తమస్సు - తమోగుణము
ఉపనిషత్తులు, షడ్దర్శనములు, శబ్దబ్రహ్మసిద్ధాంతము, తత్సంబంధ భారతీయ తత్త్వములు, తత్త్వ మీమాంసలు, వైజ్ఞానిక, ఆస్తిక దృష్టులతో వెలువడ్డాయి, వ్యాఖ్యానించబడ్డాయి. ప్రస్తుతము చాలామందికి శంకరుల, రామానుజుల, మధ్వాచార్యుల, తదితర వ్యాఖ్యానముల గురించి మాత్రమే తెలుసు.
ఉపనిషత్ ప్రతిపాదనలను జ్ఞానబోధమీమాంసా పరంగా కూడా వ్యాఖ్యానించవచ్చు. అప్పుడు మనకింతవరకు తెలిసిన ఈ విషయములను కొత్త కోణంలో చూసినప్పుడు మనకు వింతగా కనిపించి ఒప్పుదల చూపనీయవు. కాని శాస్త్రము శాస్త్రమే.
మనకు విశాల దృక్పథము ఉంటే కొత్త విషయాలను ఆకళింపు చేసికోవడానికి ప్రయత్నిస్తాము.
ఆధ్యాత్మిక గ్రంథములలో తమస్సు, తమోగుణము పదాలు అస్తమానూ వస్తాయి.
మనలో ఆత్మ ఉండి మన జ్ఞాన, విజ్ఞాన, భాషాజ్ఞాన సముపార్జనకు అవసరమైన మానసిక కార్యకలాపములను జరపడానికి, జరపడానికి కావలసిన శక్తినీ (చిచ్ఛక్తిని) ఇస్తూ, జరిపిస్తూ ఈ మానసిక కార్యకలాపములను గమనించే వీలునూ కలిగిస్తోంది.
మనలో అస్తమానూ ఉండేది ఆత్మ దశ. దీనిపై మూడు మానసిక దశలు కలిగి పోతూంటాయి.
అవి:
జాగ్రత్ (మెళకువ),
స్వప్న (కల),
సుషుప్తి (గాఢనిద్ర).
సుషుప్తి మానసిక దశలో మనసు, ఇతర అంతఃకరణములైన బుద్ధ్యహంకారచిత్తములు (లోని పనిముట్టులు) పనిచేయక విరమణలో ఉంటాయి. ఈ దశలో మానసిక కార్యకలాపములేవీ జరగవు. గ్రహణలు, గ్రహింపులు, క్రియలు, ప్రతిక్రియల కలాపము విరమింపబడి పూర్ణ శాంతి మనసై, నిరాకుల స్థితి అనుభవమై ఉంటుంది.
జాగ్రత్, కల మానసిక దశలలో అన్ని అంతఃకరణములు పనిజేసి సకల మానసిక కార్యకలాపములను నిర్వహిస్తాయి.
మనసు మాధ్యమము ద్వారా జ్ఞానేంద్రియములు బయటి భౌతిక ప్రపంచము తో అనుసంధానింప బడి గ్రహణలు, తద్వారా కలిగిన అనుభవములు, గ్రహింపులు, వరుసగా మనసు, చిత్తముల ద్వారా గ్రహింపబడి అంతర ప్రపంచంగా, వాసనలుగా భద్రపరుపబడతాయి. ఇది బహిర్ముఖ దృష్టి.
మళ్ళీ చిత్తము, ఈ వాసనలను (విషయానుభవములను) ప్రేరేపించి సుఖదుఃఖములను కలిగించి, మనసుచే తదనుగుణ విషయములను అంతర ప్రపంచంనుంచి గ్రహింపజేసి, జగత్ (గ్రహిత విషయములను) ను, భావముల రూపంలో దృష్టికి తెచ్చి కర్మేంద్రియములద్వారా క్రియలను, ప్రతిక్రియలను ఆచరింపజేస్తుంది.
కల మానసిక దశలో అంతఃకరణములన్నీ, కర్మేంద్రియములు పనిచేస్తాయి. జ్ఞానేంద్రియములు పనిచేయవు. అందువల్ల బయటి భౌతిక ప్రపంచముతో అనుసంధానముండదు. శరీరము బయట
ఏం జరుగుతోందో తలియదు.
మెళకువ, కల మానసిక దశలను ద్వైత స్థితి అంటారు. సుషుప్తి, ఆత్మ దశ లను అద్వైత స్థితి అంటారు. ఆత్మ దశను జాగ్రత్ సుషుప్తి, శుద్దాహం, ప్రజ్ఞానము, ముక్తము అనీ అంటారు.
ఆత్మ దశలో మెళకువ (జాగ్రత్) ఉంటుంది. అన్నీ తెలుస్తాంటాయి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియముల అనుసంధానం ఉంటుంది. కావాలనుకుంటే, అవసరమైతే ద్వైత స్థితి కలిగి అంతఃకరణములు పనిజేసి మానసిక కార్యకలాపములు జరుగుతాయి వద్దనుకుంటే ఆగి, అంతఃకరణలు విరమింపబడతాయి. అద్వైతానుభవము దృష్టిలో, విశ్రాంత దృష్టిగా ఉంటుంది.
సుషుప్తిలో ఈ వీలుండదు. ఏదీ తెలియదు. దీనినే తమస్సు అంటారు. కొందరు జ్ఞానరాహిత్యాన్ని తమస్సు అంటారు.
మనకు లౌకిక, ఆధ్యాత్మిక, భాషా, కళా జ్ఞానములు, ఏ ఇతర జ్ఞానమైనా కలగాలంటే త్రిపుటి ఏర్పడాలి.
గ్రహణ "జ్ఞాత - జ్ఞానము - జ్ఞేయము" గా విడాలి. ఇది అద్వైత స్థితిలో జరగదు. ద్వైత స్థితి లోనే త్రిపుటి ఏర్పడుతుంది.
త్రిపుటి రూపములు
ధ్యాత - ధ్యానము - ధ్యేయము
కర్త - క్రియ. - కర్మ
తెలుసుకునేవాడు-తెలుసుకోవడం- తెలుసుకునేవస్తువు
జ్ఞాతగా మాత్రమే ఉంటే అది సత్త్వ గుణము. ఇప్పుడు జ్ఞాతను ప్రాజ్ఞుడు అంటారు. ఇది విశ్రాంత దృష్టి. గమనిక మాత్రము.
జ్ఞాత దృష్టిలో అంతఃకరణములైన మనోబుద్ధ్యహంకారచిత్తములుంటే రజో గుణము. ఇప్పుడు జ్ఞాతను తైజసుడు అంటారు. ఇది అంతర్ముఖ దృష్టి.
అంతఃకరణములద్వారా జ్ఞాత విషయాన్ని గ్రహిస్తే అది తమో గుణము. ఇప్పుడు జ్ఞాతను వైశ్వానరుడు అంటారు.
గుణము అంటే ముడి.
దృష్టి అంతఃకరణములద్వారా విషయములకు, విషయానుభవములకు ముడిపడి ఉంటే రజస్తమోగుణములు. వీటితో ముడిపడక వట్టి గమనికగా ఉంటే సత్త్వ గుణము.
గుణమును న్యాయవైశేషికములు, సాంఖ్యయోగములు కూడా ప్రతిపాదించాయి.
జాగ్రత్ సుషుప్తి, విశ్రాంత దృష్టి యైన ఆత్మదశ పై, ఆత్మదృష్టిపై జాగ్రత్, స్వప్న, సుషుప్తులు మనకి తెలిసీ తెలియక రోజూ ఆనతాయి. అప్పుడు మనము అంతర్ముఖ, బహిర్ముఖ దృష్టులను పొంది విశ్రాంత దృష్టిని కోల్పోయి మానసికముగా, శారీరికముగా చరిస్తాము.
జ్ఞాత, జ్ఞేయములు లేని జ్ఞానము ప్రజ్ఞానము.
"ప్రజ్ఞానమ్ బ్రహ్మా"
శుద్ధజ్ఞానము అన్నా, శుద్దాహం అన్నా ఇదే.
"అహం బ్రహ్మాస్మి"
జ్ఞానుల, ఋషుల, మునుల స్థితి ఇది. నిర్గుణ స్థితియన్నా ఇదే.
గుణములు కలుగక మానసిక కార్యకలాపములు జరుగవు.
తమస్సు అంటే ఏ గ్రహణా, గ్రహింపు లేని, ఏమీ తెలియని జ్ఞానరహిత దృష్టి. నిర్గుణ స్థితి కాదు. మెళకువ (తెలుస్తూ) ఉండదు. శరీర అంతర్, బహి అనుసంధానం ఉండదు.
గమనించే తెలివి ఆత్మ. ఇది ప్రకాశము.
గమనికలో ఏమీ లేకపోవడం తమస్సు. ఇది చీకటి.
ఈ రచన బ్రహ్మజ్ఞానముపై ఆధారపడి రచింపబడినది.
ఉపనిషత్తులు, షడ్దర్శనములు, శబ్దబ్రహ్మసిద్ధాంతము, తత్సంబంధ భారతీయ తత్త్వములు, తత్త్వ మీమాంసలు, వైజ్ఞానిక, ఆస్తిక దృష్టులతో వెలువడ్డాయి, వ్యాఖ్యానించబడ్డాయి. ప్రస్తుతము చాలామందికి శంకరుల, రామానుజుల, మధ్వాచార్యుల, తదితర వ్యాఖ్యానముల గురించి మాత్రమే తెలుసు.
ఉపనిషత్ ప్రతిపాదనలను జ్ఞానబోధమీమాంసా పరంగా కూడా వ్యాఖ్యానించవచ్చు. అప్పుడు మనకింతవరకు తెలిసిన ఈ విషయములను కొత్త కోణంలో చూసినప్పుడు మనకు వింతగా కనిపించి ఒప్పుదల చూపనీయవు. కాని శాస్త్రము శాస్త్రమే.
మనకు విశాల దృక్పథము ఉంటే కొత్త విషయాలను ఆకళింపు చేసికోవడానికి ప్రయత్నిస్తాము.
ఆధ్యాత్మిక గ్రంథములలో తమస్సు, తమోగుణము పదాలు అస్తమానూ వస్తాయి.
మనలో ఆత్మ ఉండి మన జ్ఞాన, విజ్ఞాన, భాషాజ్ఞాన సముపార్జనకు అవసరమైన మానసిక కార్యకలాపములను జరపడానికి, జరపడానికి కావలసిన శక్తినీ (చిచ్ఛక్తిని) ఇస్తూ, జరిపిస్తూ ఈ మానసిక కార్యకలాపములను గమనించే వీలునూ కలిగిస్తోంది.
మనలో అస్తమానూ ఉండేది ఆత్మ దశ. దీనిపై మూడు మానసిక దశలు కలిగి పోతూంటాయి.
అవి:
జాగ్రత్ (మెళకువ),
స్వప్న (కల),
సుషుప్తి (గాఢనిద్ర).
సుషుప్తి మానసిక దశలో మనసు, ఇతర అంతఃకరణములైన బుద్ధ్యహంకారచిత్తములు (లోని పనిముట్టులు) పనిచేయక విరమణలో ఉంటాయి. ఈ దశలో మానసిక కార్యకలాపములేవీ జరగవు. గ్రహణలు, గ్రహింపులు, క్రియలు, ప్రతిక్రియల కలాపము విరమింపబడి పూర్ణ శాంతి మనసై, నిరాకుల స్థితి అనుభవమై ఉంటుంది.
జాగ్రత్, కల మానసిక దశలలో అన్ని అంతఃకరణములు పనిజేసి సకల మానసిక కార్యకలాపములను నిర్వహిస్తాయి.
మనసు మాధ్యమము ద్వారా జ్ఞానేంద్రియములు బయటి భౌతిక ప్రపంచము తో అనుసంధానింప బడి గ్రహణలు, తద్వారా కలిగిన అనుభవములు, గ్రహింపులు, వరుసగా మనసు, చిత్తముల ద్వారా గ్రహింపబడి అంతర ప్రపంచంగా, వాసనలుగా భద్రపరుపబడతాయి. ఇది బహిర్ముఖ దృష్టి.
మళ్ళీ చిత్తము, ఈ వాసనలను (విషయానుభవములను) ప్రేరేపించి సుఖదుఃఖములను కలిగించి, మనసుచే తదనుగుణ విషయములను అంతర ప్రపంచంనుంచి గ్రహింపజేసి, జగత్ (గ్రహిత విషయములను) ను, భావముల రూపంలో దృష్టికి తెచ్చి కర్మేంద్రియములద్వారా క్రియలను, ప్రతిక్రియలను ఆచరింపజేస్తుంది.
కల మానసిక దశలో అంతఃకరణములన్నీ, కర్మేంద్రియములు పనిచేస్తాయి. జ్ఞానేంద్రియములు పనిచేయవు. అందువల్ల బయటి భౌతిక ప్రపంచముతో అనుసంధానముండదు. శరీరము బయట
ఏం జరుగుతోందో తలియదు.
మెళకువ, కల మానసిక దశలను ద్వైత స్థితి అంటారు. సుషుప్తి, ఆత్మ దశ లను అద్వైత స్థితి అంటారు. ఆత్మ దశను జాగ్రత్ సుషుప్తి, శుద్దాహం, ప్రజ్ఞానము, ముక్తము అనీ అంటారు.
ఆత్మ దశలో మెళకువ (జాగ్రత్) ఉంటుంది. అన్నీ తెలుస్తాంటాయి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియముల అనుసంధానం ఉంటుంది. కావాలనుకుంటే, అవసరమైతే ద్వైత స్థితి కలిగి అంతఃకరణములు పనిజేసి మానసిక కార్యకలాపములు జరుగుతాయి వద్దనుకుంటే ఆగి, అంతఃకరణలు విరమింపబడతాయి. అద్వైతానుభవము దృష్టిలో, విశ్రాంత దృష్టిగా ఉంటుంది.
సుషుప్తిలో ఈ వీలుండదు. ఏదీ తెలియదు. దీనినే తమస్సు అంటారు. కొందరు జ్ఞానరాహిత్యాన్ని తమస్సు అంటారు.
మనకు లౌకిక, ఆధ్యాత్మిక, భాషా, కళా జ్ఞానములు, ఏ ఇతర జ్ఞానమైనా కలగాలంటే త్రిపుటి ఏర్పడాలి.
గ్రహణ "జ్ఞాత - జ్ఞానము - జ్ఞేయము" గా విడాలి. ఇది అద్వైత స్థితిలో జరగదు. ద్వైత స్థితి లోనే త్రిపుటి ఏర్పడుతుంది.
త్రిపుటి రూపములు
ధ్యాత - ధ్యానము - ధ్యేయము
కర్త - క్రియ. - కర్మ
తెలుసుకునేవాడు-తెలుసుకోవడం- తెలుసుకునేవస్తువు
జ్ఞాతగా మాత్రమే ఉంటే అది సత్త్వ గుణము. ఇప్పుడు జ్ఞాతను ప్రాజ్ఞుడు అంటారు. ఇది విశ్రాంత దృష్టి. గమనిక మాత్రము.
జ్ఞాత దృష్టిలో అంతఃకరణములైన మనోబుద్ధ్యహంకారచిత్తములుంటే రజో గుణము. ఇప్పుడు జ్ఞాతను తైజసుడు అంటారు. ఇది అంతర్ముఖ దృష్టి.
అంతఃకరణములద్వారా జ్ఞాత విషయాన్ని గ్రహిస్తే అది తమో గుణము. ఇప్పుడు జ్ఞాతను వైశ్వానరుడు అంటారు.
గుణము అంటే ముడి.
దృష్టి అంతఃకరణములద్వారా విషయములకు, విషయానుభవములకు ముడిపడి ఉంటే రజస్తమోగుణములు. వీటితో ముడిపడక వట్టి గమనికగా ఉంటే సత్త్వ గుణము.
గుణమును న్యాయవైశేషికములు, సాంఖ్యయోగములు కూడా ప్రతిపాదించాయి.
జాగ్రత్ సుషుప్తి, విశ్రాంత దృష్టి యైన ఆత్మదశ పై, ఆత్మదృష్టిపై జాగ్రత్, స్వప్న, సుషుప్తులు మనకి తెలిసీ తెలియక రోజూ ఆనతాయి. అప్పుడు మనము అంతర్ముఖ, బహిర్ముఖ దృష్టులను పొంది విశ్రాంత దృష్టిని కోల్పోయి మానసికముగా, శారీరికముగా చరిస్తాము.
జ్ఞాత, జ్ఞేయములు లేని జ్ఞానము ప్రజ్ఞానము.
"ప్రజ్ఞానమ్ బ్రహ్మా"
శుద్ధజ్ఞానము అన్నా, శుద్దాహం అన్నా ఇదే.
"అహం బ్రహ్మాస్మి"
జ్ఞానుల, ఋషుల, మునుల స్థితి ఇది. నిర్గుణ స్థితియన్నా ఇదే.
గుణములు కలుగక మానసిక కార్యకలాపములు జరుగవు.
తమస్సు అంటే ఏ గ్రహణా, గ్రహింపు లేని, ఏమీ తెలియని జ్ఞానరహిత దృష్టి. నిర్గుణ స్థితి కాదు. మెళకువ (తెలుస్తూ) ఉండదు. శరీర అంతర్, బహి అనుసంధానం ఉండదు.
గమనించే తెలివి ఆత్మ. ఇది ప్రకాశము.
గమనికలో ఏమీ లేకపోవడం తమస్సు. ఇది చీకటి.
ఈ రచన బ్రహ్మజ్ఞానముపై ఆధారపడి రచింపబడినది.
Self concept is a motivation for behavior.
ReplyDeleteA unique relationship exists between the individual and society.