హిందూ మతములోని తెగలు
హిందువులలో కులముల పేరిట తెగలున్నాయి కాని హిందూ మతములో తెగలు ఏమిటి? తెలుసుకుందాం ఇప్పుడు.
హిందువులు మొదట తెగలుగా విడిపోయినది ప్రస్థానత్రయ భాష్య రచనలలో. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అంటారు. త్రిమతాచార్యులు వీటికి తమ తమ దృష్టిని బట్టి వ్యాఖ్యానములు వ్రాశారు. గమనించండి, ఇప్పుడే, ఇక్కడే హిందూ మతము మూడు మతములుగ విడి పోయింది. శంకరాచార్యులుది అద్వైత దృష్టి. రామానుజాచార్యులుది విశిష్టాద్వైత దృష్టి. మధ్వాచార్యులుది ద్వైత దృష్టి. అవంటే ఏమిటో తెలుసుకోవాలంటే వారి వారి వ్యాఖ్యానములని, వారి శిష్యుల, అనుయాయుల ప్రవచనములనీ చదవాలి.
హిందువులలో కులముల పేరిట తెగలున్నాయి కాని హిందూ మతములో తెగలు ఏమిటి? తెలుసుకుందాం ఇప్పుడు.
హిందువులు మొదట తెగలుగా విడిపోయినది ప్రస్థానత్రయ భాష్య రచనలలో. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అంటారు. త్రిమతాచార్యులు వీటికి తమ తమ దృష్టిని బట్టి వ్యాఖ్యానములు వ్రాశారు. గమనించండి, ఇప్పుడే, ఇక్కడే హిందూ మతము మూడు మతములుగ విడి పోయింది. శంకరాచార్యులుది అద్వైత దృష్టి. రామానుజాచార్యులుది విశిష్టాద్వైత దృష్టి. మధ్వాచార్యులుది ద్వైత దృష్టి. అవంటే ఏమిటో తెలుసుకోవాలంటే వారి వారి వ్యాఖ్యానములని, వారి శిష్యుల, అనుయాయుల ప్రవచనములనీ చదవాలి.
శాక్తాద్వైతము మరియొక తెగ. ఒక్క బ్రహ్మసూత్రములకే వివిధ దృష్టులతో ఎన్నో
వ్యాఖ్యానములున్వాయి. వల్లభాచార్యుడు, నింబారకుడు వారి వారి దృష్టులతో
వ్యాఖ్యానించారు. వీరూ, వీరి వ్యాఖ్యానములు కేంద్రంగానూ మతములు ఏర్పడ్డాయి.
మహాత్మాగాంధి కుటుంబ సభ్యులు వల్లభాచార్య మతానుయాయిలు. వల్లభాచార్యులు,
నింబారకుడు తెలుగు వారు.
శివ పరంగానూ ఎన్నో మతములు ఏర్పడ్డాయి. దేముళ్ళ, దేవతల, దైవముల కుటుంబ సభ్యులతో మరెవ్నో తెగలు ఏర్పడ్డాయి. మతము, తెగ ఒకే అర్ధములో ఇక్కడ చర్చించ బడ్డాయి.
వీటితో సమాంతరంగా షడ్దర్శనముల వారూ ప్రతేక తెగలము అనిపించారు. ఆ పై వీర శైవము, వీర వైష్ణవము తెగలుగా ఏర్పడ్డాయి. వీర శైవము మళ్ళీ లింగాయత్ లు వక్కలింగలుగా విడిపోయారు. కర్ణాటక రాష్ట్ర రాజకీయము
ఈ రెండు తెగల చేతుల్లో నడుస్తోంది.
ఆధునిక భారత దేశంలో 1800 - 1900 ప్రాంతంలో ఎన్నో సాంఘిక విప్లవాలు వచ్చాయి. అవి పుంఖానుపుంఖాసుగా పెరిగి మరి కొన్ని తెగలు ఏర్పడ్డాయి. స్వాములు, బాబాలు, అమ్మలు, ఆనందాలు, బాపులు, మహరాజ్ లు, ఇంకా ఇలాంటి వాళ్ళు తామర తంపరగా వచ్చారు. వీరి చుట్టూ, వీరి వీరి "బోధనల" చుట్టూ మరెన్నో తెగలు ఏర్పడ్డాయి. అలాగే టి.వి. ల పుణ్యమా అని ఎందరో ప్రవచనకారులు వెలిసారు. ఇక్కడా తెగలే.
ఈ తెగల వారందరూ ఎవరికి వారు ప్రత్యేకము. ఎవరితో ఎవరూ కలవరు. ఎవరి ఆర్ధిక, ఆధ్యాత్మిక సామ్రాజ్యము వారిది. వారి వారి అనుయాయులు వారి గురువులకు వీర అభిమానులు. ఎంతటి అభిమానులంటే, విష్ణు, శివ, రామ, కృష్ణ, హనుమ, దేవిల దివ్య నామముల కన్న తమ తెగ నాయకుని నామమే మిన్న అనుకునేవారు.
వీరికి తోడు RSS వంటి సాంస్కృతిక సంస్థలు. అటువంటివి మరెన్నో. వీరందరూ హిందూ మతము వారే. మతాన్ని ఉద్దరించడానికి కంకణం కట్టుకున్నవారే.
వీరందరి హడావుడిలో, అలజడులలో పాల్గొనక, అంతనీ అందరినీ సాక్షి మాత్రముగ చూస్తూ అందరి దేవుళ్ళను, దేవతలనూ, దైవములనూ సమానముగా చూస్తూ , అన్ని సంప్రదాయములకు, మార్గములకు సమాన గౌరవమిస్తూ తమ మార్గమున పయనిస్తూ ప్రశాంతముగ భగవత్ ధ్యానములో సమయము గడిపే వారూ ఉన్నారు.
వీరికి తోడు నాస్తికులు, వివిధ ప్రాచ్య, పాశ్టాత్య సిద్దాంత వాదులు, ఇతర వాదముల వారూ, వివిధ రకాల సామాజిక న్యాయముల కొరకు పోరాడేవారూ, ప్రభుత్వ లెక్కల్లో హిందువులలో తెగలుగా ఉన్నారు.
లోకో భిన్న రుచి:, పుఱ్ఱెకో బుద్ధి జిహ్వకో రుచి వంటి నానుడులను నిజం చేస్తూ హిందువులు అనైక్యముతో జీవిస్తున్నారు.
పంచతంత్రము, రామాయణము, మహా భారతము, భాగవతము ఇతర తత్త్వ శాస్త్ర, సూత్ర సాహిత్య, ఇత్యాది సాహితీ మణులను ఉపయోగించుకుంటూ జీవనము సాఫీగా జీవిస్తున్న వారూ ఉన్నారు.
పరస్పర అవగాహనతో, పరోపకారము చేస్తూ, జీవుల పట్ల కారుణ్యము కలిగి ఋషి తుల్యులుగా జీవిస్తున్నవారూ ఉన్నారు.
భవిష్యత్తు భగవంతుని చేతిలో ఉంది.
సర్వే జనా: సుఖినో భవంతు!
సర్వే నిరామయా: సంతు!
సమస్త సన్మంగళాని భవంతు.
శివ పరంగానూ ఎన్నో మతములు ఏర్పడ్డాయి. దేముళ్ళ, దేవతల, దైవముల కుటుంబ సభ్యులతో మరెవ్నో తెగలు ఏర్పడ్డాయి. మతము, తెగ ఒకే అర్ధములో ఇక్కడ చర్చించ బడ్డాయి.
వీటితో సమాంతరంగా షడ్దర్శనముల వారూ ప్రతేక తెగలము అనిపించారు. ఆ పై వీర శైవము, వీర వైష్ణవము తెగలుగా ఏర్పడ్డాయి. వీర శైవము మళ్ళీ లింగాయత్ లు వక్కలింగలుగా విడిపోయారు. కర్ణాటక రాష్ట్ర రాజకీయము
ఈ రెండు తెగల చేతుల్లో నడుస్తోంది.
ఆధునిక భారత దేశంలో 1800 - 1900 ప్రాంతంలో ఎన్నో సాంఘిక విప్లవాలు వచ్చాయి. అవి పుంఖానుపుంఖాసుగా పెరిగి మరి కొన్ని తెగలు ఏర్పడ్డాయి. స్వాములు, బాబాలు, అమ్మలు, ఆనందాలు, బాపులు, మహరాజ్ లు, ఇంకా ఇలాంటి వాళ్ళు తామర తంపరగా వచ్చారు. వీరి చుట్టూ, వీరి వీరి "బోధనల" చుట్టూ మరెన్నో తెగలు ఏర్పడ్డాయి. అలాగే టి.వి. ల పుణ్యమా అని ఎందరో ప్రవచనకారులు వెలిసారు. ఇక్కడా తెగలే.
ఈ తెగల వారందరూ ఎవరికి వారు ప్రత్యేకము. ఎవరితో ఎవరూ కలవరు. ఎవరి ఆర్ధిక, ఆధ్యాత్మిక సామ్రాజ్యము వారిది. వారి వారి అనుయాయులు వారి గురువులకు వీర అభిమానులు. ఎంతటి అభిమానులంటే, విష్ణు, శివ, రామ, కృష్ణ, హనుమ, దేవిల దివ్య నామముల కన్న తమ తెగ నాయకుని నామమే మిన్న అనుకునేవారు.
వీరికి తోడు RSS వంటి సాంస్కృతిక సంస్థలు. అటువంటివి మరెన్నో. వీరందరూ హిందూ మతము వారే. మతాన్ని ఉద్దరించడానికి కంకణం కట్టుకున్నవారే.
వీరందరి హడావుడిలో, అలజడులలో పాల్గొనక, అంతనీ అందరినీ సాక్షి మాత్రముగ చూస్తూ అందరి దేవుళ్ళను, దేవతలనూ, దైవములనూ సమానముగా చూస్తూ , అన్ని సంప్రదాయములకు, మార్గములకు సమాన గౌరవమిస్తూ తమ మార్గమున పయనిస్తూ ప్రశాంతముగ భగవత్ ధ్యానములో సమయము గడిపే వారూ ఉన్నారు.
వీరికి తోడు నాస్తికులు, వివిధ ప్రాచ్య, పాశ్టాత్య సిద్దాంత వాదులు, ఇతర వాదముల వారూ, వివిధ రకాల సామాజిక న్యాయముల కొరకు పోరాడేవారూ, ప్రభుత్వ లెక్కల్లో హిందువులలో తెగలుగా ఉన్నారు.
లోకో భిన్న రుచి:, పుఱ్ఱెకో బుద్ధి జిహ్వకో రుచి వంటి నానుడులను నిజం చేస్తూ హిందువులు అనైక్యముతో జీవిస్తున్నారు.
పంచతంత్రము, రామాయణము, మహా భారతము, భాగవతము ఇతర తత్త్వ శాస్త్ర, సూత్ర సాహిత్య, ఇత్యాది సాహితీ మణులను ఉపయోగించుకుంటూ జీవనము సాఫీగా జీవిస్తున్న వారూ ఉన్నారు.
పరస్పర అవగాహనతో, పరోపకారము చేస్తూ, జీవుల పట్ల కారుణ్యము కలిగి ఋషి తుల్యులుగా జీవిస్తున్నవారూ ఉన్నారు.
భవిష్యత్తు భగవంతుని చేతిలో ఉంది.
సర్వే జనా: సుఖినో భవంతు!
సర్వే నిరామయా: సంతు!
సమస్త సన్మంగళాని భవంతు.
No comments:
Post a Comment