Monday, September 3, 2018

శోచనీయం; తెలివితక్కువ "మేధావులు"; రచయిత; ఏది, ఎవరు కారణం?; తెలుగు సారస్వత సృష్టి తీరు; నేను


విమర్శనా సూత్రములకు అందని పదముల వరుసలు నేడు రాజ్యమేలుచున్నవి; విమర్శకుల కఠిన నిబంధనలకు లోబడి ఏ కవనమూ ఉదయించుట లేదు; అసలు విమర్శయే కురూపైంది
**********
చిలుకును మనసును వలపను కవ్వముతో ఆపై మథించును డెందమును కోర్కెలను మరొక కవ్వముతో; యువతులును మన్మథుడును జట్టుకట్టి వేథించుచున్నారు యువకులను కసిగా
*******
Many intellectuals in India are abusing their hatred for Modi by dismissing and denigrating Hinduism to the displeasure and anger of crores of Hindus. Are they intellectuals?
********
శోచనీయం
"మగవారు పెళ్లి చేసుకుంటామని మాయ మాటలు చెప్పి అమ్మాయిలను "లోబరచుకుంటారు". అమ్మాయిలు "అమాయకంగా" వారి మాటలు నమ్మి తొందరపడి ముందే విందులు చేస్తారు".
ఇలాంటి వార్తలు ఇంచుమించు రోజూ చదివి చదివి విస్తుపోవడం జరుగుతోంది. ఒకరి అనుభవాలు ఒకరికి తెలియకుండా ఈ అధునాతన ప్రపంచంలో కూడా జరుగుతోందంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది.
ఇంత తేలిగ్గా దుష్టులైన మగవారి మోసపు మాటలు విని పదే పదే అమ్మాయిలు ఎందుకు మోసపోతున్నారో అర్థం కాదు. వారి చదువులు వారికి ఎందుకూ పనికి రాకుండా పోవడం శోచనీయం.
**********
జడలు కట్టిన సాములోర్లున్నారు
జడలు లేని అమ్మాయిలున్నారు
జడపాయలు వడి వేసే యువతులు లేరు
జటాజూటధారి కరుణ మాత్రం మనపై కలదు
నా హృదయంలో నివసించియున్నాడు కృష్ణమూర్తి
భక్తవరదుడు జగన్నాటక సూత్రధారి శ్రీమహావిష్ణువు
లక్ష్మీ వల్లభుడు నారాయణుడు నరాద్వైతుడు
దైత్యదమనుడు బృందావన విహారి జగన్నాథుడు
**********
భగవంతులు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు అవతార పరి సమాప్తి చేశారు అనే విషయాల కన్న భగవన్నామం స్మరిస్తూ ఉండడం వల్ల ఉపయోగం ఉంది.
*******
చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ!
జయదేవుని కాలంలో కళేబరం అనే పదాన్ని శరీరానికి ప్రత్యామ్నాయ పదంగా వాడేరు.
ఇప్పుడు మనం కళేబరాన్ని మృత శరీరానికి ప్రత్యామ్నాయంగా వాడుతున్నాము.
భాషలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. పరిణమిస్తుంది.
అలాగే భావాలు, ఆలోచనలు. ఆదిమ మానవుని మస్తిష్కంలో ఉన్నది వేరు, ఇవాళ మన మస్తిష్కాలలో ఉన్నది వేరు.
అలాగే ఉపనిషత్తుల కాలంలో ఉపనిషత్ స్రష్టల అనుభవాలు వేరు ఇవాళ మన అనుభవాలు వేరు.
మనిషి ఎదిగే కొద్దీ నాగరికత, సంస్కృతి ఎదగాలి. కాని చాలా సార్లు పతనం అవుతూ ఉంటాయి. ఇదో వింత. పాత అనుభవాలనుంచి మనిషి ఏమీ నేర్చుకోవడం లేదు.
మనిషి మనసు వికసించాలి. అందువల్ల సమాజానికి ప్రయోజనం ఉంది. కాని మనిషి మనసు కుచించుకు పోతోంది. సంకుచిత భావములే మన అశాంతికి, బాధలకు, కష్టాలకు, వేదనలకు కారణం.
సాంకేతిక జ్ఞానం పెరీగిన తరువాత ఆ సౌకర్యాలు అనుభవిస్తూ మనిషి సాంకేతిక పరిజ్ఞానం అలవరచు కోవడం హడావుడిలో మనసును వికసింప చేసు కోవడం నిర్లక్ష్యం చేస్తున్నాడు. దానికి తగ్గ కష్టనష్టాలు భరిస్తున్నాడు.
మనిషి వివేకము, విచక్షణ, వినయం, ఆహ్లాదం మర్చిపోయాడు.
దురదృష్టవశాత్తు ప్రస్తుతం భారతదేశంలో తెలివితక్కువ మేధావులే ఎక్కువగా ఉన్నారు.
********
Many intellectuals are depicting marriage as a hurdle, husband and children are botheration for career focused girl. It seems correct.
*********
Facebook has given voice to everyone.
*******
తెలుగు భాష చదువులకు మాధ్యమం కావాలి
తెలుగువారందరూ తెలుగులో మాట్లాడాలని ఊదరగొట్టేస్తారు "భాషాభిమానులు"; ఇవన్నీ ఇతరుల కొరకు ఉచిత సలహాలు; మన పిల్లలు, మనమలు, మనుమరాండ్రు ఆంగ్ల భాషా మాధ్యమంలో చదవాలి; అమెరికా వెళ్లి ఆంగ్ల భాష మాట్లాడాలి; గ్రీన్ కార్డు రావాలి; ఆ దేశపు పౌరులవ్వాలి; వీరిక్కడ డప్పులు కొట్టుకోవాలి
నిబద్ధత లేని మాటలు; ఆచరించని ఉపదేశములు;
చెప్పడానికే నీతులు ఉన్నాయి అనే పాటకి ఉదాహరణలు
**********
రాజకీయంబులైనవి ఎన్నికల సమరాంగణము యందు రణములు; ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకు నాయకుల రంగభూమి; ఎవడూ యుద్ధం చేయడు; ఒడ్డున కూర్చుని ఈత పాఠాలు ఉపన్యసించును.
*********
We have many cults in India. They all are independent under the name of a yogi, a swami, a baba, an Amma, a sanyasi or the like. Many of these cults under the name of the chief person of the cult; but use Hindu Gods and Goddesses and related culture in their Asramas.
They use the books like Bhagavata, Ramayana etc , itihasas, the Upanishads, the Darsanas, do daily pujas according to Hindu system of rituals and perform yagnas, homams, yagas, and the like. But they declare that they are not Hindus neither their cult is part of Hinduism. They claim theirs is a different religion under the name of chief person around whom the cult is formed. This is how Hinduism is misused by cults.

*******

ఎందుకనొ పెళ్లి ప్రేమని మింగేస్తుంది. గాఢ ప్రేమికులైన వారే భార్యాభర్తలైతే ఎందుకో పొరపొచ్చాలు వస్తాయి. అంతటి ప్రేమ ఇగిరి పోతుంది. కరిగి పోతుంది. పెళ్లి బాధ్యతల ముందు తట్టుకోలేక ప్రేమ పరారి అయిపోతుంది. అందుకే అనుభవజ్ఞులైన పెద్దలు అంటారు: మనసుని ఉపయోగించి ప్రేమలో పడాలి; బుద్ధిని ఉపయోగించి పెళ్లి చేసికోవాలి అని.
**********
పెళ్ళిళ్ళు స్వర్గంలో చేయబడును. కాని విడాకులు భూమి పైననే తీసికొనబడును.
తల్లి, సోదరి, పుత్రిక వీరితో ఏకాంతమున
ఏకాసనమున కూర్చుండరాదు. శయనించరాదు.
ఇంద్రియ మోహ మతి బలవత్తరమైనది. ఎంతటి
జ్ఞాని మనసునైనను ఇది విచలితం చేస్తుంది’.
భాగవతం
**********
మొన్నటి దాకా ఆ అడవుల్లో చందనం చెట్ల దొంగలు
ఇప్పుడు ఇక్కడ అడవుల్లో ఎర్రచందనం దొంగలు;
దుంగలు దుంగలు రవాణా; ఒకటి అరా పట్టుకొని
పోజులు; అసలు దొంగలు పట్టుబడే దాకా ఆగదు ఈ దోపిడీ
*******
Amaravathi is the pet project of one and bullet train of another. Personal idiosyncrasies play a lot in shaping and sticking to one's pets at the cost of public money.
***********
తెలివితక్కువ (అసాంఘిక) "మేధావులు"
తెలివైన మేధావులెవరు రాజకీయ సిద్ధాంతాలతో మమేకం కారాదు. కారు. వారి స్వతంత్రత పోతుంది. తెలివి తక్కువ మేధావులు ఉంటారా అనే ప్రశ్న వేయద్దు.
కొందరు ఎంతో మేధావులము అనుకుంటారు. సమాజమూ వారిని అలాగే పిలుస్తుంది. అందుకని ఈ వివరణ. దురదృష్టవశాత్తు ప్రస్తుతం భారతదేశంలో తెలివితక్కువ "మేధావులే" ఎక్కువగా ఉన్నారు. మేధావి పదానికే మచ్చ తెచ్చే ఈ మనుషులు విశృంఖల విహారం చేస్తున్నారు.
సమాజాన్నీ ప్రభావితం చేస్తున్నారు.
సంకుచిత, క్రూర కార్యకలాపాలను మెచ్చుకుంటూ, కొమ్ము కాస్తూ, వాటిని, వారిని కాపాడుతూ మేధావి ముసుగులో సంఘంలో అశాంతి సృష్టిస్తున్నారు.
ఇటువంటి మేధావులు తామరతంపరగా ఎదిగి సమాజంలో అల్లకల్లోలాలు సృష్టిస్తున్నారు. సంఘ ద్రోహం చేస్తున్నారు. మేధావి బాధ్యతలను నిర్వర్తించడం లేదు.
*******
The penalty for viewing the cricket match is being paid by forceful viewing of disgusting advertisements which are vulgar, tasteless and some are unintelligible.
*******
In test matches we can enjoy seeing how cricket is played.
In shorter versions we enjoy more seeing how big shots are made
The ability of batsman in test match can be gauged by how well he leaves the balls.
In shorter versions the ability of a batsman is gauged by how well he makes big shots.
*********
ఫేస్బుక్ లో అక్కడా మహనీయులను వారి జన్మ, మరణ తేదీలు గుర్తు పెట్టుకొని సంస్మరించడం కన్న ఇష్టమైన పెద్దల మార్గంలో నడవడం మిన్న.
********
రచయిత
రచయితగా ఉండడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో బాధ్యతతో కూడిన వృత్తి. రచయిత సంఘానికి మార్గ దర్శకుడు. సరియైన ప్రవృత్తి లేక రచయితలైతే సంఘానికి మేలు కన్న కీడు ఎక్కువ చేస్తారు.
రచయిత ఎంత సాక్షీ మాత్రంగా ఉంటే అంత ఉపయోగకరమైన రచనలు చేయగలడు. కవులకు తాదాత్మ్యం మేలు చేస్తుంది. కాని రచయితలకు తమ తాదాత్మ్యం వృత్తి పట్ల ఉంటూ, రచనలు చేయడంపై శ్రద్ధ, గౌరవం ఉండాలి. భాషా ప్రావీణ్యం, విశ్లేషణ, విచక్షణ ఉండాలి. ఎంతో చదవాలి. మరెంతో అవగాహన చేసి కోవాలి.
ఏదో సిద్ధాంత పంజరపు చిలకలైతే చర్విత చర్వణంగా ఊదరగొడతారు. చివరికి వారి సిద్ధాంతం పట్ల పాఠకులకి చికాకు, ఏవగింపు కలిగేలా పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి లా తయారవుతుంది ఆ రచయిత స్థితి. రచయిత ఉన్నతమైన దృక్పథం కలిగి సమాజాన్నీ, అన్ని సిద్ధాంతాలను సమరస భావంతో పరిశీలించాలి. రచయిత ఎంత బాధ్యతాయుతంగా రాస్తే సమాజానికి అంత ఉపయోగం.
నానృషిః కురుతే కావ్యం!
********
ఏది, ఎవరు కారణం?
సన్నటి అమ్మాయిలు లావుపాటి అమ్మలుగా మారతారు; చిన్నప్పుడు చక్కని జుట్టు గల నాన్న బట్టతల వాడవుతాడు; కాలం ప్రవహిస్తోందా, జీవులైన
మనుషులు ఎదుగుతున్నారా? తేడా కాలం వల్లా?
గుండురాయి కాలం ప్రవహిచినా అలాగే ఉంది
ఏమీ మారలేదు; మార్పునకు కాలం కారణమా?
వస్తువు ప్రకృతి, స్వభావములూనా కారణాలు?
అదే సూర్యుడు అలాగే ఉదయించి అస్తమిస్తున్నాడు
నిరంతరంగా; చంద్రుడు అలాగే కళలు తగ్గించుకొని పెంచుకుంటున్నాడు ఎప్పటినుంచో; పైగా సూర్య చంద్రులు కాలమును వారే సృష్టిస్తున్నారు; మరి విశ్వంలో, ప్రకృతిలో ఇన్ని మార్పులకు కారణం ఏమిటి?
కాలం కాదనుకుంటా! మరి? ఏది? ఎవరు కారణం
ఇన్ని మార్పులకు; ఇంతటి విశ్వం, ప్రకృతులలో?
*******
తెలుగు సారస్వత సృష్టి తీరు
మనుషుల కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వ్యథలు ఇవి మాత్రమేనా కవితలల్లుటకు, కథలు వ్రాయుటకు అనువైన వస్తువులు?
ఏ ముహూర్తాన "తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ......." లాంటి కవితలు ప్రసిద్ధి పొందాయో కాని తెలుగునాట అటువంటి సాహిత్యమే - సాహితీ సృష్టియే రాజ్యం ఏలుతోంది.
సారస్వతంలో స్వారస్యమే మాయమైంది. ఇంకో వస్తువుల మీద సాహితీ సృష్టి చేసినా, అదేదో సంఘ వ్యతిరేక చర్యగా పరిగణింపబడుతోంది. సంప్రదాయ సాహితీ రీతులు అటకెక్కాయి.
అసలు ఇలా ఎవరు నిర్దేశిస్తున్నారు? ఒక కూటమిలా తయారై తెలుగు సారస్వత సృష్టిని పరిమితం చేశారు, కొందరు సాహితీ స్రష్టలు, విమర్శకులు.
ఈ ధోరణి మారాలి. రకరకాల వస్తువులు సాహితీ సృష్టికి ప్రేరణ కావడాన్ని అందరూ ఆహ్వానించాలి. ప్రణయ కవిత్వం పూర్తిగా సినిమా పాటలకే పరిమితం అయింది. అదీ వల్గర్ గా తయారైంది.
భక్తి, జ్ఞాన ప్రబోధకములైన సాహిత్యాన్ని నిషేధించకపోయినా, ఇంచుమించు అలాంటి పరిస్థితి ఉంది. ఎవరైనా కవి కావచ్చు అనేది ఒకే. కాని ఫలానాదే కవితా వస్తువు కావాలి, కథలు రాయడానికి, సాహితీ సృష్టి చేయడానికి ప్రేరణ కావాలి అనే unwritten manifesto ప్రభావం నుంచి తెలుగు సారస్వత సృష్టి బయటికి రావాలి.
ఒక్క సామ్య వాదమో, హేతువాదమో, నాస్తికత్వమో, కుల గత సాహితీ సృష్టులో, స్త్రీ గత సారస్వతమో మాత్రమే రాయబడాలి, పురస్కారాలకు, మెప్పులకు అవి మాత్రమే అర్హం అనే సంకుచితత్వం పోవాలి. సౌమ్య వాదం అందరికీ ప్రేరణ కావాలి.
ముఖ్యంగా సారస్వతం యొక్క ప్రధాన పరమార్థం విశ్వశ్రేయస్సు. కవిత్వం వర్ణనలతో, అలంకారములుతో, ధ్వనితో, రసపోషణతో, శబ్ద విన్యాసంతో శోభిస్తుంది.
తెలుగు సాహితీ సృష్టిపై పుర్రచేతి భావాల, వాద రాద్ధాంతాల నిరంకుశత్వం నశించాలి. అప్పుడే తెలుగు సాహిత్యం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.

*********
ప్రజలను జ్ఞానవంతులని చేయాలనే తహతహలో తప్పుడు జ్ఞానాన్ని అందిస్తున్నారు ఎందరో సాలెగూళ్ళ మాధ్యమాల ద్వారా. తమకు అందిన, "తెలిసిన", తెలుసుననుకున్న జ్ఞానం యొక్క నిఖార్సయిన అవగాహన లేకుండా అంతర్జాలం లోకి తోసేస్తున్నారు.
ఇవి తత్త్వానికి, మతానికి, ఆచార వ్యవహారాలకి, సంస్కృతికి సంబంధించినవి.
ఈ మిడి మిడి జ్ఞానులు సినిమాలు, ఇతర దృశ్య, శ్రవణ, అచ్చు మాధ్యమాలు చరిత్రని, రామాయణ, మహాభారతాలని, భాగవతాన్ని, వక్రీకరించి నట్లు 
వక్రీకరిస్తున్నారు. అసలుది ఏమిటి అనే విషయంలో ఎంతో గందరగోళాన్ని, అపార్థాలను సృష్టిస్తున్నారు.
ఈ పెడధోరణుల వల్ల మొదటికే మోసం వస్తోంది.
*********

ఇన్ని సహస్రనామాలు ఉండగా, అన్నా చెల్లెళ్ల సహస్రనామాలు మాత్రమే ఇంత ప్రాచుర్యం పొందాయి ఎందుకో?
********
మనమే మన కట్టు, బొట్టు, ఆచారాలు, పద్ధతులు, పండుగలు వదిలేస్తూ ఉంటే, విదేశీయులు మన సంస్కృతి పట్ల మోజు చూపిస్తున్నారు, కట్టు, బొట్టు మనలా మార్చుకుంటున్నారు అని గొప్పలు పోవడంలో అర్థం ఏముంది?!
******
నేను అనే అవగాహనను శరీరానికి పరిమితంచేస్తే అది దేహాత్మ భావన.
నేను అనే అవగాహనను శరీరమునకు, మనసుకు, బుద్ధి, అహంకార, చిత్తములకు పరిమితంచేస్తే అది జీవాత్మ భావన.
నేను అనే అవగాహనను
సత్య-జ్ఞానం-అనంతం-బ్రహ్మా / ఆనందో బ్రహ్మా / రసోవై స: / సర్వమ్ ఖలు ఇదమ్ బ్రహ్మా / ప్రజ్ఞానం బ్రహ్మా / తత్ త్వమ్ అసి / అహం బ్రహ్మాస్మి / బ్రహ్మా సత్ జగత్ మిథ్యా, జీవో బ్రహ్మా ఏవ న అపర: -
వంటి ఉపనిషత్ మహా వాక్యముల, వేదాంత వాక్యముల సారముతో అనుసంధానించుకొని అనుభవముగా మార్చుకొని జీవన్ ముక్తునిగా నిలిచి జీవిస్తే అది పరమాత్మానుభవయుత సతత శాంతానంద సాక్షీమాత్ర జ్ఞాన తత్త్వానుభవము.
********
మన అన్ని వ్యాపకములు, కాలక్షేపాలు ఫేస్బుక్ కే పరిమితం అయిపోతున్నాయి. సమయం మిగిలితే ఉద్యోగం చేయడం, అన్నం తినడం, నిద్రపోవడం చేస్తున్నాము. ఇక్కడే జీవించి ఇక్కడే బకెట్ తన్నేస్తామేమో!

No comments:

Post a Comment