడైన పతిగా నిలిచాడు.

ఆంజనేయమతిపాటలాననం
కాంచనాద్రి కమనీయ విగ్రహం
పారిజాత తరుమూల వాసినమ్
భావయామి పవమాన నందనమ్

పారిజాతానికి హనుమంతులవారికీ అనుబంధం. ప్రొద్దున్నే లేచేసరికి పారిజాత వృక్షం క్రింద పారిజాతం పూవులు నింగి నుంచి నేలకు రాలిన తారకలలా పరుచుకుని ఉంటాయి. తెల్లని పూవులు ఎర్రని తొడిమ. ఎంతో అందంగా ఉంటాయి. పారిజాత పూవులని ఏరడం మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఏరితేనే కాని పారిజాత పూవులని సేకరించ లేము.

ఆ పూలను ఏరడం వలన నాకు సరిపడ్డ వ్యాయామం లభిస్తోంది. పారిజాతం పూవులని ఒంగుని, కూర్చుని, మోకాళ్ళ మీద కూర్చుని ఏరాలి. ఏరేసరికి ఒక విధమైన సంతృప్తి. వ్యాయామం. పారిజాత సుమదళాలతో కృష్ణ పరమాత్మని అర్చిస్తే పుణ్యము, పురుషార్ధము.
*******
It is only an ideal relationship to dream that no secrets and lies exist in the relationship! In reality secrets and lies may be there even in most intimate relationship.
*********
మనం - లబ్ధ ప్రతిష్టులు

మనందరం ఎంత గొప్ప వాళ్ళమైనా‌, రాజకీయ నాయకులను, సినీతారలను, ఎవరైనా లబ్ధ ప్రతిష్టులని కలిసినప్పుడు సిగ్గుతో మొగ్గై పోతాము. ఉబ్బి తబ్బిబ్బై పోతాము. మన వ్యక్తిత్వాన్ని ఆ క్షణాల్లో మరచిపోతాము.

చాలా వినయంతో, ముడుచుకుపోయి, ఆనందంతో తలక్రిందులౌతూ పరవశిస్తాం. భగవంతుడు ప్రత్యక్షమైనా అంత అభిమానం చూపించమేమో అన్నట్టు ప్రవర్తిస్తాము. మన అయిన వాళ్ళకీ, కాని వాళ్ళకీ వారితో దిగిన ఫోటోలను చూపిస్తూ, పంచుకుంటూ ధన్యులమైనట్టు ఉంటాం. ఇంకా వీలైతే
పోజు కొడతాం.

మన వ్యక్తిత్వాన్ని ఆ ఘటనతో అనుసంధానించుకొని మురిసిపోతాం. మన వంటి మీద బట్ట ఉందో లేదో కూడా చూసుకోం. దీనికంతకీ కారణం ఆ లబ్ధ ప్రతిష్టులపై మనకు కల అభిమానం. వారిని కలుసుకోవడం వల్ల మనలో ఏర్పడిన దర్పం.

అభిమానాలు మనకి ఉండొచ్చు కానీ మన ఆభిజాత్యాన్ని త్యాగం చేయనవసరం లేదు.

*********
Public speaking

Public speaking is an art. In any field the speakers with oratory and speaking skills are necessary to convey the message. Many of the skilled speakers club humor with knowledge and also cite many stanzas from many ancient texts extempore and are admired and appreciated for their memory, spontaneous recollection, scholarship, voracious reading and many other intellectual and emotion-creating skills.

Many public speakers in professional, literary, scientific, spiritual etc., matters are necessary for the spread of useful knowledge and wisdom.

Of course skilled public speakers also can charm and influence people in negative ways too. The individuals going to their speeches must exercise caution and commonsense.


Monday, September 25, 2017

మా అమృత సరోవర యాత్ర


మా అమృత సరోవర యాత్ర 1

చాలా మంది మానస సరోవర యాత్ర చేస్తారు. అలా వెళ్ళిన వాళ్ళు కొందరు దానిని​ గురించి రాస్తారు. మేము మానససరోవరం వెళ్ళలేదు. అమృతసరోవరమే వెళ్ళాము. అందుకే మాది అమృత సరోవర యాత్ర అయింది. చాలా మంది ఈ యాత్రా పర్యటనగా చేసి ఉంటారు.

WAVES అని ఢిల్లీలో ఒక సంస్థ ఉంది. వీరి శాఖ అమెరికాలోనూ ఉంది. వీరు ప్రాచీన భారతీయ విజ్ఞాన భాండాగారంని శోధించే వారి పరిశోధనా పత్రాలు, విశేషాలు పంచుకోవడానికి సమావేశాలు ఏడాదికి కాని, రెండేళ్లకోసారి కాని నిర్వహిస్తారు. నేను ఇప్పటికి వారి మూడు సమావేశాల్లో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించాను. 15-12-2016 నుంచి 18-12-2016 వరకు ఢిల్లీలోని భారతీయ విద్యాభవన్ వారి కేంద్రంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. 


యోగదర్శనము, పతంజలి శబ్దబ్రహ్మ సిద్ధాంతం, స్ఫోట వాదము, సంస్కృత భాషా, వ్యాకరణ నిర్మాణాంశములు-
బ్రహ్మ జ్ఞాన మూలముల పై వారి ఆయా సమావేశాల్లో ఇంతవరకు నా పరిశోధనా పత్రాలు సమర్పించాను.
ఇప్పుడు జ్ఞాన బోధ మీమాంసా పరంగా ఉపనిషత్తులు, అద్వైత, ద్వైత సిద్ధాంతములు, ఆస్తిక, నాస్తిక దర్శనములలో కల మనకు జ్ఞానము, భాషాధ్యయన, ఉచ్చారణలు జరిగే, కలిగే విధములపై నా పరిశోధనా పత్రం తయారు చేశాను.

నా పరిశోధనా పత్రం సమర్పించడానికి ఎన్నికైనందువల్ల ఆ సమావేశాల్లో పాల్గొనేందుకు భీమవరం నుంచి నేను, మా ఆవిడ డిసెంబర్ 13 న కేరళ ఎక్స్ప్రెస్లో - విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరాము. ఢిల్లీలో ఆప్తులైన బంధువులు ఉన్నారు. ఇలా వస్తున్నామంటే వాళ్ళింట్లోనే దిగమన్నారు. వాళ్ళింటికే వెళ్ళాము.
*********
మా అమృత సరోవర యాత్ర 2
17-12-2016
ఆగ్రా కోట సందర్శనం
16-12-2016 తారీఖున నా పేపర్ ప్రెజెంటేషన్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంక కాన్ఫరెన్స్ లో మా పని అయిపోయింది.
మరునాడు బయలుదేరి తాజ్మహల్ చూడడానికి ఆగ్రా బయలు దేరాము; ఒక టూరిస్ట్ బస్ లో.
పొద్దున్న బయలు దేరి 10, 11 గంటల మధ్యలో ఆగ్రా చేరాము. ముందుగా ఆగ్రా ఫోర్ట్ కి వెళ్ళాము.
దానిని అక్బర్ కట్టాడు. జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు ఇక్కడ నుంచే మొగలాయి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. చాలా ప్రణాలికతో, అందంగా, ఆనాటి రాచరికానికి తగ్గి హుందా, జాగ్రత్తలు కలిపి నిర్మించిన కోట. ఆగ్రా కోట లో జహంగీర్ పెళ్ళాం నూర్జహాన్ పూలతోటలు పెంచితే, షాజహాన్ భార్య ద్రాక్ష తోటలను పెంచిందిట. షాజహాన్ మధుప్రియుడుట. అందుకని. మొగలాయి చక్రవర్తుల రాజసభ వంటిది, బేగం ల జనానాలు చూశాము.
ఎక్కడైతే శివాజీ ఔరంగజేబుని కలిశాడో ఆ ప్రదేశం చూశాఎక్కడ ఔరంగజేబు షాజహాన్ ని బంధించి ఉంచాడో ఆ బందిఖానా, దానినుంచి తాజ్ మహల్ కనిపిస్తుంది. తాజ్ చూడడానికి షాజహాన్ కోసం చేసిన ఒక కన్నం కూడా ఉంది.
రాజులు, రణాలు,‌ కుట్రలు, కుతంత్రాలు చరిత్ర లో భాగాలు. ఔరంగజేబు సోదరులను చంపి, తండ్రిని ఖైదు చేసి సింహాసనం ఎక్కాడు. అక్బరు, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు వలె ఆలయాలును ధ్వంసం చేశారు. కానీ ఔరంగజేబు కు ఉన్నంత చెడ్డపేరు వారికి రాలేదు. జహంగీర్ సేనానులు కోణార్క్ దేవాలయాన్ని ధ్వంసం చేశారు.
తాజ్ మహల్
తాజ్ మహల్ కి ఉన్నంత క్రేజ్ భారతీయులకు మరెందులోనూ లేదు. ఎందుకో ప్రణయానికి తాజ్ మహల్ ను ప్రతీకగా భావిస్తారు. అంతర్జాల సాంఘిక సాలెగూళ్ళు వచ్చాక ఎన్నో విషయాలు, వివరాలు తెలిసి, విషయం పై కాని, మనిషిపై కాని మనకు అంతవరకు ఉన్న మంచి, చెడు అభిప్రాయాలు నిలవడం లేదు. తాజ్ మహల్, షాజహాన్, ముంతాజ్ బేగం ల గురించిన విషయాలు, వివరాలు కూడా అంతే. ఇదివరకటి మజాని, భావుకతని ఉత్సుకతని పాడుచేశాయి. అందుకే మనకు అన్ని విషయాల గురించి అన్ని వివరాలు తెలియనవసరం లేదు. తెలిస్తే మన సంతోషం కాస్తా ఆవిరియైపోతుంది.
షాజహాన్ 13 వ భార్య ముంతాజ్ అనీ, ముంతాజ్ భర్తీని చంపి ముంతాజ్ నుంచి వివాహమాడాడనీ, ఆమె సంతానాన్ని కంటూ అనారోగ్యం కారణంగా పోయిందదని రకరకాల విశేషాలుతో ముఖపుస్తకపు గోడలు రాతలతో నిండిపోయాయి. నాలో తాజ్ మహల్ పై ఉన్న , aura కొద్దిగా తగ్గింది. అయినా తాజ్ మహల్ చూసే వస్తాము కదా?
*********
మా అమృత సరోవర యాత్ర 3
17-12-2016
తాజ్ మహల్ సందర్శనం
మేము ఆగ్రా ఫోర్ట్ చూసి దాని చారిత్రక నేపథ్యం తలుచుకొని, ఆగ్రా లోని ఒక పంజాబీ రెస్టారెంట్లో మంచి భోజనం చేశాము. అక్కడి నుంచి తాజ్ మహల్ కి బయలుదేరాము. యమునా నదికి ఆ ఒడ్డు, ఈ ఒడ్డున ఉన్నాయి, ఆగ్రా కోట, తాజ్ మహల్.
తాజ్ మహల్ భారతీయులు మస్తిష్కంలో వేసిన ప్రణయ ముద్రను ఏ "నిజాలు" తండిచివేయలేవు.
తాజ్ మహల్ చేరేసరికి మధ్యాహ్నం 3 అయింది. ఒక కిలోమీటరు ముందు వెహికల్స్ ఆపేస్తారు. రిక్షాలలో వెళతారు. గవర్నమెంట్ వారి వాహనము ఉంది. అది ట్రిప్పులు వేస్తూంటుంది.
తాజ్ మహల్ ఉన్న ప్రదేశానికి వెళ్ళే ముందు ఒక అందమైన కట్టడం ఉంది. దాని గుండా లోపలికి వెళితే ఎదురుగా 400 మీటర్ల దూరంలో తాజ్ మహల్ కనిపిస్తూంటుంది. ఫొటోల్లో చూసే అంది చందాల కన్నా ఇంకా బాగుంటుంది.
తాజ్ మహల్ నిర్మాణానికి సందర్శించి, వెనుక ఉన్న యమునా నది సౌందర్యాలు చూసాము. తాజ్ మహల్ అంత క్రితం అక్బరు కట్టించిన ఒక కట్టడానికి, మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన సమయంలో కట్టిన మరొక కట్టడం కూడా తాజ్ మహల్ నిర్మాణానికి స్ఫూర్తి. తాజ్ మహల్ చుట్టూ ప్రదేశాలు, యమునా నదిని తప్పక దర్శించాలి. యమునా నదిలో పున్నమి రోజున యమునా విహారానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరిమిత సంఖ్యలో టిక్కెట్లు అమ్ముతారు.
తాజ్ మహల్ సందర్శించిన అనుభవం ఎవరికి వారే పొందాలి. లోపల ఉన్నవి సమాధులు అయినా ఒక చక్కని కట్టడాన్ని చూచిన అనుభవం కలుగుతుంది. రాజులు సొమ్ము రాళ్ళపాలే అయినా, ఇందులోని సోషియాలజీని పక్కకు పెట్టిన రమ్యతని ఆస్వాదించాలి.
ప్రపంచంలో రకరకాల సిద్ధాంతాలుంటాయి. ఎన్నో రకాల దృష్టులుంటాయి. మరెన్నో రకాల అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు ఉంటాయి. మనకి నచ్చినది సంతోషించి, నచ్చని దానిని వదిలేస్తే మనకి హాయిగా ఉంటుంది. ప్రశాంతతను అనుభవిస్తూ జీవించవచ్చు. సిద్ధాంత రాద్ధాంతములలో తగంలుకుంటే ఏ ఆనందమూ లేదు. జీవితమూ వాదనలతో నిస్సారంగా గడిచిపోతుంది. తాజ్ మహల్ వెనుక యమునా నది ఒంపులు, సొంపులు ఆహ్లాదపరుస్తాయి. యమునా లో నీరు నల్లని. నల్లని వాని అనుంగు సఖి.
మధుర, బృందావనం ఇక్కడకు దగ్గరలోనే ఉన్నాయి. వాటి గురించి తరువాతి భాగంలో.
*********
మా అమృత సరోవర యాత్ర 4
అమృతసర్ సందర్శనం
మా ‌అమృత సరోవర యాత్ర అమృతసర్ చూడడానికి. ఢిల్లీ కాన్ఫరెన్స్ కి వెళుతున్నాము అనుకున్నప్పుడే అమృతసర్ వెళ్ళాలి. అనుకున్నాం.
నాకు ఒక‌ 5, 6 ఏళ్ళ నుంచి అమృతసర్ చూడాలని గాఢంగా అనిపిస్తో‌ ఉంది. ఈ ఢిల్లీ పర్యటనలో తాజ్ మహల్ (మొదటి సారి), అమృతసర్ కలిపాము. తాజ్ మహల్ చూడాలని ఎన్నో ఏళ్లనుంచి‌ అనుకుంటున్నాను. అది ఇప్పుడు ‌వీలుపడింది. ఇది వరకు రెండు మూడు సార్లు వచ్చినప్పుడు ఢిల్లీ కొంత చూశాము.
తాజ్ మహల్ చూస్తున్నపుడు శ్రీ శ్రీ గారి "తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు" కవితా పంక్తులు కవితా ప్రియులైన తెలుగు వారందరికీ తప్పక గుర్తుకు వస్తాయి. కాని‌ ఆ భావం శ్రీ శ్రీ గారిదని ఎక్కువ మంది పొరబడతారు.
ఆ భావాల సొంత దారుడు బ్రెతోల్ట్ బ్రెఖ్ త్. ఈయన ప్రఖ్యాత జర్మన్ నాటక రచయిత, కవి, సాహితీ కారుడు. శ్రీ శ్రీ బ్రెఖ్ త్ భావములను సొంతం చేసికున్నారు.
బ్రెఖ్ త్ రాసిన ఒక జర్మన్ కవిత శ్రీ శ్రీ గారి ఆ ప్రసిద్ధ కవితా పంక్తులకు ఆధారం.‌ఆ కవిత‌ని ఇక్కడ ‌ఉటంకిస్తాను.‌
దాని శీర్షిక "చదువరి యైన పాఠకుని ప్రశ్నలు"
తాజ్ మహల్ చూసిన తర్వాత మధుర, బృందావనం లకు బయలుదేరాము. అప్పటికి సాయంత్రం 6 దాటింది. మధుర చేరేసరికి రాత్రి 8 అయింది. మా బస్ ఢిల్లీ ‌అర్థరాత్రి దాటాక చేరుతుందన్నారు. అప్పుడు మా అమృతసర్ రైలు మిస్ అవుతుంది. అందుకని మేము మధురలో ఆగిపోయి, మధుర మీదుగా ఢిల్లీ, అమృతసర్ వెళ్ళే మా రైలుని మధుర లోనే ఎక్కేద్దామని నిర్ణయించుకున్నాము. మేము మధుర చేరేసరికి మా రైలు మధుర రావడానికి 1-30 గంటలు మాత్రమే ఉంది.
మధుర స్టేషన్ చేరేసరికి మా రైలు 3 గంటల లేట్ గా‌ నడుస్తోందని తెలిసింది. గతి లేక మధుర స్టేషన్ లో వేచి ఉన్నాము. మా రైలు లేట్ పెరిగింది. ఈ రైలు లేటవడం ఈ ప్రయాణంలో మాకు ప్రతి సారి జరిగింది. మొదటగా ఎక్కిన కేరళ ఎక్స్ప్రెస్ 6 గంటలు లేట్ గా హజ్రత్ నిజాముద్దీన్ చేరింది. ఈ‌ రైలు ఇల్లాగే అయింది. మా‌ రైలు‌ వచ్చే వరకు మధురలో వెయిట్ చెయ్యలేక (ప్లాట్ ఫారం‌మీద; రిటైరింగ్ రూమ్‌లు ఇంకో ప్లాట్ ఫాం ‌మీద ఉన్నాయి. లగేజీ ఉంది) ముందు వచ్చిన‌ రైలు మీద న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ చేరాము. అప్పటికి రాత్రి 12 దాటింది.
మా రైలు తెల్లారకట్ట ‌4-30 కు వచ్చేవరకు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ వెయిటింగ్ హాల్ లో గడిపాము. తెల్లవారుజామున 4-30 కు మా అమృతసర్ రైలు ఎక్కాము. పొద్దున్న 11 గంటలకు వెళ్ళవలసింది మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళింది.
అంతే క్రితమే మా అబ్బాయి రిజర్వ్ చేసిన ‌హోటల్ రూమ్ కి వెళ్ళి రిఫ్రెష్, రిలాక్స్ అయ్యాము.
అమృతసర్ ఊరు పాత, కొత్తలో కలయిక. పాత భవనములు, కొత్త బిల్డింగ్స్ సహవాసం చేస్తున్న ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి. ఊరు పొతే వాసనలు, కొత్త‌ పరిమళాలతోటి అలరారుతోంది. ఉదాహరణకి మా హోటల్ బిల్డింగ్ చాలా కొత్తది,‌ ఫెసిలిటీస్‌ బాగున్నాయి కూడా, కాని ఒక సందులో పాత బజారు మధ్యలో ఉంది.
అమృతసర్ విశేషాలు తరువాయి భాగంలో.

మా అమృత సరోవర యాత్ర 5

18, 19, డిసెంబర్ 2016

సువర్ణ దేవాలయ సందర్శనము

నాకు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి అమృతసర్ చూడాలని గాఢంగా ఉంది.
ఢిల్లీ ఎలాగ కాన్ఫరెన్స్ కి వెళుతున్నాము కదా దీనితో కలుపుదాం అని అనుకున్నాను. అలాగే ఆగ్రా సందర్శనం అయ్యాక మధురలో టూరిస్ట్ బస్ దిగిపోయి, ఢిల్లీ రైలు ఎక్కాము. మాకు రిజర్వేషన్ ఉన్న రైలు మధుర మీదుగానే వస్తుంది. కానీ బాగా లేట్ గా నడుస్తోంది. మాకు రిజర్వేషన్ ఢిల్లీ నుంచి ఉంది. అందుకని ఇంకో ముందు రైలులో ఢిల్లీ చేరాము. అక్కడ లేట్ గా వచ్చిన మా రైలు ఎక్కి 7 గంటలు లేటుగా మధ్యాహ్నం 3 గంటలకు అమృతసర్ చేరాము.

ముందుగానే మా అబ్బాయి రిజర్వ్ చేసిన ‌హోటల్ రూమ్ కి వెళ్ళి రిఫ్రెష్ అయ్యి సాయంకాలం 7 గంటలకి సువర్ణ దేవాలయ సందర్శనానికి వెళ్ళాము.

అమృతసర్ శిఖ్ఖులకు గొప్ప తీర్థయాత్రా స్థలం. నాకు చిన్నప్పటి నుంచి చరిత్ర అంటే ఇష్టం. మనదేశంలో గొప్ప శౌర్యవంతమైన, నిజాయితీ కల, కష్టపడే మనస్తత్వం కలిగిన జాతి శిఖ్ లు. మన సైన్యంలో, ఇతర రక్షణ బలాలలో శిఖ్ లు ఎక్కువ.

మొగలాయి చక్రవర్తులను ఎదిరించిన సాహస ‌జాతి శిఖ్ జాతి. నాకు ఆ జాతి పై ఎంతో గౌరవం, మన్నన.
అమృతసర్ ఊరు పాత, కొత్తల కలయిక. రైల్వే స్టేషన్ ప్రాంతం, మా హోటల్ ఉన్న ప్రాంతం పాత ఊరు.
కాన్పూర్, వారణాసిలలా‌ ఉంది.

ఆటో ఎక్కి సువర్ణ దేవాలయానికి వెళ్ళాం. చీకటి పడి పోయింది. దేవాలయం లోనికి పురుషులు ఒక రుమాలు తలకి చుట్టుకొని, స్త్రీలు తలపై కొంగు కప్పుకొని ప్రవేశించాలి. దేవాలయం సరస్సులో వెలుగులతో నిండిపోయి, వెలుగులు చిందిస్తూ ఎంతో బాగుంది.

దేవాలయ ప్రదిక్షణ చేస్తూ, చుట్టూ ఉన్న కట్టడాలు చూస్తూ దేవాలయం క్యూ లోకి ప్రవేశించాము. లోనికి వెళ్లడానికి అరగంట పట్టింది. దేవాలయం మూడు అంతస్తులుగా ఉంటుంది. మూడు అంతస్తుల లోనూ శిఖ్ లు మతం గ్రంథం గ్రంథసాహెబా ఉంటుంది. చుట్టూ మతం గురువులు కూర్చుని ఉంటారు. మంచి గాయకులుపాడంతూ, జంత్ర తంత్రీ వాద్య గాళ్ళు సంగీతం అందిస్తూ ఉంటారు. వారి గానం ఎంతో శ్రావ్యంగా, భక్తి శ్రద్ధలతో నిండి ఉంది.

మొదటి గ్రంథసాహెబా చాలా పెద్దదిగా ఉంది. ఎంతో మంది భక్తులు డబ్బులు గ్రంథసాహెబా వద్ద వేస్తున్నారు. వరండాలో ఎంతోమంది కూర్చుని గానంలో గొంతు కలుపుతున్నారు. వాతావరణం అంతా ఆధ్యాత్మిక అమృతవాహిని లా ఉంది.

వేదాంతంలో జాగ్రత్ సుషుప్తి దేశ ఉన్నట్టే శిఖ్ ల తత్త్వంలో అమృత వేళ అని మానసిక దశ ఉంది. నిర్మల మానసిక స్థితి అది. గురునానక్ ఇప్పటి లాహోర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో శిఖ్ మతాన్ని స్థాపించాడు. ప్రస్తుత పాకిస్థాన్ లో ఎన్నో చారిత్రాత్మక గురుద్వారాలున్నొయి.

రంజిత్ సింగ్ సువర్ణ దేవాలయాన్ని కట్టించాడు. పదిమంది శిఖ్ గురువులు వీరులు, ధీరులుగా
మొగలాయిలతో పోరాడి శిఖ్ మత సంరక్షణని, ప్రాచుర్యాన్ని, అభివృద్ధిని తమ భుజస్కంధాలపై వేసుకుని శిఖ్ మత ఉద్ధరణలు చేశారు. 

మొదటి, రెండవ అంతస్తులలోనూ గ్రంథసాహెబా ఉంటుంది. దాన్ని పఠిస్తూ కొందరున్నారు.
అన్ని అంతస్తుల లోనూ గ్రంథసాహెబా‌ దర్శనం చేసుకుని లంగర్ లో భోజనం చేసి రాత్రికి హోటల్ కి చేరి విశ్రమించాము.

మరునాటి ఉదయం మళ్ళీ సువర్ణ దేవాలయానికి వెళ్ళాం. గ్రంథసాహెబా దర్శనం చేసికున్నాము. తరువాత జలియన్వాలాబాగ్ సందర్శించాము. అప్పటి విషాద సంఘటన గురించి తలుచుకొని
ఎంతో వ్యథ చెందాము.

మధ్యాహ్నం వాఘా బోర్డర్ చూడడానికి టాక్సీలో బయలు దేరాము. మధ్యలో ఒక జాబితాలో భోజనం చేశాము. మా ‌పెద్దకోడలు ఒక పంజాబీ వంటకం రుచిచూశాము. అది ఆవకూరతో చేసే పరోటా లాంటిది. రుచిగానే ఉంది.
సాయంకాలం 4 గంటలకు వాఘా బోర్డర్ చేరాము. స్టేడియంలాంటి స్ట్రక్చర్ లో ఆసీనులమయ్యాము.
చాలా మంది జనం వచ్చారు. అటు పాకిస్థాన్ వైపు ముందు జనం ఎక్కువగా లేరు, కాని నెమ్మదిగా చేరారు. అప్పుడే ఢిల్లీ-లాహోర్ బస్ బోర్డర్ దాటింది. 

5 గంటలకు రిట్రీట్ మొదలైంది. చాలా హుందాగా, హుషారుగా, ఆకర్షణీయంగా జరిగింది. ఒక విధమైన దర్పం, ఆనందం కలిగాయి. గర్వంగా అనిపించింది.

మేము రెండవ సారి సువర్ణ దేవాలయ సందర్శనం లో ఉండగా మా రెండవ అబ్బాయి భావి మామగారు అమ్మాయినిస్తామని ఫోన్ చేశారు. శుభసూచకంగా ఉంది అనుకున్నాం.

రాత్రికి హోటల్ కి చేరి విశ్రమించాము. మరునాడు ఉదయం 11 గంటలకు మా రైలు. 10-30 కే స్టేషన్ చేరాము. మా రైలు ఒక్క 11గంటలు మాత్రం లేట్ అయ్యింది రాత్రి పదిగంటల ప్రాంతంలో బయలు దేరింది. తరువాత ఢిల్లీ చేరుకొని, రాత్రి 10 గంటలకు విజయవాడ కి మా రైలు ఎక్కాము. దారిలో చర్చించు కొని విజయవాడ బదులు హైదరాబాద్ చేరి మా రెండవ అబ్బాయి భావి పత్నిని చూశాం. అదే సమయంలో మా పెద్దకోడలు ప్రెగ్నెంట్ అని తెలిసింది. అప్పుడు మేము చూసిన అమ్మాయే మా రెండవ కోడలు అయింది. అలాగే మాకు ఆగస్టు రెండున మనుమరాలు పుట్టింది. 2017వ సంవత్సరంలో మా కుటుంబం లోనికి ఇద్దరు ముఖ్య సభ్యులు వచ్చి చేరారు.
కథ కంచికి మనం ఇంటికి..

స్త్రీ పురుష సమానత్వం; మతం; మనవాడు మృగచర్మ ధారి పంచముఖుడుస్త్రీలు-ప్రేమాస్పదత;

స్త్రీ పురుష సమానత్వం

నేను ఈ మధ్య సరదా మాటలు వింటున్నాను; సుమారు 30 ఏళ్ళుగా.
అందరూ ఆడవారు, మగవారు సమానం అనడం. అంతవరకూ బాగానే ఉంది. కాని తరువాతి మాటే కొద్దిగా తిరకాసు వ్యవహారం.
అదేమంటే, ఆడవారు మగవారి కన్నా అధికారులుగా ఎక్కువ ఉపయోగం గా ఉంటారు అని. కారణం ఏమిటిట అంటే మాతృమూర్తులుగా‌ వారికి, ప్రేమ, ఓపిక ఎక్కువ ఉంటాయట. స్త్రీ సహజమైన లాలిత్యంతో మృదువుగా వ్యవహరిస్తారట.
మరి ఆడవారు, మగవారు సమానం కాదా? కాదనే అంటారు వీరు. ఆడవారు ఉద్యోగినులుగా మగవారి కన్నా కొద్ది ఎక్కువ సూటబుల్ ట.
అలాగే అమ్మాయిలు అబ్బాయిల కన్నా బాధ్యతలు బాగా తీసికుంటారట. అలా అబ్బాయిలు అమ్మాయిలతో పోలిస్తే తక్కువ ఎఫిషియంట్ ట.
మరి స్త్రీ, పురుష సమానత్వం మాటేమిటి?
*********
మతం

మతం గ్రుడ్డి నమ్మకాలను కలిగించి‌, ప్రోత్సహించేది కాకూడదు. మతం పేరుతో‌ ఎంతో మంది, తోటి మనుషులపై స్వారీ చేయడానికి ప్రయత్నిస్తూంటారు.
మతం పేరుతో, భగవంతుని మాట చెప్పి, తమ పబ్బం గడుపుకునే మనుషులు ఎక్కువై పోయారు. మతం మనశ్శాంతిని ఇవ్వాలి. మంచి పనులవైపు మనసును తిప్పాలి.
భగవంతుని పేరు చెప్పి తమకు సేవ చేయించుకునే స్వాములు, ఆధ్యాత్మిక గురువులు తామరతంపరగా
తయారయ్యారు. మతం ముసుగులో ఏం చేసినా చెల్లుతోంది.
మతం మనసుని బలహీనం చేయకూడదు. దృఢం చేయాలి. మతం అంటే ఇష్టం అనే అర్థమూ ఉంది.
మతం మన సృష్టో, భగవత్ సంకల్పమో తెలియదు.
ప్రాంతాన్ని బట్టి ఒకే మతంలో ఆచారవ్యవహారాలు మారతాయి. కాని జ్ఞానం మారదు. తత్త్వం మనిషికి స్వేచ్ఛనిస్తుంది. మనుషులను బానిసలుగా చేయడానికి మతం ఉద్దేశింపబడలేదు.
ఎందరో సామాన్యులు తమ అరకొర జ్ఞానంతో ఇతరులను నిర్దేశించడానికి, నియమించడానికి ఉవ్విళ్లూరుతూంటారు. వీరు చాల ప్రమాదకారులు.
మత నియమాలతో తికమక పడుతుంటారు. ఇతరులను తికమక పెడుతూంటారు. ఈ మిడిమిడి జ్ఞానులు తప్పుడు నిర్వచనాలతో, వ్యాఖ్యానాలతో మతం స్వరూపమే మార్చేస్తున్నారు. వీరి చేతిలో మతం తన ఉనికినే కోల్పోతోంది.
***********
మనవాడు మృగచర్మ ధారి పంచముఖుడు

గళమునందు గరళము, కన్నులు
బేసి; శరీరమునందే ఒక ఆలి; నెత్తిపై
మరొక ఆమె; తామసులు రాక్షసులు
భక్తులందుదురు; ఆలయములందు
నీరు, పత్రి‌, పుష్పం, బూడిద మాత్రం
నివాసము స్మశానము; అయినను
భోళా శంకరుడు భక్త సులభుడు
జ్ఞాన ప్రదాత, సకల లోక ప్రజ్ఞానము;
శివుడు ఇన్ని సంకటములలో తానున్నను
ఆనందమయుడు శాంతి నిండినవాడు
మౌన స్వరూపుడు త్యాగరాజు విరాగి;
తానే దేవుడయ్యు రామ నామము .సతతము
స్మరించుచు మనకు ఆధ్యాత్మికత బోధించువాడు
మేధా దక్షిణామూర్తి చంద్రమౌళి గజచర్మధారుడు
తాపసి నటరాజు ఢమరుక వాదనం నుంచి మనకు
అక్షరమాలనందించిన అక్షరుడు‌ మనకు అండ
పంచాక్షరీ స్వరూపుడు పంచముఖుడు మనవాడు
***********
విశ్వం యొక్క నిర్మాత, హృదయం పరమాత్మ.
********
స్త్రీలు-ప్రేమాస్పదత

ప్రపంచానికి ప్రేమ గురించి తెలియజేసినది, ప్రేమను నిర్మలంగా అందించినది, అందిచగలిగినది స్త్రీ.
అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, కూతురుగా, కోడలిగా, మనుమరాలిగా, చెలిగా, ప్రణయినిగా తనవారిని అలరించ గలిగిన, అలరించే భగవదంశ స్త్రీ. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి.
స్త్రీ రకరకాల పాత్రల్లో అందించగల, అందిస్తున్న ఈ ప్రేమాభిమానాల వల్లే సంఘం ఇంకా ఆహ్లాద మయంగా ఉంది. లేకపోతే ఒక పిచ్చాసుపత్రిగా ఉండేది. కాని నవీన నాగరికతలో ఇల్లాలికి చోటు లేకుండా పోతోంది. మనుషులు ప్రేమాస్పదులుగా ఉండడానికి, మన జీవితాలలో ఆనందం వెల్లివిరియడానికి స్త్రీలు అందించే ఆప్యాయత అనురాగాలు ఎంతో దోహదం చేస్తున్నాయి.
నాగరికత లేక, అడవుల్లో జంతువుల్లా జీవించే మనకి నాగరికత, సంస్కృతి, ప్రేమాభిమానాలు నేర్పింది, పంచింది, పెంచింది స్త్రీలే.
కాని ఆధునిక జీవనశైలులలో, నాగరికతా పోకడలలో వాతావరణం మారిపోయింది. అనురాగం పంచడం, తిరిగి ఆశించి పొందడం స్త్రీ ప్రకృతి. పసికందులకు తల్లి పాలలా, స్త్రీకి ప్రేమ అందించడం, అందుకోవడం బలం, రోగ నిరోధకం, సహజ లక్షణం. కాని కుహనా మేధావుల ప్రోద్బలంతో తను ఇల్లాలిగా ఇంటో ఉంటూ ఎంతో కోల్పోతున్నాననే భావన, భ్రాంతి ఆడువారిని అతలాకుతలం చేసింది వారి ప్రేమాస్పదతను వారే ఒక బాదరబందీగా తలుస్తున్న రోజులివి.
అనురాగాన్ని పంచక, పెంచక, అందుకోలేక
స్త్రీలు మానసిక రుగ్మతలకు, వైకల్యాలకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ప్రకృతికి విరుద్ధంగా జీవించడం ఎవరికీ మంచిది కాదు.
********
Fewer the words and more the involvement of heart is success of the prayer.



Tuesday, September 19, 2017

మా ఖాట్మండూ యాత్ర 12; వృత్తి - నివృత్తి; ఫేస్ బుక్ నిండా మేధావులే

మా ఖాట్మండూ యాత్ర 12
24-8-2017
గుహ్యేశ్వరీ దేవ్యాలయ దర్శనం, చంద్రగిరి రోప్ వే
ప్రతి శివాలయంలోనూ అమ్మవారి ఆలయం ఉంటుంది కదా! పశుపతినాథ్ దేవాలయం ప్రాంగణంలో అమ్మవారి ఆలయం కోసం వెతికాను. కనిపించలేదు. ఇద్దరు, ముగ్గుర్ని అడిగాను. ఒకతను ఇక్కడ లేదు, వెనక్కాల ఉంది అన్నాడు. వివరం తెలియలేదు. శృంగేరి మఠం రిప్రజెంటేటివ్ స్వామి వారి దర్శన సందర్భంగా ఆయన్ని అడిగాను. ఆయన ఉందే, గుహ్యేశ్వరీ దేవి ఆలయం, పశుపతినాథ్ ఆలయం వెనుక బాగమతి నది దాటి వెళ్తే ఉంది. తప్పక దర్శించి వెళ్ళండి అన్నారు.
పశుపతినాథ్ ఆలయం వెనుక బాగమతి నది పై చిన్ని వంతెన దాటి 200 మెట్లు ఎక్కి 100 మెట్లు దిగితే అమ్మవారి ఆలయం వచ్చింది. దారిలో చిన్న, చితక ఆలయాలెన్నో ఉన్నాయి. పూజాదికాలకు ఏమీ నోచుకుంటున్నట్టు లేదు. అలా ఉన్నాయి అంతే. అమ్మవారు గుహ్యేశ్వరీ దేవి ఆలయం నేపాల్ గుళ్ళ నమూనాలో ఉంది. బాగమతి నది అమ్మవారి ఆలయం ఎదురుగా ఉంటుంది. అదే తిరిగి పశుపతినాథ్ ఆలయం వెనుక వైపునకు వస్తుంది. బాగమతి నది ఖాట్మండు నగరంలో ఎన్నో మెలికలు తిరిగి ప్రవహిస్తుంది.
గుహ్యేశ్వరీ దేవి ఆలయం చక్కగా ఉంది. అమ్మవారి విగ్రహం ఉండదు. కింద ఊటలా ఉంటుంది. ఆ ప్రదేశంలో పైన ఒక ఆకారంగా అమర్చి ఉంచారు.
లోపల ఇద్దరు పూజారులు ఉన్నారు. ఒకతను చైనా అతనులా ఉన్నాడు. భక్తిగా, శ్రద్ధతో ఆలయం నిర్వహిస్తున్నారు.
అమ్మవారి దర్శనం అయ్యాక మా హోటల్ కి వచ్చి భోజనం చేసి చంద్రగిరి టాక్సీ చేసుకు బయలు దేరాము. వెళ్లి రావడానికి 2500 రూపాయలు బాడుగ. దూరం ఖాట్మండు కి 20 కి.మీ. మేము వెళ్ళే దారే ఇండియా బోర్డుకు వెళుతుంది. బోర్డరు చాలా దూరం. కాని ట్రాఫిక్ విపరీతంగా ఉంది. వర్షం కురిసింది. దారి, రోడ్డు బాగులేదు.
20 కి.మీ. కి 2-30 గంటలు పట్టింది. సాయంత్రం 4-45 కి చంద్రగిరి పర్వతములు చేరాము. అక్కడ రోప్ వే ఉంది. రోప్ వే లో 15 నిమిషాలు ప్రయాణం. టాక్సీ డ్రైవర్ తొందరపెట్టి ముందు టిక్కట్లున్నయో లేదో కనుక్కోండి అన్నాడు. ఉన్నాయి. అవేళ్టికి మావే ఆఖరి టిక్కెట్లు. ఆ టిక్కెట్లు దొరకడం ఎంతో అదృష్టం. లేకపోతే ఇంత ప్రయాణం, హైరానా, ప్రయాస, శ్రమ, డబ్బూ వృథా అయ్యేవి. భగవంతుని కి కృతజ్ఞతలు చెప్పుకున్నాము.
చంద్రగిరి పర్వతములను అధిరోహింప జేసే రోప్ వే ప్రయాణం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎక్కుతూంటే, దిగుతూంటే సుందర ప్రకృతి దృశ్యాల సౌందర్యం, చూచి తీరాలి. పైన ఒక శివాలయం ఉంది. పూజారిగారు గుడి మూసేస్తూ మమ్మల్ని చూసి ఆగారు. ఒక స్ఫురద్రూపి అయిన కుఱ్ఱాడు అతను. శృంగేరి మఠం వారి ఆధ్వర్యంలో ఉన్నది ఈ ఆలయం కూడా. కొండపైన ఎంతో బాగుంది. మళ్ళీ రోప్ వే స్టేషన్ కి వచ్చి ఆఖరు ప్రయాణీకులు గా దిగాము. రోప్ వే ప్రయాణం ఒక అందమైన అనుభవం.
ట్రాఫిక్ జామ్ వల్ల వెనక్కి హోటల్ కి వెళ్ళడానికి 3-30 గంటలు పట్టింది. మరునాడు ఎయిర్ ఇండియా విమానంలో ఖాట్మండు-ఢిల్లీ, ఢిల్లీ-హైదరాబాద్ రిజర్వేషన్ ఉంది.
24 ఉదయం 8-30 కి ఖాట్మండు త్రిభువన్ తో విమానాశ్రయానికి చేరాము. త్రిభువన్, మహేంద్ర, జ్ఞానేంద్ర నేపాల్ రాజులు. జ్ఞానేంద్ర తన కుటుంబం అంతనీ కాల్చి చంపేశాడు. తన ప్రేమని ఒప్పుకొని పెళ్లి చేయడానికి అంగీకరింలేదని. నేపాల్ లో ఇప్పుడు రాచరికం లేదు. ప్రజాస్వామ్యం ఉంది.
మా ఖాట్మండూ - ఢిల్లీ విమానం అరగంట ఆలస్యంగా 11-15 కి బయలుదేరింది. ఢిల్లీ చేరేసరికి మా హైదరాబాద్ కనెక్షన్ విమానం వెళ్ళిపోయింది. మాకు ఎయిర్ లైన్స్ వారు భోజనం ఏర్పాటు చేశారు. సాయంకాలం 6 గంటలు చికాగో-హైదరాబాద్ ఫ్లైట్ లో సీట్లు ఎరేంజ్ చేశారు. అది బోయింగ్ 737 విమానం. బాగా‌ పెద్దది గా ఉంది. రాత్ర 8-30కి రాజీవ్ గాంధీ విమానాశ్రయం లో దిగాము. మా రెండో అబ్బాయి వచ్చి పికప్ చేసుకున్నాడు.
మరునాడు మా రెండో అబ్బాయి, వాడి భార్య క్రొత్త కోడలు లచే వినాయక వ్రతం చేయించి అక్షింతల వేసుకున్నాము. మా పెద్దబ్బాయి కూతురు-మా మనుమరాలిని చూసి వారితో గడిపి ఆగస్టు 29 ప్రొద్దున్న నర్సాపురం ఎక్స్ప్రెస్ లో భీమవరం చేరాము. ఆగష్టు 14 న మొదలైన మా ఖాట్మండూ యాత్ర ముగిసింది.

*****************
వృత్తి - నివృత్తి

యోగః చిత్త వృత్తి నిరోధః
అనే యోగ సూత్రం మనకు పరిచయమే.
చిత్త వృత్తి అంటే ఏమిటి? వృత్తి అంటే ఏమిటి?
వృత్తి నామ అంతఃకరణ పరిణామః
వృత్తి అంటే అంతఃకరణములు పరిణమించుట. మార్పునొందుట.
మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అంతఃకరణములు. లోపలి పనిముట్లు.
మన మానసిక కార్యకలాపాలు ఈ నాలుగింటి పరిణామములే.
మనసు బాహ్య భౌతిక ప్రపంచాన్ని విషయముల రూపంలో జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహించి, వాటిని ఆంతర ప్రపంచంగా మస్తిష్కంలో భద్రపరుస్తుంది. మరల ఆ విషయ సమూహ సమాహారాన్ని జగత్ గా దృష్టిలోకి తెస్తుంది. తలపులు కలిగే విధము ఇది.

బుద్ధి తర్కాన్నీ, విచక్షణని, నిశ్చయాన్ని, వివేకాన్ని కలిగిస్తుంది.

చిత్తము విషయములు గ్రహించి బడుతున్నపుడు అదే సమయంలో అవి కలిగించే అనుభవములను, విషయానుభవములను గ్రహించి జ్ఞప్తి, జ్ఞాపకములు గా భద్రపరుస్తుంది. ఈ జ్ఞప్తి, జ్ఞాపకములనే వాసనలు అంటారు. వీటినే స్మృతి అనీ అంటారు. వాసనలను కలిగించి మరల వాటిని ప్రేరేపించడమూ చిత్రమే చేస్తుంది. ఆ ప్రేరేపింపబడిన వాసనే భావములు, లేక తలపులు, లేక ఆలోచనలుగా మారుతాయి. చిత్తము స్మరణమూ చేస్తుంది.

వ్యక్తికి, వ్యక్తిత్వానికి సంబంధించిన విషయ సమాహారమే, సమాచార సమూహమే అహంకారం. దర్పము అనే అర్థం నానుడి లో వచ్చింది. అహంకార మమకారములు వ్యక్తిత్వ స్పృహ పై ఆధారపడి ఉంటాయి.

ఇలా ఈ నాలుగు అంతఃకరణములు విషయములను కాని విషయానుభవములను కాని గ్రహించడమే అంతఃకరణ పరిణామం. దీనినే వృత్తి అంటారు. ఈ నాలుగింటికి ముడి శక్తి ఒకటే. దానిని మాయ అంటారు.

ఈ అంతఃకరణ పరిణామములను నిరోధించు కోవడాన్నే యోగం అంటారు. అంటే మానసిక కార్యకలాపాలను ఉపసంహరించుకునే ప్రయత్నమే యోగం.

అంతఃకరణములు పరిణమించకుండా ఉన్న సహజ, ముందటి స్థితిని నివృత్తి అంటారు. నివృత్తి అంటే లేకుండా చేసికోవడం. చిత్తవృత్తిని లేకుండా చూసుకోవడం. అంతఃకరణములు పరిణమించకుండా చూసుకోవడం. అంతఃకరణములు పరిణమించకుండా ఎలా చూసుకోవాలి అనే విషయం యోగదర్శనం చెబుతుంది.

నివృత్తి స్థితినే మోక్ష స్థితి అని కూడా అంటారు.

వృత్తి, నివృత్తుల మధ్య మనసు, ఇతర అంతఃకరణములు మసలడమే మానసిక కార్యకలాపాలు జరగడం, ఆగడం, నియమింప బడడం. ఇది సరిగా జరిగేటట్టు చూసుకోవడమే యోగాభ్యాసము. యోగ శిక్షణ.

సమస్త సన్మంగలాని భవంతు!
***********
ఫేస్ బుక్ నిండా మేధావులే

ఫేస్ బుక్ నిండా మేధావులే
కవులే, సమాజ సేవకులే;
అంతర్జాలం పుణ్యమా అని
ప్రతి రచయితకూ లైకుల పండగే
పత్రికలలో మాత్రమే ప్రచురించబడే
రోజుల్లో జనానాలో ఉన్న కవులు
కవయిత్రులందరూ రచయితల
జనాభా లోకి వచ్చేసారు; భారత
దేశపు జనాభా వలె అతియైనది?!
కాదు, సాహితీ సృష్టికి వాతావరణం
అనుకూలంగా ఉంది; దమ్మిడీ ఖర్చు లేని
ప్రచురణా స్వాతంత్ర్యం; రసికులైన
పాఠకుల నుంచి రయ్ రయ్ మని
స్పందనలు, ప్రతిస్పందనలు, ప్రశంసలు
నేటి అంతర్జాల సాహితీ కారుల
అదృష్టమే అదృష్టము; రచనల
ప్రయోజనమేమి? ఆ ఒక్కటి
అడగొద్దు; మంది ఎక్కువై మజ్జిగ
పల్చనైంది; లేదా వాదముల రణగొణ ధ్వనుల
ముందు శ్రావ్య గీతాలు వినిపించుటలేదు??
**********
నా హృదయము నీవే; నా హృదయ స్పందనలు ప్రణవ నాదములే;
నీ దరిని చేరటకునై భవసాగరమీది అద్దరిని చేరిన సంసార సంద్రపు
ఈతగాడను; నీ మౌన సంద్రమున కలిసిన నిశ్శబ్ద వ్యక్తిత్వ సంగమమును;
నారాయణా! నేనన్నది పిసరంతైన, నాదన్నది ఇసుమంతైన లేని, అద్వైతిని

Monday, September 18, 2017

మన సుఖ శాంతులు; నాగరికత; మేధావులు - రాజకీయ నాయకులు - గారాబాలు;What fate is worse than this?

మన సుఖ శాంతులు 

మనం సుఖంగా మనశ్శాంతిగా ఉండాలంటే మన ఇంట్లో వాళ్ళకి కాస్త మర్యాద, గౌరవం ఇస్తూ కొంచెం అభిమానం కూడా కలగలిపితే చాలు. ఏ ధ్యానాలు, ఆధ్యాత్మిక వ్యాపారుల శిష్యరికాలు అవసరం లేదు.
కాని మనం అది తప్ప అన్నీ చేస్తాం మనశ్శాంతి కోసం. మనకి మనశ్శాంతి లభించడం లేదంటే వింతేముంది?
సరియైన మానవ సంబంధాలు కలిగి ఉండకుండా స్వాములు, బాబాలు, అమ్మలు, ఆనందాల చుట్టూ తిరగడం వృథా ప్రయాస. ధ్యానాన్ని మించినది ఆప్యాయత పంచడం. యోగా అక్కర్లేదు అనురాగం పంచడం, పొందడం చేతనైతే.
కాని వినేవాళ్శెవరు? ఆధ్యాత్మికత వ్యాపార వస్తువు గా అమ్మితేనే కాని మనకు ఆకర్షణీయంగా ఉండదు.
ఆ స్వాములు మాత్రం ఏం చేస్తారు మన అజ్ఞానానికి?
ఇంట్లో వాళ్ళని చిన్నచూపు చూస్తూ ఆధ్యాత్మిక వ్యాపారుల చుట్టూ తిరగడం అమాయకత్వానికి పరాకాష్ట.
అమ్మ, నాన్న, భార్య/భర్త ఆక్క/చెల్లి, అన్న/తమ్ముడు ఈయలేని మనశ్శాంతిని భగవంతుడు కూడా ఈయలేడు. ఈ నిజం బుఱ్ఱకెక్కనంతవరకు మనశ్శాంతికై బుఱ్ఱలు బద్దలుకొట్టుకున్నా తరుణోపాయం లభించదు.

************
నాగరికత 

మన వాళ్ళైన మన కుటుంబం లోని తోటి మనుషులకు ఉపయోగ పడడం నేటి మేధావులచే నిషేధింప బడింది.
మనందరం ఈ నిషేధాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్నాము. మన జీవితాలు డబ్బు సంపాదించడానికి మాత్రమే ఉన్నాయని " విజ్ఞుల" ఉవాచ. మరి అనారోగ్యాలు, పసితనాలు, వృద్ధాప్యాలు ఎలా గడుస్తాయో? మనది నాగరికతా? గుడ్డెద్దు చేలో పడడమా?
**********
మేధావులు - రాజకీయ నాయకులు - గారాబాలు

నేటి మేధావులందరూ మన హక్కులను గురించే మాట్లాడుతారు.మన బాధ్యతల గురించి ఎవరూ మాట్లాడరు.
బాధ్యత లేని హక్కులు సమాజానికి చేటు. ఓట్ల కోసం రాజకీయ నాయకులు, సంఘంలో పేరు ప్రఖ్యాతుల కోసం మేధావులు నిరంతరం శ్రమ పడుతూంటారు. 

ఆ హడావిడిలో సంఘం శ్రేయస్సు గురించి ఎవరూ పట్టించుకోరు. తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుస్తుంది. ఎందుకు మాట్లాడినా హక్కుల కోసం మాత్రమే మాట్లాడితే పల్లకీ ఎక్కేవారే కాని మోసే వారుండరు.

ఇంతటి బాధ్యతా రాహిత్యంతో నాయకులు, మేధావులు మనల్ని గారాబం చేస్తున్నారు. మనమూ చంటి పిల్లల లాగా ఆ గారాబాన్ని ఆస్వాదిస్తూ ఎదగడం లేదు. అందుకనే సంఘం, దేశం అల్లల్లాడి పోతున్నాయి.

ఏదో కారణంగా రకరకాల వర్గముల వారిని, స్త్రీ పురుషులను తమ తమ జీవితాలకై కష్టపడనివ్వటం
లేదు. మృగతృష్ణ వంటి అంశాలు చూపించి, సొల్లు కబుర్లు చెప్పి వారిని ఉభయ భ్రష్టులుగా చేస్తున్నారు.
సంఘంలో అందరూ కలిసి సామరస్యం, సౌహార్దాలతో పరస్పరం సాయం చేసుకుంటూ ఎవరి బాధ్యత వారు వహిస్తే నే దేశం, సంఘం ప్రగతి పథంలో నడుస్తాయి. గారాబాలు ఆ వర్గాలకు, దేశానికీ కూడా చేటు.
********
What fate is worse than this?

   God molds us and creates
No nature evolved molding us;
And we appeared after millions of
Years of events and processes
Starting big-bang; through pre-biotic,
Biotic, macro-molecular, species
Evolution, is current scientific information
Whoever created us or whatever
Evolved us; will it make any difference
Once we appeared? Our present aim
Is to live a life of joy and peace;
Let us strive for us
Let us not make it splinter
Pieces by insisting this God
Created us; that God is taking
Care of us; only this religion
Can deliver things to us and
Liberate us from our difficulties
Agonies, disturbances and create
An atmosphere of hell on earth;
But we are particular about creation
Or evolution; we want to prove it
At the cost of our extinction by
Mascaraing one another; what a
Wisdom is ruling our minds?
What fate is worse than this madness?


Saturday, September 16, 2017

దివ్యులు; No Alternative; ఆకర్షణల వలయాలలో

దివ్యులు

రచయితలు రమ్య రమణీయ సాహితీ చిత్రకారులు
రచయితలు సంఘమునకు చదువు చెప్పు చదువరులు; 
రచయితలు సమాజమునకు మార్గదర్శకులు; 
రచయితలు మనవారు మనతోటివారు

సంకటమున నున్న మనుషులకు దారి చూపువారు
తత్త్వమును లౌకికమును సమముగ అందించు అక్షరాస్యులు; 
జ్ఞానమును పెంచి అనవసర అశాంతి పరిజ్ఞానమును 
తుంచి మనసునకు హాయినిచ్చువారు

రాయి వంటి హృదయములను సుందర 
శిల్పములుగ మలుచు చేయి తిరిగిన శిల్పులు
రాగము భావము అనుభవమును కలిగించి
పరిణిత మనస్కులను చేయు పరిపక్వచిత్తులు

అందమును ఆనందమును రుచి చూపించు అందె
వేసిన చేతులు; ప్రజ్ఞానమున సరస్వతీ మూర్తులు

అన్ని శాస్త్రముల కళల జ్ఞానముల
విశేషముల తెలిసిన విద్వాంసులు

రచయితలు భగవంతునికి ప్రతిరూపములు
సంచిత ఆగామి కర్మల తొలగించు దివ్యులు

************

No Alternative

Politicians want to bring development
To Indians through caste, community,
Region, religion and language considerations:

Really can they?
70 years of rhetoric is
Unable to do anything
But fool Indians;

Still Indians believe in
The Promises and manifestos
Of political parties;

Why so?
Because
There is no alternative!

Politicians and intellectuals
Have divided Indians successfully

***********

ఆకర్షణల వలయాలలో

మా నాన్నగారి తరంలో నాటకాలు ఆకర్షణ; 
అంతకు ముందు తరాలలో‌ మేజువాణీలు;

మా తరంలో సినిమాలు ఆకర్షణ; మా అబ్బాయిల
తరంలో టి.వి., వీడియో గేమ్స్ ఆకర్షణ;

ఇప్పుడు అంతర్జాలమున సమయము గడుపుట
ఆకర్షణ; సాంఘిక సాలెగూళ్ళ చిక్కుకొని బాహ్యము
మరచుట ఆకర్షణ; చరవాణుల చిక్కుకొని చిత్రంగా
వర్తించుటయు ఆకర్షణ;

ఆకర్షించే వస్తువు తరతరానికీ మారుతుంది; సమయ
యాపనము తాపముల విరహముల జరుగుతుంది;

ప్రేమయో వయసున సహజమైన ఆకర్షణయో
యువతీయువకుల స్త్రీ పురుషుల కొంత సేపు
పట్టి ఉంచుతుంది; ఏవో బంధముల చిక్కుకొని
జీవితముల గడుపుట అప్పుడూ ఇప్పుడూ తప్పనిది

Tuesday, September 12, 2017

Love and fake spirituality; భగవంతునితో అనుబంధం

Love and fake spirituality

Love is the catch-word of many god-men and god-women of Indian commercial spiritual establishments. The individuals who do not show or receive love at their homes throng to these "masters" in the
exploitation of human sentiments and vulnerabilities.
Just by using this word they are able to attract millions to their premesis and build spiritual empires.of grandiose and self-angrandisement. Amass money and wealth disproportionate to their spiritual credentials and knowledge.
If men and women love at their homes the individuals in the form of spouses, parents, children, in- laws, near and dear, friends, colleagues; there is no need for them to become devotees and disciples of these fake spiritualists. Commercial spiritual masters can never replace homes and homely loves.
Who neglect homes and throng to ashrams attracted by self-advertisers of spirituality can not get the promised and required peace of mind outside their homes by neglecting their duty of sharing love with near and dear.
**********
2-9-2017:
మనకు కావలసినట్టుగా ఏమీ చేయకుండా జీవించడం ఒక వైభవం. ఐశ్వర్యం కూడాను.
11-9-2017:
భగవంతునితో అనుబంధం

మతం అంటే కట్టు కథలని ప్రచారం చేయడం కాదు. స్వాముల మహిమలు, వారి ఇంద్రజాలాలు తలుచుకొని మురిసిపోవడం కాదు. ప్రచారం చేసి "ధన్యజీవులం" అవడం కాదు. 

భగవంతునిపై భక్తి కుదుర్చుకోవడం. శ్రద్ధగా పరమాత్ముని నిరాడంబరంగా పూజించడం. 
అనవసర చాదస్తాలు పెంచుకోక పోవడం. 

ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్ధి, మోక్షకామి తనను వారి వారి కామితములను ఈడేర్చుకొందుకు పూజిస్తారని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సెలవిచ్చాడు. ఆయనకు అందరి అంతరంగాలు తెలుసు. ఆయనను, ఆయన తత్త్వాన్ని అర్థం చేసుకునేవారు, ఆ ప్రయత్నం చేసేవారు అంటే ఆయనకు ఇష్టం.

భక్తి అంటే బానిసత్వం కాదు. భక్తి దర్పం. భక్తి భగవంతునిపై పరమమైన ప్రేమ. మనం కోరుకున్న దాని కన్నా ఆయనంతట ఆయన ఇచ్చేది మనకు లక్ష రెట్లు శుభం కలిగిస్తుంది. మనం తీసికుంటే మన బుల్లి చేతులు పట్టినంత మాత్రమే తీసికోగలం. ఆయన ఇస్తే తన పేద్ద చేయి పట్టినంత ఇస్తాడు. 

శివుడు జ్ఞాన ప్రదాత. విష్ణుమూర్తి మోక్ష ప్రదాత. భాస్కరుడు ఆరోగ్య ప్రదాత. సుబ్రహ్మణ్యుడు ఐశ్వర్య ప్రదాత. 

భగవంతునికి మనకు మధ్య ఏ మధ్యవర్తులు అవసరం లేదు. ఇది సూటియైన వ్యక్తిగత అనుబంధం. సంబంధం. 

పరమాత్ముని నిరాడంబరంగా మనస్ఫూర్తిగా ఆరాధిస్తే, తలిస్తే, సతతము నామం స్మరిస్తే చాలు ఆయన ప్రసన్నుడౌతాడు. అక్రమాలు చేస్తూ, అక్రమాస్తులు సంపాదిస్తూ భగవంతుని మరిన్ని సిరుల కోసం ఆడంబరంగా‌ ఆరాధించబూనడం అమాయకత్వం. పసితనం. అతితెలివి తేటలు చూపించడం. భగవంతుని అపార్థం చేసికొనడం

భగవంతుని మోసం చేయడం. ఆయన మన కర్మలకు తగిన ఫలితం ఇస్తాడు. వెధవ పనులు చేస్తూ "అభివృద్ధి" చెంది భగవంతుని ఒక కోరికలు తీర్చే యంత్రంగా భావించడం భగవంతుని ఎడల అపరాధం చేయడం. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, కరుణాంతరంగుడు అయిన భగవంతుని నిర్మలమైన
మనసుతో పూజించి, ధ్యానించి, స్మరిస్తూండడం ఇహ పర సాధకము.
శుభం భూయాత్!

Sunday, September 10, 2017

Abdication in the Self - Divine Wisdom;ఉచితం ;సంఘానికి మేధావురల అపకారం; కాలావగాహన ; పురస్కారము - రచనా పటిమ; మతము మంటిగడ్డాయె;

Abdication in the Self - The Divine Wisdom

Indian spirituality as originated in and with and evolved through the Upanishads and later supplemented and complemented through the Buddhism, the Jainism, the Shaddarsanas, and later spiritual masters is the Divine Wisdom. It is essentially the Knowledge of the Self, known popularly as Brahmajnaana or Aatmajnaana.

The Brahmajnaana reveals the true nature of the original state of mind and origin, structure, function and control of mind.

This path through knowledge is known as experiencing what the true awareness of "I".

The Upanishads say the real "I" is neither experience, thought/feeling, or utterance but pure consciousness sans all these mental functions in the awareness. The path of knowing and experiencing the real nature of "I" is the most beautiful and rewarding spiritual path towards permanently being the Being sans the adjective "human".

As is well-known ego represents the "human" aspect of awareness. Ego is the projection of the mind about the individual-personal traits, character,social status etc., and super-imposition on the Self in the form of experiences/senses -meanings-, thoughts/feelings, utterances. . If this reality is realized and the true spirit of the "I" in the form of Self is the consciousness as Unoccupied Awareness or Content-free Contentment, one is pure consciousness sans any mental functions in the awareness. Then the mind rests in the recesses of its origin, form, sustain-er, terminator and extinguisher.

This ability to be Being with mind absorbed in Itself - the Being , the abdication of the individual in the Self happens / takes place.

Self is nothing but Being-Pure Consciousness-Bliss - the Mind-Time - Transcendent Awareness. Silence is being experiences in the form of silent mind and transcends mind and its functions - when mind is working also - by providing the awareness of the mental functions in the form of experiences/meanings. thoughts/feelings/sentences, utterances/actions/reactions - both physical and psychological- and the State of their cessation.

This is the Diving wisdom, the essence of Brahmajnaana.
**********

Do governments have courage to identify and take action on the remaining cult leaders like ram Rahim and care for citizens' welfare and well-being?
*********
Let us do our work in a concentrated way. No other Guru, or Swami or Ananda is necessary to guide us on meditation. 

Meditation is concentrated doing.
**********
8-9-2017

పరిమళించే కాంతి
మిరుమిట్లు గొలిపే గొంతు
కవి ఊహకు లేదు అడ్డు ఆపు
కవితకేదీ కాదనర్హం ఊహకేదీ కాదు
అసమంజసం; గగన కుసుమములు
కవిసమయములు; మిగతావీ అలాగే

********
ఉచితం

బడుగులు ఎక్కువ ఓట్లు ఇచ్చు
కులముల వారు ప్రభుత్వ స్థలముల
నాక్రమించి వాసములుందురు; చిన్న చితక
దుకాణములు నడిపెదరు; రాజకీయులు

వారి అనుయాయులు బడా నేరగాళ్లు 
అన్ని రకాల స్థలములను ఆక్రమించెదరు; రియల్ ఎస్టేట్ వ్యాపారములు చేసికొనుచు కోట్లు గడించెదరు
ఎవ్వరు కిమ్మనరు; ప్రభుత్వములు గుడ్డి యగును;

మిగిలిన పౌరులు స్థలముల కొని ఇళ్ళు కట్టు కొనెదరు; ఈ కేటగిరీ వారికి స్థలముల నాక్రమించు లైసెన్స్ లేదు; అది ఓటు బ్యాంకులకు రాజకీయులకు 
వారి వారికి కరడు కట్టిన నేరగాళ్ళకు మాత్రం ఉచితం

**********

సంఘానికి మేధావుల అపకారం

"బ్రాహ్మణానాం అనేకత్వం" అనే నానుడి ప్రసిద్ధమే. అయితే ఎక్కువ మంది అనుకుంటున్నట్టు "బ్రాహ్మణ కులానికి చెందినవారిలో ఏకత్వం ఉండదు అని దీని అర్థం కాదు.

ఇక్కడ బ్రాహ్మణులు అనే మాట బ్రాహ్మణ కులానికి సంబంధించినది కాదు. బ్రాహ్మణులు అంటే పండితులు, మేధావులు, తత్త్వవేత్తలు, కవులు అనే అర్థంలో తీసి కోవాలి.

పండితులము, మేధావులము, తత్త్వ వేత్తలము, కవులము అనుకునేవారిలో ఏ విషయం మీదా ఏకాభిప్రాయం ఉండదు. వీరందరూ తలొకరు తలో అభిప్రాయం చెబుతారు. తమ అభిప్రాయం మీద నిలబడి, మిగతావారి నందరినీ, వారి అభిప్రాయాలను తీసిపారేస్తారు. ఏ ఇద్దరు మేధావులు, తత్త్వ వేత్తలు తమ అభిప్రాయాలను అనుసరించి వాదులాడంకుంటారు తప్ప ఇద్దరూ ఒకే అంగీకారానికి రారు. మిగతావాళ్ళని రానివ్వరు. తర్కం, మేధ, బుద్ధీ, సమయం, అన్నీ వాదులాట లోనే వ్యర్థం చేసికుంటారు. 

తమ వాదమే గొప్పదని నిరంతరం వాదములలో మునిగి తేలుతారు. గమ్యానికి చేరరు, చేరనీయరు, చేరలేరు. సమన్వయం వారికి తెలియని విద్య.

బ్రహ్మ సూత్రములలో 

తత్ తు సమన్వయాత్.  

అని సూత్రీకరించారు. 

ఈ సూత్రము ఆత్మ తత్త్వం విషయంలో చెప్పినా, అన్ని విషయాలకు, జ్ఞానాలకు, తత్త్వాలు, వాదాలకు సమానంగా చెందుతుంది. 

పూర్వము ఉపనిదనుయాయులు, బౌద్ధులు, జైనులు, న్యాయ,వైశేషికులు; సాంఖ్య, యోగ దర్శనములు వారు; పూర్వ, ఉత్తర మీమాంసీకులు, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత వేదాంతులు, చార్వాకులు;

ఆపై 

వీర వైష్ణవులు, వీర శైవులు, ఇతర సామాజిక న్యాయానుయాయులు, క్రైస్తవము, ఇస్లాం, శిఖ్ మతం, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, నక్సలైట్లు, మావోయిస్టులు, టెర్రరిస్టులు, ఇతర ప్రసిద్ధ వాదముల వారు ఒకరి మాట ఒకరు వినరు. ఒకరి మాట ఒకరికి గిట్టదు. ఒకరి మాట ఒకరు ఒప్పుకోరు.

సమాజంలో వీరందరూ సమాంతరంగా ఉంటూ, వీరంగం చేస్తూ తమ తమ వాదములతో అరిచి గీ పెడుతూ, కాట్లాడుకుంటూ, కొట్లాడుకుంటూ సంఘంలోని వారికి ఆనందం, శాంతి, సుఖాలు లేకుండా చేస్తారు. వివిధ వాదాల మధ్య సమన్వయం కోసం ఎన్నడూ కృషి చేయరు. 

తమ తమ వాదాలను, సిద్ధాంతాలను, తత్త్వాలను సంఘం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తూంటారు. సొమాన్యులు అటూ ఇటూ చేరి వీధుల్లో, పత్రికల్లో, టి.వి. ఛానళ్ళలో, అంతర్జాల వేదికలపై, ఇంకా ‌ఇటువంటి మాధ్యమాల్లో కొట్టుకుంటూంటారు. చంపుకుంటూంటారు కూడా. 

సత్యదర్శనము, తత్త్వదర్శనము పక్కకు పెట్టి తర్కం, మేధ సాయాలతో కిందా, మీదా పడుతూంటారు. అనవసరంగా కొట్లాడుకుంటారు. కాని ఏ వాదము మిగతా వాదాలను లేకుండా చేయలేదు అనే సత్యం వీరికి గోచరించదు. అనుయాయులకు గోచరించ నీయరు. 

మానవుడు నాగరికత, సంస్కృతి నేర్చిన నాటి నుంచీ
ఈ వాదులాటలు, దెబ్బలాటలు నిరంతరంగా సాగుతూనే ఉన్నాయి. సాగుతున్నాయి. సాగుతూనే ఉంటాయి. మేధావులు, తత్త్వవేత్తలు, పండితులు, కవులలోని ఈ అనైక్యత సంఘానికి తలనొప్పి కలిగిస్తూనే ఉంది. వీళ్ళకి సాగతీత తప్ప మరొక మంచి, పనికొచ్చే విషయం తెలియదు. 

ఈ అనైక్యత శ్రంతి మించి, మితి మీరి అమాయకులు ఊచకోతకి వేదికలు ఏర్పడతాయి. 

సంఘం ఈ మేధావుల అనైక్యత వల్ల కలిగే దుష్పరిణామాలను మౌనంగా భరిస్తూనే ఉంది. భరిస్తోంది. భరిస్తూ ఉంటుంది. సంఘానికి మేలు చేయడానికి ఉద్యమించే మేధావులు మంచి చేయడం మర్చిపోయి వాదనలలో, దెబ్బలాటలలో గడుపుతూ తమ జీవితాలను నిరర్ధకం చేసుకుంటారు. సంఘాన్ని సుఖంగా, మనశ్శాంతిగా ఉండనివ్వరు.

సామాన్యులకన్న మేధావులే సంఘానికి ఎక్కువ అపకారం చేస్తారు. చేస్తున్నారు. చేస్తూనే ఉంటారు.

7-9-2017

కాలావగాహన

కాలము అనునది ప్రత్యేకముగా లేదు. ఉన్నది పదార్ధము, శక్తి, ఆకాశము, అవకాశము, చోటు, చర్యలు, ప్రతి చర్యలు. శక్తి సాయంతో పదార్ధం స్థితి మారుతుంది. పదార్ధము ద్వారా శక్తి రూపము మారుతుంది. శక్తి, పదార్ధముల మార్పులే, పరిణామములే చర్యలు, ప్రతి చర్యలు.

ఆకాశము, అవకాశము, చోటు Space, శూన్యము - (ఇవన్నీ సమానార్ధకాలే) - ఉండడం వల్ల పదార్థాలు వహించబడుతున్నాయి. శక్తి పరిణమిస్తోంది. 

చర్యలు జరగడం వల్ల కాలము సృష్టించబడుతోంది. కాలమునకు స్వయముగా ఉనికి లేదు. శక్తి, పదార్ధ పరిణామములు లేక కాలము, కాలగమనము లేవు. 

సూర్యుడు  (సూర్యుని గతి శాస్త్రీయంగా కాదన్నా, మనకి సూర్యోదయ, సూర్యాస్తమయములు కలగడం వల్ల ఆ భ్రమ కలుగుతోంది కనుక సూర్యగతి చెప్పబడింది), చంద్రుడు, గ్రహముల గతి వలన కాలం సృష్టి జరుగుతోంది. ఈ గమనములు, చర్యలు, ప్రతి చర్యలు లేక కాలము లేదు.

కాల స్పృహ మనుషులకు మాత్రమే ప్రత్యేకం. కాలగమన దృష్టి, కాల గణన మానవుల నాగరికత, సంస్కృతుల వల్ల సృష్టించబడి ప్రాచుర్యం లోకి వచ్చింది. 

గమనము, పరిణామము, అగుట కాల స్వరూపమునకు ఆలంబనలు. కాలం గడుస్తోంది కాబట్టి చంద్రుడు, ఇతర గ్రహములు చలించుట లేదు. అవి చలిస్తున్నాయి కనుక కాలం గమన స్పృహ, భ్రమ, భ్రాంతి కలుగుతున్నాయి. కాలాతీతము అంటే పరిణామము కాని, గమనము కాని, అగుట కాని లేనిది

మొక్క చెట్టు అవుతుంది. బాలిక స్త్రీ అవుతుంది. యువతులు ముసలివారు అవుతారు. ఉష్ణ శక్తి సహాయంతో నీరు ఆవిరి అవుతుంది. కాలం గడుస్తోంది కాబట్టి మనకు వివిధ వయో అవస్థలు కలగటం లేదు. జీవ సహజంగా మనం వృద్ధులం అవుతాము తప్ప కాల గమనం వల్ల కాదు. అసలు కాలమే లేదు. ఇంక గమనమెక్కడ?

స్వయం ప్రతిపత్తి లేని ఊహా భాగము కాలము. పూర్తి మానసికము. మన జ్ఞాపకములు, గుర్తు గతం. మన ఊహలు, అపోహలు, భయాలు, ఆందోళనలు, భవిష్యత్తు.

మన గమనిక వర్తమానము.

6-9-2017

పురస్కారము - రచనా పటిమ

పుస్తకాలకు పురస్కారాలు రావడం న్యాయనిర్ణేతల అభిరుచి పై ఆధారపడి ఉంటుంది. రచన మీద తక్కువ శాతం జడ్జీల వ్యక్తిత్వం మీద ఎక్కువ శాతం అధారపడి ఉంటుంది.

ఏ పురస్కారాలైనా ఇంతే.‌ పురస్కార ప్రదానానికి ఎన్నికైన దాన్ని బట్టి మనం కళాసృష్టి పసపై అభిప్రాయం ఏర్పరిచుకోనవసరం లేదు. పురస్కారము రావడం సృష్టి మంచి చెడ్డలు, అల్పత్వము, ఘనము, రచనలో పటిమ కన్న న్యాయమూర్తుల ఇష్టాయిష్టాలను మాత్రమే  తెలియజేస్తుంది. 

అందుకని, పురస్కారాలు వస్తే మంచిదే. రానంత మాత్రాన ఆ రచనలు, సృష్టులు తక్కువ రకంవి కావు.

కాని సమాజం పురస్కార గ్రహీతలను ఎక్కువగా ఆదరిస్తుంది. పాఠకులు, ప్రేక్షకులు, వీక్షకులు తమ రస హృదయంతో, ఆస్వాదనా గరిమతో కవులను, రచయితలను, ఇతర లలిత కళా సృష్టి కర్తలను ఆదరిస్తారు. ఇదే సృష్టి కర్తకు పదికోట్ల రెట్లు సంతృప్తిని ఇస్తుంది. ఆదీ పురస్కార ప్రదానమే.
******

మతము మంటిగడ్డాయె

మతము మంటిగడ్డాయె; ఉత్సవాలు
మూర్ఖుల చేతిలోని రాయాయె
కోతికి కొబ్బరి దొరికిన చందమాయె
భారతదేశమున మతము ప్రజాస్వామ్య ఘోరమాయె

పూజల కన్న జనఘోషలెక్కువాయె
ప్రార్థనల కన్న లౌడ్ స్పీకర్ గోలలెక్కువాయె
మనసర్పించుట కన్న ఆడంబరములెక్కువాయె
ఎవరు నేడు నిర్వచించుచున్నారు మతమును?
ఎవరు నిర్వహించుచున్నారు గందరగోళపు వేడుకలను; ఉత్సవములు కోల్పోయె హుందా

ప్రజల వద్ద బలవంతముగా విరాళములు గుంజుట
రివాజాయె; ఉత్సవముపేరిట తాగి తైతెక్కలాడుట సంబరమాయె; ఆచారవ్యవహారముల అజ్ఞానుల
సందడి వేషమాయె; భగవంతుని అర్చించుట సున్నయ్యె; శుష్క వచనములు శూన్య హస్తముల రాజకీయ నాయకులు అనుయాయులు కబ్జా చేసిరి 
గుడులను ఉత్సవములను జుగుప్సాకరముగా;

ప్రార్థనాలయములు ప్రాంతీయ ఛోటా నాయకులకు
ఆదాయ ధామములయ్యె; గొఱ్ఱె దాటు జనులు
భక్తులై ఇహ పరములకు చెడుచు, భక్తిని ఆధ్యాత్మికతను కొండెక్కించుచున్నారు కలిసి
నిర్వాహకులతో; అంతయు అగమ్యగోచరమైనది
*******

Monday, September 4, 2017

మా ఖాట్మండు యాత్ర 11

మా ఖాట్మండు యాత్ర 11

23-8-2017

20 వ తారీఖు నుంచి 22 వరకు నిర్వాహకులైన సారస్వత్ ఇన్స్టిట్యూట్, బెంగుళూరు వారు మా నుంచి తీసికున్న డబ్బులతో ఈ మూడు రోజులు మాచే ఖాట్మండు, ఖాట్మండు చుట్టుపక్కల ముఖ్య ప్రదేశాల దర్శనం చేయించారు. వాటి వివరాలు ముందు భాగములలో వివరించాను.

ఖాట్మండు, చుట్టుపక్కల దారునిర్మిత ఆలయములు ఎక్కువ. చాంగ్ నారాయణ్ ఆలయం నుంచి, పశుపతినాథ్ ఆలయం, పాటన్ కృష్ణాలయం, భవానీ ఆలయం, భైరవ ఆలయాలు, ఇతర ఆలయాలు దారు నిర్మితములే. శిల్పములూ కలపవే. ఆలయ నమూనాలు నేపాల్ కి ప్రత్యేకంగా ఉన్నాయి.

23 వ తారీఖున మేము, జగన్నాథం గారు మా ప్రొగ్రాం మేము వేసుకున్నాం. ఉదయమే బయలుదేరి పశుపతినాథుని దర్శనం మరొక సారి చేసుకోవడం, శృంగేరి మఠం రిప్రజెంటేటివ్ స్వామి వారి దర్శనం చేసుకోవడం, మధ్యాహ్నం చంద్రగిరి పర్వతములు చూడడానికి వెళ్లడం.

పశుపతినాథుని తనివితీరా వీక్షించాము. నాలుగు వైపులా నాలుగు ముఖాలు చూచి ఆనందించి భక్తి తో నమస్కరించాము. అప్పుడే శంకరునికి అభిషేకం చేస్తున్నారు.

కనుల పండువగా అభిషేకం వీక్షించాము. అభిషేక జలం మాపై శృంగేరి ప్రతినిధి పూజారి ప్రోక్షించారు. తరువాత సదాశివాశ్రమ స్వామి సమక్షంలో రెండు గంటలు గడిపాము. మాతో వచ్చిన నేపాలీ ఆయన స్వొమి వారిని ఒక అంతర్జాతీయ సదస్సు లో పాల్గొని ఉపన్యాసం ఇమ్మని అడిగారు. నేపాల్ లో క్రైస్తవ మతానుయాయులు హిందూ మతం పై జరుపుతున్న తప్పుడు ప్రచారానికి విరుగుడుగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. స్వామి తాను ఆ సదస్సులో పాల్గొనేందుకు అంగీకరించకుండా ఆ సదస్సు తరువాత ఈ విషయంలో ఆ నేపాలీ సంఘం వారు ఏం చేస్తే బాగుంటుందో సూచించారు.

తరువాత మమ్మల్ని ఏమైనా అడగమన్నారు.

నేను "అసతో సదాజాయత" అనే శ్రుతి వాక్యంలో, అసత్ అంటే ఆక్సిజన్ అని అనుకోవచ్చా అని అడిగాను
( అసత్ అంటే సత్ కానిది అని అర్థం.అలా అసత్ అంటే ఏదైనా భౌతిక పదార్ధము అని అర్థం. సాంప్రదాయ వాదులు ఈ అసతో సదజాయత - సత్ కాని దాని నుంచి సత్ పుట్టింది అనే శ్రుతి వాక్య సత్యాన్ని ఎన్నో వంకరలతో వ్యాఖ్యానిస్తారు. 

వారికి భగవత్ పరంగా వ్యాఖ్యానించడానికి లొంగని శ్రుతి వాక్యమది.

శ్రుతులు, ఉపనిషత్తులు సత్యాత్మకములు. సత్య ప్రతిపాదకములు. వేద ఋషులకి, ఉపనిషత్ స్రష్టలకి, సత్యాన్వేషణ, సత్యావిష్కరణ మాత్రమే ధ్యేయములు. మరొక దృష్టి లేదు వారికి.

ఈ ప్రపంచం ఎప్పుడు పుట్టింది?
ఎలా పుట్టింది? ఎవరు సృజించారు?
ఈ దేవుళ్ళు ఎప్పుడు వచ్చారు?
వీరందరూ తరువాత సృష్టించబడిన వారే

అని శ్రుతులు, ఉపనిషత్తులు నిర్ద్వంద్వంగా ప్రకటించాయి. ( Dr. S. Radhakrishnan Indian Philosophy, Part I and II).

భగవత్ పరంగా ప్రస్థాన త్రయాన్ని వ్యాఖ్యానించే వారికి ఇది మింగుడు పడని, ఇష్టం లేని నిజం. సత్యం మన ఇష్టాయిష్టాలకు అతీతమైనది అని చాలా మందికి తెలియని వాస్తవం. వారి శషభిషలను శ్రుతులు లెక్కించవు. )

ఆయన కొద్దిగా వ్యంగ్యంగా నవ్వుతూ, నా "అమాయకత్వాన్ని" క్షమిస్తూ ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. అంతటితో ఆగక ఎంతో కష్టపడ్డారు, ఎన్ని జన్మలు ఎత్తినా సైంటిస్ట్ లకు ఆత్మజ్ఞానం అందదని అనుష్ఠానపరులకు మాత్రమే అది ప్రాప్తిస్తుందని అన్నారు. ఈ ధోరణి ఎందరో స్వాములు వద్ద నేను గమనించాను. తాము సైన్స్ చదివినవారికంటే అధికులము అనే స్వోత్కర్ష వీరిలో కరడు కట్టి ఉంటుంది.

సత్యదర్శనములలో ఒకటైన విజ్ఞాన శాస్త్రాన్ని ఆయన తీసిపారేస్తూ చులకనగా చూడటం నాకు నచ్చలేదు. మౌనం పాటించాను.

అలాగే ఇంకొకటి కూడా ఏమిటంటే సైంటిస్ట్ లము అనుకునేవారు కూడా సత్ దర్శనములో ఏముందో తెలియకుండా, తెలుసుకోకుండా శ్రుతి జ్ఞానాన్ని, ఉపనిషత్ సారాన్ని తక్కువ చేసి మాట్లాడుతోంటారు. అందులో సైన్స్ ఏమీ లేదంటారు.

ఈ రెండు రకాల నీ చూస్తూంటే మము బోంట్లకు నువ్వూ వస్తుంది, సరదా కలిగి వారి జ్ఞాన రాహిత్యానికి, అమాయకత్వానికి,"రాజసానికి", రజోగుణ భూయిష్ఠ దర్పానికీ జాలీ వేస్తుంది. ఈ పెద్దల పసితనం పసగా, నసగా ఉంటుంది.

I am meditating on the Self ( Atman/Brahman) through physics, modern and cognitive science. Just as musician - composer Tyagaraja Swami meditated on the Self through music, I ma meditating on the Self through the knowledge of physics, physiological psychology and cognitive science. Thus the Swami belittling scientific quest of the Self through knowledge did not enthuse me.

బ్రహ్మసూత్రాలలో

ఆథాతో బ్రహ్మ జిజ్ఞాసా
జన్మాది అస్య యతః

సూత్రములు తర్వాత

శాస్త్రయోనిత్వాత్

అనే సూత్రం అన్ని శాస్త్రాలు పరబ్రహ్మము నుంచి వచ్చినవే అంటుంది. అన్ని శాస్త్రాల గుండా పరబ్రహ్మమును చేరవచ్చు; ఏ నది గుండా అయినా సముద్రాన్ని జేరగలిగినట్టు. పరమాత్మకు భేదదృష్టి లేదు.

Science and Spirituality

In India two kinds of people are of interest in relation to Indian tradition and Indian spirituality.

First kind of people are outright denounce rs of anything ancient Indian. In the name of science, though some of them are neither students of science nor well-versed with scientific knowledge and skills; talk on behalf of science to denounce ancient Indian tradition and spirituality.

The second in the form of spiritual authorities will blindly stick to many traditional practices. Especially the people associated with a cult or math tradition will arrogate themselves to be custodians of anything ancient Indian and deny place of authority to individuals outside their cult or math tradition. Some individuals of this kind look down science and practice of doing science. This is silly and against Indian knowledge traditions.

Some individuals from first kind of people who talk nonsense about ancient Indian tradition and spirituality are ignorant of contents of Indian knowledge and spiritual systems and their eminence and usefulness to individuals and human societies and humanity.

The second kind of people insist on performing rituals strictly before one takes to spirituality. These are mostly their cult or math rituals. Most of the times they lack in open mind and see any other spiritual quest like through scientific knowledge, music or such fine-arts as not equal to their rituals-centric spiritual path. They completely forget the very nature of liberty and independence associated with ancient Indian spiritual wisdom and tradition.

They dismiss anything other than their rituals, unsuitable or inferior to spiritual quest. Most of them are not trained in science or other knowledge-based or art-based spiritual practice. But still they denounce science and its probing capability and efficiency. They insist on the ways known to them and are averse to recognise spiritual quests through other means other than their rituals-filled path as equally authentic and valid.

Their insistence on karma-specific path is their ignorance of jnana and bhakti paths which are equally adored, admired and practiced traditionally in India for centuries. This insistance may reveal their anxiety more rather than suitability of quests through other means than their cult-, math - specific rituals.

The consonance of mind and heart, jnana, bhakti together with observance karma-specific rituals, not necessarily insisted rituals of cult and math traditions.

Spiritual quest through any means is equally potent to liberate the individual from worldly entanglements and make one spiritual equally in competence with cult-, and math-tradition followers. Every knowledge must be respected and one must be able to see the diversity allowed to reach the ultimate. Being a serious student of spirituality is enough.

All asramas are equally competent to liberate an individual. Insisting on taking a specific asrama for attainment of spiritual knowledge and spirit for spreading spirituality is naive and child-like.

తరువాత గుహ్యేశ్వరీదేవి ఆలయాన్ని దర్శించాము.

గుహ్యశ్వరీ ప్రియాయ విద్మహే పశుపతినాథాయ ధీమహి తన్నో భాలేశ్వర ప్రచోదయాత్

ఓం నమః శివాయ