చదువులలోని మర్మము
పుస్తకములను చదివితే పరిజ్ఞానము, విజ్ఞానము, జ్ఞానము కలుగుతాయి. మనిషికి మానసిక వికాసము, నైర్మల్యము, శాంతి కలిగించే చదువే చదువు. చదువులలోని మర్మమునెల్ల చదవితిని తండ్రి అని ప్రహ్లాదుడు అంటాడు. ఆ అవగాహన నే జ్ఞానమని అంటారు.
జీవిక కోసం నేర్చే చదువులు, కౌశల్యములు ధన సంపాదనకై ఉపయోగిస్తాయి. బ్రతుకును ధనసహితముగా గడపడానికి సాయం చేస్తాయి.
లౌకికమైన వృత్తి ఏదయినా అందరు మనుషులకు చదువులలోని మర్మమైన జ్ఞానము అలవడుట అవసరము. ఎందుకంటే మనసు పెట్టే యాతనలు జ్ఞానరాహిత్యము వలన చాలా వేదనను కలిగిస్తాయి.
మన సాంఘిక స్థితి ఏదయినా మనసును అవగాహన చేసికొని నియంత్రించుకునే ప్రయత్నము చేసికొనకపోతే లౌకిక జీవనములో ఎంత ప్రతిభా వ్యుత్పన్నతలను చూపినా కోతి వంటి మనసు ఆ సాఫల్యములను నిష్ఫలము చేస్తుంది. ఉన్నదానిని, కలిగి ఉన్నదానిని అనుభవించనీయదు. ఆస్వాదించ నీయదు. ఆనందించనీయదు. లేనిదానిని గురించి యుగములు కుములుతుంది. అంతా మనసు మాయ. ఇంద్రజాలము.
మనసుని దయ్యమని కొందరు, ఊహల ఉయ్యాల అని కొందరు అంటారు.
మూర్తి లేని, ఏ రూపము వహించని మనసు తలపుల వరుస మాత్రమే అనే అవగాహన కలిగితే కొంతలో కొంత మేలుగా జీవితాన్ని ఆస్వాదించ వచ్చు. ఆనందిచవచ్చు.
"మన ఏవ కారణం మనష్యాణాం బంధ మోక్షయోః" ఆధ్యాత్మిక సూక్తి.
మనసే మనుషుల బంధ మోక్షములకు కారణము.
రాగము, విరాగము మనసు వల్లే కలుగుతాయి. మనసు రమణము ఆనందాన్ని, విరమణము ప్రశాంతతను ఇస్తాయి.
కోతివలె చపలమైన మనసుని బంధించి ఉంచమని శంకరులు కపాలికుడైన, ఆదిభిక్షుకుడైన పరమ శివుని ప్రార్ధించారు.
స్ఫుటపట కుటీరమైన తన మనసులో వసించమని శంకరులని శంకరులు అర్ధించారు.
కామక్రోధలోభమోహమదమాత్సర్యములు అనే క్రూర మృగములు తన హృదయమనే ఘోరాటవిలో సంచరిస్తున్నాయని వాటిని వేటాడి వేటలోని వేడుకని ఆస్వాదించమని ఆదికిరాతుడైన శంకరుని శంకరులు
ఆహ్వానించారు.
నమ్మకము ఆధారముగా కల ఆధ్యాత్మికత సకల శుభములను కలిగిస్తుంది. ప్రశాంతమైన మనసుతో శాంత్యానంద యుతమైన జీవితమును గడపవచ్చు.
లౌకిక జీవనములో జయాపజయములు, లాభనష్టములు, కష్టసుఖములు గణించక స్థిమితము గా జీవించవచ్చు.
అందుకనే ఈ చదువును చదువులలోని మర్మము అన్నారు. ఈ చదువును నేర్చితే లౌకిక జీవన స్థితి గతులను అధిగమించి ప్రశాంతముగ జీవించవచ్చు. లౌకిక జీవనములో అందరము రకరకాల కారణముల వల్ల అందలములు ఎక్కలేము. మధ్యతరగతి, బడుగు జీవితములను గడపవలసి రావచ్చు. అప్పుడూ జీవితములోని అలసటను తెలియనీయకుండా జీవించగలిగే వెసులుబాటు ఈ చదువు కలిగిస్తుంది.
అందుకే ఈ చదువును భారతదేశంలో జ్ఞానులు తప్పక చదవవలసిన చదువు అన్నారు. ధనవంతులైనా, అధికార యుతులైనా, మనశ్శాంతి లేకపోతే అంతా, అన్ని ఐశ్వర్యములు, సంపదలు వృథా అనిపిస్తాయి.
ఆ ప్రమాదంనుంచి తప్పించుకోవడానికి అందరూ, అన్ని సాంఘిక స్థితులవారు తప్పక ఆధ్యాత్మిక జ్ఞానము అలవరచుకోవాలి. లౌకిక జీవనములో అందలాలు ఎక్కించే, పేరు ప్రఖ్యాతులు తెచ్చే, కాని కలత కలిగించే, పెంచే పరిజ్ఞాన, విజ్ఞానములు ఒక స్థాయి దాటేక బరువు అనిపిస్తాయి. లౌకిక జీవనము ఏదయినా ఆధ్యాత్మిక జీవితమూ లేకపోతే బ్రతుకు ఉప్పులేని పప్పులా రుచి హీనముగా ఉండి రమ్య జీవితాన్ని మనిషి రుచి చూడలేడు.
అందుకనే
నమామి నారాయణ పాద పంకజమ్
కరోమి నారాయణ పూజనం సదా
వదామి నారాయణ నామ నిర్మలమ్
స్మరామి నారాయణ తత్త్వమవ్యయమ్
అని గాని
ప్రణమామి శంకరమ్
భక్తజన కింకరమ్
భవతిమిర భాస్కరమ్
పార్వతీ సహచరమ్
అని గాని
స్మరిస్తూ, తపిస్తూ లౌకిక జీవనము ప్రశాంతముగ, స్థిర చిత్తముతో, స్థిమితము చెందిన మనసుతో గడపవచ్చు.
చదువులలోని మర్మమునెల్ల చదివి, అవగాహన చేసికొని తరింతుము గాక!
శ్రీరస్తు! శుభమస్తు! సమస్త సన్మంగళాని భవంతు!
భగవత్ ప్రీతిరస్తు! ప్రజ్ఞానం బ్రహ్మా! ఆనందో బ్రహ్మా! సత్యం జ్ఞానమ్ అనంతమ్ బ్రహ్మా!
జన్మాది అస్య యతః!
శాస్త్ర యోనిత్వాత్!
తత్ తు సమన్వయాత్!
ఏతత్సర్వమ్ శ్రీ పరమేశ్వరార్పణమస్తు!
పుస్తకములను చదివితే పరిజ్ఞానము, విజ్ఞానము, జ్ఞానము కలుగుతాయి. మనిషికి మానసిక వికాసము, నైర్మల్యము, శాంతి కలిగించే చదువే చదువు. చదువులలోని మర్మమునెల్ల చదవితిని తండ్రి అని ప్రహ్లాదుడు అంటాడు. ఆ అవగాహన నే జ్ఞానమని అంటారు.
జీవిక కోసం నేర్చే చదువులు, కౌశల్యములు ధన సంపాదనకై ఉపయోగిస్తాయి. బ్రతుకును ధనసహితముగా గడపడానికి సాయం చేస్తాయి.
లౌకికమైన వృత్తి ఏదయినా అందరు మనుషులకు చదువులలోని మర్మమైన జ్ఞానము అలవడుట అవసరము. ఎందుకంటే మనసు పెట్టే యాతనలు జ్ఞానరాహిత్యము వలన చాలా వేదనను కలిగిస్తాయి.
మన సాంఘిక స్థితి ఏదయినా మనసును అవగాహన చేసికొని నియంత్రించుకునే ప్రయత్నము చేసికొనకపోతే లౌకిక జీవనములో ఎంత ప్రతిభా వ్యుత్పన్నతలను చూపినా కోతి వంటి మనసు ఆ సాఫల్యములను నిష్ఫలము చేస్తుంది. ఉన్నదానిని, కలిగి ఉన్నదానిని అనుభవించనీయదు. ఆస్వాదించ నీయదు. ఆనందించనీయదు. లేనిదానిని గురించి యుగములు కుములుతుంది. అంతా మనసు మాయ. ఇంద్రజాలము.
మనసుని దయ్యమని కొందరు, ఊహల ఉయ్యాల అని కొందరు అంటారు.
మూర్తి లేని, ఏ రూపము వహించని మనసు తలపుల వరుస మాత్రమే అనే అవగాహన కలిగితే కొంతలో కొంత మేలుగా జీవితాన్ని ఆస్వాదించ వచ్చు. ఆనందిచవచ్చు.
"మన ఏవ కారణం మనష్యాణాం బంధ మోక్షయోః" ఆధ్యాత్మిక సూక్తి.
మనసే మనుషుల బంధ మోక్షములకు కారణము.
రాగము, విరాగము మనసు వల్లే కలుగుతాయి. మనసు రమణము ఆనందాన్ని, విరమణము ప్రశాంతతను ఇస్తాయి.
కోతివలె చపలమైన మనసుని బంధించి ఉంచమని శంకరులు కపాలికుడైన, ఆదిభిక్షుకుడైన పరమ శివుని ప్రార్ధించారు.
స్ఫుటపట కుటీరమైన తన మనసులో వసించమని శంకరులని శంకరులు అర్ధించారు.
కామక్రోధలోభమోహమదమాత్సర్యములు అనే క్రూర మృగములు తన హృదయమనే ఘోరాటవిలో సంచరిస్తున్నాయని వాటిని వేటాడి వేటలోని వేడుకని ఆస్వాదించమని ఆదికిరాతుడైన శంకరుని శంకరులు
ఆహ్వానించారు.
నమ్మకము ఆధారముగా కల ఆధ్యాత్మికత సకల శుభములను కలిగిస్తుంది. ప్రశాంతమైన మనసుతో శాంత్యానంద యుతమైన జీవితమును గడపవచ్చు.
లౌకిక జీవనములో జయాపజయములు, లాభనష్టములు, కష్టసుఖములు గణించక స్థిమితము గా జీవించవచ్చు.
అందుకనే ఈ చదువును చదువులలోని మర్మము అన్నారు. ఈ చదువును నేర్చితే లౌకిక జీవన స్థితి గతులను అధిగమించి ప్రశాంతముగ జీవించవచ్చు. లౌకిక జీవనములో అందరము రకరకాల కారణముల వల్ల అందలములు ఎక్కలేము. మధ్యతరగతి, బడుగు జీవితములను గడపవలసి రావచ్చు. అప్పుడూ జీవితములోని అలసటను తెలియనీయకుండా జీవించగలిగే వెసులుబాటు ఈ చదువు కలిగిస్తుంది.
అందుకే ఈ చదువును భారతదేశంలో జ్ఞానులు తప్పక చదవవలసిన చదువు అన్నారు. ధనవంతులైనా, అధికార యుతులైనా, మనశ్శాంతి లేకపోతే అంతా, అన్ని ఐశ్వర్యములు, సంపదలు వృథా అనిపిస్తాయి.
ఆ ప్రమాదంనుంచి తప్పించుకోవడానికి అందరూ, అన్ని సాంఘిక స్థితులవారు తప్పక ఆధ్యాత్మిక జ్ఞానము అలవరచుకోవాలి. లౌకిక జీవనములో అందలాలు ఎక్కించే, పేరు ప్రఖ్యాతులు తెచ్చే, కాని కలత కలిగించే, పెంచే పరిజ్ఞాన, విజ్ఞానములు ఒక స్థాయి దాటేక బరువు అనిపిస్తాయి. లౌకిక జీవనము ఏదయినా ఆధ్యాత్మిక జీవితమూ లేకపోతే బ్రతుకు ఉప్పులేని పప్పులా రుచి హీనముగా ఉండి రమ్య జీవితాన్ని మనిషి రుచి చూడలేడు.
అందుకనే
నమామి నారాయణ పాద పంకజమ్
కరోమి నారాయణ పూజనం సదా
వదామి నారాయణ నామ నిర్మలమ్
స్మరామి నారాయణ తత్త్వమవ్యయమ్
అని గాని
ప్రణమామి శంకరమ్
భక్తజన కింకరమ్
భవతిమిర భాస్కరమ్
పార్వతీ సహచరమ్
అని గాని
స్మరిస్తూ, తపిస్తూ లౌకిక జీవనము ప్రశాంతముగ, స్థిర చిత్తముతో, స్థిమితము చెందిన మనసుతో గడపవచ్చు.
చదువులలోని మర్మమునెల్ల చదివి, అవగాహన చేసికొని తరింతుము గాక!
శ్రీరస్తు! శుభమస్తు! సమస్త సన్మంగళాని భవంతు!
భగవత్ ప్రీతిరస్తు! ప్రజ్ఞానం బ్రహ్మా! ఆనందో బ్రహ్మా! సత్యం జ్ఞానమ్ అనంతమ్ బ్రహ్మా!
జన్మాది అస్య యతః!
శాస్త్ర యోనిత్వాత్!
తత్ తు సమన్వయాత్!
ఏతత్సర్వమ్ శ్రీ పరమేశ్వరార్పణమస్తు!