Showing posts with label భారతదేశంలోని వింతలు. Show all posts
Showing posts with label భారతదేశంలోని వింతలు. Show all posts

Wednesday, May 10, 2017

తిమ్మరుసు బుద్ధి సూక్ష్మత; భాషలు, జ్ఞానము; ఆస్తికత-నాస్తికత; భారతదేశంలోని వింతలు


తిమ్మరుసు బుద్ధి సూక్ష్మత



తిమ్మరుసు బుద్ధి సూక్ష్మత నేటి మత గురువులకు ఉంటే బాగుండును.
ఆయన గీతను చెఱపకుండా గీతను చిన్నది చేశాడు.; దాని పక్కన పెద్దగీత రాసి.

మన మతం గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే ఇతర మతాలను చిన్నబుచ్చక్కరలేదు. ఆ గీత గురించి ఏమీ అనకుండా తమ మతం గొప్పతనం, దాని శ్రేష్టత ప్రచారం చేసుకోవచ్చు. ఇతర మతాలు హీనమైనవి అని ప్రచారం చేయడం మూర్ఖత్వం​. తమది గొప్పమతం అని టముకు వేసుకోవచ్చు.

ఏదిఏమైనా​ అన్ని మతాల వారు అవస్థలు పడుతున్నారు.

ఏ మతమూ ఏ మానవునీ సుఖసంతోషాలలో ఉంచలేక పోతోంది. ఇంక ఈ అమాయక, మూర్ఖత్వపు ప్రచారాలెందుకో? అప్పనంగా ఇస్తున్న డబ్బులకోసం అయి ఉండవచ్చు.

మరో మతం వాళ్ళని ఊచకోత కోయడం కొన్ని మతాల దుర్లక్షణం. ఇది నాగరికత వెల్లివిరుస్తోంది అనుకుంటున్న
నేడు యథేచ్ఛగా జరగడం ప్రపంచంలో మేధావుల కొఱత వలన. రాజకీయం తప్ప వేరు విషయం తెలియని ప్రపంచ నాయకులు, మూర్ఖత్వం మూర్తీభవించిన మిత్రునికి గురువులు ప్రపంచంలో అలజడి, అస్తవ్యస్త పరిస్థితి, మానవ మారణహోమాలకు కారణం అవుతున్నారు.
మతం మతి భ్రమించి ఉన్మాదస్థితి లోనికి నెట్టబడుతూంటే విశ్వమానవ సౌభ్రాతృత్వం పుస్తకాలకే పరిమితం అవడం దురదృష్టకరం.
మతం మానవ కల్యాణానికి కాక మానవ మారణహోమానికి కారణం కావడం, దానిని ఆపే సత్తా కల మేధావులు ప్రపంచంలో లేకపోవడం మరింత దురదృష్టం.

అందరమూ చేతులెత్తేసి విపత్కర పరిణామాలకు సిద్ధపడ్డట్టుంది.

***********
 భాషలు, జ్ఞానము

భాషలు, జ్ఞానము ఎవరూ శ్రద్ధాసక్తులతో నేర్చుకోవడం లేదు. చదువుకోవడం పరమార్థమే మారిపోయింది. భాషలు సరిగా రాకపోయినా, శాస్త్రజ్ఞానములు ( ప్రకృతి శాస్త్రాలు, సాంకేతిక శాస్త్రాలు) లోతుగా నేర్వకున్నా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. అందుకని భాషాధ్యయనంపై నిర్లక్ష్యము. శాస్త్ర విజ్ఞాన సముపార్జనపై చిన్న చూపు. ఇది నేటి భారతదేశంలో చదువుల స్థితి (దుస్థితి).

ఎవరికీ జ్ఞాన సముపార్జనపై దృష్టి, ఆసక్తి, గౌరవము లేవు. ఎన్నో అపసవ్య మార్గములలో ఎందరో ఈజీ మనీ సంపాదించగలగడం మరొక కారణము; చదువు, సంస్కారం కాని, పాండిత్యాన్ని కాని, విజ్ఞానాన్ని కాని, జ్ఞానాన్ని కాని ఈయలేకపోవడానికి. తల్లిదండ్రుల్లో కాని, విద్యార్థులలో కాని చదువు పట్ల జిజ్ఞాస, అవగాహన, గౌరవం లేనంత కాలం , విద్యాసంస్థలు కాబూలీవాలాల చేతుల్లో ఉన్నంతకాలం చదువు‌ అబ్బదు. మనలాంటి సున్నిత మనస్కులము వాపోతూంటాము అంతే.
***********

భగవంతుని ఉనికిని నమ్మడం ఆస్తికత. భగవంతుడు లేడని నమ్మడం నాస్తికత. రెండూ నమ్మకాలే!

************

భారతదేశంలోని వింతలు

భారతదేశంలో ఉన్న అన్ని ఛిద్రాలకి భారతదేశంలోని కుహనా మేధావులు మూడింటిని బాధ్యులను చేస్తారు. వారి మేధాశక్తి అపూర్వము అనిపించేలా మాట్లాడతారు. వ్యాసాలు రాస్తారు. టిి.వి లోని చర్చల్లో పాల్గొని ఈ మూడింటిని దునుమాడేస్తారు. సంస్కార రహిత, అసభ్య భాష నిర్లజ్జగా ఉపయోగిస్తారు కూడా. వీరి వీరంగాలకు అడ్డు, అదుపు, ఆపూ ఉండవు. ఏ సైతానో వీరిలోకి పరకాయ ప్రవేశం చేసినట్టు ఊగిపోతారు.

ప్రపంచం లోని ఇతర దేశములను, సంఘములను, అక్కడి పరిస్థితులను అసలు గమనిస్తారో లేదో తెలియదు. ఈ మూడింటిని ఆడిపోసుకోవడం మాత్రం వీరికి నిత్య కృత్యం. వీరిలో ఏమీ చదువుకోని, వివిధ అంశాలపై ఏ విధమైన పరిజ్ఞానము, జ్ఞానం, అవగాహన, కనీస ఇంగితం లేని కుల నాయకుల నుంచి, పత్రికా ప్రతినిధులు, అన్ని మీడియాలలోని ప్రముఖులు, రచయితలు, కవులు, విశ్వ విద్యాలయ ఆచార్యులు, విజ్ఞాన శాస్త్రం చదువుకున్నాం అనుకున్న వాళ్ళు, వివిధ లలిత కళల్లో ప్రజ్ఞ కలవారు, నాస్తికులు, రేషనలిష్టులు, వివిధ వాదముల ప్రియులు ఉంటారు. ఇలాంటి వారు ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నారో లేరో తెలియదు. భారతదేశ ఆలోచనా, అవగాహనా ప్రపంచాన్ని మాత్రం ఏలేస్తున్నారు. ఛిద్రమూ చేస్తున్నారు. 

వీరికి ఆవేశం ఎక్కువ. అవగాహన తక్కువ. ఆ మూడింటిపై ద్వేష, విద్వేషాలు అపరిమితం. అనవసరమైన కక్ష. ఎవరు చెప్పినదాన్ని వీరు గణించరు.

తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటారు. అందరూ తమ మాట వినాలంటారు. వినని వాళ్ళని అసభ్యంగా తిడతారు. తమని మించిన మేధావులు లేరనే భ్రమ, భ్రాంతులలో మునిగి తేలుతూ ఉంటారు.
వీరి మాటల, చేతల విచ్చలవిడితనం,​ మొండితనం సభ్య సమాజానికి అసహ్యంగా ఉంటుంది. అయినా నేడు భారతదేశంలో వీరే సంఘ, దేశ ఆలోచనా ధోరణిని శాసిస్తున్నారు.

వీరు దునుమాడే మూడూ: మగవారు, బ్రాహ్మణులు, హిందూ మతం/ధర్మం.