Thursday, March 31, 2016

Education and Skills' Development

Education and Skills' Development


Education and skills'-development are not one and the same. They are basically different. Education brightens mind and sharpens mental faculties to receive and give knowledge. Education leads to innovation in learning and leads to discoveries and inventions in all intellectual and aesthetic endeavors of human civilization and culture.

On the other hand learning skills provides livelihood. Skills' development is equally important and useful to humans living and comfort.

But skills are non-academic in the sense of formal school, college and university education. Skills can be taught and developed by individuals who are experts in skills' use, implementation and instruction. They need not have any academic instructions and go through formal school and higher education.
Many are confused between academics and skills' development. Academic instructions and training may not assure a livelihood. But it will provide intellectual and aesthetic pleasure which is unique to humans of all the flora and fauna.

Who are intent only on job and livelihood should think twice before proceeding with academics. Because after completion there is no guarantee of getting job. Individuals intent only on job and livelihood and not at all on intellectual and aesthetic pleasures,; must learn skills that guarantee livelihood. They must not continue in academics and then blame themselves, governments, education system for their unemployment and lack of livelihood.

It became a trend and fashion currently to compare Tendulkar, Bill Gates like economically and financially successful people to "denounce" the educational and academic acquisitions and adore and admire the entrepreneurial - abilities and -skills (cricket in the case of Tendulkar).

This admiration and adoration for financially successful individuals sans academic success also strengthen the "superiority" of skills-learning over livelihood non-providing academics.
Without education and academics neither TV nor computer might have been possible to be invented and enable Tendulkar and Gates to earn the millions or billions they have amassed. TV played a tremendous role in popularizing Mr. Tendulkar through live telecast of cricket matches and associated advertising.

Mr. Bill Gates might not have earned the billions but for the invention of computer, internet and technology. Many scientists and engineers and their academic achievements and technical minds are behind the success of modern technology which is the child of natural sciences.
Academicians never are interested in money and material comforts. They live and be blissful in their inventions and discoveries.

To look down academics in the light of material success of some skill-learners, is height of innocence and show of disrespect to knowledge, learning, academic brilliance; which never need shine as money makers and earners through skills; shine and get "worshiped".

All must know that there is vast difference between acquiring scholarship, becoming a scientist, technocrat who develop, innovate and shine as academicians and developers of knowledge and technology; and also give humans the aesthetic pleasure through their works in fine-arts and other arts.

It is childish to ignore the eminence of academic learning and not able to recognize and appreciate the merits of academicians and their discoveries, innovations and creations.

Business, which makes money on products from agriculture, industry, discoveries, innovations of intellectuals, scholars, technocrats, is never superior to basic learning and development of knowledge and learning just because it makes more money; and it must be noted again again that business makes money on the sweat of farmers, industrial labor, excellent academicians and technocrats.
Education is only for humans who can experience and appreciate intellectual and aesthetic pleasure while undergoing academic learning, which is unique to homo sapiens.

It is inappropriate wording to name ministry of education as ministry of human resources' development. Humans are intellectual and aesthetic living beings capable of creating wonders and not mere material resources as minerals, ores, metals and like natural or synthetic materials.

Humans are natural, lively and spiritual beings. Comparing them with materials is disservice to human dignity and capabilities and insult to Human uniqueness..

Tuesday, March 29, 2016

చలన చిత్రములు

చలన చిత్రములు

ఉత్సాహము కలిగించెడివి మనసుకు నిన్నటి‌ చలనచిత్రములు;
సంగీతము పాటలు వాటిలోని సాహిత్యము
తూగు సంభాషణలు ఆహార్యములు నటన
సున్నిత హాస్యము; ఇచ్చెడివి అందమైన
అనుభూతులను; మళ్ళీ మళ్ళీ చూడాలనిపించెే
తహతహను తమకమును తృష్ణను తపనను


ఇప్పటి సినిమానటులు వంశపారంపర్య హక్కుదారులు;
తండ్రి నటనా సామర్ధ్యము ఇసుమంతయును పట్టించుకొనకనే
అంటకనె రంగులు పూసుకొనుచున్నారు; ప్రేక్షకులను
మాత్రము తమ "నటనతో" చంపుచున్నారు; రాజకీయ
వారసులు తమ పాలనతో చంపుతున్నట్టు; సినిమా,
రాజకీయ వారసత్వములు భారత దేశమునతు పట్టిన చీడ

భౌతికాకర్షణతో యవతీ యువకుల ఆకర్షించి
వారి వారి హృదయముల "దోచి" వారి చదువులు
అటక  ఎక్కించుచున్నారు; నటులకు విటులకు
సంఘమున గౌరవము హెచ్చి యువతకు
"ఆదర్శప్రాయులైన" వ్యక్తులైరి; తెలిసీ తెలియక
వినోదమును భ్రష్టు పట్టించుచున్నారు; వికాసము
ఏ మాత్రము కలగని వెఱ్ఱి మొఱ్ఱి కథలతో మొత్తుచున్నారు

చక్కని చుక్క నాయికయై అందముల అన్నీ
ప్రదర్శించుచు ఊగుతు తూలుతూ స్టెప్పులేయ
యువతను ఊపు వెఱ్ఱెక్కించు గీతముల నాడు;
వారసనటులు వాచకము ఆంగికము నటన లేకయే
హీరోయిన్ల ఒంపు సొంపుల మోటుగ తాకుచు; డబ్బులు,
ప్రాచుర్యము పొందుచు; అభిమానులను సంపాదించుకొనుచున్నారు

సినమాలకు పేర్లు పెట్టుట రాదో, చేతకాదో,
లేక పేర్లు నిండుకొనుచున్నవో, పెట్టిన పేర్లే పెట్టి
మూకలనాకర్షించు మోటు పేర్లు పెట్టి తమ
సాహితీ అజ్ఞానమును, అభిరుచిని, లలితకళల
యందు తమ పరిచయ, ప్రవేశ లేములతో
మన హృదయ సున్నితత్వమును సరసతను
అవమానించుచున్నారు; మన హృదయ
రాసిక్యతను అసలు పట్టించుకొనుటలేదు

ఇరవయ్యవ శతాబ్దపు "మార్వెల్" సినిమా;
చేతకాని వారి చేతులలో పడి మనల ఏడిపించుచున్నది

Saturday, March 26, 2016

మధ్యతరగతి మహనీయులకు వందనములు

మధ్యతరగతి మహనీయులకు వందనములు

మధ్య తరగతి వారు మహనీయులు. భారీ ఫీజులు కట్టి చదువు "కొని", పిల్లలని విద్యాలయములలో "చదువుకొనడానికి" పంపిస్తారు. మరీ దారుణంగా ఆ స్కూళ్ళ యాజమాన్యము వారు నియంతల్లా వ్యవహరిస్తారు. జ్ఞానము అబ్బని, ఉద్యోగము గ్యారంటీ అస్సలు లేని ఇంతోటి చదువుకి తల్లిదండ్రులపై, పిల్లలపై ఎన్నో ఆంక్షలు. అజమాయిషీలు. మన పిల్లాడిని, మన పిల్లని మనతో ఊరు తీసికెళ్ళడానికి లీవ్ మంజూరు చేయడానికి సవాలక్ష ప్రశ్నలు. సవాలక్ష అడ్డులు.

ఒకరోజు రెండు రోజులకే చదువు పాడైపోతుందని నస. మనమేదో మహాపాపం చేస్తున్నట్టు పిల్లాడి/పిల్ల చదువు పట్ల మనకెంత మాత్రము శ్రద్ధ లేనట్టు వాళ్ళ భవిష్యత్తుతోమనం ఆటలాడుకుంటున్నట్టు మనని గిల్టీ ఫీల్ అయ్యేలా చెయ్యడం. మన ప్రతి చిన్న చితకా రిక్వెష్టుకి, అవసరానికీ ఇదే వరస. ఇదే పోజు. యాజమాన్యం ముందు మనం తలలు వంచుకుని చేతులు నలుపుకుంటూ నుంచునేలా చేస్తారు. గవర్నమెంటు స్కూళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.శాంతి.

మన పిల్లలని స్కూల్లో చేర్చామో. వెట్టి చాకిరీకి పంపించామో తెలియకుండా చేస్తున్నారు. విద్యాసంస్థలు నడుపుతున్నామంటూ అన్ని రాయితీలు పొందుతున్నారు. చేసేది ఫక్తు వ్యాపారము. పోజు మాత్రం సంఘసేవ చేస్తున్నట్టు. వైద్యమూ ఇలాగే తయారయింది. దాన్ని గురించి తరువాత.

మధ్య తరగతి వారి ప్రభుత్వ సంబంధ పనుల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. వాడు తీసుకునే ఆమ్యామ్యా తీసుకోకుండా ఎలాగూ పని చెయ్యడు. ఈ లోపల చుక్కలు చూపిస్తాడు. రెవెన్యూ, రిజిష్ట్రేషన్, టేక్స్ లాంటి డిపార్టమంట్లయితే ప్రతి పనికి మన ఒప్పుదల, అనుమతి ప్రసక్తులు లేకుండానే ఒక రేటుంటుంది. అన్నీ మూసుకుని ఆ రేట్ మౌనంగా చెల్లిస్తేనే అక్కడ పనులవుతాయి.

అక్కడ దళారులుంటారు. వాళ్ళ ద్వారా మాత్రమే మనం పనులు చేయించుకోవాలి, మనం తిన్నగా వెళితే పని అవదు సరి కదా, త్రిప్పట, ఆయాసము, ఖర్చు భరించాలి కూడా. ఈ మధ్య మనం చెల్లించీ, ప్రభుత్వానికి అందని సేల్స్, కమ్మర్షియల్ వంటి టేక్స్ ల జాబితాకి సర్వీస్ టేక్స్ కూడా చేరింది. మన దగ్గర ముక్కు పండి వసూలు చేస్తారు. ప్రభుత్వానికి కట్టరు. రిసీప్ట్ అడిగితే, "టేక్స్ మేము సంవత్సరం ఆఖరున టోకుగా కడతాము, అప్పుడు రండి" అంటారు. మనమూ మర్చిపోతాము. జ్ఞపకముంచుకొని వెళ్ళినా ఇంకేదో వంకలు చెబుతూ తిప్పుతారు, కాని రిసీప్ట్ ఇవ్వరు. ఎన్.జి.వోలు. ఇతర సామాజికులూ కంప్లైంట్ చేయాలి అని మనకు పౌర విధుల మీద లెక్చెర్లిస్తారు. ఈ గొడవ తప్ప ఫలితం శూన్యం.

డబ్బు ఖర్చు పెట్టేదీ మనమే, వీళ్ళందరి ముందూపూర్వకాలపు పాలేళ్ళలా నుంచోవలసందీ మనమే. మన ఆత్మగౌరవాన్ని ప్రతి క్షణం చంపుకుంటూ బ్రతక వలసినదీ మనమే.

మనం ఎంతటి వారమైనా, ఏమి తెలిసినా, ఇంటికి ఏదైనా పనిచేయించుకోవాలంటే, పనిచేసేవాళ్ళ ముందు ఏదీ పనికిరాదు. ఆ మేస్త్రీ చెప్పినట్టు వినాల్సందే. అతను సూచించిన విధముగా సరుకుకొనాల్సందే. వారు ఎలా పనిచేస్తే నోరు మూసుకుని భరిస్తూ అలా పనిచేయించుకోవాల్సిందే. గట్టిగా మాట్లాడితే, "అందుకే ఈ చిన్న పనులక ఒప్పకోం. ఒక్కొక్క దాంటో 40 ఫ్లాట్ లున్న ఆరు బిల్డింగులలో మాకు పని" ఇని వాడి గొప్పతనాన్ని చెబుతూ, మన ఆర్ధిక స్థితిని గేలి చేస్తూ ఒదురు మాట్లాడుతాడు. ఏదో చిన్న చిన్న రిపేర్లు చేయించుకుంటాంగాని అన్నేసి ఫ్లాట్లున్న బిల్డింగులు వీళ్ళచేత పని చేయించుకోవడానికి మనం ఎక్కడ కట్టగలం?

మధ్య తరగతి వారు. రాజసము, ఆత్మాభిమానము, హుందా మరచిపోయి చాలా దశాబ్దాలు అయింది.

ఇంక ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకోవడం కోసం మన పడే పాట్లు పగవాడైనా పడద్దు.ఎంత ఫీజ్ అంటే అంతా సమర్పించికూడా వైద్యునితో సరిగా మాటలాడడానికే కుదరదు. వారికి సమయముండదు. మనలాంటి వారు వెనక క్యూలో వేచియుంటారు. రోజంతా పని చేయడానికై వారి శక్తిని వారు పరిమితంగా ఉపయోగించుకోవడానికా అన్నట్టు మనతో మనకు వినిపించీ వినిపించకుండా మాట్లాడతారు. విషయం తెలుసుకోవడానికి మళ్ళీ మనం కాంపౌడరునో, నర్సునో ఆశ్రయించాలి. తక్కువ జీతాలందుకోవడం వల్లనో పని ఒత్తిడి వల్ల అలిసిపోవడం వల్లో, మనమంటే అలుసువల్లో వాళ్ళ విసుగంతా మనమీద చూపిస్తారు. మం ఓపిక పట్టి, మన ఆభిజాత్యాన్ని పక్కకు నెట్టి విషయాన్ని రాబట్టుకోవాలి. అన్ని టెస్ట్లూ పలుమారు చేయించుకునీ, అవసరమైతే ఆపరేషనూ చేయించుకుని, ఎంతో డబ్బు ఖర్చుపెట్టుకునీ నోరు మెదపకుండా ఏమైనా, నయమైనా, అవకపోయినా, మరణమే సంభవించినా, మన ఖర్మ అని సరిపెట్టుకోవాలి.

(గవర్నమెంటు ఆస్పత్రులలో మధ్యతరగతి వారికి, ప్రవేశము, ప్రాధాన్యతా చాలా తక్కువ. వెల్ఫేర్ ఎకనామిక్స్లో మధ్యతరగతి వారికి ఎటువంటి ప్రాముఖ్యతా లేదు. ప్రాధాన్యతా, ప్రాముఖ్యతా లేనివారికి మాత్రమే. ఏమి లేనివారికో అర్థము కాదు. అలా ఏమీ లేని వారిని ఎందుకు దేశం నెత్తికెక్కించుకోవాలో తెలియదు. అలా లేనివారిని నెత్తినేసుకొని దేశం మొత్తం అలా నెత్తికెక్కించుకోవడం వల్ల కలుగుతున్న అనర్ధాలు, ఛిద్రాలు ఎందుకు భరించాలో ఏ ఆర్ధిక శాస్త్రవేత్తా చెప్పడు. మధ్యతరగతి వారు వారి చావు వారు చావాల్సందే. ఏ ఆర్ధిక శాస్త్రవేత్తా వీరిని గణించడు. (కేపిటలిజమ్, సోషలిజమ్, వెల్ఫేర్ ఎకనామిక్స్ లలో మధ్యతరగతివారికి చోటు లేదు.)

ఈ పై అన్నిచోట్లా ఎంతెంతో డబ్బు ఖర్చయ్యేదీ మనకే, అన్నీ మౌనంగా భరించి, పనులు అయ్యేలా చూచుకోవలసినదీ మనమే.

ఇంక రాజకీయనాయకుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత ప్రశాంతత. మన దగ్గర వాళ్ళు గెలవడానికి సరిపడ ఓట్లు లేవు కాబట్టి మనం చచ్చినా బ్రతికినా వాళ్ళకనవసరం. వాళ్ళ దృష్టి అంతా ఓట్లు భారీగాఉన్న పౌరుల మీద. వారిని రకరకాలుగా ప్రలోభపెట్టి, వారి ఓట్లు రాబట్టి ఎన్నికై పదవి, అధికారం పొంది అవినీతిపరులై దేశాన్ని దోచుకు తివడం రాజకీయనాయకుల political economics.

డబ్బులు నీళ్ళలా ఖరిచయ్యేది మధ్యతరగతి వారికే. ఎవరూ గౌరవము, ప్రాధాన్యతా ఈయని బ్రతుకులూమధ్య తరగతి వారివే. ఏ కులానికి, ప్రాంతానికి, మతానికి, మైనారిటీ వర్గానికీ చెందినా, నాస్తికులైనా, నిష్ఠాగరిష్ఠులైనా, మేధావులైనా, రేషనలిష్టులైనా ఇదే తీరు. వేదన. వ్యథ. అమర్యాద, అలుసు. మధ్యతరగతి వారి కష్టములు, నష్టములు అందరు భారతీయులకు ఒకటే. అదే బాధల, వ్యథల వర్తమానము. ఆందోళన కలిగించే, భయపెట్టే అంధకార భవిష్యత్తు..


దీనికి తోడు ఉద్యోగాల్లేని, ఏ గర్ల్ ఫ్రెండూ పట్టించుకోని, కొడుకులు; పెళ్ళి అక్కర్లేదని ఉద్యోగం చేసుకుంటామని, స్వంత కాళ్ళపై నిలబడతామని, - ఉద్యోగాలు ఎవరికీ లేని ఈ గడ్డు రోజుల్లో - గారాలు పోయే కూతుళ్ళు. సినీహీరోల మత్తులో, ఫేషన్ జీవితాల మోజులో కలల బేహారులు వారు. వారికి బాయ్ ఫ్రెండ్స్కి కొదవ మాత్రం లేదు. ప్రేమ వ్యవహారములూ యథాశక్తి నడుపుతూండే మన చిట్టి తల్లులను ఎలా మృగాలనుంచి కాపాడడం. మధ్యతరగతి వారి ఇడుములలో ఇది ఒక తీవ్ర సమస్య. ఇంక అమ్మాయి పెళ్ళి చెయ్యాలన్నా, ఓ గూడు అమర్చుకోవాలన్నా వారు పడే పాట్లు వర్ణనాతీతము.

ఇంక బాధ్యతారాహిత్ంగా ఉండి విచ్చల విడిగా తిరుగుతూ డబ్బు నీళ్ళలా ఖర్చు చేయడానికి డబ్బు కోసం సతాయించే కొడుకో, కూతురో ఉంటే అంతే. వయసు వేడిలో "ఇది వెన్నెల వేళ యని, ఇది మల్లెల మాసమనీ" తెలియని కూతుళ్ళు ముందే కూస్తే ఆ నరకం వేరే.

స్వంత పసికూనల ఆలనా పాలనా చూసుకోలేని యువతులైన తల్లులు; ముసలాళ్ళను సాకలేని, వారి సంరక్షణ చూడలేని కన్న బిడ్డలు.

ఇంతటి అస్తవ్యస్తాన్ని భరించలేక భరించే మధ్యతరగతి మహనీయులకు వందనములు. వీరి మీద, వీరి బాధల మీద బ్రతుకుతున్న, బ్రతుదామనుకుంటున్న నకిలీ స్వాములు, బాబాలు, అమ్మలు, ఇతర ఆకర్షకులు ఎంత దరిద్రులో కదా!!!???

 ఇటువంటి సెకండరీ సిటిజన్ స్టేటస్ లో జీవిస్తూ, ఆత్మాభిమానము, ఆభిజాత్యము మరిచి ఏదో బ్రతుకును ఈడుస్తున్న మధ్యతరగతి మహనీయులకు వందనములు.

Friday, March 25, 2016

ఇ-ప్రచురణలు



మానవ జిజ్ఞాస - సృష్టి
సార్వజనీనత - విశ్వ శ్రేయస్సు
సాహితీ సృష్టి - విమర్శ - ఇ-ప్రచురణలు - విశాల విశ్వ దృష్టి
పాఠకులు, విమర్శకుల ద్వారా సాహితీ స్రష్టలు ప్రాచుర్యం పొందుతారు. వారి కవితలలోని గుణగణములను, ఇతర సాహితీ ప్రమాణములను పరిశీలించి, విశ్లేషించి, విమర్శకులు కవులను, వారి శ్రేష్ఠతను, కవన సృష్టిని, ఇతర పాటవములను వర్గీకరిస్తారు, పొగడుతారు, తెగడుతారు. ఈ విమర్శ స్వ ఇష్టాయిష్టములకు అతీతంగా చేయాలి.
కాని నేటి తెలుగు సాహితీ జగత్తును పరిశీలిస్తే ఒక వింత విషయం బయటపడుతుంది. సాహితీ స్రష్టలు - ముఖ్యంగా కవులు వాదములపై ప్రీతితో వర్గములుగా విడిపోయారు. తమ వర్గ సాహిత్యమే ప్రపంచ సాహిత్యమనే భ్రమలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇతర వర్గములను, తత్సంబంధ సాహిత్యాన్ని తప్పుపడుతున్నారు. నిందిస్తున్నారు కూడా. విమర్శకులూ అలానే వర్గములుగా విడిపోయారు. సిద్ధాంత రాద్ధాంతములకిచ్చే ప్రాముఖ్యత విషయ పరిశీలనకు, విశ్లేషణకు, అవగాహనకు ఈయక, తమ వర్గపు సాహితీ వేత్తలను, కవులను ఆకాశానికి ఎత్తేసి, ఇతర సాహితీకారులను పాతాళానికి దించేస్తున్నారు. కువిమర్శకులవుతున్నారు. లేత అరిటాకు వంటి కవుల మనసులను చీల్చేస్తున్నారు. వారి కుసుమ హృదయాలను నలిపేస్తున్నారు.
ఇలాంటి వర్గ సాహితీకారులు, విమర్శకులు గుంపులుగా ఏర్పడి పరస్పర కుచమర్దనములు చేసుకుంటున్నారు. ఇటువంటి స్థితిలో తెలుగు సాహిత్యం ప్రపంచ వ్యాప్తం ఎలా అవుతుంది?
దీనితోపాటు కవుల సంఖ్యా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. చేతి చమురు భాగోతంలా కవితా సంకలనాలు వెలువరిస్తున్నారు.
అచ్చువేసిన పుస్తకాలు మాత్రమే పురస్కారములకు పనికివస్తాయనే నియమం ఎందరో కవులను తమ కవితలను అచ్చు వేయించుకునేలా చేస్తున్నాయి. అందుకై ఆర్ధికంగా, ఇతరత్రా ఎంతో వ్యయప్రయాసలకు లోనవుతున్నారు, కవులు, ఇతర సాహితీ స్రష్టలు.
అచ్చు రాక ముందు తాటాకులపై గ్రంథాలు రాసేవారు. అచ్చు వచ్చాక, పుస్తకములు ప్రచురింపబడడం మొదలయ్యాక జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, సాహిత్యాన్ని, ఇతర అంశములను నిక్షిప్తపరచండం, పంచడం సులువైంది. అలా మాత్రమే మానవుని మేధ, లలితకళాసృష్టి నలుగురికీ చేరడం సాంప్రదాయమైంది.
ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానము ఎంతో పెరిగి, అంతర్జాల మాధ్యమం వచ్చాక మానవుని, జ్ఞాన, విజ్ఞాన కళాదృష్టులను, సృష్టులను అందించడం ఎంతో సులువు, వేగవంతం, చవక అయిపోయింది. ఇ-సృష్టి, ఇ-రికార్డింగ్, ఇ-ప్రచురణ విప్లవాత్మకంగా, సౌకర్యంగా మారి మానవునికి జ్ఞాన, విజ్ఞాన, కళా సముపార్జనం బాగా తేలిక, వేగవంతం, చవక అయ్యాయి.
ఇటువంటి సాంకేతికతా విప్లవం వచ్చాక కూడా, అచ్చు పుస్తకాలను మాత్రమే పురస్కారాలకు పరిశీలిస్తామనడం కూపస్థ మండూక మనస్తత్త్వం. మార్పుని అంగీకరించలేని,అందిపుచ్చుకోలేని ఛాందసం. కాలం చెల్లిన సాంప్రదాయం.
ఇలా సాహితీ సృష్టి, విమర్శ, ప్రచురణ కాలం చెల్లిన ఛాందసాన్ని, అజ్ఞానాన్ని, పసితనాన్నివీడలేకుంటే, తెలుగు వారి మేధా సంపత్తి, సాహితీ కళాసృష్టులు ప్రపంచాన్ని ఎలా చేరతాయి? నలుగురూ తెలుగు వారి సృష్టుల గురించి ఏమి చర్చంచుకుంటారు? అలాగే తమ రచనలను తగు భాషలలోనికి అనువదించకుండా ప్రాచుర్యం రాదని అన్ని రంగములలోని స్రష్టలు గ్రహించాలి. ప్రపంచం విశాలమైనది. సంకుచిత్వానికి అందనిది. వాదప్రతివాదములకు లొంగనిది. మన మనసు ఎంత విశాలంగా ఉంటే మనకు ఆదరణ అంత పెరుగుతుంది. ప్రాచుర్యం, గుర్తింపూ లభిస్తుంది.
మనం వర్గ పౌరులం కాక విశ్వ పౌరులం అవుదాము.
సార్వజనీనత లేని, విశ్వ శ్రేయస్సును కాంక్షించని సృష్టులు నిరర్ధకములు.

Thursday, March 24, 2016

మానవ జిజ్ఞాస - సృష్టి



మానవ జిజ్ఞాస - సృష్టి

సార్వజనీనత - విశ్వ శ్రేయస్సు

సాహితీ సృష్టి - విమర్శ - ఇ-ప్రచురణలు - విశాల విశ్వ దృష్టి

పాఠకులు, విమర్శకుల ద్వారా సాహితీ స్రష్టలు ప్రాచుర్యం పొందుతారు. వారి కవితలలోని గుణగణములను, ఇతర సాహితీ ప్రమాణములను పరిశీలించి, విశ్లేషించి, విమర్శకులు కవులను, వారి శ్రేష్ఠతను, కవన సృష్టిని, ఇతర పాటవములను వర్గీకరిస్తారు, పొగడుతారు, తెగడుతారు. ఈ విమర్శ స్వ ఇష్టాయిష్టములకు అతీతంగా చేయాలి.

కాని నేటి తెలుగు సాహితీ జగత్తును పరిశీలిస్తే ఒక వింత విషయం బయటపడుతుంది. సాహితీ స్రష్టలు - ముఖ్యంగా కవులు, వాదములపై ప్రీతితో వర్గములుగా విడిపోయారు. తమ వర్గ సాహిత్యమే ప్రపంచ సాహిత్యమనే భ్రమలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇతర వర్గములను, తత్సంబంధ సాహిత్యాన్ని తప్పుపడుతున్నారు. నిందిస్తున్నారు కూడా. విమర్శకులూ అలానే వర్గములుగా విడిపోయారు. సిద్ధాంత రాద్ధాంతములకిచ్చే ప్రాముఖ్యత విషయ పరిశీలనకు, విశ్లేషణకు, అవగాహనకు ఈయక, తమ వర్గపు సాహితీ వేత్తలను, కవులను ఆకాశానికి ఎత్తేసి, ఇతర సాహితీకారులను పాతాళానికి దించేస్తున్నారు. కువిమర్శకులవుతున్నారు. లేత అరిటాకు వంటి కవుల మనసులను చీల్చేస్తున్నారు. వారి కుసుమ హృదయాలను నలిపేస్తున్నారు.
 
ఇలాంటి వర్గ సాహితీకారులు, విమర్శకులు గుంపులుగా ఏర్పడి పరస్పర కుచమర్దనములు చేసుకుంటున్నారు. ఇటువంటి స్థితిలో తెలుగు సాహిత్యం ప్రపంచ వ్యాప్తం ఎలా అవుతుంది

దీనితోపాటు కవుల సంఖ్యా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. చేతి చమురు భాగోతంలా కవితా సంకలనాలు వెలువరిస్తున్నారు.
 
అచ్చువేసిన పుస్తకాలు మాత్రమే పురస్కారములకు పనికివస్తాయనే నియమం ఎందరో కవులను తమ కవితలను అచ్చు వేయించుకునేలా చేస్తున్నాయి. అందుకై ఆర్ధికంగా, ఇతరత్రా ఎంతో వ్యయప్రయాసలకు లోనవుతున్నారు, కవులు, ఇతర సాహితీ స్రష్టలు.
 
అచ్చు రాక ముందు తాటాకులపై గ్రంథాలు రాసేవారు. అచ్చు వచ్చాక, పుస్తకములు ప్రచురింపబడడం మొదలయ్యాక జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, సాహిత్యాన్ని, ఇతర అంశములను నిక్షిప్తపరచండం, పంచడం సులువైంది. అలా మాత్రమే మానవుని మేధ, లలితకళాసృష్టి నలుగురికీ చేరడం సాంప్రదాయమైంది.

ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానము ఎంతో పెరిగి, అంతర్జాల మాధ్యమం వచ్చాక మానవుని, జ్ఞాన, విజ్ఞాన కళాదృష్టులను, సృష్టులను అందించడం ఎంతో సులువు, వేగవంతం, చవక అయిపోయింది. ఇ-సృష్టి, ఇ-రికార్డింగ్, ఇ-ప్రచురణ విప్లవాత్మకంగా, సౌకర్యంగా మారి మానవునికి జ్ఞాన, విజ్ఞాన, కళా సముపార్జనం బాగా తేలిక, వేగవంతం, చవక అయ్యాయి.

ఇటువంటి సాంకేతికతా విప్లవం వచ్చాక కూడా, అచ్చు పుస్తకాలను మాత్రమే పురస్కారాలకు పరిశీలిస్తామనడం కూపస్థ మండూక మనస్తత్త్వం. మార్పుని అంగీకరించలేని,అందిపుచ్చుకోలేని ఛాందసం. కాలం చెల్లిన సాంప్రదాయం. ఇ - ప్రచురణలను అచ్చు పుస్తకములతో సమానముగా పురస్కారములకు పరిశీలించవలసిన  సమయము ఆసన్నమైనది.
 
ఇలా సాహితీ సృష్టి, విమర్శ, ప్రచురణ కాలం చెల్లిన ఛాందసాన్ని, అజ్ఞానాన్ని, పసితనాన్నివీడలేకుంటే, తెలుగు వారి మేధా సంపత్తి, సాహితీ కళాసృష్టులు ప్రపంచాన్ని ఎలా చేరతాయి? నలుగురూ తెలుగు వారి సృష్టుల గురించి ఏమి చర్చంచుకుంటారు?  

అలాగే తమ రచనలను తగు భాషలలోనికి అనువదించకుండా ప్రాచుర్యం రాదని అన్ని రంగములలోని స్రష్టలు గ్రహించాలి. ప్రపంచం విశాలమైనది. సంకుచిత్వానికి అందనిది. వాదప్రతివాదములకు లొంగనిది. మన మనసు ఎంత విశాలంగా ఉంటే మనకు ఆదరణ అంత పెరుగుతుంది. ప్రాచుర్యం, గుర్తింపూ భిస్తాయి

మనం వర్గ పౌరులం కాక విశ్వ పౌరులం అవుదాము.

సార్వజనీనత లేని, విశ్వ శ్రేయస్సును కాంక్షించని సృష్టులు నిరర్ధకములు.

Tuesday, March 22, 2016

అంతర్జాల మాధ్యమ సాంఘిక సాలెగూళ్ళు

అంతర్జాల మాధ్యమ సాంఘిక సాలెగూళ్ళు

మనందరం మన మన బాజాలు కొట్టుకుందుకు అంతర్జాల మాధ్యమంలోని సాంఘిక సంబంధ సాలెగూళ్ళను వాడతాము. రచయితలము, కవులము, నృత్య సంబంధీకులము, సంగీత ప్రముఖులము, సాంఘిక సేవాతత్పరులము, విదేశయానములు చేసేవాళ్ళము, అక్కడికెళ్ళి పిల్లలతో గడుపుతూ ఆ ఛాయాచిత్రాలను పంచేవాళ్ళము, అందమైన స్వ రచిత చిత్రములను, ఛాయాచిత్రములను, సందేశములను, జీవన, జీవితసత్యములను పంచేవాళ్ళము, స్వంత గుంపులను ప్రాంరంభిచేవాళ్ళము, స్నేహితులను చేర్చుకుని కారణం చెప్పా పెట్టకుండా, వాళ్శని ఇష్టా రాజ్యంగా తొలగించేవాళ్ళము, అడగకపోయినా మన ఇష్టాయిష్టములను చర్చకు పెట్టేవాళ్ళము, స్వోత్కర్ష అధికముగా చూపించే వాళ్ళము, ఇలా ఎన్నో తరహాల వ్యక్తులము కాలక్షేపం చేస్తున్నాము.

ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ప్రయాణిస్తున్నా, హాస్పిటల్ కు వెళుతున్నా, హాస్పిటల్లో ఉన్నా‌, డిశ్ఛార్జీ చేసినా, ఠంచనుగా మవ హాజరు వేయించుకుంటూ, ఇతరుల ‌హాజరు గమనిస్తూ, ఏవేవో అరకొర మాటలు మాటాడుకుంటూ, మన సిద్ధాంత రాద్ధాంతముల, గొడవల వ్యక్తీకరణలకు, ఇతరుల వ్యక్తీకరణల తక్షణ ఖండన మండనలకు వాడుతూ ఎంతో హడావుడిగా ఉంటూ జీవితాలను వెళ్ళదోస్తున్నాము.

అంతర్జాల సాంఘిక సాలెగూళ్ళు ఎంతో సంఘసేవ చేస్తున్నాయి. నాలుగు రాళ్ళూ చేసుకంటున్నాయి. ఇంతటి కాలక్షేపము, వ్యవహారము, వ్యాపారము జరుగుచువ్న అంతర్జాల సాంఘిక సాలెగూళ్ళ మాధ్యమము ఒక పుస్తకము చదువుటలా, ఒక చలన చిత్రము చూచుటలా వినోద, విలాస, వికాస ప్రయోజనములు అందించుచున్నది.

ఈ కాలక్షేపము సత్ అవునా కాదా అనే మీమాంస అప్రస్తుతము, అనవసరము. ఆసక్తికరంగా ఇతరుల ప్రసక్తితో కొండవాగులా పడి లేస్తూ పయనిస్తూ జలపాతమై దూకుతూ హడావిడి పడుతూ‌, హడావిడి
చేస్తూ ఎందరినో కట్టిపడేస్తున్న ఈ కాలక్షేపానికి శుభాభినందనలు.