Monday, April 20, 2020

ప్రపంచం-జగత్తు; విమోచనం పొందిన లలనలు; అణిమాది సిద్ధులు; Known Truth, దురభిమానాలు; ఆధ్యాత్మికత

ప్రపంచం-జగత్తు

డా. వారణాసి రామబ్రహ్మం

ప్రపంచం అనే పదాన్ని తత్త్వం పూర్తి అవగాహనతో నిర్వచించింది.

వేదాంత పంచదశి

శ్లోll అస్తి భాతి ప్రియం నామం రూపంచ ఇతి అంశ పంచకం
ఆంద్ర త్రయం బ్రహ్మరూపం తతో ద్వయం జగద్రూపం 

ప్రపంచంలో ఐదు అంశాలుంటాయి. అవి అస్తి, భాతి, ప్రియం, నామం, రూపం. ఇందులో మొదటి మూడూ బ్రహ్మమునకు సంబంధించినవి. మిగతా రెండు జగత్తుకు సంబంధించినవి. 

అస్తి-భాతి-ప్రియం, సత్-చిత్-ఆనందములకు సదృశం. అన్ని మానసిక, శారీరక కార్యకలాపాలు సచ్చిదానంద రూపమైన ఆత్మ లేక బ్రహ్మము వల్ల జరుగుతున్నాయని ఉపనిషత్తులు చెప్పాయి. 

దీని అర్థం, మన మానసిక, తత్సంబంధ శారీరక కలాపాలు చిత్ శక్తి వల్ల జరుగుతున్నాయని తాత్పర్యం. ఎటొచ్చీ చిత్ శక్తి మేధలో చిదాభాసగా మారి, తాను పరిణామములు చెంది మానసిక విభూతులైన అంతఃకరణముల రూపము పొంది సకల కార్యకలాపాలను నిర్వహిస్తుంది. మాయ, ప్రణవం, స్ఫోట ఈ చిదాభాసకు మారు పేర్లు.

మనం ప్రపంచం, జగత్తు పదాలను ఒకే అర్థంలో ఉపయోగిస్తాము. ఆ రెండింటికి తత్త్వ శాస్త్ర రీత్యా అల్పమైన, కాని ప్రస్ఫుటమైన తేడా ఉంది. 

అస్సలు ముందు గమనించ వలసింది, ఎప్పుడూ మర్చిపోకూడనిది ఏమిటంటే, ప్రపంచం, జగత్తు పదాలను వేదాంతం ప్రత్యేక పారిభాషిక పదాలుగా వాడింది. ఉపనిషత్తులు, వేదాంతం, ఇతర తత్త్వ శాస్త్ర గ్రంథాలు ఈ ప్రపంచం, జగత్తు పదాలను మన అంతర ప్రపంచం అర్థంలో వాడింది. బయటి భౌతిక ప్రపంచం ఉద్దేశంతో కాదు. ఇది రూఢముగా మన మనస్సులలో నాటుకోవాలి. 

అప్పుడు తత్త్వం, వేదాంతం మనకు ఉపయోగకరంగా మారతాయి. ఉపనిషత్ స్రష్టల అనుభవములు, వాటి నుంచి వెలువడిన వాక్కులు మనకు స్పష్టమౌతాయి.

ఇంక, ప్రపంచం మనలో మనసు + జ్ఞానేంద్రియాల సంఘటిత కృషి వల్ల ఏర్పడుతుంది. ఈ ప్రపంచం నామ, రూపాత్మకము. గ్రహించిబడే బయటి భౌతిక ప్రపంచంలో వస్తువులన్నిటికీ జ్ఞానేంద్రియాల ద్వారా వాటి వాటి  శక్తి రూపముల ఆధారంగా భాషనుపయోగించి వాటికి పేర్లు పెట్టుకున్నాము. మనసు మాధ్యమంలో, కన్ను దృశ్యములను, రూపములను; చెవి ధ్వనులను; ముక్కు వాసనలను; నాలుక రుచులను; చర్మము స్పర్శలను, వేడిమి, చల్లదనములను గ్రహిస్తాయి. ఇప్పటి మానసిక దృష్టిని బహిర్ముఖ దృష్టి అంటారు.

ఇలా వివిధ శక్తి రూపములలో గ్రహించబడిన విషయములు మనసుతో మన మస్తిష్కంలో ప్రపంచంగా జడ రూపంలో భద్రపరచ బడతాయి. ఈ విషయములు అదే సమయంలో కలిగించే అనుభవములను చిత్తం వాసనలుగా స్మృతిలో జడ రూపంలో భద్రపరుస్తుంది. 

మన శరీరము, మన సాంఘిక స్థితి, మనస్తత్వం, అహంకారం, అహంభావం రూపంలో మనలో మనసుచే భద్రపరచడానికి
ఉంటాయి. ఇవి కూడా మన ప్రపంచంలోని భాగాలు. వీటితో కలిసేది మన మమకారములు, ద్వేష, విద్వేషములు, అరిషడ్వర్గాలు. ఇవన్నీ మన వ్యక్తిత్వం రూపంలో ప్రపంచంలోనే భద్రపరచబడి ఉంటాయి. 

నేను ని శరీరం, మనస్తత్వంములతో అన్వయించుకోవడం వల్ల మన "నేను" ఇదిగా చెలామణీ అవుతుంది. దాని వల్ల కలిగే సుఖదుఃఖాలు, ఇతర హాయిలు, వ్యాదులు, వేదనలు ఈ ప్రపంచంలో భాగం.

ఈ ఆంతర ప్రపంచంలో జడ రూపంలో ఉన్న విషయములు మనసుచే వెలికి తీయబడతాయి. ఇప్పటి మానసిక దృష్టిని అంతర్ముఖ దృష్టి అంటారు. ఇలా కలిసిన మనసు+విషయములే మన తలపులు. ఈ తలపులనే జగత్ అంటారు. ప్రపంచం జడం. జగత్ చేతనామయం. భావరూపం. 

జాగ్రత్ మానసిక దశలో బహిర్ముఖ దృష్టి, అంతర్ముఖ దృష్టి ఉంటాయి. బహిర్ముఖ దృష్టితో జ్ఞానేంద్రియాల ద్వారా బయటి భౌతిక ప్రపంచానికి, అంతర్ముఖ దృష్టి ద్వారా - స్వప్న మానసిక దశలో - లోని అంతర్ ప్రపంచానికి మనము ఒకే సారి అనుసంధానించబడి ఉంటాము. అంతఃకరణములు - మనో బుద్ధ్య హంకార చిత్తములు - పని చేస్తూ అన్ని శారీరక, మానసిక కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ఈ రెండు మానసిక దశలలోనూ ఈ కలాపాలు నిర్వహణను గమనిస్తూ అసలు నేను అయిన ఆత్మ లేక బ్రహ్మము ఉంటుంది. 

మనకు మరొక రెండు మానసిక దశలు ఉన్నాయి. అవి సుషుప్తి, జాగ్రత్ సుషుప్తి.
సుషుప్తి మానసిక దశయే గాఢనిద్ర స్థితి. 
ఈ దశలో మానసిక కార్యకలాపాలన్నీ ఆగిపోతాయి. దీనిని విశ్రాంత దృష్టి అంటారు. 
మానసిక కార్యకలాపాలు జరగకపోవడం వల్ల
మన సహజ స్థితి యైన శాంత స్థితి అనుభవానికి వస్తుంది. మనం ఎంతో నిరాకులంగా ఉంటాము. ప్రపంచంగాని, జగత్తు గాని దృష్టిలో ఉండవు. అందుకే గాఢ నిద్రలో అంత హాయి కలుగుతుంది. మానసిక కార్యకలాపాల శూన్యతే సుషుప్తి.

ఇదే స్థితిని మెళకువగా గమనించ గలిగితే
దానిని జాగ్రత్ సుషుప్తి దశ అంటారు. ప్రపంచం - బయటి భౌతిక, అంతర విషయ - 
ప్రపంచం తెలుస్తూ ఉంటుంది, కానీ నిరాకులత అనుభవింపబడుతూ ఉంటుంది. కావలిస్తే మానసిక కార్యకలాపాలు జరుగుతాయి. ఎటొచ్చీ నేను అన్వయం వ్యక్తిత్వంతో జరగదు కనుక ఆ కార్యకలాపాల వల్ల ఏ అనుభవములూ కలుగవు. వ్యక్తిత్వ స్పృహ కల జగత్ దృష్టిలోనికి రాదు. తలపులు కలుగవు. తలపులు కలుగవు కనుక అరిషడ్వర్గాలు విజృంభించవు. సంయమనము, శాంతులతో శారీరక, మానసిక కలాపాలు జరుగుతాయి.

ఈ చేతనాత్మకమైన జగత్ తలపుల రూపంలో కలిగి, మాయమౌతూ ఉంటుంది కనుక ఆది శంకరాచార్యులు:

బ్రహ్మ సత్ జగత్ మిథ్యా 
జీవో బ్రహ్మ ఏవ న అపరః 

అన్నారు. ఇక్కడ జగన్మిథ్యాత్వము బయటి భౌతిక ప్రపంచానికి కాదు. అంతర విషయ ప్రపంచానికి.

మిథ్యకి రెండు అర్థాలు ఉన్నాయి.

ఒకసారి ఉండి మరుక్షణం మాయమౌతుంది కనుక అది మిథ్యా.

అద్దంలోని ప్రతిబింబం ఎలా మిథ్యయో - భౌతిక రూపం లేనిది, మరొక వస్తువు యొక్క ప్రతిఫలనము మాత్రమే అయినది - అలా జగత్ కూడా ప్రతిఫలనము మాత్రమే. దానంతట దానికి ఉనికి లేదు.

ఇలా భావ రూపమైన ఆంతర ప్రపంచాన్ని శంకరులు మిథ్యా అన్నారు తప్ప, బయటి భౌతిక ప్రపంచాన్ని కాదు.

అలా విషయముల జడ రూపము ప్రపంచం. చేతనా రూపం - తలపుల రూపంలో - జగత్ లేదా జగత్తు.

ఇలా కనిపిస్తున్న జగత్తును గణించక దాన్ని ఉపేక్షించి, అది కలిగించే సుఖదుఃఖాలు, అరిషడ్వర్గ ప్రకోపనములు సంయమనముతో భరిస్తూ శాంతిని చెదరనీయక, విధ్యుక్త ధర్మములను నిర్వహిస్తూ జీవించడమే, జీవించగలగడమే ఆధ్యాత్మికతను మనం సరిగా అర్థం చేసుకున్నట్టు, ఆచరించినట్టు.

మిగతా పటాటోపాలు,ఆడంబరాలు, ఆశ్రమాలు, గురువులు, శిష్యరికాలు, అన్నీ ఏదో కాలక్షేపం బఠానీలు.
******
విమోచనం పొందిన లలనలు

డా. వారణాసి రామబ్రహ్మం

తల్లులమై, ప్రేమ వల్లులమై,
అనురాగ మల్లెలమై, మమతా వల్లరులమై, ఆత్మీయతా లహరులమై, వ్యథ, వేదనలకు 
ఔషధములమై, ఇల్లే మేమై అలరిన,
అలరించిన ఇంతులము మేము:

ఇక మీదట ఈ పాత్రలు పోషించడం ఆపి,
మా చదువు, ఉద్యోగం, తత్సంబంధ విషయములపై మాత్రమే మా దృష్టి;
ఇతరములు మా బాధ్యతలు కావు; 
హక్కుల పరిధిలో లేవు; ఇకపై మేము
విమోచనం పొందిన లలనలము;

ఇంటికి, వంటిటికీ,
పడకటింటికీ పరిమితమైన
ఇల్లాళ్ళము, గృహిణులము కాము
ఉద్యోగస్థులము, స్త్రీ పురుషులు సమానము
****
ప్రకృతి

డా. వారణాసి రామబ్రహ్మం

భగవంతుడు కూడా ప్రకృతి విషయంలో ఎంతో బాధ్యతాయుతంగా ఉంటాడు. ప్రకృతితో ఆటలాడడు. ప్రకృతి స్థానాన్ని, శక్తిని మరువడు. ఈయవలసిన గౌరవం ఇస్తాడు.

తను కూడా ప్రకృతి విషయంలో అనువర్తినే అన్నట్టు వ్యవహరిస్తాడు. ప్రకృతి ఆవేశం ముందు తన శక్తి యుక్తులను నియమింపచేసుకుంటాడు.

మనిషి మాత్రమే రకరకాల కారణాల వల్ల ప్రకృతి పట్ల అనాదరంగా, బాధ్యతారహితంగా ప్రవర్తించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు. 

ప్రకృతితో ఆటలాడి అనుభవిస్తాడు.
****
మనకి ముందే అధిక అనవసర పరిజ్ఞానం అనవసరం.
19-4-2020
అణిమాది సిద్ధులు

డా. వారణాసి రామబ్రహ్మం

మనిషికి ఈ శరీరం కలిగి ఉండడమే సిద్ధి. అది ఆరోగ్యంగా ఉండడానికన్న మించిన సిద్ధి లేదు.

కాని చాలామంది జనాలకి, ఏదేదో చేసి, ఏవేవో సిద్ధులు పొందాలని ఆశ. ఆ సిద్ధులతో ధనము, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, గొప్ప సిద్ధుడిగా మిగిలి పోవాలనీ కోరిక. 

ఈ సిద్ధులలో అణిమాది సిద్ధులు అందరికీ తెలుసు. అవి పొందాలని ఎందరికో తహ తహ. 

ఈ రోజుల్లో కాదు గాని, ఇదివరకు ఈ పిచ్చి చాలా ఎక్కువగా ఉండేది. జనాల్లోని అత్యాశ, మూఢనమ్మకాలు దీనికి ఆజ్యం పోసేవి. ఈ శరీరంతో కలకాలం ఈ భూమి మీద జరా మరణాలు లేకుండా ఉండిపోవడం
అన్నింటికీ మకుటాయమానమైన సిద్ధిగా కోరబడేది. 

ఎందరో జనం తమ జీవితాలను ఈ సిద్ధులు సాధించడం కోసం వెచ్చించే వారు. భారతదేశంలో ఈ సిద్ధులపై ఎన్నో పుస్తకాలు రాశారు; ఎంతో సాహిత్యం ఉంది.

ఎవరు ఎంత చేసినా ఈ భూమిపై జరా మరణాలు లేకుండా ఉండిపోవడం ఎవరికీ సాధ్యపడలేదు. అందరూ ఏదో వయసులో ప్రకృతి నియమానికి లోనై చనిపోయే వారు -
జాతస్య మరణం ధ్రువమ్ - కదా.

సిద్ధులతో జనాలను ఆకర్షించడం, శిష్య కోటిని ఏర్పరచుకోవడం, ఎంతో సాహిత్యం రచించడం,  వీలైనంత ధనం, వీలైనన్ని ఆస్తులు సంపాదించుకోవడం జీవనాశయంగా
ఉండేది. తత్త్వం నేర్చుకోవడానికి ఎందరుండే వారో అంతకు మించి సిద్ధులు పొందడానికి జనాలుండేవారు.

మనిషికి ఆశ ఎక్కువ. పర్వాలేదు. ఆశ పడకుండా మనిషి బతక లేడు. కాని అది దురాశ కాకూడదు. దురాశ వ్యక్తిని అతని చుట్టుపక్కల వాళ్ళని నాశనం చేస్తుంది.

ఇదివరికిటి సిద్ధుల స్థానంలో ఇప్పుడు ఆధునిక సాంకేతిక పనిముట్లు వచ్చాయి.
అవి చేయగల ఇంద్రజాల మహేంద్రజాలాలు అనంతం. మనం ఈ ఆధునిక సాంకేతికతకి అలవాటు పడ్డాం. చాలామందిమి అవి లేకుండా బ్రతకలేము.

మనిషికి ఎప్పుడూ తను విశ్వ సార్వభౌముడు కావాలని కోరిక. ఆ దిశలోనే అన్ని ప్రయత్నాలు, కనిపెట్టడాలు చేస్తాడు. తను 
ఏ ఇతర శక్తి మీదా ఆధారపడకుండా, స్వ ఇచ్ఛతో, స్వతంత్రగా జీవించాలని ఆశయం.

పూర్వ కాలపు సిద్ధుల వంటివి నేటి ఆధునిక ఉపకరణములు.

ఈ హడావుడిలో తనకు ముఖ్యమైనది ఏదీ అనే మీమాంస రాదు.

తను ఈ శరీరం ద్వారా సంక్రమించిన  జ్ఞాన, కర్మేంద్రియాలతో ఎన్నో చేయగలడు, అనుభవించగలడు. కాని అంత మాత్రాన సంతృప్తి చెందడు. అది తన హక్కు అనుకుంటాడు.

అందమైన దృశ్యాలు చూడగలగడం, శ్రావ్య ధ్వనులు వినగలగడం, ఎన్నో రుచుల ఆహారం ఆస్వాదిస్తూ తినగలగడం, సుగంధాలను ఆస్వాదించడం, స్పర్శానుభూతులు పొందడం, నడవగలగడం, చేతుల, కాళ్ళతో 
ఎన్నో పనులు చేయగలగడం అద్భుతం అనుకోడు. ఇదంతా మామూలు అనుకుంటాడు.

ఆ జ్ఞాన, కర్మేంద్రియాలలో ఏదైనా లోటుంటే, లోపం ఏర్పడితే తప్ప వాటి విలువ తెలుసుకోడు. మాట్లాడగలగడం, అనుభూతి చెందగలగడం, ఆలోచించగలగడం తనకు మాత్రమే ప్రకృతిచే  ఇవ్వ బడిన వరాలు అనుకోడు. ఆరోగ్యకరమైన, దార్ఢ్యమైన శరీరం కూడా ఒక పెను సిద్ధి అని తెలుసుకోడు. 

సిద్ధులు, ఉపకరణాలు అంటూ నక్కాశతో బతుకుతూంటాడు. మనుషుల కన్నా ఆస్తిపాస్తులకి, డబ్బుకి విలువ ఇస్తాడు.

తనకు ఎన్నో చేసిపెట్టే శరీరం విలువ తెలుసుకోడు.

"శరీరమాద్య ఖలు ధర్మసాధనమ్" అని గ్రహించక ఇక్కట్లు పాలవుతాడు.
18-4-2020
ఆత్మ సిద్ధి అనేది అజ్ఞాన నిర్మూలనానికి ఇడిన శుభ నామము.
*****
Known Truth

Dr. Varanasi Ramabrahmam

Humans die;
So also their ideas
And created institutions

Death is inevitable
For the born

Death is so natural to 
Living beings as 
Their presence

Being, becoming
And death follow
One another 
Making life
Exist and disappear
*****
Divinity is not the property of any single religion.

Divinity is the nature of all creation and evolution.
****
Lockdown

Dr. Varanasi Ramabrahmam

Even without Covid-19, man  cages himself in his thoughts and ego. He is never free and jubilant. Presently Covid-19 is a pretext only. Locking up mentally is the nature of the man. Physical lockdown is nothing compared to mental lockdown. Even in physical lockdown, the inconvenient and disturbing mental lockdown in thoughts never sets man free. After lifting physical lockdown, the body moves, but the mental lockdown continues unfortunately.
Lockdown seems to be a must for humans with or without Covid-19 like emergencies or disasters. 

Setting free from thoughts and ego calms the mind; and the physical lockdown is just a passing by event.
*****
దురభిమానాలు

డా. వారణాసి రామబ్రహ్మం

ఏ మతం లోనైనా మనశ్శుద్ధి కలవారు చాలా అరుదు. అన్ని మతాల వారు పర మతాలలోని లోటుపాట్లు చెప్పేవారే తప్ప, తమ మతాన్ని త్రికరణ శుద్ధిగా అనుసరించేవారు కనుమరుగై పోతున్నారు.

మతం మనిషికి ఎంత ఉపకారం చేసిందో అంత అపకారము చేసింది. చేస్తోంది. మత సంబంధమైన రైట్యువల్స్, కార్యక్రమాలు చెయ్యడంతో పాటు మానవతా దృక్పథం కూడా మనిషికి ఉండాలని చాలా మతాలు, మత పెద్దలు చెప్పడం లేదు. పైగా మతం పేరుతో జరిగే నరమేధాన్ని అడ్డుకోవడం లేదు. పైపెచ్చు దానికి ఆజ్యం పోస్తున్నారు. 

మతం అంటే మూఢత్వం, మూర్ఖత్వం, మూఢ
నమ్మకాలు అని ఇప్పటి యువతీయువకులు అనుకుంటున్నారు. ముఖ్యంగా హిందూ మతంలోని వారు ఇలా అనుకుంటున్నారు.

మిగతా మతాల వారికి అలా అనుకునే, మాట్లాడే స్వేచ్ఛ లేదు. భిన్నత్వం కల భారతదేశంలో, ఈ భిన్నత్వాన్ని మత గురువులు, మత, కుల పెద్దలు, రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. భారతీయుల్ని ఐక్యంగా మనసా, వచసా, కర్మణా‌ ఉండనివ్వడం లేదు.

వీళ్ళ భీభత్సం ఎక్కువ ఐపోయింది. మతాన్ని అందరూ చీదరించుకునే స్థాయికి ఇంచు మించు అన్ని మతాలు దిగజారిపోయాయి.
మంచి చెప్పే మతాలే కరువయ్యాయి. రైట్యువల్స్ కి పరిమితమై, తత్త్వం మరచి,
మతాన్ని అంటరాని దానిగా మార్చేశారు.

ఎవరైనా మా మతం గొప్పది, మంచిది అంటే నవ్వొస్తోంది. మతాలన్నీ మానవతా దృక్పథం లేనివారి చేతిలో చిక్కి ఆ ఉక్కు పిడికిలిలో ఊపిరాడకుండా సతమతం అవుతున్నాయి.

అలాగే కులాల, ప్రాంతీయ, ఉపజాతీయతా, సిద్ధాంత దురభిమానాలు భారతీయుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి ఆగడాలకి అడ్డూ, ఆపూ, అదుపూ లేవు. మానవతా దృక్పథం ఉన్నవారు ఈ దౌర్జన్యాలని, దౌర్భాగ్యాలని ఎంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు. ఏమీ చేయలేక మథన పడుతున్నారు. ఓటర్లు, ప్రజలు ఈ నకిలీ సరుకునే ప్రోత్సాహిస్తూ వారి వెనుక నడుస్తున్నారు. ఈ స్థితిలో మంచి మాటలు దున్నపోతు మీద వాన కురవడం వంటిది.

17-4-2020
Enjoying solitude

Dr. Varanasi Ramabrahmam

People must learn to spend time with one's self. Else lonli-ness will kill. Lonli-ness is to be converted into solitude. This is a conscious effort. Every one must practise by oneself.
We always need not have things which cater to our entertainment and time pass.

Fellow humans, entertainment gadgets and like may not be available every moment. It is in person's interest to practise enjoying solitude.
******

భాషాస్థితులు

డా. వారణాసి రామబ్రహ్మం

అక్షరమ్ములు భాషకు ప్రతీకలు
భావములు మనసుకు ప్రతీకలు
అర్థమగుటలు అనుభవమునకు ప్రతీకలు
మౌనముగనుండుట ఆత్మజ్ఞునికి ప్రతీక

అందరము అనుకొనునది, భావించునది ఒకటే; వ్యక్తపరచుట మాత్రము వేరు వేరు శబ్దములతో; శబ్దములు నిశ్శబ్ద జనితములు;
అర్థానుభవము, భావము, మాట, భాషా దశలు, భాషాంగములు; అందరికీ ఒకటే;
మాటలు భావార్థ భరితములు, మౌన విభూతులు
*****
మనలో చాలా మందిమి ఇంగ్లీష్ పదాలు దొర్లకుండా ఏ భాషలోనూ రాయలేము. భారతదేశంలో మాతృ భాషలలో విద్యా బోధనకి కావలసిన పాఠ్యపుస్తకాలు ప్రాథమిక, మాధ్యమిక, కళాశాల, విశ్వవిద్యాలయం స్థాయిల్లో లేవు.  కొన్ని ఉటంకించిన దేశాల్లో అన్ని స్థాయిలలో పాఠ్యపుస్తకాలు, పారిభాషిక పదాలు ఉన్నాయి. అందువల్ల ఆ దేశాలకు ఏ ఇబ్బందీ లేదు. ఆంగ్లాన్ని మాత్రం ప్రస్తుతం అన్ని దేశాల వారూ, ఉటంకించిన దేశాలతో సహా, అంతర్జాతీయ స్థాయిలో వ్యావహారికానికి ఉపయోగిస్తున్నారు. వారు ప్రత్యేకంగా ఆంగ్లం నేర్చుకుంటున్నారు.

16-4-2020
ఉద్యోగం తేని సమయ యాపనం

డా. వారణాసి రామబ్రహ్మం

పుస్తకాలు గాని, చదువు గాని చదవడానికి అవసరమైన మానసిక వాతావరణం ఇప్పుడు లేదు.

సాంకేతికత పెరిగి వినోద సాధనములు చేతుల్లోకి వచ్చేశాక మనసు ఏకాగ్రత మర్చిపోయింది. నేర్చుకోవడం అనే మాట మర్చిపోయింది.

మనసు స్థిరంగా ఉంటేనే చదువు అబ్బుతుంది. ఇష్టమైన పుస్తకాలు చదవగలం.
మనని మనమే బలహీనులుగా, దుర్బలులుగా‌ మార్చేసుకున్నాం. బుర్ర ఉపయోగించి చదవవలసిన అవసరం తగ్గి పోయింది. బుర్ర పదును పెట్టడం చదువు ఉద్దేశ్యం కాదని నిర్ణయించేసాము. 

మనిషికి వినోదము, విజ్ఞానము, వికాసము సమపాళ్ళలో లభించాలి. ఇప్పుడు వినోదం అధికాధికంగా, విజ్ఞానం పనికి రాని పరిజ్ఞానం రూపంలో, వికాసం శూన్యం గా మనుషులు బ్రతుకుతున్నారు. అందుకే మానసికంగా ఎంతో బలహీనులు, దుర్బలులు అవుతున్నారు.

మనసు బలం, వికాసం పెంపొందించు కోవటానికి చదువుని ఉపయోగించుకోవాలని 
ఎవరికీ తెలియడం లేదు. చదువుని ఉద్యోగం తెచ్చే సమయయాపనంలా తయారు చేశారు.
*****
Education system giving preference to technology and modernity and ushering in them for teaching and examining, makes the students more robotic. In education human touch is essential. That should not be trampled upon.
*****
The word migrant worker is blasphemous. Why journalists and political leaders are using it so casually? Indians are in India only. They did not migrate from another country. Can't they use a more dignified word? 

Illiterate gang!!!
15-4-2020
ఆధ్యాత్మికత

డా. వారణాసి రామబ్రహ్మం

శ్రీ రమణ మహర్షి పలుకుల ప్రకారం, ఆత్మానుభవానికి మనం చేయవలసిందేమీ లేదు, చేయవలసిందంతా ఏమీ చేయకుండా ఉండడమే. ఆత్మానుభవం అయ్యే ఉంది. అడ్డుతున్న వ్యక్తిత్వ స్పృహను లేకుండా చేసుకోవడమే.

మహర్షుల పంథా గాని, ఇతర ఆధ్యాత్మిక మార్గములు గాని అందరికీ కాదు. లౌకిక ప్రపంచంలో ఉంటూ నిద్రపోగలగడమే ఆ మార్గమును అనుసరించడం.

ముముక్షువులు మాత్రమే ఆధ్యాత్మిక పథం అనుసరించాలి. ఉత్సుకత లేక ఆర్తి ఉన్నవారే ఆధ్యాత్మిక సాధనకు ఉపక్రమించాలి.

మిగతా అందరూ తమ తమ లౌకిక వ్యవహారములలో తలమునకలై, జీవితాన్ని జీవించడం మంచిది. 

కోరికలతో, అవి తీరాలనే ఆశతో భగవంతుని, ఆత్మానుభవాన్ని పొందాలనుకోవడం వృథా
ప్రయాస. ఆధ్యాత్మికత ఒక శాస్త్ర పఠనం వంటిది. శాస్త్రముపై నమ్మకము, శ్రద్ధ, భక్తి, గౌరవము,  పిపాస, ఉండి తీరాలి. 

భగవత్ పదము చేరాలంటే భగవదర్పణం జరగాలి. శరణాగతి చెందాలి. ప్రపత్తి నిండాలి.

ఏదో లౌకికమైన కోరిక తీరడం కోసం ఆధ్యాత్మిక పథం త్రొక్కడం అనవసరం. ఉపయోగం లేని శ్రమ. ఆ లౌకికమైన కోరికలు తీరడానికి, మోసగాళ్ళని తెలియకుండా, మన బలహీనతను, అవసరాన్ని సొమ్ము చేసుకునే స్వాములను, సన్యాసులు, ఆనందాలను, అమ్మలను, బాబాలను, అటువంటి వారిని ఆశ్రయించడం మేలు.

ఆధ్యాత్మికత జిజ్ఞాసువులకే. ఆర్తులకు కూడా. అర్ధార్ధులకు లౌకిక ప్రపంచంలో కనిపించే నకిలీ గురువులను నమ్మడం మంచిది. ఆ గురువు అదృష్టం, మన అదృష్టం బాగుంటే ఆ కోరిక తీరుతుంది. ఆధ్యాత్మికత అలసులకు, అత్యాశాపరులకు కాదు. నిజాన్ని అనుభవించాలనే తహతహ నిజాయితీగా ఉన్నవారికి మాత్రమే.

లౌకిక జీవనాన్ని, అందులో ఎదురయ్యే వడి దుడుకులను భగవత్ కృపతో ఎదుర్కుంటూ, సంయమనంతో జీవిస్తూ, సుస్థిర అనన్య భక్తి కలవారే శాంత్యానుభవానికి అర్హులు.

భగవదనుభవానికి పరితపిస్తూ, శ్రద్ధాళువులై,

శ్లోll అనన్యాన్ చింతయంతో మాం యే జనాః
పర్యుపాసతే 
తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహమ్

అనే భగవాన్ ఉవాచ అయిన హామీని మనసా, వచసా, కర్మణా నమ్మి భక్తి, కర్మ, జ్ఞాన మార్గములలో తమకు ఇష్టమైన పంథాలో సాగిపోవడమే మోక్ష ప్రదము.

"మోక్షః విష్ణు ప్రసాదేన వినా న లభ్యతే".

శివరూపాత్ జ్ఞానమహః
తత్త్వో ముక్తిం జనార్దనాకారాత్
శిఖిరూపాదైశ్వర్యం
భాస్కరాత్ ఆరోగ్యమిచ్ఛామి

అని కోరుకుంటూ, పొందుతూ ఈ లౌకిక జీవనాన్ని విద్యుక్త ధర్మములు నిర్వహిస్తూ సుఖప్రదంగా జీవించడమే ఆధ్యాత్మికత.

మిగతాదంతా డంబాచారం. ఉపయోగపడనిది.

ఓం తత్ సత్!
******

No comments:

Post a Comment