నా కవితా సంకలనం ప్రచురణ
నేను యానాంలో ఉద్యోగం చేసేటప్పుడు నా కవితా సంకలనం
తేవాలని ఉవ్విళ్ళూరుతో ఉండేవాడిని అప్పటికి నేను ఆంగ్లం, తెలుగు, సంస్కృతములలో
కవితలు, కథలు, వ్యాసములు
రాస్తూండేవాడిని.
చుట్టుపక్కల ఎందరో కవులు, విమర్శకులు ఉంటూండేవారు. యానాం
ప్రక్కన ఉన్న పల్లెపాలెంలోని మధునాపంతుల వారి లోగిలిలో సాహితీ
కార్యక్రమములు తరచు జరుగుతూండేవి.
అక్కడికి తూర్పుగోదావరి జిల్లాలోని "లబ్ధప్రతిష్టులైన" కవులు, విమర్శకులు వస్తూండేవారు. వారిలో కొందరితోనే నా పరిచయం. వట్టి ముఖ పరిచయం మాత్రమే. గుంపులో గోవిందంలా ఉండేవాడిని.
అక్కడికి తూర్పుగోదావరి జిల్లాలోని "లబ్ధప్రతిష్టులైన" కవులు, విమర్శకులు వస్తూండేవారు. వారిలో కొందరితోనే నా పరిచయం. వట్టి ముఖ పరిచయం మాత్రమే. గుంపులో గోవిందంలా ఉండేవాడిని.
అక్కడ, చుట్టుపక్కల జరిగే కవి
సమ్మేళనములలోనూ నా తెలుగు కవితలు చదువుతూండే వాడిని. మొహమాటం
చప్పట్లు తప్ప మరే గుర్తింపు ఉండేది కాదు. నేనూ పెద్దగా ఆశించేవాడినీ
కాదు.
అప్పటికే ఉపనిషత్తులలోని ఆత్మజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానశాస్త్ర
అవగాహనగా మారుస్తూండే పరిశోధనలో నిమగ్నమై కూడా ఉండేవాడిని. అందువల్ల
కవిగా నన్ను చుట్టుపక్కల వాళ్ళే గుర్తించక పోయినా పట్టించుకునేవాడిని
కాదు.
కాని నా చుట్టుపక్కల కవులు వాళ్ళ కవితా సంకలనాలనీ
తెస్తూ, వాటి ఆవిష్కరణకు సభలు పెడుతూ
పెద్దలను ఆహ్వానించి హడావిడి చేస్తూంటే, నాకు అంత
హడావుడులు చేసే ఆసక్తీ, ఆర్ధిక సత్తువ, పరిచయాలు
లేకపోయినా, నా తెలుగు కవితాసంకలనం తేవాలనే
లాలస మాత్రం ఉండేది. ఈ ప్రయత్నమంతా చేతి చమురు
భాగవతంగా మిగిలిపోతుందనే శంకా ఉండేది.
ఈ మీమాంసలో ఊగుతూ, నా కవితలు
కొన్ని ప్రముఖ సినీకవులు, అవార్డు గ్రహీతలు అయిన ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయ
కులపతులకు పంపాను. ఆయన వాటిపై స్పందించే తీరిక, ఉత్సాహము లేక
కాబోలు స్థానిక కవులకు చూపించండని సలహా ఇచ్చే లేఖను వారి పి.ఏ.
చే పంపించారు. ఆయన అప్పుడు తెలుగు విశ్వవిద్యాసయం ఉపకులపతులు. (నా వంటి
చిన్న కవులు రోజుకి ఎందరో పెద్దలకు అభిప్రాయం కోసమై కవితలు పంపుతారనీ, వారికి మన
కవితలు చదవడంపై ఆసక్తీ, తీరిక ఉండవనీ; పెద్దలను
ఆకట్టుకోవడం జరిగేపని కాదని అర్థమైంది. అసలు ఆయనకి నేను నా కవితలు ఎందుకు పంపించానంటే; అప్పటికి వారం క్రితం సోదర కవి కవితా
సంకలనం ఆవిష్కరించి, దానిని ఘనంగా పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశారు; అందుకని పంపాను. ).
అప్పుడు నా కవితలను అభిప్రాయం కోరుతూ రాజమండ్రీలో
ఉన్న ఒక తెలుగుశాఖ ఆచార్యులకు పంపాను. ఆయన పద్యరచనలో దిట్ట. ఆయన మరింత
ఘాటుగా సమాధానం రాస్తూ అసలు కవిత్వం రాయడం లోకువ అయిపోయిందని, అందరూ
కవిత్వం బరికే వారేననీ, అయినా భౌతిక శాస్త్రము చదివిన
నాకు కవితా రచన ఏమిటని, నేను నా
కవితలు ప్రచురిస్తే ఆ తెల్లకాగితము వేస్ట్ అనీ ఆయన అభిప్రాయం
పంపారు. దిమ్మతిరిగింది నాకు. కవితా సంకలనం తేవడం కాదు కవితలల్లడం
పైనే ఆసక్తి చచ్చిపోయింది కొన్నాళ్ళు. తరువాత చిగురించింది అనుకోండి.
నేను ఆ ఆచార్యులకు కొంటెగా, నేను నా కవితా సంకలనం ప్రచురిస్తున్నాననీ, నా కవితలపై
ఆయన అభిప్రాయాన్ని యథా తథంగా అచ్చువేస్తాననీ, అనుమతి
ఇమ్మనీ రాసాను. ఆయన బెదిరిపోయి, ఆ అబిప్రాయం ప్రచురణకు ఉద్దేశించినది కాదనీ, కావసిస్తే
మళ్ళీ పంపుతాననీ, దానిని ప్రచురించుకోవచ్చనీ
కాళ్ళ బేరానికి వచ్చాడు.
దానితో నాకు తెలుగునాట అప్పటి కొందరు కవుల, విమర్శకుల
ధోరణులు తెలిసాయి. నా కవితా సంకలనం తెచ్చుకోవాలనే ఇచ్ఛా కరిగిపోయింది.
ఈ అనుభవాలతో ఆనాడే నిశ్చయించుకున్నాను. నా కవితాసంకలనం ఎప్పుడైనా ప్రచురిస్తే పెద్జలను మాత్రం ముందు మాట రాయాలని
కోరకూడదని. అలాగే నా కవితలపై అభిప్రాయం అడుగుతూ మరే
పెద్దలకూ నా కవితలు పంపకూడదనీ.
నా కవితా సంకలనం తేవడంపై నా మరిన్ని
అనుభవాలు మరొక సారి పంచుకుంటాను.
మన బ్రతుకులు
పసికూనలు, ముసలివగ్గులు పువ్వువంటివారు. ఎంతో నాజూకైన వారు. వారిద్దరూ వారి పనులు వారు చేసుకోలేరు. మరొకరు
వారికై చేసితీరాలి. వారిని మనం ఎంతో సున్నితంగా సాకాలి. దురదృష్ట
వశాత్తు మన జీవన విధానంలో వీరికి ప్రాధాన్యం, స్థానం లేకుండా పోయాయి.
స్త్రీని గృహ ప్రాంగణం నుంచి విడదీసి చూడడం దగ్గరనుంచి పసికూనలకు, ముసలివగ్గులకు సంరక్షణ లేకుండాపోయింది. థెరిసా పేరు ముందు మదర్ చేర్చి అమ్మ
ప్రాధాన్యాన్ని చాటి చెప్పే మనం, అవే పనులు ఇంట్లో ప్రేమగా,అనురాగం పంచుతూ చేసే
గృహిణిని మగవానికి బానిస అంటాం. అంతా అస్తవ్యస్తమైన నేటి జీవన విధానంలో పసికూనలకు
(వీరు ఆ స్త్రీ పిల్లలే), ముసలివగ్గులకు (ఆ స్త్రీ అత్తమామలే, తల్లిదండ్రులే),
పరాయివారు కాదు, ఆధారం, అనునయం లేకుండా పోయింది. వారికి ఏ మానవ హక్కులూ లేవు.
కుహనా మేధావులు, వివిధ వాదముల రక్తులు, వాదప్రియులు ఈ విషయంలో సంఘానికి చేస్తున్న
అపకారం క్షమింపరానిది.
స్త్రీ,
పురుషులిద్దరూ కలిసి సంపాదిస్తేనేగాని రోజు గడవని దుస్థితిలో ఉన్నాం మనం.
పిల్లలకు, చదువు ఖర్చులు, మనందరికీ వైద్యం ఖర్చులు నింగినంటుతున్న ఈ వేళ ఎంత డబ్బు
సంపాదించినా సరిపోని స్థితికి చేరుకున్నాం. అక్రమంగా డబ్బులు సంపాదించేవాళ్ళు తప్ప
మరెవరమూ హుందాగా జీవించేస్థితిలో లేము.
దీనికి తోడు మనుషుల
మధ్య అనుబంధాలూ మృగ్యమైతే, బతుకులు కష్టంగా ఈడ్వాల్సి వస్తుంది. మన జీవన విధానాలు,
మన ప్రాధాన్యతలు మనం మార్చుకుని తీరాలి. ఈ విషయంలో మన పూర్వుల ఉక్తులు, అనుభవములు,
సంసారము, సంస్కృతులు శిరోధార్యములు. తప్పక అనుసరించవలసినవి. వీటిని ఇప్పటికే
నిర్లక్ష్యం చేస్తూ ఇక్కట్ల పాలవుతున్నాం. మేలుకోవడం మంచిది. ఆధునిక మేధావులకు,
వాద ప్రియులకు బుద్ధి, బుర్ర తక్కువ. వారి హృదయములు మకిలి పట్టినవి. మనకు
పనికిరావు. వీరు త్పుపట్టే, నిరసించే, నిందించే సాంప్రదాయాన్ని వదులుకోకుండా
అనుసరిస్తేనే మనకు సుఖశాంతులు.
తస్మాత్ జాగ్రత!
జాగ్రత!
No comments:
Post a Comment