Sunday, September 9, 2018

నన్ను తీర్చిదిద్దిన నా గురువులు ; Silence; మనసు వాగుడు; తత్త్వ గురువులు

నన్ను తీర్చిదిద్దిన నా గురువులు 

తల్లి మనకు మొదటి గురువు. తండ్రి మన మాలి గురువు. అప్పుడు మనకు ప్రాథమిక ఉన్నత పాఠశాలలోను, కళాశాలలలోను, విశ్వవిద్యాలయములలోను గురువులు మనకు పాఠములు చెప్పి మనకు గురువులు అవుతారు. ఇందులో కొందరు మనపై గాఢ ముద్ర వేసి మన జీవితాన్ని సుసంపన్నం చేస్తారు. నన్ను జ్ఞానవంతుణ్ణి చేసి నన్ను మలచిన అటువంటి ఇద్దరు గురువుల గురించి ఇప్పుడు పరిచయము చేస్తాను.
శ్రీ చామర్తి నాగేశ్వరరావు గారు పాఠశాలలో ఫస్ట్ క్లాసులో నా మొదటి గురువు. నేను ఆయన ద్వారానే అక్షరములు, అంకెలు నేర్చుకున్నాను. ఆయనంటే నాకు ఎంత ఇష్టం ఏర్పడిందంటే ఆయన్ని వదిలి రెండవ క్లాసుకి ప్రమోషన్ వచ్చినా వెళ్లానని గోవ పెట్టాను. హెడ్ మాష్టారు రెండంటించి రెండవ క్లాస్ లో కూర్చోపెట్టారు అది వేరే విషయం.
ఉన్నత పాఠశాలలో నా గురువులు ఆకెళ్ళ కామశాస్త్రి గారు (తెలుగు),డ్. సూర్యనారాయణ గారు (గణితం), మా నాన్నగారు శ్రీ వారణాసి వెంకట నరసింహ మూర్తి గారు. మా నాన్నగారు నాకు తండ్రిగా ఈ శరీరాన్ని ఇవ్వడమే కాక గురువుగా నా ఆంగ్ల భాషా పాండిత్యాన్ని, జీవితముపై అవగాహనను కలిగించారు. నాకు పథ నిర్దేశకులు కాక పోయినా నన్ను ఆంగ్ల భాషలోనూ, ఇంగితజ్ఞానంములోను సుసంపన్నము చేశారు. నాకు ఇంట్లోనే ఆంగ్ల భాష మా నాన్నగారి ద్వారా నేర్పబడింది. ఆంగ్లభాష వ్యాకరణము నాకు కరతలామలకం కావడానికి మా నాన్నగారి పాత్ర ఏంటో ఉంది. మా నాన్న గారు నేను ఉన్నత పాఠశాలలోనికి వచ్చేసరికి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు.
ఆంగ్ల భాషలో బలహీనులైన విద్యార్థులకు మా ఇంటి దగ్గర ప్రత్యేకముగా పాఠాలు చెప్పేవారు. నేను ఆరవ క్లాసు నుంచీ అటు వఛ్చి, ఇటు వఛ్చి ఆంగ్లభాష వ్యాకరణము వింటూ ఉండేవాణ్ణి. అలా నేను 11వ క్లాసుకి S.S.L.C కి వచ్చ్చేసరికి ఆంగ్ల వ్యాకరణము కంఠతా వచ్చేసింది. S.S.L.C లోనూ మా నాన్న గారే మాకు ఇంగ్లీష్ మాస్టారు. అందువల్ల నాకు ఈ వ్యాకరణ జ్ఞానము ముందు ముందు ఎంతో ఉపయోగించింది. నన్ను ఆంగ్ల భాషలో ఒక రచయితగా, కవిగా చేయడంలో ఆ వ్యాకరణ జ్ఞానము ఎంతో దోహదం చేసింది. నేను తరవాత నేర్చుకున్న జర్మన్, ఫ్రెంచ్, సంస్కృతం భాషలలో వ్యాకరణము ఎలా పట్టుకోవాలో నేర్పింది. అలాగే నేనుతరవాత చదివిన ఫిజిక్స్ లో విషయగ్రహణకు, అర్థం చేసు కోవడానికి ఈ ఆంగ్ల భాషా ప్రావీణ్యత ఎంతో ఉపయోగపడింది.
తరువాత నన్ను అంతగా ప్రభావితం చేసినది శ్రీ శివశర్మ గారు. ఆయన మాకు ఎం. ఎస్సీ. లో గురువులు. ఆయన ఫిజిక్స్ పాఠం చెప్పే విధము నాకు ఆ శాస్త్రములో ఆసక్తి, అవగాహన కలిగించాయి. నన్ను నన్నుగా చేశాయి. తరువాత నేను రిసెర్చ్ చేసేటప్పుడు ఈ అవగాహన ఎంతో ఉపయోగపడింది.
నాకు జర్మన్ నేర్పిన హేరీ అండ్ బ్రిగీటా స్పిరిట్బార్జ్ లు నన్ను ఏంతో ప్రభావితం చేశారు. ఫ్రెంచ్ నేర్పిన బుల్లోజు బసవలింగం గారు ఎంతో ఆదరంతో ఫ్రెంచ్ నేర్పారు. అయన మంచి వ్యక్తి కూడా. మేమిద్దరం యానాం లో కొల్లీగ్స్.
నా రీసెర్చ్ గైడ్ డా. ఏ. ఎస్. కొలాస్కర్ నన్ను మలిచిన గురువులు. ఆయన నిర్దేశనలో పరిశోధన ఎలా చేయాలో, పరిశోధనా పత్రములు ఎలా తయారు చేయాలో, కాన్ఫరెన్సులలో ఎలా పరిశోధనను వివరించాలో నేర్చుకున్నాను.
ఈ అందరు గురువులు నన్ను తీర్చి దిద్దారు. వీరందరికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను.
********
సినీ తారలు తప్ప రాజకీయ పార్టీలకు ఓట్లు తెచ్చే నాథుడే లేనట్టున్నాడు. అలాగే హిందూ మతాన్ని, బ్రాహ్మణులను తిట్టడం ఒక మార్గము. అసలు రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలే లేవు. పన్నులు కట్టే వారి సొమ్ము పేదలకు ఈ పేరుతో, ఆ పేరుతో పంచి పెట్టడం మరొక విద్య.
ఈ నాయకులా భారతదేశ ప్రజల జీవితాలు బాగు పరచేది? వాళ్ళ జీవితాలు వంశ పారంపర్యంగా బాగు చేసుకుంటున్నారు అంతే.
********
Silence is related to the words. Silence is related to the mind. Silence is related to the Consciousness. Silence is related to the Self. Silence is the Self. The melody of the Silence is heard in quietude.
********
Bliss Peace Serenity Silence are original states of mind.
Moods, experiences, feelings, thoughts, utterances, knowing, perceiving and generation of moods, understanding; are super-impositions on these normal phases of mind.
*********

మనం పెళ్లి చేసుకోవాలి. మంచి భార్య/భర్త లభించారా సుఖశాంతులతో బ్రతకచ్చు లేదా సోక్రటీస్/ఫెమినిస్ట్ గా మారచ్చు.
We must get married. If we get affectionate and friendly spouse we can lead a happy and peaceful life. Else we can become Socrates/Feminist.
*******:
ఎడ్డెం అంటే తెడ్డెం అనే మేధావులు పుష్కలంగా ఉన్న భారతదేశంలో ఏది సరియైన మార్గనిర్దేశనము?
అంతా కొట్లాటలు, గందరగోళం, గోల తప్ప దేశానికి, సంఘానికి పనికివచ్చే మాటలు, చేతలు హుళక్కి అయ్యాయి.
**********
ఏం చూసి పెళ్ళిళ్ళు చేస్తాము?
కొన్ని సక్సెస్ అవుతాయి. ఎక్కువగా ఫెయిల్ అవుతాయి.
***********
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. కాని మనసుకు ఈ విషయం తెలియదు. అలా గత జల సేతు బంధనం అంటూ వ్యథ చెందుతూనే ఉంటుంది.
**********
నూటికి తొంభై ఎనిమిది పెళ్ళిళ్ళు తొందరలోనే అయిష్టంగా మారతాయి. దానికి ఎన్నో కారణాలు. కాని ఇంత వరకు వివాహబంధానికి స్త్రీ పురుషులు ఇచ్చిన గౌరవం వల్ల, సర్దుకుపోవడం వల్ల చాలా పెళ్ళిళ్ళు నిలిచిఉన్నాయి. ఇక మీదట సంఘానికి ఈ లగ్జరీ ఉండదు.
**********
పెళ్ళి ఎవరికీ సుఖాన్నివ్వదు. కాని కుటుంబ వ్యవస్థ నిరంతరంగా సాగడానికి పెళ్లి చేసుకోవాలి.
********:
మనసు వాగుడు
మనవంటి చిట్టి చిట్టి కవుల
చిరు చిరు రచయితల సృష్టిని
సమాదరించి, చదివి, జీర్ణము
చేసికొని సమాజంలో ఎవరూ
మారరు; ఏదీ మన రాత ప్రకారం
జరగదు; కొందరు పై వాని రాత
ప్రకారం జరుగుతుందంటారు
అయినా మనం ఎందుకు రాస్తాం?
మన మనస్తత్వం మనల్ని ఊరుకోనివ్వదు
మన కలం ప్రతి ఘటనకు, మాటకు స్పందిస్తుంది
మనదైన తీర్పు, మనదైన పరిష్కారం చూపుతుంది
కానీ పట్టించుకునే వారే ఉండరు; వ్యాస వాల్మీకులనే
ఎవరూ పట్టించుకోవడం లేదు, మనమెంత? అయినా
మనసు ఊరుకోదు; కళవళ పడి ఆరిందాలా వాగుతుంది,
మన ఇష్టాయిష్టములపై
ఆధారపడి ప్రపంచం నడవదు!
మనసుకు ఈ విషయం తెలియదు
మన్ని చంపుతుంది మూర్ఖురాలై
********
మనందరికీ జ్ఞానం, పరిజ్ఞానం చాలా ఎక్కువగా ఉంది.
కరుణ, అనుకంపన మాత్రం ఇసుమంతైనా ఉండటం లేదు.
అందువల్ల మన సాంకేతిక అభివృద్ధి అంతా మనకు సౌకర్యాలు కలిగిస్తుంది కాని, స్థిమితాన్ని ఈయలేదు.
అందుకనే మనకు అన్ని"సరదాలు" తీరుతున్నాయి, కాని సుఖశాంతులు కరువౌతున్నాయి.
కరుణ చూపించక మానవులు మనలేరు.
*********
మగవారు చెడ్డవారు; స్త్రీల పాలిటి రాక్షసులు,
వారిని అణగద్రొక్కుతూ, వాడుకొనువారని కొందరు; బ్రాహ్మణులు చెడ్డవారని; వారు మిగిలిన వారిని
అణగద్రొక్కి ఉంచారని "ఎదగనివ్వలేదని" ఇంకొందరు
మేధావులు సంఘం చెవిన ఇల్లు కట్టుకొని పోరుతారు
ఇందులో నిజం ఎంత, అకారణ ద్వేషం ఎంత? ఎవరికీ తెలియని వింత; అబద్ధాలు ఈ ఆరోపణలు అని తెలిసీ; మగవారైన బ్రాహ్మణులు సంఘం పాలిటి?
********
సన్యాసులేల సంసారుల చుట్టూ తిరిగెదరు?
ఆ బ్రహ్మమో, ఆత్మయో
ఆ అనుభవములో రమిస్తూ జీవించరేమి?
***********
భారతదేశానికి అందించ బడిన వారసత్వం, బాంబ్ విసరడం లాంటిది, "నిరశన దీక్ష". ఇప్పుడు ఎవళ్ళు పడితే వాళ్ళు ఆచరిస్తున్నారు. గాంధీ గారి లాగా, పొట్టి శ్రీరాములు గారి లాగా కాదనుకోండి.
కాని అల్లరి, గోల చెయ్యడానికి పనికివస్తోంది.
ప్రభుత్వాలను చికాకు పెట్టడానికి వాడుకోబడుతోంది.
నిరశన దీక్షనే అందరూ వేళాకోళం చేసే స్థాయికి దిగజారింది. అన్నీ తిని నిరశన దీక్షలేమిటో? అంతా స్వేచ్ఛా జీవితం!
********
మన పూర్వ కవుల ఊహలు రమ్యములు, రమణీయములు.
మనకి ఊహలే లేవు. ఉన్న ఒకరిద్దరు భావుకులని చీదరించుకుంటాము.

********
తత్త్వ గురువులు
శ్రీ రమణ మహర్షి, శ్రీ అరవిందులు, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి ఇంచు మించు సమకాలికులు. ఒకరి గురించి ఒకరికి తెలుసా, తెలియదా, మనకి తెలియదు.
అరవిందుల గురించి శ్రీ రమణ మహర్షి కి తెలుసు. అంటే తీర్థ ప్రజ వంటి ముముక్షువులు, కవులు నానా రాజ సందర్శనం చేసినట్లు, నానా స్వామి సందర్శనం చేస్తారు. ఎందరో పాండిచ్చేరి నుంచి తిరువణ్ణామలై వెళ్ళేవారు. రమణ మహర్షి తో అరవిందుల గురించి చెప్పేవారు. రమణ మహర్షిని కూడా అరవిందుల వలె పౌష్టికాహారం తీసుకోమని "అర్థించేవారు". తాము ఆ వ్యవస్థను ఏర్పాటు చేస్తామనే వారు. ఉన్న అందరికీ కాక, ఒక్క మహర్షికి మాత్రమే పౌష్టికాహారం ఇస్తామనడం రమణ మహర్షి ఒప్పుకోని అవ్యవస్థ.
అరవిందులు కూడా రమణ మహర్షి గురించి విని ఉంటారు. మిగతా వారి విషయంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు. ఈ వ్యాసానికి ఆ సమాచారం అనవసరం.
భారతీయ తత్త్వదర్శనము ఉపనిషత్తులతో మొదలైంది. బౌద్ధం, జైనం, షడ్ దర్శనముల గుండా ఎదుగుతూ, పరిణమిస్తూ రూపు సంతరించుకొంది.
ఉపనిషత్తులు చెప్పినది రామకృష్ణ పరమహంస, శ్రీ రమణ మహర్షి, అరవిందులు, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి తమ తమ అనుభవాల ఆధారంగా పరిభాష వాడి తత్త్వం చెప్పారు. పరిభాష వేరైనా ఉపనిషత్ స్రష్టల నుంచి వీరి వరకు అనుభవం ఒకటే. వారి వారి ప్రారబ్ధానుసారం, వారి సాంఘిక, లౌకిక, ఆధ్యాత్మిక సంస్కృతుల నుంచీ, కలిగిన ప్రగాఢమైన అనుభవాల నుంచీ మాట్లాడారు. వారి వారి పరిస్థితులని బట్టి ఆ ప్రగాఢ అనుభవాలు కలిగిన తీరు, వైఖరి, విధానము, చోట్లు వేరు.
ఉపనిషత్తులు ఉదహరించిన అజ్ఞానమే కృష్ణమూర్తి వాడిన mental conditioning. రామకృష్ణులు, రమణ మహర్షి సాంప్రదాయ పరిభాషయే వాడారు. అరవిందులు క్రొత్త పరిభాష వాడారు. ఏ భాషలో మాట్లాడినా సారం మారనట్లు, ఏ పరిభాష ఉపయోగించినా సారం ఉపనిషత్ సారమే.
లోకో భిన్న రుచిః - వలన ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిభాష నచ్చుతుంది. మనస్తత్వాన్ని బట్టి ఒక్కో గురువు ఆకర్షిస్తాడు. అవగాహన కన్న మూఢ భక్తి
సామాన్యులను ఎక్కువ వశపరచుకొంటుంది, తత్త్వ వేత్తలు, తత్త్వ గురువుల విషయంలో కూడా అంతే.
ఈ నలుగురూ అనుభవం పొందినది ఉపనిదనుభవమే. చెప్పిన పరిభాష ఎవరికి వారికి ప్రత్యేకం.
పరిభాషను బట్టి వీరివి వేరు వేరు తత్త్వాలు అనుకోవడం అవగాహనా లేమి.
పైకి వీరొక్కక్కరికి కలిగిన అనుభవములు వేరు వేరని అనిపిస్తుంది. కాని కాదు.
పరిభాషలు వేరు అంతే. సాంకేతిక పదములు వేరు.
వారు జీవించిన జీవితాలు వేరు. జిడ్డు కృష్ణమూర్తి తప్ప మిగిలిన వారందరూ ఒక్కచోటే ఉన్నారు. కృష్ణమూర్తి ప్రపంచం అంతా పలుమార్లు తిరిగి ఉపన్యాసాలు ఇచ్చారు. అరవిందుల తత్త్వాన్ని మదర్ హైజాక్ చేసింది. అరవిందుల తత్త్వం కన్న
మదర్ని కొలవడం, ఆరాధన ఎక్కువై పోయింది. అరవింద తత్త్వం వెనుక బడింది.
రమణులది మౌనోపదేశం. మాట్లాడినా తూచి తూచి అవసరం మేరకే క్లుప్తంగా భాషించేవారు. కాని ముముక్షువులతో, ముముక్షువులలో ఒకరిగా కలిసి మెలిగారు. రామకృష్ణులు అంతే. అరవిందులు, కృష్ణమూర్తి తమ తత్త్వ పరిభాష ప్రగాఢత, తమ జీవనశైలిలతో ఒకవిధమైన అరిస్టోక్రాటిక్ టింజ్ వల్ల సోఫెష్టికేటెడ్ తత్త్వవేత్తలలా జీవించారు
ఏకం సత్ విప్రాః బహుధా వదంతి!
***********
స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండడం కాదు. బాధ్యతగా ఉండడం. అప్పుడే స్వేచ్ఛ పరిమళిస్తుంది.
**********
భౌతికమైన అందం ఎందరినో కట్టిపడేస్తుంది. హృదయ సౌందర్యం అందరినీ కట్టి పడేస్తుంది.
*********
ఉపనిషత్తులు బ్రాహ్మణులవి కావు. ప్రపంచానివి.
రామాయణం, మహాభారతం, మహాభాగవతం అందించిన వ్యాస, వాల్మీకులు ఉపనిషత్ స్రష్టల వలె బ్రహ్మణస్పతులు కారు. సామాన్య వర్గం వారే.
భారతీయ సంస్కృతి, సాహిత్యం అందరికోసం.
మనందరి కోసం.
ఎవరు రాసారో దాన్ని బట్టి గౌరవిస్తాం అనడం నిజంగా అవివేకం.
*********
ఇంట్లో సేవ అటకెక్కించి
సమాజసేవకై పరుగులు తీయు
ఆధునిక స్త్రీ పురుషులారా!
పునాదులు తవ్వేసి భవంతులు
నిలబెట్టలేరు! ఇంగితం మరువకండి!
**********
జీవితం మనకిచ్చిన బాధ్యతలను నిర్వర్తించడమే జీవించడం..
తప్పించుకోవడం ఏదో బతకడం.
********

No comments:

Post a Comment