When fake-ness is ruling the society, the genuineness will be ignored and not used.
గృహస్థాశ్రమం - ఆధ్యాత్మిక వ్యాపారులు
భారతీయ సంస్కృతిలో గృహస్థాశ్రమానికి పెద్దపీట. మిగిలిన ఆశ్రమములన్నీ తమ ఉనికికి గృహస్థాశ్రమం పైనే ఆధారపడి ఉన్నాయి.
ఇంత ఉత్తమమైన ఆశ్రమాన్ని నడుపుతూ దాని వల్ల కలిగే సాధకబాధకముల భరిస్తూ భారతీయ సంస్కృతిని నిలబడుతున్న స్త్రీ, పురుషులు అభినందనీయులు. రికామీగా తిరుగుతూ, సోమరులైన వివిధ సన్యాసాశ్రమ నిర్వాహకులు గృహస్థులకు ఉపన్యాసములనిస్తూ పొట్ట పోషించుకుంటున్నారు. ఆర్ధిక సామ్రాజ్యములను నిర్మించుకుంటున్నారు.
గృహస్థాశ్రమం - ఆధ్యాత్మిక వ్యాపారులు
భారతీయ సంస్కృతిలో గృహస్థాశ్రమానికి పెద్దపీట. మిగిలిన ఆశ్రమములన్నీ తమ ఉనికికి గృహస్థాశ్రమం పైనే ఆధారపడి ఉన్నాయి.
ఇంత ఉత్తమమైన ఆశ్రమాన్ని నడుపుతూ దాని వల్ల కలిగే సాధకబాధకముల భరిస్తూ భారతీయ సంస్కృతిని నిలబడుతున్న స్త్రీ, పురుషులు అభినందనీయులు. రికామీగా తిరుగుతూ, సోమరులైన వివిధ సన్యాసాశ్రమ నిర్వాహకులు గృహస్థులకు ఉపన్యాసములనిస్తూ పొట్ట పోషించుకుంటున్నారు. ఆర్ధిక సామ్రాజ్యములను నిర్మించుకుంటున్నారు.
కాని వట్టి
చిలకపలుకులు పలికే ఈ ఘనులు, తమ ఉనికికి, ఆహారవ్యవహారాలకు గృహస్థులపై
ఆధారపడుతూ కూడ గృహస్థులను గేలి చేస్తూ మాట్లాడతారు. వీరందరూ "పాపులని" తమచే
ఉద్ధరింప బడవలసిన వారని గీరగా మాట్లాడుతూంటారు.
నిజానికి గృహస్థాశ్రమం లోని ఒడి దుడుకులను తట్టుకుంటూ, తమని, తమ ఓపికను, నిత్యమూ పరీక్షించే
కుటుంబ సభ్యుల వల్ల, వృత్తి పరంగాను, రాజకీయనాయకుల దుష్పరిపాలన, సంఘం లోని ఇతర తరగతుల వారి కుసంస్కారం వల్ల, దుష్టుల, నేరస్థుల వల్ల కలిగే, వచ్చే దుష్పరిమాణాలను మౌనంగా తట్టుకుంటూ, సర్దుకుంటూ, భరిస్తూ బతుకులీడ్చే గృహస్థులు ఈ ఆధ్యాత్మిక వ్యాపారుల కన్నా కోటి రెట్లు వందనీయులు.
సన్యాసులు, ఇతర పరాన్నజీవులు; గృహస్థుల ఓపిక, పటిమ, నేర్పరితనముల ముందు బలాదూర్.
గృహస్థాశ్రమం లేక తరువాతి తరములు లేవు. అతిథి అభ్యాతుల సేవ గృహస్థాశ్రమం ద్వారానే జరిగేది. జీవనశైలులలో మార్పుల దృష్ట్యా ఇది జరగడం లేదు.
గృహస్థాశ్రమాన్ని, గృహస్థులను తేలికగా చూసి మాట్లాడే ఆధ్యాత్మిక వ్యాపారులు గృహస్థుల కాలిగోటికైనా పోలరు.
ఈ విషయం ఎంత తొందరగా అందరూ తెలుసుకుంటే అంత మంచిది. గృహస్థులు దైవ స్వరూపులు.
భగవంతునికి ప్రీతి పాత్రులు.
సమస్త సన్మంగళాని భవంతు!
**************
ఇజములు- సాహితీ సృష్టులు
రచన చేయడం రచయితలకు సహజంగా అలవడే కళ. అలా అలవడేవే కవిత్వం, ఇతర లలిత కళలు.
ముఖ్యంగా సాహితీ సృష్టి బాధ్యతాయుతమైనది. విశ్వశ్రేయమ్ కావ్యపరమార్ధమ్ - అని నానుడి.
నిజానికి గృహస్థాశ్రమం లోని ఒడి దుడుకులను తట్టుకుంటూ, తమని, తమ ఓపికను, నిత్యమూ పరీక్షించే
కుటుంబ సభ్యుల వల్ల, వృత్తి పరంగాను, రాజకీయనాయకుల దుష్పరిపాలన, సంఘం లోని ఇతర తరగతుల వారి కుసంస్కారం వల్ల, దుష్టుల, నేరస్థుల వల్ల కలిగే, వచ్చే దుష్పరిమాణాలను మౌనంగా తట్టుకుంటూ, సర్దుకుంటూ, భరిస్తూ బతుకులీడ్చే గృహస్థులు ఈ ఆధ్యాత్మిక వ్యాపారుల కన్నా కోటి రెట్లు వందనీయులు.
సన్యాసులు, ఇతర పరాన్నజీవులు; గృహస్థుల ఓపిక, పటిమ, నేర్పరితనముల ముందు బలాదూర్.
గృహస్థాశ్రమం లేక తరువాతి తరములు లేవు. అతిథి అభ్యాతుల సేవ గృహస్థాశ్రమం ద్వారానే జరిగేది. జీవనశైలులలో మార్పుల దృష్ట్యా ఇది జరగడం లేదు.
గృహస్థాశ్రమాన్ని, గృహస్థులను తేలికగా చూసి మాట్లాడే ఆధ్యాత్మిక వ్యాపారులు గృహస్థుల కాలిగోటికైనా పోలరు.
ఈ విషయం ఎంత తొందరగా అందరూ తెలుసుకుంటే అంత మంచిది. గృహస్థులు దైవ స్వరూపులు.
భగవంతునికి ప్రీతి పాత్రులు.
సమస్త సన్మంగళాని భవంతు!
**************
ఇజములు- సాహితీ సృష్టులు
రచన చేయడం రచయితలకు సహజంగా అలవడే కళ. అలా అలవడేవే కవిత్వం, ఇతర లలిత కళలు.
ముఖ్యంగా సాహితీ సృష్టి బాధ్యతాయుతమైనది. విశ్వశ్రేయమ్ కావ్యపరమార్ధమ్ - అని నానుడి.
ఈ నాడు రచించేవారు, కవనములు అల్లేవారు కోకొల్లలుగా ఉన్నారు. వారి సృష్టులు
అంతర్జాలం వచ్చాక నలుగురికి అందడం ప్రారంభించాయి. వీటిలో కొందరు మాత్రమే
తమ రచనలను, కవనములను పుస్తకములుగా అచ్చువేయించుకోగలుగుతున్నారు. వారంతట
వారు, లేక ఒక ప్రచురణ కర్త ద్వారా కాని.
మళ్ళీ వీరిలో కొందరు మాత్రమే రచయితలుగా, కవులుగా లబ్ధ ప్రతిష్టులు అవుతున్నారు. ఇటువంటి వారి కొందరి సృష్టులు సంఘానికి ఉపయోగించాలి అనే నియమం లేనివిగా ఉన్నాయి. వారి వారికి పేరు ప్రతిష్టలు, ప్రఖ్యాతులు తెస్తే చాలనేట్టుగా ఉంది వాస్తవము.
ఈ పేరు ప్రఖ్యాతులు ఎలా వస్తాయి? తెచ్చుకుంటారా? తేబడతాయా? పేరు ప్రఖ్యాతులకి రచన, కవనముల శేష్ఠతకు సంబంధం ఉందా అనేది కోటి డాలర్ల ప్రశ్న.
రచనల ద్వారా, కవితల ద్వారా డబ్బు సంపాదించే వారు ఈ రోజులలో చాలా అరుదుగా ఉన్నారు. మిగతా వారిలో కొందరికి తమ తమ పరిచయముల ద్వారా "గుర్తింపు" వస్తోంది. వారికి వీరు వీరికి వారు విమర్శకులై పబ్బము గడుపుకుంటున్నారు.
వీరిలో ఎక్కువ మంది "చేతి చమురు భాగోతంలా" తమ ధనాన్ని ఖర్చుపెట్టి పుస్తకములను ప్రచురించుకోవడం, ఉత్సవములు జరుపుకోవడం, ప్రచారము చేసికోవడం రివాజయింది.
సాహితీసృష్టి శ్రేష్ఠతను కొలిచే ప్రమాణాలు మారిపోయినవి.
ఏదైనా ఒక "ఇజాన్ని" కౌగలించుకోకుండా కవనములు అల్లడం "అవుట్ ఆఫ్ ఫేషన్" అయింది. విమర్శకులూ ఏదో ఒక సిద్దాంతానికి దాసులై ఆ సిద్ధాంతేతరములను స్పృశించే సాహితీ సృష్టిని సాహిత్యము గా గుర్తించడమే మానేశారు.
తెలుగు రాష్ట్రములలో అరసం, విరసం, దిగంబర కవుల సంఘం, స్త్రీ, దళిత, ప్రాంతీయ, అస్పష్ట, పుర్రచేతి భావముల వాదములుగా విడి సాహిత్యము రూపు మారిపోయింది. ఇదివరకటి రంజకత్వం కోల్పోయింది.
పొడి పొడి సృష్టులు, డెందపు తడులు లేని తర్కములు, ఆలోచనలు కవితా రమ్యత ను పాడుచేశాయి.
సిద్దాంత రాద్ధాంతములు గా సాహితీ విమర్శ, విమర్శకులు కుచించుకుపోయారు. ఏ "ఇజానికీ" చెందని సాహితీ సృష్టులు "సాహితీ విమర్శకుల" దృష్టి ని ఆకర్షించలేక పోతున్నాయి. కవి, రచయిత ఇష్టప్రకారంగా కాక, విమర్శకుల అవగాహన, ఇష్టాయిష్టముల ఆధారంగా సాహితీ సృష్టి జరిగితేనే దానికి గుర్తింపు వస్తుంది అన్నంతగా సాహితీ విమర్శ దిగజారింది.
ఈ హడావుడిలో ఏ ఇజానికీ చెందని సాహితీ సృష్టులు వెల వెల బోతున్నాయి. గుర్తింపుకు నోచుకోవటం లేదు.
మళ్ళీ వీరిలో కొందరు మాత్రమే రచయితలుగా, కవులుగా లబ్ధ ప్రతిష్టులు అవుతున్నారు. ఇటువంటి వారి కొందరి సృష్టులు సంఘానికి ఉపయోగించాలి అనే నియమం లేనివిగా ఉన్నాయి. వారి వారికి పేరు ప్రతిష్టలు, ప్రఖ్యాతులు తెస్తే చాలనేట్టుగా ఉంది వాస్తవము.
ఈ పేరు ప్రఖ్యాతులు ఎలా వస్తాయి? తెచ్చుకుంటారా? తేబడతాయా? పేరు ప్రఖ్యాతులకి రచన, కవనముల శేష్ఠతకు సంబంధం ఉందా అనేది కోటి డాలర్ల ప్రశ్న.
రచనల ద్వారా, కవితల ద్వారా డబ్బు సంపాదించే వారు ఈ రోజులలో చాలా అరుదుగా ఉన్నారు. మిగతా వారిలో కొందరికి తమ తమ పరిచయముల ద్వారా "గుర్తింపు" వస్తోంది. వారికి వీరు వీరికి వారు విమర్శకులై పబ్బము గడుపుకుంటున్నారు.
వీరిలో ఎక్కువ మంది "చేతి చమురు భాగోతంలా" తమ ధనాన్ని ఖర్చుపెట్టి పుస్తకములను ప్రచురించుకోవడం, ఉత్సవములు జరుపుకోవడం, ప్రచారము చేసికోవడం రివాజయింది.
సాహితీసృష్టి శ్రేష్ఠతను కొలిచే ప్రమాణాలు మారిపోయినవి.
ఏదైనా ఒక "ఇజాన్ని" కౌగలించుకోకుండా కవనములు అల్లడం "అవుట్ ఆఫ్ ఫేషన్" అయింది. విమర్శకులూ ఏదో ఒక సిద్దాంతానికి దాసులై ఆ సిద్ధాంతేతరములను స్పృశించే సాహితీ సృష్టిని సాహిత్యము గా గుర్తించడమే మానేశారు.
తెలుగు రాష్ట్రములలో అరసం, విరసం, దిగంబర కవుల సంఘం, స్త్రీ, దళిత, ప్రాంతీయ, అస్పష్ట, పుర్రచేతి భావముల వాదములుగా విడి సాహిత్యము రూపు మారిపోయింది. ఇదివరకటి రంజకత్వం కోల్పోయింది.
పొడి పొడి సృష్టులు, డెందపు తడులు లేని తర్కములు, ఆలోచనలు కవితా రమ్యత ను పాడుచేశాయి.
సిద్దాంత రాద్ధాంతములు గా సాహితీ విమర్శ, విమర్శకులు కుచించుకుపోయారు. ఏ "ఇజానికీ" చెందని సాహితీ సృష్టులు "సాహితీ విమర్శకుల" దృష్టి ని ఆకర్షించలేక పోతున్నాయి. కవి, రచయిత ఇష్టప్రకారంగా కాక, విమర్శకుల అవగాహన, ఇష్టాయిష్టముల ఆధారంగా సాహితీ సృష్టి జరిగితేనే దానికి గుర్తింపు వస్తుంది అన్నంతగా సాహితీ విమర్శ దిగజారింది.
ఈ హడావుడిలో ఏ ఇజానికీ చెందని సాహితీ సృష్టులు వెల వెల బోతున్నాయి. గుర్తింపుకు నోచుకోవటం లేదు.
No comments:
Post a Comment