Thursday, October 27, 2016

భారతదేశంలో కులాల నియంతృత్వం: కవులు: రమ్య చిత్రముల గని

భారతదేశంలో కులాల నియంతృత్వం

భారత దేశంలో మేధావులమనకున్న ప్రతి వారు బ్రాహ్మణులనీ, బ్రాహ్మణ మతాన్ని నిరంతరంగా ఆడిపోసుకుంటూంటారు. ఈ ఆడిపోసుకోవడానికి అడ్డు, , ఆపూ, అంతూ లేవు. ఇప్పుడు మనం అనుభవించే అన్ని ఛిద్రాలకూ వీరు బ్రాహ్మణులనే బాధ్యులని చేస్తూంటారు. వారి అనుయాయులు ఇది వాస్తవమే కదా అనుకుంటారు. అంటారు కూడా. బ్రాహ్మణులు తప్ప మిగతా ఎవరూ సంఘానికి ఏమీ చెడు చెయ్యడం లేదంటారు.

ఈ సందర్భంలో ప్రస్తుతపు కొన్ని వాస్తవాలను, న్యాయరహిత ప్రవర్తనలను గమనిద్దాం.

ప్రభుత్వ భూములను, స్థలాలను అక్రమంగా ఆక్రమించి చిన్న చిన్న వ్యాపారాలనుంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారముల దాకా చేస్తున్న ఆసాములు ఎవరు? బ్రాహ్మణులా?

కాల్ మనీ సంటర్లు నడుపుతూ జనాలని పీల్చి పిప్పి చేస్తున్నదెవరు? దందాలు చేస్తూ కాఫ్ పంచాయత్ లు నిర్వహిస్తున్నదెవరు? కులాల పేరుతో సృఘాలేర్పరచుకొని మనోళ్ళులంటూ అన్ని అక్రమాలకూ లోపాయికారీ సాయాలు చేసుకుంటున్నదెవరు?

సంఘంలో రౌడీలు, గూండాలు, అసాంఘిక శక్తులు ఎవరు?

విద్యాలయములను, వైద్యశాలలను ఫక్తు వ్యాపార కేంద్రాలుగా మార్చి నాగరికతకు, సంస్కృతికి, మారుపేరయిన విద్యాదానాన్ని, వైద్యసహాయాన్ని కార్పొరేట్ స్థాయిలో వాణిజ్యముగా మార్చి అందరు ప్రజలకు ఇక్కట్లు కలిగిస్తూ ప్రజలను డబ్బుకాసే చెట్లుగా చేసి వారిని ఉసూరుమనిపిస్తున్నదెవరు?

ఏ కులాన్ని అయితే బ్రాహ్మణులొక్కరే సృష్టించారని‌ తిడుతూంటారో ఆ కులాన్నే ఆధారం చేసికొని అర్హతతో నిమిత్తం లేకుండా ఒక్క ఆ కులం ఆసరాతోనే చదువులు, స్కాలర్షిప్పులు, ఉగ్యోగములు సంపాదిస్తున్నదెవరు?
రాజకీయాల్లో చేరి ప్రజాస్వామ్యమును ఇంత దారుణంగా అవినీతిమయంగా చేసి, సంఘవిద్రోహ శక్తులతో అంటకాగి సంఘాన్ని అనేక అగచాట్లకు గురి చేస్తున్నది ఎవరు? వంశపారంపర్యముగా పార్టీని శాసిస్తూ అధికారాన్ని అనుభవిస్తూ పాలన ఏమీ తెలియక, పాలించడం చేతకాక కబుర్లతో కాలక్షేపం చేస్తున్నదెవరు? అక్రమంగా ఆర్జిస్తున్నది ఎవరు? నల్లధనమును విపరీతముగా పోగేస్తున్నదెవరు? భూస్వామ్య, పెత్తందారీ మనస్తత్త్వాలను చూపుతున్నదెవరు? ఆ పెత్తందారు తత్త్వంతో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాన్ని ఆనువంశిక పాలనలలోనికి నెట్టుతున్నదెవరు? ఎన్నో వ్యాపార, వ్యవహారాలతో సఘంలోని అన్ని వృత్తులపై, ఉద్యోగాలపై అజమాయిషీ చలాయిస్తున్నదెవరు?

ప్రతి అడుగులో, ప్రతి విషయంలో, ప్రతిక్షణమూ కులగజ్జి చూపుతూ ఈ కుల, జాతి, ప్రాంతీయ పెడధోరణులను ప్రజలలో పెంచి పోషిస్తున్నదెవరు? అలాచేస్తూ విభేదాలను మాసిపోకుండా చేస్తున్నదెవరు?
కులాలవారీగా, ప్రాంతాలవారీగా పౌరులను విడదీసి పబ్బం గడుపుకుంటున్నదెవరు?

ఈ విషయాలపై గణాంక వివరాలు సేకరించి నిజం తెలుసుకొని, ఆ నిజాన్ని ఒప్పుకునే ధైర్యమున్న నాయకులు, మేధావులు, తర్కవాదులు, సామాజిక న్యాయవాదులు ఎందరు? దేశానికీ, సంఘానికి చెడు, కీడు చేస్తున్నదెవరు? ఉష్ట్రపక్షి చందముగా వ్యవహరిస్తున్నది ఎవరు?

ఏదో చెవిని పడినది నిజమని బుకాయిస్తూ వాస్తవంలో జరుగుతున్న అన్యాయములకు కారణమెవరో తెలిసీ కిమ్మనక, ప్రతి ఇబ్బందికి బ్రాహ్మణులను బాధ్యులని చేసే దుష్టసంప్రదాయం సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించదు.సామాజిక న్యాయాన్ని ఏర్పరచ లేదు కూడా.

నిజాన్ని చూడక అకారణంగా ద్వేష, విద్వేషములను అపోహలతో కలిగించుకొని, ఊపిరిగా చేసికొని వ్యాసములు వ్రాసినా, ప్రసంగములను చేసినా వృథా కాలయాపనము, ప్రయాస తప్ప ఎవరికీ ప్రయోజనమును కలిగించదు.
ఇన్ని విధ్వంసాలను, అనాగరికతను, అరాచకాన్ని, కుసంస్కారాన్ని సంఘానికి అలవాటు చేసింది ఎవరు? ఈ పై ఇక్కట్లకు, దౌర్భాగ్యానికి కారణమైనవారెవరు?

తమ తమ మిథ్యా లోకములలో విహరిస్తూ ఈ మేధావులు, రేషనలిష్ట్లు, సామాజిక న్యాయవాదులు వాస్తవాన్ని‌ గమనించక బ్రాహ్మణులను ఆడిపోసుకోవడం వల్ల సామాజిక న్యాయమూ ఏర్పడదు, ప్రజల ఇబ్బందులూ తొలగవు; పౌరులలో విభజనలు, విభేదాలు మాత్రము తామర తంపరగా పెరిగి సంఘాన్ని అతలాకుతలం చేస్తాయి. చేస్తున్నాయి. ఇది తప్ప మరే ప్రయోజనము సిద్ధించదు.

కుల మత ప్రాంతీయ తేడాలు లేక అందరు పౌరులూ అలమటిస్తూనే ఉంటారు. బ్రాహ్మణులను ఎంత నిందించినా ఈ కష్టనష్టాలు తీరవు. రోగము ఒకటైతే మందు ఇంకోటి వేస్తే రోగము నయము కాదు కదా! ఆరోగ్యము కలగదు కదా!

 **********

 కవులు

ఎందఱో కవితలల్లుతారు కొందఱే
కవులుగా గుర్తింపబడతారు; కారణం?

కీర్తిప్రతిష్టలకు కవిత్వంలో పసతో పాటు
సంబంధ బాంధవ్యముల నెఱపడం, అదృష్టం
అవసరం; పేరు వచ్చినా రాకపోయినా నది
ప్రవహించడం ఆపదు; మేఘసముదాయం
వర్షించుట ఆపదు; తరువు ఫలములందించుట
ఆపదు; కవి తనకు సహజమైన కవన సృష్టి ఆపడు,

*********

రమ్య చిత్రముల గని
బాపు (శ్రీ సత్తిరాజు లక్ష్మీనారాయణ)
– డా. వారణాసి రామబ్రహ్మం

రమ్య చిత్రముల గని; రమణీయ చలన చిత్రముల ఖని;
చిత్రముగ చిత్రించు; బొమ్మల, తెరపై ఆడు బొమ్మల;
తెలుగువారి హృదయముల తన రేఖా చిత్రముల
వేసి వేసి అలసి సొలసిన చిత్ర కారుడు, దర్శకుడు;

హొయలొలికించు బొమ్మల, ముద్దు గుమ్మలకు ప్రాణములు
పోసిన చిత్ర బ్రహ్మ, కదలిపోయెను తిరిగి రాని లోకములకు;
ప్రాణమిత్రుడు రమణను కలియుటకై; చిరంజీవులు వారు
వారి జత సృష్టించిన గీతలందు, జీవన రేఖలందు, చలన చిత్రములందు;

ధన్య జీవులు వారు; నిలచియుందురు తెలుగువారి
మనసులందు దివ్యులై, మధురిమలొలికించుచు అమరులై
 

No comments:

Post a Comment