Thursday, July 30, 2015

VYAASA POORNIMA

VYAASA POORNIMA



Poornima (full-moon day) night is full of moon-light. Full-moon light is pleasant. Full moon is complete and full with sixteen kalas (phases). There is a thick bond between seers, sages, saints and religious preachers of India and full moon day. Many of them have taken their birth on full moon day. Some of them are Vyasa, the Buddha, Vardhamaana Mahaaveera, Gurunaanak.


Full moon and full-moon light are manifestations and replicas of pleasantness, fullness, and purity. The Aashadha (June-July) Pooornima is famously and popularly called as Vyasa Poornima and Guru Poornima.


Sage Vyaasa has taken birth on Aashaadha Poornima. Sage Vyaasa has contributed enormously to the culture and spirituality of India. He has composed the resource books and guides to Indian culture. He has given India; The Mahaabhaarata, The Bhagawadgita, The Mahaabhaagavata, The Eighteen Puraanaas, Brahma Sutras and host of things. He is also compiled and divided The Vedas. So he is also known as Veda Vyaasa.  Let us remember him with respect and gratitude.


As said earkier, the Aashadha Poornima is also known as Guru Poornima. On this auspicious Guru Poornima day let us delightedly, joyfully, affectionately, with full humility and thankfully remember all the teachers (Gurus) who taught us secular as well as spiritual knowledge and be devoted to them by surrendering our ego. To do so is our tradition and habit.


Let us pray Lord Parameswara on this joyous occasion to make our minds and hearts reflect the Sunlight like Knowledge and the insight so gained pervade us as full-moon light; thus making us peaceful, blissful, pleasant, with humility, serenity and silence.


Let us also humbly bow down to our enlightened traditional Spiritual Initiators and Teachers of         Brahmajnaana (the Knowledge of Self); Sri Dakshinaamoorty (Saivaite Tradition) and Sri Hayagriva (Vaishnavite Tradition). Let us also salute the succeeding spiritual teachers, the Buddha, the Vardhamaana Mahaaveera, the compilers of Saddarsana Sutras, and many seers, saints, sages of all views and schools of spirituality. And with their grace and blessings let us drink to our hearts’ content the nectar of Knowledge of Self and shine and become immortal too transcending conventional religions and their limitations and attain Jeevan Mukti (getting liberated while alive).
WebRepOverall rating

Sunday, July 26, 2015

ఇంత కంటే గతి లేదు మనకు

ఇంత కంటే గతి లేదు మనకు

బొట్టు పెట్టుకొని అమ్మాయిలు; జడ వేసుకొని కూతుళ్ళు;
పంజాబీలు, స్కర్టులు, తొడలు కనిపింప చేయు పొట్టి లాగులు,
జీన్స్ పొడుగు లాగులు, మరెన్నో బోల్డ్, హాట్ వస్త్రధారణలు; కొనిపెట్టే మనము
నచ్చక పోయినా అడిగే ధైర్యము లేనిదీ మనకె; అడిగితె మన్ని తిట్టిపోసే ఆధునికులు కోకొల్లలు;
బాయ్ ఫ్రెండ్స్ తో చక్కర్లుకొడుతూ  హాయ్ బాయ్ బై అంటూ కులుకుతూ,
ఏదో హీరో కి ఫాన్లై మనసున మల్లెలు పూయించుకునే యువతులు మనవాళ్ళు;
బాధ్యత కల తండ్రులమైన మనకు ఏదీ చెందదు;అరటాకు సామెతలు బిసి నాటివి;
సామ్ప్రదాయమన్న సంస్కృతి యన్న చెమడలెక్కదీసెదరు ఎన్. జీ. ఓ. లు; నోరు మూసుకుని
ఈ నాగరికతను బిక్కు బిక్కు మంటూ కళ్ళప్పగించి చూడడం తప్ప గతి లేదు మనకు

Friday, July 24, 2015

Religion, fanaticism and secularism



 RELIGION, FANATICISM AND SECULARISM



A person who is truly religious will not be corrupt. Indian politicians, government employes, corporates, rulers and others if have been and are truly religious India would have never suffered the rampant corruption practiced, being practiced by all.

In India religion is invoked by all politicians and other selfish people having vote-banks in mind. Words for this or that religion or for "secularism" are used without any conviction. The word secularism is most abused in India by politicians to the extent of changing its meaning and sense.

Secularism in its truest sense is following one's own religion but transcending religion and administering and not making India irreligious. Who cares? secularism has been practiced in India from times immemorial by many rulers and by all its citizens as a "religion". Secularism is respecting all religions equally; and not criticizing or trying to deride religions, especially Hindu religion in India, and attempt to "eliminate" religion from the social fabric of the nation.

Many rationalists and thinkers influenced by modern thoughts and isms like communism and who feel they only are "true" intellectuals, only know to talk irresponsibly, vulgarly and without etiquette and culture and manners about Hinduism. They do not and cannot see any such negative things they point out in other religions being practiced in India simultaneously. They lack in objectivity and are carried away by their "beliefs" that Hinduism is dogmatic and progress-obstructing. and full of "superstitions" and discrimination and exploitation.

Wish all these intellectuals become more enlightened and see things with equanimity and objectivity, as they are, and not colored by their ideology, ism, and personal avarice and dislikes which are mere individualistic and personal prejudices.


It has been a tradition in all societies of nations that an individual proposes an ideology or a religion or a cult and some others write books around it. Some take fancy to it and "follow" it and while doing so introduce many "innovations" not present in the original but by force of their personality make them part of the original ideology, religion or cult.

Some others will now take care and impose the cult/religion/ideology on others who are not necessarily enthused about it or might be following another cult. They naturally resist. These imposers are normally fundamentalists and fanatics. They will not hesitate to physically eliminate the resistors to their ideology/cult/religion. The society will have blood shed and this may be repeated many times during the course of passage of time. 

Very rarely in between some humane-nature individuals take birth and try to correct and re-conciliate the warring factions. But they may or may not succeed. As long the humane people are alive they will have some influence. After their death the history gets repeated. Killings and destruction in the name of cult/religion/ideology rampantly takes place. And this gets repeated.

Mot of the times, unfortunately, only the fundamentalists, fanatics and terrorist-turned followers dominate and change the course of destinies of all societies or nations.

There is no escape from this. And more interestingly and tragically many "intellectuals" swarm around these congregations and do their best that their cult/religion/ideology dominates. They very fiercely and as fanatically as the killers in the name of their faith divide society and try to uphold their faith through their writings, speeches and all other communicative practices.

The nation and the society in the form of normal citizens suffers all this silently. And beautifully in between some scholars, intellectuals, fine-artists, scientists, philosophers, spiritual people also try their best to maintain harmony and peace through their works and actions.

This is the perpetuating history of societies and nations through out the globe, then, now and tomorrow.

Tuesday, July 21, 2015

చేతి చమురు భాగోతం

చేతి చమురు భాగోతం 

నేటి రోజులలో కవిగా పేరుతెచ్చుకోవడానికి కవితలు రాస్తే సరిపోదు. ఇంకా ఎన్నో చేయాలి. ముందుగా ఒక వాదాన్ని ఆశ్రయించాలి. కవనములను ఆ వాదానికి అనుగుణంగానే రాయాలి. వీలయితే  సంప్రదాయాన్ని వీలయినంత ఘాటుగా  విమర్శించాలి. మళ్ళీ నమ్మకస్తులైన పాఠకులను అమర్చుకోవాలి. 

కళాశాలలో, విశ్వవిద్యాలయములలో బోధించే ఆచార్యులు వారి వారి ఇష్టాయిష్టాలని  బట్టి కవితలకు మార్కులేస్తోంటారు. విమర్శకుల గురించి ఇంక చెప్పనక్కర లేదు. విమర్శకులు నమ్మిన సిద్ధాంతాన్ని పోషిస్తూ కవిత తయారైందా  లేదా అని వారు చూస్తారు. అప్పుడే ఆ కవితని ఆస్వాదించడానికి మొదలు పెడతారు. సిద్ధాంతపు పంజరపు చిలకలకె వారి  ఓటు. 

ఇదంతా అయ్యాక ఒక రకమైన గుర్తింపు వచ్చాక "కవికి" కవితా సంకలనము తేవాలనే కౌతుకము. దానికి సంబంధిచిన హడావుడి,శ్రమ, ఆయాసము అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఇంత కష్ట పడి, ఖర్చుపెట్టి సంకలనము అచ్చువేసికున్నాక దాని ఆవిష్కరణ మరొక సంబరము. "పేరుప్రతిష్టలు" కల ఒకరిద్దరు ఘన కవుల, విమర్శకుల చేతితో ఆ ఆవిష్కరణ సభ జరపడం, దానికోసం మళ్ళీ ఖర్చు పెట్టడం. అందరూ పొగిడాక ఆ పుస్తకాన్ని అందరకూ ఉచితముగా పంచడము. ధన్యోస్మి అనుకోవడము. కవినయ్యానని ఆనందం. 

కవితలు రాయడం ఒక ఎత్తు, అచ్చు వేయడం, ఆవిష్కరణ సభ జరపడం, సభకు పెద్దలను, పాఠకులను పట్టుకురావడం, ఇదంతా ఒక ఎత్తు. 

ఈ రోజులలలో ఎందరమో ఈ "వ్యసనాన్ని"వదులుకోలేకపోతున్నాము. ఇంతటి ఖర్చు పెట్టి, చేతి చమురు భాగోతంలా కవులము అనిపించుకుంటున్నాము, అవుతున్నాము. 

ఇదంతా అవసరమా? ఏమో? 

అంతర్జాలము ఏలుతున్న ఈ రోజులలో ఇ-పుస్తకము తయారు చేసుకుంటే సరిపోదా? అవార్డులు ఇచ్చే వారు అచ్చు అయిన పుస్తకాలకే బహుమతులు ఇస్తారు. కవి అవార్డు కోసము ఇంత  ఖర్చు పెట్టాలా? ఇ-పుస్తకాన్ని అచ్చు పుస్తకం లాగా ఎందుకు పరిగణించకూడదు? 

ఖర్చు పెడితేనే కవి అవుతాడా? కవనము రాస్తే కవి  అవుతాడా? ఏమిటో మరి ఈ వింత!

దేవుడి గొడవ మీకెందుకు?

దేవుడి గొడవ మీకెందుకు?

దేవుడి గొడవ మీకెందుకు?
వదలండి దేవుణ్ణి, ఆయన భక్తులను
వారి మానాన పోనివ్వండి వారిని;
జీవించండి మీరు మీ "నమ్మకముతో" 


నమకము చమకము
మంత్రపుష్పము అనవసరము మీకు

ప్రాచ్యమో పాశ్చాత్యమో ఒక
సిద్ధాంత వ్యామోహంలో పడి
విలసిల్లండి; ఆ సిద్ధాంత విలాసినీ
మాటల మత్తులో కబుర్ల సొగసు
సోయగములలో చూడండి నాకమును
దేవుడెందుకు మీకు దేవతల ఊసెందుకు మీకు

మీది ప్రశస్త బుద్ధి; జీవించండి
ఆ బుద్ధి కుశలతతో; నమ్మకండి విధిని
దేవుని సంకల్పములను; ఆయన కారుణ్యమును
బ్రతకండి మీ స్వంత ప్రతిభతో, సామర్ధ్యములతో

వదలండి దేవుడిని, గుడిని
వెళ్ళకండి అక్కడకి, వెళ్ళండి
మీ చిత్తమొచ్చిన చోటికి

భక్తుల-భగవంతుని సహజ అనుబంధము
అవగతము కాదు మీకు;

మీరు మెచ్చు సిద్ధాంతమును,
తత్ సిద్ధాంత కర్తను కొలవండి,
పరిగణించండి అతని పుస్తకమును
పవిత్ర గ్రంథముగా; ఆ ఉక్తులను ఉటంకించండి
ఎచ్చోటనైనా; పొందండి కితాబులను

రాకండి మాజోలికి; మా సఖుని జోలికి
హేతువాదులారా, నాస్తికులారా
దేవుడు లేడని మీ "నమ్మకము" మాత్రమె
వదలండి దేవుడిని, గుడిని

Monday, July 20, 2015

పెద్దల ఊసులే చద్దికూడు మనకు

పెద్దల ఊసులే చద్దికూడు మనకు

కృష్ణుడు ఇస్కాన్ కల్టు వారి స్వంతమా‌ లేక వారి‌ కాపీరైటా, పేటెంటా?
వేంకటేశ్వరుడు వైష్ణవులకు‌‌ మాత్రమే దేముడా ఇతర భక్తుల కాయడా?
ప్రాంతము అక్కడి రాజకీయుల జాగీరా? తాతల ఆస్తా? మరెవరికి అక్కడ
చోటెందుకు లేదు? సంకుచిత్వము విషము చిమ్ముచువ్న నేడు, మత గురువులు,
నాస్తికులు, ప్రాంతీయ నాయకులు బరువు దేశమునకు; సామరస్యము తెలియని‌
మనుషులు శాంతి విధ్వంసకులు, సంఘ విద్రోహులు; అన్య మతముల,
అన్య తత్త్వముల, అన్యదైవముల దూషించు‌వారు కారు మానవులు

ఇంగితము లేని వారు విద్యలు గరపగలరా? ఈ ఎల్లయ్యలు పుల్లయ్యలు?
ద్వేషము క్రక్కు వారు సంఘమును నడుపగలరా? ఈ ఆధునిక  సిద్ధాంత వాదులు?
మూర్ఖులై మూఢులై అనాగరికులు, సంస్కార హీనులు
గాక ఆ‌ ( నా )స్తిక శిఖామణులు? సమత మమత తెలియక,
నలుగుర కలుపుకుపోగల హృదయ‌ నైర్మల్యము లేక
పేచీ పెట్టు గురువులు, నాయకులు మేధావులు పుడమికి చేటు గాద!

ఆడలేనమ్మ మద్దెల ఓటన్నట్టు చేతగాక,
నూతనముగ ఏమి ఆవిష్కరించక
సాంప్రదాయమును, జ్ఞానమును నిందించువారు
సంస్కృతి, సంస్కారములు లేని అనాగరికులు, ‌
ఆటవికులు; ఇందర కుమనస్కుల భరించుట
భారతమునకు కష్టమగుచున్నది‌ నష్టమగు చున్నది‌;
ఎవరూ దేశమునకు చెందరు! అందరి సుఖ శాంతుల పోగొట్టు
దుండగీడులు వీరు; మేధావుల మనుకొను వాగుడు మూకలు!
జ్ఞానమే శరణ్యము మనకు; పెద్దల ఊసులే చద్దికూడు మనకు

Monday, July 6, 2015

కావ్యాలాప వినోదినీ!

కావ్యాలాప వినోదినీ!
చక్కని కవితలు చుక్కల చందమున
చక్కని చుక్కవు చందమామవు నీవని
నీపై మోజుతో కాంతులు విరజిమ్ముచు
నిన్నలరించుచు నిను కూడి యుండ
ఆ ధగధగల వెల వెల బోయెదమని
అస్మత్ కవితా తారకలు జంకుచుండె
చూడుమా వంక ఓ నెలవంకా!
చూడు మావంక సిరీ! సఖీ!
భ్రమర సదృశ రస సరస హృదయమును కలిగి
వివిధ కవితా ప్రసూనముల జుంటు తేనియలు
గ్రోలుచు ఆ మత్తుల హాయిల ఊగి తూగు
నీకు హాయిని తూకముగ అందించలేమేమో అని
నా రస కవితా సుమములు బెరుకు వహించె
అల్లన నిలిచె నీ కటాక్షమునకై చూడుము చెలీ!
సురస కవితాఝరుల తానమాడు నీ మనమును
తమ ఆర్ద్రతతో తడుపగలమొ లేమో నని
ఇంకి పోవుచుండె నా రస కవితా ధారలు ఇంతీ!
నీ రస హృదయము వీణయై నిను శ్రుతి చేసి ఉంచ
మర్మజ్ఞులు రస కవితా సంగీతజ్ఞులు కవనముల
ఆలాపించుచు నీ డెందమును మీటుచుండ
మేమును వైణికులమని అనుటకు మాట రాక
మా కవితా సుస్వరములు మూగ బోవుచుండె ప్రియా!
పూబోడివై రస పుష్పమువై నీవు వెల్గొంద
నీ చుట్టూ రస కవితా ప్రసూనములు వెదజల్లబడి
నిను కొలుచుచు నీకు అందమును చేకూర్చ హృదయమునూపుచుండ
మా కవితా పుష్పములు నీ పై జల్లుటకు జంకాయె సఖీ!
ప్రముఖులు గాయకులై తమ కవితాగానమున
నిను పరవశింప జేయుచుండ రస లోకములనున్న
నిన్ను మా కవితా గానము చేరునో
లేదో యని సందియమాయె చెలియా!
రస రాజకుమారివి రసరాజ దేవేరివి
కమ్మని కవితలు చెలికత్తెలై
నిన్నుఅలరించు చుండ
మేమును కవితలమనుచు
నిను రంజింప జేయుటకై
నా కవితా చెలులు నీ అంతఃపురమున నున్నారు
ఇటు తిప్పు మోము చంద్రుని తోడ బుట్టినదానా!
ప్రముఖుల కవితలకు ఏవో ఎవరో ప్రేరణలు ఎందఱో పాఠకులు
మా కవితలకు మాత్రము ప్రేరణవు పాఠకురాలవు నువ్వే చెలీ!
ఇతరుల కవితలందరి హృదయానందములకు
మా కవితా మల్లెల గుబాళింపు నీ ఆస్వాదనకే సుందరీ!
వారి కవితలలో సార్వజనీనత ఆటాడుచుండును
మా కవితలలో నీపై నా మమతే నాట్యమాడుచుండును నెలతా!
ధైర్యముగ చెప్పు ఒక్క మాటను విను ప్రియా!
మేమూ కవులమే భావుకులమే
వారి సాటి వారమే ఆ పాటి వారమే
నీకు సరి జోడులమే జోదులమే
సరిపోయి సరితూగు వారమే!

Saturday, July 4, 2015

ఆత్మ దృష్టి - మానసిక దృష్టులు

ఆత్మ దృష్టి - మానసిక దృష్టులు
గమనికలో విషయము (దృశ్యము, శబ్దము లేక ధ్వని, పరిమళము, స్పర్శ, రుచి ) గాని; విషయానుభవము [పై విషయములు కలిగించే అనుభవములు - వీటినే వాసనలు (మిగిలి ఉండేవి) అని కూడా అంటారు] లేని దృష్టియే ఆత్మ. దీనినే బ్రహ్మము అని కూడా అంటారు. అయం ఆత్మా బ్రహ్మా. వట్టి గమనిక మాత్రమే అయిన విశ్రాంత దృష్టియే ఆత్మ. బ్రహ్మము.

గమనికలో ఏదేని విషయము గాని, విషయానుభవము గాని లేక ఉండడమే మనసుకు శాంతి కుదరడము. నిర్మలమైన మనసే శాంతి. శాంతి కుదరడమే మోక్షము. ఆనందము లేక మౌనము అన్నా ఇదే.
తన నామ, రూప, వ్యక్తిత్వ (అహంకార - మమకార స్పృహ) నిండుకొనిన నిండు (పూర్ణ) దృష్టియే (పూర్ణమదః  పూర్ణమిదమ్ పూర్ణాత్ పూర్ణముదచ్యతే / పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే
లోని పూర్ణము ఇదే).
శరీర, జీవ (వ్యక్తిత్వ) స్పృహ లేకపోవడమే పూర్ణ దృష్టి. విశ్రాంత దృష్టి అన్నా ఇదే. విషయయుత గ్రహింపులు గాని, తలంపులు గాని, అవి కలిగించే లేక ప్రేరేపించే వాసనలు గాని, దృష్టిలో గాని స్పృహలో గాని, లేకపోవడమే మన నిజ "మానసిక" స్థితి. ఈ స్థితిలో మనసు, ఇతర అంతఃకరణములు - బుద్ధి, చిత్తము, అహంకారము -  పని చేయక ఆత్మలో లీనమై ఉంటాయి. దీనినే ఆత్మ లేదా బ్రహ్మ స్థితి అంటారు. పరమాత్మ స్థితి అన్నా ఇదే.
ఈ భూ గ్రహము పై మనుష్య జాతి ఉనికియే ఈ మధ్యది. వ్యక్తీ ఉనికి సమయము ఇంకెంతటిది? ఆ వ్యక్తీ ఉనికి స్పృహ సమయము ఇంకెంత తక్కువది?
క్షణ భంగురమైన మనుష్య శరీరమే "నేను" అని భావించక, ఈ మనుష్య శరీరాన్ని, ఆ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్న వ్యక్తిత్వము, తత్సంబంధ అహంకార - మమకారములు, జీవ భావములు "నేను" అని అనుకోక -ఇవన్నీ అయిన సృష్టి - దృష్టిలో లేక నిలిచిన - విశ్రాంతమైన - వట్టి గమనిక మాత్రమే ఆత్మ దృష్టి. అదియే మన సహజ స్థితి. దానిపైని ఆనింపులే మన భావములు, అనుభవములు, వ్యక్తిత్వము, జీవ భావములు, అనుభవములు.

ఈ భావములు, అనుభవములనె సంసారము అంటారు. సంసారము అంటే భార్య, బిడ్డలు , సంపత్తి, పేదరికము మొదలైన లంపటములు ఉండడమే కాదు. అలా దొంగ సన్యాసులకు కూడా ఈ మానసిక సంసారము బెడద తప్పదు. అందుకే చాలామంది దొంగ సన్యాసులు - సన్యాసినులు, ఆధ్యాత్మిక ప్రవచనము చేయడాన్ని వృత్తిగా, వ్యాపారముగా పెట్టుకున్న వాళ్ళు, అటువంటి ఇతరులు - కూడా ఈ మానసిక సంసార సుఖ దుఃఖములకు, సాధక బాధకములకు అతీతముగా ఉండలేక అన్ని వెధవ పనులూ చేస్తారు. " చేసేవి ఆధ్యాత్మిక ప్రసంగాలు దూరేవి దొమ్మరి గుడిసెలు " చందాన జీవిస్తారు. ఇటువంటి వారు వారిని వారే ఉద్ధరించుకొనలేరు. ఇంకా మనలని ఏమి ఉద్దరిస్తారు?
అలా విశ్రాంత దృష్టియైన ఆత్మ దృష్టి పైన ఆభాసయే (ఆనింపే) మానసిక దృష్టి. మానసిక దృష్టి అడ్డుపడి మనకు సహజమైన ఆత్మ దృష్టిని కప్పి బయటి ప్రపంచాన్ని, ఆ ప్రపంచములో కల విషయములను, విషయానుభవములను చూస్తూ (దృష్టిలో ఉంచుకొని) ఆత్మస్థితి అనుభవములోనికి రాకుండా చేస్తుంది. సహజమైన మన శాంత స్థితిని మరుగున పడేస్తుంది. మన తలపులు, అనుభవములు రూపములో ఉన్న ఈ ఆంతర  ప్రపంచము (బయటి ప్రపంచము యొక్క ప్రతి - విషయములు, విషయానుభవముల రూపములో) దృష్టికి వచ్చి తదనుగుణ సుఖ దుఃఖములను కలిగిస్తూ తలపుల సుడిగుండములో పడేస్తుంది.

ఈ మానసిక దృష్టి రెండు రకాలు.
1. బహిర్ముఖ దృష్టి:

జ్ఞానేంద్రియములతో అనుసంధానమైన మనసు బయటి ప్రపంచములోని విషయములతో అల్లుకుపోతుంది. మనసు దృష్టి అంతా బయటి ప్రపంచపు విషయములతో మమేకమవుతుంది.

2. అంతర్ముఖ దృష్టి:

అదే మనసు ఈ బయటి ప్రపంచపు విషయ సముదాయాన్నంతా ప్రపంచముగా మస్తిష్కంలో భద్రపరుస్తుంది. దీనిని అంతర జగత్తు అంటారు. ఈ జగత్తులోని విషయాలను మనసు మరల గ్రహిస్తే అవే మన భావములు, తలపులు, ఆలోచనలు అవుతాయి. "జగత్ - కదిలేది" అంటే ఇదే. "బ్రహ్మా సత్ జగత్ మిథ్యా" లోని "జగత్" ఇదే.   ఈ విషయములు అదే సమయములో కలిగించే అనుభవములను చిత్తము వాసనలుగా, జ్ఞాపకములుగా భద్రపరుస్స్తుంది. మరల చిత్తమే ఈ వాసనలను జాగృత పరుస్తుంది. అవే మన చిత్త స్థితులు. సంకల్పము కలిగినప్పుడు చిత్తము తదనుగుణ మానసిక స్థితి ఏర్పరస్తుంది. అనుభవము మానసిక స్థితి. తలపు,  భావము, ఆలోచన - మానసిక గతి. వ్యక్తిత్వ సంబంధమైన తలపులను కలిగించే మనసుని (అంతః కరణాన్ని) అహంకారము అంటారు. గర్వము అనే ఉద్దేశములో ఇక్కడ ఈ అహంకార పదాన్ని ఆర్ధము చేసికోకూడదు. వ్యక్తి  భావముల - అహంకార మమకార భావ సముచ్చయము- అని అర్ధము చేసుకోవాలి. బుద్ధి విచక్షణను, తార్కిక జ్ఞానాన్ని అందిస్తుంది. అంతఃకరణములు అంతర జగత్తును చూస్తున్నప్పుడు అంతర్ముఖ దృష్టి ఏర్పడుతుంది.

ఈ దృష్టియే బయటి ప్రపంచపు గ్రహిత విషయములకు, లోపలి తలపులకు అనుగుణముగా కర్మేన్ద్రియములను మనసుద్వారా పని చేయిస్తుంది.
అంతర్ముఖ, బహిర్ముఖ దృష్టుల ద్వారా మనసు అన్ని గ్రహణములూ చేస్తుంది. తదనుగుణ ప్రతి క్రియలూ చేయిస్తుంది.

మానసిక దృష్టులైన బహిర్ముఖ, అంతర్ముఖ దృష్టులు రెండూ విరమింప బడినప్పుడు విశ్రాంత దృష్టి నిండుగా భాసిస్తుంది - మబ్బు తెర తీసిన తరువాత సూర్య భగవానునిలా. ఈ సూర్య భగవానుడే ఆత్మ. బ్రహ్మము. అసలు నేను. (అసలు మనము; అసలు మనసు). నిర్మల మానసిక స్థితి. అసలు జ్ఞాన స్థితి. జ్ఞానుల నిరంతర స్థితి. జ్ఞానులు, మునులు, ఋషులు, బ్రహ్మ విదులు, బ్రహ్మ వేత్తలు, సదా ఈ స్థితిలో రమిస్తూంటారు - వేదాంత వాక్యేషు సదా రమన్తి - వేదాంత వాక్య తాత్పర్య తత్పర స్థితిమ్ అనుభవరూపేణ సదా వహన్తి. ఇప్పుడు మనసు తన పుట్టుక స్థానము అయిన ఆత్మలో లీనమైపోయి తెలుకుకునేది, తెలియబడేది లేని తెలివి మాత్రముగా ఉంటుంది.
ఇట్టి స్థితిలో నున్న జ్ఞానులకు ఆత్మయే మనసుగా వర్తిస్తుంది. మనసు మనకు నౌకరు. వంటవాడు. తోటమాలి. ఇవన్నీ అయిన మనసు తన పనులను సరిగా చేయక యజమానులమైన మన నెత్తిన ఎక్కి, తన పనులు మానేసి నపుడు, మన అదుపులో ఉండక వెర్రి వేషాలు వేస్తున్నప్పుడు, ఆ నౌకరును తీసి పారేసి అన్ని పనులూ మనమే చేసికున్నట్టు మునులు, జ్ఞానులు, ఋషులు, తత్త్వ వేత్తలు, బ్రహ్మ విదులు తమ లౌకిక వ్యవహారములను మానసాతీతముగా నిర్వర్తించుకుంటారు. మనసు వారికి పెంపుడు కుక్క. చెప్పినట్టు వింటుంది. అందుకని జ్ఞానులకు సంసార - సుఖ దుఃఖానుభవయుత - బాధలు కలుగవు.
ఆత్మయే మనసుగా వర్తింప చేసికునే నేర్పు సాధించడమే ఆధ్యాత్మికత పరమార్ధము.పరమోద్దేశము.
అంతర్ముఖ, బహిర్ముఖ  దృష్టులకు అతీతముగా విశ్రాంత దృష్టియై విధి విహిత, నియమిత వ్యవహారములను గృహస్తులుగా నిర్వహిస్తూ, భగవన్నామ స్మరణము చేసికుంటూ - జీవించడమే మానవ జీవిత లక్ష్యము. విధి. ఇంక దేనిని ఉపనిషత్తులు గాని, వాటి స్రష్టలుగాని చెప్పలేదు.
***********

హిందూ మతములోని తెగలు

హిందూ మతములోని తెగలు
హిందువులలో కులముల పేరిట తెగలున్నాయి కాని హిందూ మతములో తెగలు ఏమిటి? తెలుసుకుందాం ఇప్పుడు.
హిందువులు మొదట తెగలుగా విడిపోయినది ప్రస్థానత్రయ భాష్య రచనలలో. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అంటారు. త్రిమతాచార్యులు వీటికి తమ తమ దృష్టిని బట్టి వ్యాఖ్యానములు వ్రాశారు. గమనించండి, ఇప్పుడే, ఇక్కడే హిందూ మతము మూడు మతములుగ విడి పోయింది. శంకరాచార్యులుది అద్వైత దృష్టి. రామానుజాచార్యులుది విశిష్టాద్వైత దృష్టి. మధ్వాచార్యులుది ద్వైత దృష్టి. అవంటే ఏమిటో తెలుసుకోవాలంటే వారి వారి వ్యాఖ్యానములని, వారి శిష్యుల, అనుయాయుల ప్రవచనములనీ చదవాలి.
శాక్తాద్వైతము మరియొక తెగ. ఒక్క బ్రహ్మసూత్రములకే వివిధ దృష్టులతో ఎన్నో వ్యాఖ్యానములున్వాయి. వల్లభాచార్యుడు, నింబారకుడు వారి వారి దృష్టులతో వ్యాఖ్యానించారు. వీరూ, వీరి వ్యాఖ్యానములు కేంద్రంగానూ మతములు ఏర్పడ్డాయి. మహాత్మాగాంధి కుటుంబ సభ్యులు వల్లభాచార్య మతానుయాయిలు. వల్లభాచార్యులు, నింబారకుడు తెలుగు వారు.
శివ పరంగానూ ఎన్నో మతములు ఏర్పడ్డాయి. దేముళ్ళ, దేవతల, దైవముల కుటుంబ సభ్యులతో మరెవ్నో తెగలు ఏర్పడ్డాయి. మతము, తెగ ఒకే అర్ధములో ఇక్కడ చర్చించ బడ్డాయి.
వీటితో సమాంతరంగా షడ్దర్శనముల వారూ ప్రతేక తెగలము అనిపించారు. ఆ పై వీర శైవము, వీర వైష్ణవము తెగలుగా ఏర్పడ్డాయి. వీర శైవము మళ్ళీ లింగాయత్ లు వక్కలింగలుగా విడిపోయారు. కర్ణాటక రాష్ట్ర రాజకీయము
ఈ రెండు తెగల చేతుల్లో నడుస్తోంది.
ఆధునిక భారత దేశంలో 1800 - 1900 ప్రాంతంలో ఎన్నో సాంఘిక విప్లవాలు వచ్చాయి. అవి పుంఖానుపుంఖాసుగా పెరిగి మరి కొన్ని తెగలు ఏర్పడ్డాయి. స్వాములు, బాబాలు, అమ్మలు, ఆనందాలు, బాపులు, మహరాజ్ లు, ఇంకా ఇలాంటి వాళ్ళు తామర తంపరగా వచ్చారు. వీరి చుట్టూ, వీరి వీరి "బోధనల" చుట్టూ మరెన్నో తెగలు ఏర్పడ్డాయి. అలాగే టి.వి. ల పుణ్యమా అని ఎందరో ప్రవచనకారులు వెలిసారు. ఇక్కడా తెగలే.
ఈ తెగల వారందరూ ఎవరికి వారు ప్రత్యేకము. ఎవరితో ఎవరూ కలవరు. ఎవరి ఆర్ధిక, ఆధ్యాత్మిక సామ్రాజ్యము వారిది. వారి వారి అనుయాయులు వారి గురువులకు వీర అభిమానులు. ఎంతటి అభిమానులంటే, విష్ణు, శివ, రామ, కృష్ణ, హనుమ, దేవిల దివ్య నామముల కన్న‌ తమ తెగ నాయకుని నామమే మిన్న అనుకునేవారు.
వీరికి తోడు RSS వంటి సాంస్కృతిక సంస్థలు. అటువంటివి మరెన్నో. వీరందరూ హిందూ మతము వారే. మతాన్ని ఉద్దరించడానికి కంకణం‌ కట్టుకున్నవారే.
వీరందరి హడావుడిలో, అలజడులలో పాల్గొనక, అంతనీ అందరినీ సాక్షి మాత్రముగ చూస్తూ అందరి దేవుళ్ళను, దేవతలనూ, దైవములనూ సమానముగా‌ చూస్తూ , అన్ని సంప్రదాయములకు, మార్గములకు సమాన గౌరవమిస్తూ తమ మార్గమున పయనిస్తూ ప్రశాంతముగ భగవత్ ధ్యానములో సమయము గడిపే వారూ ఉన్నారు.
వీరికి తోడు నాస్తికులు, వివిధ ప్రాచ్య, పాశ్టాత్య సిద్దాంత వాదులు, ఇతర వాదముల వారూ, వివిధ రకాల సామాజిక న్యాయముల‌ కొరకు పోరాడేవారూ, ప్రభుత్వ లెక్కల్లో హిందువులలో తెగలుగా ఉన్నారు.
లోకో భిన్న రుచి:, పుఱ్ఱెకో బుద్ధి జిహ్వకో రుచి వంటి నానుడులను నిజం చేస్తూ హిందువులు అనైక్యముతో జీవిస్తున్నారు.
పంచతంత్రము, రామాయణము, మహా భారతము, భాగవతము ఇతర తత్త్వ శాస్త్ర, సూత్ర సాహిత్య, ఇత్యాది సాహితీ మణులను ఉపయోగించుకుంటూ జీవనము సాఫీగా జీవిస్తున్న వారూ ఉన్నారు.
పరస్పర అవగాహనతో, పరోపకారము చేస్తూ, జీవుల పట్ల కారుణ్యము కలిగి ఋషి తుల్యులుగా జీవిస్తున్నవారూ ఉన్నారు.
భవిష్యత్తు భగవంతుని చేతిలో ఉంది.
సర్వే జనా: సుఖినో భవంతు!
సర్వే నిరామయా: సంతు!
సమస్త సన్మంగళాని భవంతు.

సనాతన ధర్మము - హిందూ మతము

సనాతన ధర్మము - హిందూ మతము

హిందూ మతం పేరు ఎత్తగానే, ఇది హిందూ మతము కాదు సవాతన ధర్మము అంటారు. తేడా ఏమిటి?
ధర్మము అనే పదానికి వహించునది, లక్షణము కలది అనే అర్థాలు ఉన్నాయి. ఇంకా అర్థాలు కూడా ఉన్నాయి. మతము అంటే ముఖ్యార్థము ఇష్టము అని.
నా దృష్టి ప్రకారము "సనాతన" పదము ఉపనిషత్ కాలానికి చెందుతుంది. ఉపనిషత్తులు జ్ఞాన సముచ్చయములు. ఆత్మ, బ్రహ్మము లను‌దర్శించాయి, వాటిని గురించి ప్రతిపాదించాయి. చర్చించాయి. మన కాలానికి 108 ఉపనిషత్తులు ఉన్నా పెద్దలు 12 ఉపనిషత్తులని ముఖ్య ఉపనిషత్తులుగా (Principal Upanishads) చూశారు, చూపారు.
సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు హిందూ మతము ఒక జీవన విధానము అన్నారు. సనాతన ధర్మమూ ఒక జీవన విధానము. ఉపనిత్ స్రష్టలందరూ గృహస్థులే. అప్పటికి మూడే ఆశ్రమములు. అవి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రవానప్రస్థము. మూడే వేదములు. ఋక్, సామ, యజుర్వేదములు.
సన్యాసము సనాతన ధర్మము, సంప్రదాయము కాదు. బౌద్ద, జైన సంప్రదాయములకు సంబంధించినది. తరువాత హిందూ మతములో ప్రవేశించినది. షడ్దర్శనములు తరువాతి పరిణామ ఫలములే. ఫలితములే. ఇవన్నీ తత్త్వాన్ని చర్చిస్తాయి. యోగము ఒక దర్శనము. ప్రస్తుతం యోగా అని శరీర వ్యాయామముగా మిక్కిలిగా ఆచరించబడుతోంది.
ధర్మము మానవ జీవిత విధానాన్ని, విధులను, బాధ్యతలను, గమనాన్ని చూపుతుంది. తద్వారా మానవ జీవితాన్ని నిర్దేశిస్తుంది, నియమిస్తుంది. స్నేహితునిలా, భార్య\భర్తలా కూడా ఉంటుంది. ఒకే మనిషికి ఎన్నో ధర్మములంటాయి. తల్లిగా, తండ్రిగా, భర్తగా\భార్యగా, గురువుగా\శిష్యునిగా, ప్రభువుగా, ప్రజ (ప్రజలు, సంతానముగా - కొడుకు, కూతురిగా) గా, బంధువులుగా, పై అధికారిగా, ఉద్యోగిగా, నౌకరుగా, ఇలా అన్ని బంధములకు, అన్ని వృత్తులకు, వివిధ మతానుయాయులగా, మానవుని అన్ని బాధ్యతలకు ఒక్కొక్క ధర్మము ఉంది. అవి పాటిస్తేనే సంఘ జీవితం సాఫీగా సాగుతుంది. లేకుంటే‌ అల్లకల్లోలాలే. గొడవలు, గందరగోళాలే. అశాంతియే. అందుకనే పెద్దలు అన్నారు "ధర్మో రక్షతి రక్షిత:" అని. ఎవరి ధర్మము వారు నిర్వహించకపోతే మనిషి సంఘ జీవితం సజావుగా సాగదు.
అందుకే ఉపనిషత్ స్రష్టలు "మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ" అని అన్నారు. గృహస్థులైన వారికి "అతిథిదేవో భవ" అనేదీ చేర్చారు. (ఇదివరకు హోటళ్ళు అవీ లేవని పాఠకులు గ్రహించాలి. సత్రములు, పూటకూళ్లమ్మలు తరువాతి చేరికలై ఉంటాయి.)
అహింస, జీవకారుణ్యము మానవుని విధులలో చేర్చబడ్డాయి. "సత్యం వద, ధర్మం చర" అనేదీ ఉపనిత్ ఉద్బోధమే. పరమత సహనము (శివకేశవుల, ఇతర దైవముల అభేదము) ఉపనిత్సందేశము లోని భాగమే. పురుషార్ధములైన ధర్మార్ధకామమోక్షములు ఉపనిత్ ప్రతిపాదనలే.
రామాయణ మహాభారతములు, ఇతర శ్రుతి, స్మృతి, శాస్త్ర, పురాణములు వీటిని, సనాతన ధర్మ ప్రాముఖ్యాన్ని, ఉపయోగాన్ని బహుళ ప్రచారము చేశాయి.
ఉపనిషత్తులు నిర్గుణ తత్త్వాన్ని చెప్పాయి. శంకరాచార్యులు దీనిని ప్రచారము చేశారు. రామానుజులు, మధ్వాచార్యులు సగుణ తత్త్వాన్ని ప్రచారము చేశారు. మహాభాగవతము, దేవీ భాగవతము, ఆళ్వారులు, నాయనమారులు, భారత దేశము లోని ఇతర ప్రాంతములకు చెందిన ఎందరో భక్తులు భక్తి మార్గానికి విశేష ప్రాముఖ్యము, ప్రాచుర్యము కలిగించారు.
మతము అంటే ఇష్టము కదా!
భక్తి, జ్ఞాన, కర్మ మార్గములు ముఖ్యముగా చెప్పారు. మనిషి ప్రవృత్తిని బట్టి ఒక్కొక్క మార్గము నచ్చుతుంది. ఏదీ మిగిలిన రెంటికన్న గొప్పదీ కాదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఇష్టము అంతే.
అలాగే దేవుళ్ళు, దేవతల, దైవముల విషయమూ. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవుడు ఇష్టం. ఏ దేవుడూ మిగిలినవారికన్న గొప్ప కాదు.
కానీ నా మార్గము గొప్పది, మిగతావి తక్కువవి అనే కొట్లాటలు ఆది నుంచీ ఉన్నాయి. అలాగే దేవుళ్ళు. ఎవరు ఎవరికి చెప్పగలరు? చెప్పివా ఎవరు వింటారు?
మతము ఇష్టములు కలిసిన వారికి ఒకటి అవుతుంది. ధర్మము మాత్రము అందరు మనుషులకూ ఒకటే. కుల, మత, ప్రాంత, భాషా వంటి భేదములెన్నున్నా మనుషులు అనుసరించవలసిన ప్రవర్తనా నియమావళి ఒకటే. అదే ధర్మము. మతమా, ఎవరి ఇష్టము వారిది.
సనాతన ధర్మము అందరు మనుషులకూ. హిందూ మతము హిందువులకు. భారత దేశము ధర్మానికి, తత్త్వమునకు, మానవ ధర్మములకు, విధులకు, బాధ్యతలకు, తత్త్వసారమునకు పేరెన్నిక కన్నది. మతమునకు కాదు.
సనాతన ధర్మముని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. హిందువులూ ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పుడు మానేశారు. దున్నేవాడిదే భూమిలాగ ఆచరించేవాడిదే సంస్కృతి. మా తాతలనాడు వేతులు తాగారు మా మూతులు వాసన చూడండంటే ఎలా.
ధర్మము, మతము వేరు. ధర్మము మతమునకు వేరు (root).