Monday, June 11, 2018

సామాన్య భారతీయుడు; త్రిమూర్తులు; అశాంతి; Ranks; Experience and Understanding;

సామాన్య భారతీయుడు

అడవులలో అన్నలు
సంఘంలో కులగజ్జి
ప్రాంతీయ తత్త్వం
మత సిద్ధాంత చాదస్తాలు
మోసగాళ్ళు అవినీతి పరులు
ఎక్కువగా నేరస్థులు అయిన
ప్రతినిధులు; దేవుడు లేడని
నాస్తికులు; దేనినీ నమ్మొద్దని
తర్క వితర్క కుతర్క మేధావులు
వాద ప్రతివాద ఉద్దండులు
అంతా ఇలా కూడబలుక్కుని
కూడగట్టుకుని నన్ను నానా
ఇబ్బందులూ పెడుతూ బ్రతక
నీయకుండా గందరగోళం, గోల
గొడవలతో శాంతి సుఖములు
ఎండగట్టి మనసును చికాకు పరిచి;
చదువులు వైద్యము ఫక్తు వ్యాపారములు చేసి
చదువు కొన్నా రాని ఉద్యోగాలు, కొలువులు
ఇంతటి గడ్డు స్థితిలో కవితోపాసనలు
కళారాధనలు, విజ్ఞాన శాస్త్ర విన్యాసాలు
ఎక్కడ వీలు? ఏదో బతకాల్సిన స్థితి కలిగించిన
ఈ నాడు ఈ భారతావనిలో జీవించుటెట్లు? ఎదుగుట ఎట్లు?
*********
త్రిమూర్తులు
నల్లని వాడు శ్రీమన్నారాయణుడు
తెల్లని వాడు హిమవన్నగవాసి
ఎగిరే పక్షి వైకుంఠ వాసుని వాహనము
వృషభము కైలాస నాథుని ధ్వజము
అలా గరుడధ్వజులొకరు వృషభధ్వజులొకరు
ఇద్దరూ మన సంక్షేమమును చూచు దొరలు
దొరలు వారి కనులందు బాష్పములు మన కలతలకు
కష్టములకు; చతుర్ముఖునితో కలిసి త్రిమూర్తులు
మన పుట్టుక, ఆలనా, పాలనా, జీవనమునకు లయము
 వారి భిక్షలే; తపస్సొకరిది; మోక్షమొకరిది
జ్ఞానమొకరిది; మనకై తమ తమ లోకములనుండి
పాలింతురు మనల, సంబాళింతురు మన జీవనంల
**********
అశాంతి
ఒకే విషయం రకరకాలుగా అర్థం చేసుకోబడుతుంది.
దీనికి ప్రఖ్యాత ఉదాహరణ ప్రస్థాన త్రయం యొక్క భాష్యములు. ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీతలను ప్రస్థాన త్రయం అంటారు.
ఈ మూడింటినే శంకరాచార్యులు అద్వైత పరంగాను, రామానుజాచార్యులు విశిష్టాద్వైత పరంగాను, మధ్వాచార్యులు ద్వైత పరంగాను వ్యాఖ్యానించారు. ఇదెలా సాధ్యం? ఒకే పుస్తకాలు ఎలా పరస్పర విరుద్ధమైన సిద్ధాంతములను కలిగి ఉంటాయి?
ప్రస్థాన త్రయమే కాదు ప్రపంచంలో ఎన్నో విషయాలపై పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు, అభిప్రాయాలు ఉంటాయి. అలా మన అవగాహన వివిధము. మన పాండిత్యాన్ని బట్టి, సిద్ధాంత అవగాహనను బట్టి వివిధ దృష్టులు ఏర్పడతాయి. లేదా మనకు ముందే కలిగిన లేక కలిగించబడిన దృష్టితో శాస్త్రావగాహన చేసికొని రకరకాల అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం.
ఇలా మన ఇష్టాయిష్టాలను బట్టి, ఏర్పడిన దృష్టిని బట్టి, మనం ఈ భాష్యాన్నో, ఆ వ్యాఖ్యలనో, మరో అభిప్రాయాలనో ఇష్టపడతాం. అదే నిజమని నమ్ముతాము. ప్రచారము, ప్రసారము చేస్తాం. తద్విరుద్ధమైన అభిప్రాయాలను, వ్యాఖ్యలు, భాష్యాలను, ఎండగడతాము.
ప్రశాంతంగా మన అవగాహనను మెరుగు పరుచుకొని ప్రశాంతంగా జీవించకుండా, మాత్సర్యముతో ఇతర అవగాహనలను
తీసిపారేస్తాము. మన సిద్ధాంతమే అసలు అవగాహన అంటాం. ఇలాంటి పోట్లాటలతో ఆధ్యాత్మిక జీవితాన్ని అశాంతి మయం చేసుకుంటాం.
ఈ ప్రపంచంలో ఏ విషయం మీదా ఏకాభిప్రాయం ఉండదు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి. తత్కారణంగా మనం స్పర్థలు పెంచుకొని, మన అవగాహననే ప్రచారం చెయ్యాలని కోరుకుంటూ
పోట్లాడుకుంటూ సుఖశాంతులు లేకుండా చేసికుంటాం. అలా చేయడం వల్ల అనవసర రక్తపాతాలు కలుగుతున్నాయి.
పుఱ్ఱెకో బుద్ధి, జిహ్వకో రుచి అనే సూక్తిని నిర్లక్ష్యం చేసి దృష్టి భేదాలను భూతద్దంలో చూసి, చూపి
అనవసర రాద్ధాంతాలు చేసుకుంటాం.
విజ్ఞాన శాస్త్రం విషయంలో ఈ శషభిషలు కూడవు.
మన ఇష్టాయిష్టాల మీద విజ్ఞాన శాస్త్రం ఆధారపడి ఉండదు. అందరికీ ఒకే శాస్త్రం. ఒకే అవగాహన. మిగతా శాస్త్రాలలో వ్యక్తిగత దృష్టికి స్థానం ఉంది.
అందుకనే ఇన్ని వ్యాఖ్యలు, పోట్లాటలు, అశాంతి.
*******
The coverage of school, competitive examination results and ranks need not be as noisy and is too much. As we all know, may be the winners rejoice, but are not the non-winners get disappointed, discouraged and depressed?
The dose and pitch by media coverage of school examination results and ranks of competitive examinations should be subdued.
And the nuisance created by corporate education institutions on local print, TV and web media has reached unbearable proportions.
We must learn decency and etiquette in our celebrations and behavior.
********
They need not like BJP or Modi; why they are not liking Hinduism? Their dislike for Hinduism is a psychological disorder. Great Indian pseudo-intellectuals are borne by the society with great patience!
******
ఈ మధ్య ఉత్తర్ ప్రదేశ్‌లో 368 ప్యూన్ పోస్టులకు దాదాపు 23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 2 లక్షల మంది ఇంజినీర్లు. మరో 255 మంది పీహెచ్‌డీ చేశారు.
భారతదేశమంతా పరిస్థితి ఇలాగే ఉంది. అయినా ఈ పనికిరాని, పనికి రాని చదువులు చదవడం ఆగడం లేదు. ఆగడంగా ఉంది. డబ్బులూ విపరీతంగా వృథా అయిపోతున్నాయి.
*******
Experience and Understanding

One experiences theories while proposing and understanding! Understanding and experiencing are simultaneous rather one and the same.
*******
నిఖార్సైన వేదాంతులు - సాధువులు

కుహనా మేధావులు పాత అంతనీ విమర్శిస్తారు
తీసెయ్యమన్నదానితో తులతూగే ప్రత్యామ్నాయం చెప్పలేరు; సృజించలేరు!

అభివృద్ధి వద్దంటారు పర్యావరణ రక్షకులు; 
అభివృద్ధి ఇచ్చే టెక్నాలజీ వస్తువులు విరివిగా 
వాడతారు మాత్రం, సౌకర్యాలూ అనుభవిస్తారు; 
మరెవరికి ఈ నీతులు, మరెందుకు ఈ అడ్డుపుల్లలు?

వన్య ప్రాణివధ కూడదంటారు, చికెన్లు, మటన్లు తింటారు
బడుగువర్గాలు తాగుడుకు బానిసలయ్యారని బాపడానికి 
ఉద్యమాలు చేస్తారు; రాత్రి హాయిగా ఫారిన్ మందు 
కొట్టి మెత్తటి పరుపులపై నిద్దరోతారు!

పగలు ఎయిడ్స్ ప్రచారంలో పాల్గొంటారు, వర్క్ షాప్
లు నిర్వహిస్తారు; రాత్రి పెళ్లి చేసుకోని పార్ట్ నర్ తో
కులుకుతారు; వీలైనన్ని అవకాశ వ్యభిచారాలు చేస్తారు;

అంతా పరుల కొరకే, తమకంటూ ఏమీ లేదు
నిజమైన నిఖార్సైన సాధువులు, వేదాంతులు

తామరాకుపై నీటిబొట్టు వలె తాము ఆనందించు
భోగములు మనసుకు అంటని, తద్వారా అంటుకునే 
రోగములను మాత్రము పోగొట్టుకోలేని సంఘసేవకులు
*********
పిల్లలు పెద్దల అజ్ఞానానికి ప్రతీకలు.
పెద్దల తెలియనితనమంతా పిల్లలకి నేర్పుతారు.
********
పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.
కాని విలాస జీవితానికి ఈ రెండూ ప్రతీకలు. డ్రగ్స్, promiscuity కూడా వీటి సోదరిలు.
********
If we love and show affection as we do to cine stars, sports persons, wily politicians, criminal minded corporate-giants and the like elite, middle and low strata individuals, to our near and dear, we live a life of joy and serenity. 
We can also love, appreciate, lose heart to and admire and fans to our near and dear.



No comments:

Post a Comment